28, ఆగస్టు 2011, ఆదివారం

శిష్యలక్షణములు

శ్రీ గురుభ్యోన్నమః

అందరికీ నమస్కారములు

ఇతః పూర్వము మనము గురువు, ఆచార్యుడు అన్న విషయం పై చర్చ జరిపి ఉన్నాం.
అలానే శిష్యునికు ఉండవలసిన ముఖ్య లక్షణములను గురించి తెలుసుకునే ప్రయత్నం
ఇది.

శాస్త్రంలో శిష్యునకు ఉండవలసిన లక్షణములు ఈ క్రింది విధంగా చెప్పబడింది.

ఈ క్రింది ఐదు లక్షణములు శిష్యునకు ఉండవలసినవి.
1) అనన్యసాధ్యత్వము
2) ఆర్తి
3) అధ్యవసాయము
4) ఆదరము
5) అనసూయ

1) అనన్యసాధ్యత్వము : సాధ్యాసాధ్యాలయందు ఆసక్తి లేకుండా తాను ఆశ్రయించిన
గురువు/ఆచార్యుని ద్వారా ఏది పొందవలెనో దానిమీదనే దృష్టి పెట్టి ఉండే
లక్షణము:
2) ఆర్తి : ఎట్టి పరిస్థితులలోనూ తాను పొందవలసిన దానికి దూరముగా జరుగక,
వ్యతిరిక్త పరిస్థితులలో కూడా తాను పొందవలసిన దానిపైననే ధ్యాస తప్ప ఇంకొక
మార్గముపై ధ్యాసలేకుండుట.
3) అధ్యవసాయము : తాను ఏది పొందవలెనని ఆచార్యుని ఆశ్రయించాడో అదియే తాను
తప్పక పొందవలెనన్న గట్టిపూనిక కలిగి ఆ పూనికను రోజు రోజుకూ గట్టి
పరచుకునేలక్షణము కలిగు ఉండుట.
4) ఆదరము : తాను తెలుసుకోవలసిన విద్య లేదా పొందవలసిన దానిని గూర్చిన విషయ
పరిజ్ఙానము సంపాదించుకొనే పథంలో ఆ విషయములను ఎవరు చెప్పిననూ చెప్పినవాడు
తక్కువ వాడా లేక ఎక్కువ వాడా అన్నది ఆలోచించక ఆదరముతో వినుట. వినయముతో
ఉండుట.
5) అనసూయ : తాను తెలుసుకోవలసినది తెలుసుకోలేకపోయినను, పొందవలసినది
పొందలేకపోయినను, తానది పొందలేకపోయాను కాబట్టి దానియందు దోషములనెంచక దాని
గుణములను కీర్తించుట. ఇతరులు పొందిన గుణములను చూసి సంతోషించి
ప్రోత్సహించుట.

ఈ పై ఐదు లక్షణములు కలవారు ఆచార్యుని పొందటానికి సంపూర్ణ అర్హులు,
యోగ్యులు.

సర్వం శ్రీ ఉమా మహేశ్వరపరబ్రహ్మార్పణమస్తు

--

26, ఆగస్టు 2011, శుక్రవారం

శిష్యునకు ఉండవలసిన లక్షణములు

శ్రీ గురుభ్యోన్నమః

అందరికీ నమస్కారములు

ఇతః పూర్వము మనము గురువు, ఆచార్యుడు అన్న విషయం పై చర్చ జరిపి ఉన్నాం.
అలానే శిష్యునికు ఉండవలసిన ముఖ్య లక్షణములను గురించి తెలుసుకునే ప్రయత్నం
ఇది.

శాస్త్రంలో శిష్యునకు ఉండవలసిన లక్షణములు ఈ క్రింది విధంగా చెప్పబడింది.

ఈ క్రింది ఐదు లక్షణములు శిష్యునకు ఉండవలసినవి.
1) అనన్యసాధ్యత్వము
2) ఆర్తి
3) అధ్యవసాయము
4) ఆదరము
5) అనసూయ

1) అనన్యసాధ్యత్వము : సాధ్యాసాధ్యాలయందు ఆసక్తి లేకుండా తాను ఆశ్రయించిన
గురువు/ఆచార్యుని ద్వారా ఏది పొందవలెనో దానిమీదనే దృష్టి పెట్టి ఉండే
లక్షణము:
2) ఆర్తి : ఎట్టి పరిస్థితులలోనూ తాను పొందవలసిన దానికి దూరముగా జరుగక,
వ్యతిరిక్త పరిస్థితులలో కూడా తాను పొందవలసిన దానిపైననే ధ్యాస తప్ప ఇంకొక
మార్గముపై ధ్యాసలేకుండుట.
3) అధ్యవసాయము : తాను ఏది పొందవలెనని ఆచార్యుని ఆశ్రయించాడో అదియే తాను
తప్పక పొందవలెనన్న గట్టిపూనిక కలిగి ఆ పూనికను రోజు రోజుకూ గట్టి
పరచుకునేలక్షణము కలిగు ఉండుట.
4) ఆదరము : తాను తెలుసుకోవలసిన విద్య లేదా పొందవలసిన దానిని గూర్చిన విషయ
పరిజ్ఙానము సంపాదించుకొనే పథంలో ఆ విషయములను ఎవరు చెప్పిననూ చెప్పినవాడు
తక్కువ వాడా లేక ఎక్కువ వాడా అన్నది ఆలోచించక ఆదరముతో వినుట. వినయముతో
ఉండుట.
5) అనసూయ : తాను తెలుసుకోవలసినది తెలుసుకోలేకపోయినను, పొందవలసినది
పొందలేకపోయినను, తానది పొందలేకపోయాను కాబట్టి దానియందు దోషములనెంచక దాని
గుణములను కీర్తించుట. ఇతరులు పొందిన గుణములను చూసి సంతోషించి
ప్రోత్సహించుట.

ఈ పై ఐదు లక్షణములు కలవారు ఆచార్యుని పొందటానికి సంపూర్ణ అర్హులు,
యోగ్యులు.

సర్వం శ్రీ ఉమా మహేశ్వరపరబ్రహ్మార్పణమస్తు

24, ఆగస్టు 2011, బుధవారం

హిందూమత వివాదాల పరిష్కారానికి ధార్మిక న్యాయస్థానాలు ప్రత్యేకంగా కావాలి

తమ చిన్ననాడు తమ తల్లిదండ్రులో, ఇతర పెద్దలో జాతక రచన నిమిత్తం నమోదు చేసిన జననతేదీకి విలువ ఇవ్వాలని కోరుతూ గతంలో కొన్ని వ్యాజ్యాలు వివిధ భారతీయ న్యాయస్థానాల్లో నడిచాయి. మన సెక్యులర్ (read anti-Hindu or non-Hindu) న్యాయవ్యవస్థ మనం ఊహించినట్లే ఆ వాదనల్ని కొట్టేసింది. పైపెచ్చు "వట్టి జాతకానికి విలువ లేదనీ, దాన్తో పాటు ఇంకేదైనా సహాయసాక్ష్యంగా ఉంటేనే జాతకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు" ననీ తీర్పులు చెప్పాయి మన న్యాయస్థానాలు.

తాజాగా, ఇటీవల ఇలాంటి ఇంకో వ్యాజ్యంలోనే భారత సర్వోన్నత న్యాయస్థానం "జననతేదీకి జాతకం ఒక బలహీనమైన సాక్ష్యాధారం (weak piece of evidence)" అని వ్యాఖ్యానించి హిందువుల మనోభావాల్ని నిస్సంకోచంగా గాయపఱిచింది. ఈ వ్యాజ్యంలో మద్రాస్ హైకోర్టు మాజీ రిజిస్ట్రార్ జెనరల్ మాణిక్యం అనే ఆయన తన అసలైన జననతేదీ 1950 అనీ, కానీ సర్వీస్ రికార్డులలో 1947 గా నమోదు చేయడం మూలాన తాను మూడేళ్ళ ముందుగా పదవీ విరమణ చెయ్యాల్సి వచ్చిందనీ మొఱపెట్టుకున్నాడు. తన SSLC పత్రాల్ని చూపించినా ఈ అన్యాయం సరిదిద్దబడలేదు. అప్పుడాయన తన జన్మజాతకాన్ని న్యాయస్థానానికిసమర్పించాడు. ఈ తీర్పిచ్చినవాళ్ళు హిందూ న్యాయమూర్తులు జస్టిస్ ముకుందకమ్ శర్మ మఱియు అనిల్ ఆర్. దవే.

హిందూ మతగురువులు తయారుచేసే జాతకాల్ని ఇలా కించపఱుస్తున్నవారు ముస్లిమ్ మతపెద్దలు వివాహసమయంలో జారీ చేస్తున్న నిఖానామాలను సాక్ష్యాధారంగా అంగీకరిస్తున్నారని గమనించాలి. అదే, హిందువుల దగ్గఱికొచ్చేసరికి "ఆ పెళ్ళి ప్రభుత్వ కచేరీలో నమోదైందా ? లేదా ?" అని ప్రశ్నిస్తున్నారు. ఇలా అడుగడుగడునా మన ఆచారాలకీ, విశ్వసనీయతకీ ఆధికారికంగా దెబ్బకొడుతున్నారు. హిందువుల పేరు చెప్పగానే ఎక్కడ లేని సెక్యులరిజమూ గుర్తొచ్చేస్తుంది మన న్యాయస్థానాలకి !ఈ రకంగా ఏ ఇతర మతస్థుడికీ అవసరం లేని సెక్యులరిజాన్ని మనమీద బలవంతంగా రుద్దుతున్నారు. మన మతవిశ్వాసాల్లో తమ సెక్యులర్ విశ్వాసాల్ని చొప్పించి మన ఆచారాల్ని కలుషితం చేస్తున్నారు. ఉదాహరణకి - మదురైలో ఒక పూజారి చనిపోగా అతని కూతురు పూజారి అవ్వొచ్చునని కోర్టు తీర్పిచ్చింది. కానీ హిందూమతంలో స్త్రీలకు అర్చకత్వం ఎప్పుడూ లేదు.

ఇక్కడ మన శాస్త్రం చెప్పినట్లు హిందువులు వినాలా ? లేక సెక్యులరిస్టులు చెప్పినట్లు దేవాలయాలు నడవాలా ? అనేది ప్రశ్న. లౌకిక విషయాల్లో మతోపదేశాల్ని అంగీకరించని సెక్యులరిస్టు న్యాయస్థానాలు మతవిషయాల్లో మాత్రం తామెందుకు వేలుపెడుతున్నాయి ? అనేది అసలు ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో మన మత వివాదాల పరిష్కారం నిమిత్తం ప్రత్యేకంగా హిందూ ధార్మిక న్యాయస్థానాలూ, వాటికి అధ్యక్షత వహించడానికి మతధర్మశాస్త్రాలలో పాండిత్యం గల ప్రత్యేక ఆస్తిక న్యాయమూర్తులూ అవసరం కాదా ? పిడుక్కీ,బియ్యానికీ ఒకటే మంత్రం లాగా ఎంతకాలం ఇలా మనం (హిందువులం) దేవుణ్ణీ, హిందూమతాన్నీ నమ్మని లౌకిక న్యాయస్థానాల తీర్పులకు బలైపోవాలి ? ఆలోచించండి.

ఏ ఇతర విధాలైన సాక్ష్యాల కంటేనూ జాతకానికే జననతేదీ విషయంలో ప్రామాణికత హెచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే దాన్ని రచించేవాళ్ళ దృష్టిలో అది ఆ వ్యక్తి జీవితాన్ని శాసించే పత్రం. కనుక వారు దాన్ని రచించేటప్పుడు పొఱపాట్లు దొర్లకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. అయితే ఆ జాతకం ఆ వ్యక్తి పుట్టినప్పుడే వేయబడిందనే పురావస్తు ఆధారం (archaelogical_evidence) లభ్యమవుతున్నప్పుడు దాన్ని ప్రమాణంగా స్వీకరించడానికి ఎవఱికీ అభ్యంతరం ఉండనవసరం లేదు.

22, ఆగస్టు 2011, సోమవారం

మహాభక్తుడు మన్రో

థామస్ మన్రో గురించి చూసి వివరాలు తెలుసుకుందామని గూగులించా. ఏంతో ఆసక్తికర విషయాలు నాకు కనిపించాయి. ఈయన గురించి తెలియని వారికోసం వ్రాస్తున్నా.

క్రీ.శ. 1800లో థామస్ మన్రో బళ్ళారికి కలెక్టర్‌గా ఉండగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఏదయినా ఆధ్యాత్మిక సంస్థ యజమాని మరణిస్తే ఆ చట్టం ప్రకారం ఆధ్యాత్మిక సంస్థలు విరాళంగా అందుకున్న భూములు, ఆస్థులు ఈస్ట్ ఇండియా పరమవుతాయి. ఆ చట్టంప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆస్థులు స్వాధీనపరుచుకోవటానికి మన్రో మఠానికి వెళ్ళారు. ఆయన చెప్పులు తీసి లోపలికి ప్రవేశించి బృందావనం దగ్గర నిలబడగానే బృందావనం పారదర్శకంగా మారి లోపల కాషాయ వస్త్రాలతో, ప్రకాశ వంతంగా చిరునవ్వుతో రాఘవేంద్రస్వామి దర్శనం ఇచ్చారు. స్వామి అతనితో స్పష్టంగా దారాళమైన ఆంగ్లంలో మాట్లాడారు. కాసేపు మాట్లాడిన పిమ్మట మన్రో అక్కడ నుండి వెళ్ళిపోయారు.అక్కడే ఉన్న మిగిలినవారికి బృందావనం సాదారణ కట్టడంగానే కనిపించింది. మన్రో ఎవరితో మాట్లాడుతున్నారో అర్ధం కాలేదంట.తనకి భౌతికంగా కనిపించి తనతో మాట్లాడారు కాబట్టి స్వామి జీవించి ఉన్నట్టే అని భావించి చట్టం నుండి మంత్రాలయం మఠానికి మినహాయింపునిచ్చారు. ఈ గెజెట్ ఇప్పటికీ అందుబాటులో ఉందంట. ఆయన తన డైరీలో "వాట్ ఎ మేన్? ఆ కళ్ళలో కాంతి, మృధువుగా పలికినా శాసించే స్వరం, దారాళమైన ఆంగ్లం మాట్లాడారు" అని వ్రాసుకున్నారంట.

గండి లోయలో వాయుదేవుడు ధ్యానంలో ఉండగా, సీతమ్మవారిని వెతుకుతూ శ్రీరాముడు అటుగా వచ్చాడు. వాయుదేవుడు తన ఆతిధ్యం స్వీకరించమని కోరగా తిరుగు ప్రయాణంలో వస్తానని మాట ఇచ్చాడు రామయ్య. లంకలో రాముని విజయ వార్త చెవినపడ్డ వాయుదేవుడు తిరుగు ప్రయాణంలో అటుగా వచ్చే రాముని విజయానికి గుర్తుగా లోయపైన ఒక బంగారు తోరణాన్ని అలంకరించాడు. ఆ తోరణం ఇప్పటికీ పవిత్రాత్మ కలిగిన వారికి కనిపిస్తూ ఉంటుంది. ఆ తోరణం కనిపించినవారికి మరుజన్మ ఉండదని ప్రశస్తి.

థామస్ మన్రో మద్రాసు గవర్నర్‌గా తన పదవీకాలం ముగుస్తుండగా చివరిసారి అన్ని ప్రాంతాలనూ దర్శించటానికి బయలుదేరినప్పుడు గండి క్షేత్రంలో లోయగుండా గుర్రాలపై సాగుతున్నాడు. హఠాత్తుగా తల ఎత్తి చూస్తే ఎత్తులో బంగారుతోరణం కనిపించింది. "ఇంత అందమైన బంగారు తోరణం అంత ఎత్తులో ఎవరు అలంకరించారు?" అని తన వెనుక వస్తున్న సేవకుల్ని అడిగారు. సేవకులు చుట్టూ చూసి తమకి ఏమీ కనిపించటం లేదని చెప్పారు. వారిలో ఒక ముసలి సేవకుడు మాత్రం అది కేవలం పవిత్రమైన ఆత్మ కలవారికే కనిపిస్తుందని చెప్పాడు. కానీ దానిని చూసినవారు కొద్దిరోజుల్లోనే మరణిస్తారని చెప్పాడు. మన్రో అప్పటికి మౌనంగా ఊరుకున్నారు. కానీ ఆరునెలలలోపే కలరాతో మరణించారు.

చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్‌ మన్రో పెద్ద వెండి గంగాళాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కి కానుకగా ఇచ్చాడు. దీనినే మన్రో గంగాళం అంటారు. నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు. ఒక ఆంగ్లేయునికి మనదేశంలో ఇన్నివిధాలుగా దేవుని తార్కాణాలు లభించినా ఈ సంఘటనలకు మనం సరైన ప్రచారం కల్పించటంలో విఫలమయ్యామేమో అనిపిస్తుంది.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి