25, డిసెంబర్ 2010, శనివారం

ఏమిటీ అప్రస్తుత విమర్శ ? దీనివెనుకున్న కుట్రలేమిటి ?

పొద్దుట ఆరున్నర/ఆరూ ముప్పావుకి తొమ్మిదో టీవీ పెట్టాను. పూజలు, దీక్షల పేరిట భక్తులను దోచేస్తున్నారంటూ ఒక వార్తను ప్రసారం చేసాడు. బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో భవానీ దీక్షల పేరిట ఏటా నూటయాభై కోట్ల దాకా భక్తుల దగ్గర్నుండి నొల్లుకుంటున్నారంటూ ఒక వార్తా విశేషాన్ని ప్రసారం చేసాడు. అదేదో నిన్న జరిగిన సంఘటనా అంటే.., కాదు. మామూలు వార్తల్లో భాగం కాదది.. ఒక ప్రత్యేక వార్తా విశేషం! పది పదిహేను నిమిషాలు వచ్చినట్టుంది.
ఓ పక్క క్రిస్మస్ జరుపుకుంటూంటే మనమీద ఏమిటీ వ్యతిరేక వార్తలు అని నాకు అనిపించింది. నేనేమైనా నెగటివుగా ఆలోచిస్తున్నానా?
[ ఓమితృని ఆవేదన]
--------------------------------------------------------------


క్రిమస్ పేరిట ఇక్కడ కొన్ని బిలియన్ డాలర్ల వ్యాపారం నడుస్తుంది -
క్రిస్మస్ షాపింగ్. మన వెన్నెముక లేని జీవాలకు అవేకనిపిస్తాయ్. ఏంచేస్తాం
మన కర్మం.

[అమెరికా లో ఉన్న ఓ హిందువు ఆవేదన ]
------------------------------------------------------------


లేదండీ, మీరు సరిగానే ఆలోచిస్తున్నారు. ఇది ఒక పెద్ద దోపిడీ విధానం. ఆ కుట్రలో భాగమే ఈ వ్యతిరేక ప్రచారం

[విషయాలను గమనిస్తున్న ఓ సామాన్య హిందువు విశ్లేషణ]

------------------------------------------------------------

ఈమధ్య దసరా ఉత్సవాలలో కూడా మహిషుని పై మాయదారి ప్రేమకురిపిస్తూ భక్తులమనసులను చికాకు పరచేందుకు టీవీ 9 అనే దిక్కుమాలిన చానల్ లో ఒక చర్చ. అక్కడ స్వయం ప్రకటిత మేధావుల పీత మెదళ్లలోంచి వచ్చిన అద్భుత పాండిత్యం . ఇవన్నీ గమనిస్తుంటే మనమీద మనధర్మం మీద స్లోపాయిజన్ ప్రయోగం జరుగుతుందనిపించటం లేదూ !???
[మన మనసులో మాట]

13, డిసెంబర్ 2010, సోమవారం

ఆలయ రక్షణ భారం దేవుడిదే

ఆలయ రక్షణ భారం దేవుడిదే
ఆందోళన రేకెత్తిస్తున్న ఐ.ఎం. హెచ్చరికలు
చేతులు ఎత్తేస్తున్న పోలీసులు
--హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

దేవాలయాల్లో విధ్వంసం రేపుతామని కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిద్దీన్‌ బహిరంగంగా హెచ్చరించినప్పటికీ మన రాష్ట్రంలో మందిరాలకు కనీస రక్షణ కల్పించే పరిస్థితి కనిపించడంలేదు. ఉన్న సిబ్బందిని ఇతరత్రా తప్పనిసరి విధులకు వినియోగించాల్సి వస్తుండటంతో హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా దేవాలయాలకు అదనపు సిబ్బందిని కేటాయించలేకపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, కనకదుర్గ దేవాలయం వంటి పెద్దపెద్ద ప్రార్థనా మందిరాలు తమ ఖర్చుతో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌.పి.ఎఫ్‌.)ను నియమించుకొని తంటాలు పడుతున్నాయి. కాని మధ్య, చిన్నతరహా దేవాలయాలకు కనీస భద్రత కరవైంది. ఉగ్రవాద సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు వీటి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

అయోధ్య వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా గత మంగళవారం వారణాసిలోని దేవాలయంలో ఇండియన్‌ముజాహిద్దీన్‌ (ఐ.ఎం.) బాంబు పేలుళ్లకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. అనంతరం భారతీయ మందిరాల్లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిస్తు కొన్ని పత్రికా కార్యాలయాలకు ఐ.ఎం. ప్రతినిధులు ఈమెయిల్‌ సందేశం పంపారు. 2008 ఆగస్టు 25వ తేదీన హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్‌, లుంబినీపార్కుల వద్ద జరిగిన పేలుళ్ళు ఈ సంస్థ పనే. ఐ.ఎం. వ్యవస్థాపకుడు రియాజ్‌ భత్కల్‌, సాంకేతిక నిపుణుడు పీర్‌భాయ్‌ మొదలు అనేక మంది ఐ.ఎం. కీలక సభ్యులు గతంలో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించారు. జంట పేలుళ్ళకు ముందు కొన్ని నెలలపాటు ఇక్కడ తిష్ట వేశారు. గతంలో ఈ సంస్థ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి తాజా హెచ్చరికల నేపథ్యంలో అది మరోమారు విరుచుకుపడే అవకాశాలు తోసిపుచ్చలేం. పైగా మందిరాలను లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా ప్రకటించింది కాబట్టి ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలో చిన్నాచితకా అన్నీ కలిపి మొత్తం 37వేల దేవస్థానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 27వేల దేవాలయాలకు ఎలాంటి రక్షణా లేదు. ఇందులో నిత్యం వేలమంది దర్శించే దేవాలయాల సంఖ్య కనీసం 500 వరకూ ఉంటుంది. పర్వదినాల సమయంలో ఈ దేవాలయాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో వీటికి కనీస స్థాయి భద్రత అయినా కల్పించాల్సిఉంది. అయితే దేవాలయాలన్నింటకి భద్రత కల్పించడం తమవల్ల కాదని పోలీసులు చేతులు ఎత్తివేస్తున్నారు. రాష్ట్రంలో లక్షకుపైగా పోలీసు సిబ్బంది ఉండగా వీరిలో శాంతిభద్రతలు పర్యవేక్షించే పోలీసులకు దైనందిన విధులతోనే సరిపోతోంది. రిజర్వు బలగాల సంఖ్య దాదాపు 20వేల వరకూ ఉన్నా ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోవడంతో వీరంతా తీరికలేకుండా పనిచేస్తున్నారు. వారంతపు సెలవులు కూడా తీసుకోలేకపోతున్నామని వీరు వాపోతున్నారు. ఈ నెలాఖరుకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దానిపై పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచే బలగాలను సిద్దం చేస్తున్నారు. ఇప్పుడున్న పోలీసులను వారి విధుల నుంచి తప్పించి ఇతర పనులు అప్పగించడం సాధ్యమయ్యేలా లేదు. దాంతో ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో దేవాలయాల భద్రతపై ఆందోళణ నెలకొంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది.

-----------------------------------------------------------------

చారిత్రక కట్టడాలు మన గుళ్ళు. వేల సంవత్సరాల చరిత్ర. రాజకీయ లబ్దికోసం బలిపెడుతున్నారు. మన గుళ్ళను మనమే కాపాడుకునే సమయం ఆసన్నమైంది. వెన్నెముకలేని ప్రభుత్వాన్ని, రాజకీయాలకూ, డబ్బుకూ అమ్ముడుపోయిన న్యాయ చట్ట వ్యవస్థనీ నమ్ముకుంటే మన మూలాలే మిగిలేలా లేవు.

8, డిసెంబర్ 2010, బుధవారం

కాశిలో గంగా హారతి సమయంలో పేలుడు [పరమేశ్వరా !ఇక నీవే దిక్కు]

కాశిలో గంగా హారతి సమయంలో పేలుడు

లక్నో: కాశీలో ఈరోజు సాయంత్రం గంగాహారతి సమయంలో పేలుడు సంభవించింది. ఇక్కడి దశ అశ్వమేథ ఘాట్‌లో మంగళవారం గంగానదికి సాంప్రదాయకంగా మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. శివుడు, మహాకాళేశ్వరుని ఆలయాలకు సమీపంలో ఈ ఘాట్‌ ఉంది. హారతిని వీక్షించేందుకు వందలమంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. హారతి కార్యక్రమం జరుగుతుండగా పేలుడు సంభవించటంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ విదేశీయుడు మృతి చెందగా 20 మంది వరకు గాయపడ్డారు. నదిలో పడవలో ఉండి చూస్తున్న భక్తులకూ శకలాలు తగిలాయి. రెండు కిలోమీటర్ల దూరం వరకు పేలుళ్లు వినిపించాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం వారణాశి జిల్లా ఆసుపత్రికి తరలించారు.గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇంత గోల దేనికి, కాశీ విశ్వనాథ ఆలయం తాళాంచేతులు వీళ్ళకే ఇచ్చి, అబ్బాయిలూ కూలగొట్టండీ అంటే సరిపోతుందిగా. గోల వదిలిపోతుంది.

ప్రశ్న :- ఇలా ఎంతకాలం?

పేలుడు మా పనే: ఇండియన్‌ ముజాహిదీన్

లక్నో: కాశీలో పేలుడుకు పాల్పడింది తమ సంస్థేనని ఇండియన్‌ ముజాహిద్‌ ప్రకటించింది. దీంతో విదేశీయుల లక్ష్యంగానే వారు ఈ పనికి పాల్పడి ఉంటారని కేంద్ర హోం శాఖ నిర్ధారణకు వచ్చింది. పేలుడు శబ్ధాలు రెండు కిలో మీటర్ల దూరం వరకు వినిపించడంతో చాలా శక్తివంతమైనవే ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. వరుసపేలుళ్లకు వారు కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌లలో కూడా కేంద్ర హోం శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

హోం శాఖ ఏం నిర్థారణకు వస్తే మనకేంటి? అవ్వాల్సిన పని అయ్యాక, రెడ్ ఎలర్టులు ప్రకటించి ప్రయోజనం ఏంటీ? వీళ్ళు అంతలోపలిదాకా వెళ్ళి బాంబులు పెట్టగల్గుతున్నారంటే, ఏంటో, నోటమాట రావట్లా.

ఇంకెన్ని ఘోరాలు జరగబోటున్నాయో ఏంటో.

నేనూ వెళ్ళాను రెండు సార్లు ఈ హారతిని చూట్టానికి. అత్భుతంగా ఉంటుంది మహా హారతి. పరమేశ్వరా ! నీ ఇంటిని ఇక నువ్వే కాపాడుకోవాలయ్యా !

7, డిసెంబర్ 2010, మంగళవారం

మాస శివరాత్రి అంటే ఏమిటి ? : ఒక చర్చ

ప్రశ్న :

సభాయై నమః

మున్ముందుగా మాస శివరాత్రి సాధారణంగా ఏరోజు జరుపుకుంటారో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు చతుర్దసి తరువాత వచ్చే అమావాస్య అని అనుకుంటున్నాను. తెలిసిన వారు సరిదిద్ద గలరు.

తరువాత విషయంగా శివరాత్రిని మాసానికి ఒకసారి చేసుకోవడం వెనకాల విశేషమేమిటో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వచ్చేదే అని. ఇలా మాసమునకు ఒకసారి శివరాత్రి చేసుకోవడం వెనకాల ఉన్న ప్రాశస్త్యం తెలిసిన వారు వివరించ మనవి.

--భవదీయుడు
_______________________________________

సమాధానము



నమస్తే!

ముందుగా ఈ శివరాత్రులు సంవత్సరానికొకసారో నెలకొకసారో కాక ప్రతి రాత్రి శివరాత్రిగానే భావించే సాంప్రదాయముంది. ఉదయాన్నే లేచి (శ్రీ హరి అని మూడుసార్లు తలచి లేవాలి ఎందుకంటే నిద్రలేచినది మొదలు నిద్ర కుపక్రమించేవరకు(జాగ్రదావస్థకు) ఉన్న కాలమునకు విష్ణువే అధిపతి ఆయన అనుగ్రహముతో ఆ రోజు కార్యములన్నీ శుభప్రదంగా జరగడాని కొరకు, మీరు చేసే మొదటి సంకల్పమే బ్రహ్మతత్వమైన సృష్టికి గుర్తు). నిత్య కర్మానుష్టనములు చేసుకొని శివలింగము నారాధించి, తను చేసే ప్రతి పనిలో ప్రతి ఒక్కరిలో శివును చూస్తూ సాత్వికాహార బద్ధుడై తిరిగి సాయంత్రం శివారాధన చేసి నివేదన చేయబడిన పదార్థములను ప్రసాద బుద్ధితో తీసుకొని రాత్రి నిద్రకు ఉపక్రమించడం. ఈ నిద్రనే శివుని స్వల్పకాలిక లయం అంటారు. ఈ నిద్రను పొందటను గమనిస్తూ శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోవాలని శాస్త్ర వచనం / పెద్దల వచనం . ఇలా రోజూ త్రిమూర్తులను తన అవస్థలలో గుర్తిస్తూ సాధన ద్వారా జ్ఞానం వేపుకి అడుగులేయడం. ప్రతి రోజు శివరాత్రి.

ఇక త్రయోదశి తిథి పరమ శివుని తిథిగా శాస్త్రాలు పెద్దలు గుర్తించారు. శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడుకుని ఉన్న చతుర్థశిని శుక్లపక్ష శివరాత్రి అని పిలుస్తూ ఉంటారు ఇది సంపూర్ణ జ్ఙానం వైపు వెళ్ళేసాధకునికి గుర్తు (చాలా వరకు శుక్ల పక్ష శివరాత్రిని ఉపాసన చేయడమన్నది ఈమధ్య కాలంలో కనబడడంలేదు, దీనికి తగిన ఆఖ్యానాలు కూడా ప్రచారంలో లేవు. ఉన్నవేమో తెలీదు.) ఇక కృష్ణ పక్షంలో త్రయోదశి తిథిని కూడిన చతుర్దశీ తిథిని మాస శివరాత్రి అని పిలుస్తారు అదే కృష్ణ పక్ష శివరాత్రి. ఒక రోజులో అసుర సంధ్య వేళ కేవలం శివ పూజకు ఎంత విశిష్టమో అలా ఒక నెలలో మాస శివరాత్రి అటువంటిది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం పరిపాటి. ఆరాధనలో ఎటువంటి తేడాలేదు. ఐతే రోజూ చేసే ఉపాసనకన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత అధికం.

అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహా శివరాత్రి అని నిర్ధారించారు. ఆరోజే రాత్రే శివలింగము ఆవిర్భవించిందని శాస్త్ర వాక్కు. ఆనాడు పగలంతా శివ పూజలతో, శివ కథా కాలక్షేపములతో సాత్విక ఆహారము లేదా ఉపవాసము (ఉపవాసమంటే లంఖణం కాదు ఉప= దగ్గర, వాసము= ఉండుట, భగవంతునికి దగ్గరగా ఉండుట. వీలైనంత తక్కువైన ఆహారము సాత్వికమైనది తీసుకొని భగవంతుని గుణములను కొలుస్తూ, స్తోత్ర పాఠాలను చేస్తూ, ఆ లీలా మూర్తి అనుగ్రహాలను తలచుకొంటూ భగవత్కార్యక్రమాలలో పాల్గొనుట).

శివలింగం అర్థ రాత్రి ఆవిర్భవించడం అంటే ఏదో ఒక రాయిలానో శిల గానో ఆవిర్భవించటం అని కాదు. మాఘ మాసం వచ్చేసరికి, (ఆషాడ మాసంనుంచి వర్షాలవల్ల లోకంలో సృష్టి ప్రతి సృష్టి జరిగుతుంది. భౌతికంగా అన్ని జీవాలు అంధకారంలోఉంటాయి, సరిగ్గా కనపడదు అందునా మాఘ మాసం చతుర్దశి అర్థ రాత్రి అమావాస్య ఘడియలలో లేదా అమావాస్య వస్తుందనగా ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో శివుడు ఆవిర్భవించాడు అదే అజ్ఙానరూపంలో ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో ఆవిర్భవించాడు. అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తమైనాడు. ఆరోజు రాత్రి జాగరణ చేసి లింగావిర్భావ సమయమున ఒక జ్యోతి (దీపమును లేదా కర్పూర దీపమునుగాని) గాని ఈ క్రింది శ్లోకము చదువుతూ చూడవలెను అప్పుడు శివరాత్రి వ్రత పూర్ణ ఫలము.

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః , జలేస్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం నీచజన్మభాగినః , భవన్తి త్వం శ్వపచా హి విప్రాః ||

మన సనాతన ధర్మ గొప్పదనమెంతో చూడండి. ఈ శ్లోకం చదివి, ఆ దీపాన్ని వెలిగించిన యజమానే కాక, దానిని చూస్తున్న వారందరే కాక, కీటకములు, పక్షులు, దోమలు, చెట్లు, జల నివాసములు, ఏ ఏ జీవములు ఆ దీపమును చూచుచున్నవో లేదా ఏ ఏ జీవములపై ఆ దీపపు కాంతి పడుతున్నదో అవన్నీ ఉద్ధరణ పొందవలెను అని ఆ యజమాని భావన చేయాలి. దీనితోనే ఆ శివరాత్రి వ్రతం సంపూర్ణం. (ఇదే శ్లోకం కార్తీక పౌర్ణమి దీపాన్ని చూస్తూ కూడా చెప్పవలెను)

ఈ విషయాన్ని మీకు తెలిసినవారందరకీ తెల్పండి. [పూర్తిగా శివరాత్రి, కార్తీక పౌర్ణమి వ్రతాలు చేయకపోయినా (ఏ అస్వస్తత వల్లనో) అ నాటి రాత్రి జ్యోతి స్వరూపుడైన శివుని దీపము లో చూస్తూ ఈ శ్లోకం చెప్పినా చాలు అని పెద్దలెవరో చెప్పగా విన్నట్లు గుర్తు ]

ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి, స్వయంగా ఆ పరమేశ్వరుడే మన అజ్ఙానపు చీకట్లను తొలగించడానికి జ్యోతీరూప శివలింగంగా ఆవిర్భవించిన రోజు కాబట్టీ, ప్రతి రోజూ అంత గొప్పగా ఉపాసన చేయడం అందరికీ సాధ్యం కాబట్టీ, కనీసం ప్రతి సంవత్సరం మహా శివరాత్రైనా జరుపుకోవాలని(జన్మానికో శివరాత్రి అని నానుడి) పెద్దలు నిశ్చయం చేశారు.

మీ ప్రశ్నకు పూర్తిగా సమాధానము చెప్పకపోయి ఉండవచ్చు. నాకు తెలిసినంత మేరకు మాత్రమే చెప్పాను కాని అంతా చెప్పినట్లు కాదు. ఇంకా విజ్ఙులైన పెద్దలు మరికొన్ని విశేష విషయములేమన్నా ఉన్నవేమో తెల్పండి, తప్పులేమైనాఉంటే సరిదిద్ధండి.

సూర్యనాగేంద్రకుమార్ అయ్యగారి

5, డిసెంబర్ 2010, ఆదివారం

ఉపాసనామార్గాలన్నీ భగవత్‌ ప్రసాదితాలే సుమా !

ఒక పిల్లవాడికి "అమ్మా ! నాన్నా !" అనే పిలుపులు ఎవఱు నేర్పుతారు ? తల్లిదండ్రులే కదా. ఆ బిడ్డడికీ, తమకూ మధ్య ఉన్న వావి (సంబంధం) తెలిసినవారు వారు. ఆ పిలుపుల ద్వారా ఆ సంబంధాన్ని వారు ఆ పిల్లవాడికి తెలియజెబుతారు. అదే విధంగా "భగవాన్, దేవుడు, దైవం" అనే ఈ మాటలు కూడా మనకు నేర్పినది బహుశా భగవంతుడే సాక్షాత్తు ! లేకపోతే భగవద్ భావనని కల్పించుకునే పాటి తెలివి ఎక్కడిది మనిషికి ? ఊరికే అవిశ్వాసులు ఊదరగొట్టడం తప్ప ! ఊహించుకోవడానికీ, కల గనడానికీ సహితం ఒక ఆధారం కావాలి. ఉదాహరణకు - తాను చనిపోయినట్లు కల గనజాలినవాళ్ళెవఱున్నారు ? ఆ అనుభవాన్ని ఊహించుకోవడానికి మానవ మనస్సుకు ఏ జాడా దొఱకదు గదా !

ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ కథామృతంలోని ఒక సంభాషణ నా స్మృతిపథంలో మెదుల్తున్నది. ఆ పుస్తక రచయిత శ్రీ గుప్తా శ్రీరామకృష్ణులకు సమకాలికులూ, శిష్యులున్ను. శ్రీ పరమహంసగారితో తన ప్రథమ సమావేశాన్ని "మణి" అనే మారుపేరు పెట్టుకొని అక్షరబద్ధం కావించారు. అప్పటిదాకా ఆయన బ్రహ్మసమాజ మతస్థుడుగా ఉన్నారు. అందుకని ఆ సమయానికి క్షవరం చేయించుకుంటున్న శ్రీ పరమహంసగారి దగ్గఱ కూర్చుని "మట్టి, చెక్క, ఱాయి ఇలాంటి పదార్థాలతో చేసిన విగ్రహాల్ని పూజించడం పొఱపాటు కదండీ ! అవి దేవుడు కాదు గదా ! అది తప్పు అని సామాన్యప్రజలకు తెలియకపోతే మనం వెళ్ళి చెప్పాలి కదండీ !" అన్నారు. అందుకు శ్రీ పరమహంస నవ్వి "విగ్రహం అని ఎవఱు చెప్పారోయ్ ! చిన్మయప్రతిమ !" అన్నారు. మణికి చిన్మయప్రతిమ కాన్సెప్టు అర్థం కాలేదు. అప్పుడు పరమహంస "ఒకటి తప్పు, అని, ఇంకొకటి ఒప్పు అని నీకెలా తెలుసు ? నువ్వేమైనా దేవుణ్ణి చూశావా ?" అని అడిగారు. తాను గొప్ప ఇంగ్లీషు విద్యావంతుణ్ణి అనే అహంకారం ఉండేది మణికి.శ్రీ పరమహంస వేసిన ఈ ఒక్క ప్రశ్నతో అతని అహంకారం అధః పాతాళానికి క్రుంగిపోయింది. బడికే వెళ్ళని శ్రీ పరమహంసకు పాదాక్రాంతుడయ్యాడా కలకత్తా బాబు. అప్పుడు శ్రీ పరమహంస అతనికిలా వివరించారు "ఒక మార్గం తప్పు అనీ, ఇంకొక మార్గం ఒప్పు అనీ మనం ఎలా చెబుతాం ? భగవంతుడే ఆయా మానవుల పరిపక్వతను బట్టి వివిధ ఆరాధనా పద్ధతుల్ని సృష్టించి (ఉపదేశించి) ఉన్నాడు"

ఆయనే మఱో సందర్భంలో మాట్లాడుతూ "ఒక తల్లి తన సంతానంలో ఒక్కొక్కఱి వయస్సు, ఆరోగ్యాన్నీ బట్టి ఒక్కొక్క రకంగా అన్నం పెట్టినట్లే భగవంతుడు కూడా ఆయా మానవజాతుల స్థాయిని బట్టి వివిధ మతాల్ని కల్పించి ఉన్నాడు." అని అనుగ్రహభాషణ చేశారు.

మనం చదివే విష్ణుసహస్రనామాలూ, రుద్రం, దేవీసప్తశతి ఇవన్నీ ఋషుల ద్వారా భగవంతుడు మనపై ప్రేమతో అనుగ్రహించినటువంటివి. మఱో రకంగా చేస్తే ఫలితం తక్కువ. పైగా అలాంటి అనధికృత స్వతంత్రత (unauthorized liberty) నిషిద్ధ పాషండ మతం అనిపించుకుంటుంది. ఉపాసనా పద్ధతుల్ని బ్రాహ్మణులు గానీ, లేదా వారిలాంటి మఱో మానవ ఏజన్సీ గానీ సృష్టించలేదనేది, అవి నేరు (direct) గా భగవదాదేశమనీ నాక్కూడా అనుభవమే. చాలా కాలం క్రితం నేనొకసారి శివుడిమీద వేఱే విధంగా నామాలు కల్పించి వ్రాయగా ఆయన స్వప్నదర్శనమిచ్చి నాపై కోపించి వాటిని ధ్వంసం చేయమని సూచించారు.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి