2, మార్చి 2012, శుక్రవారం

శృంగారమే చావుకు మూలం !

శృంగారం లేకుంటే.. చావేరాదు!
అలైంగిక ప్రాణుల్లో అపరిమిత పునరుత్పత్తి
మరణంలేని ఫ్లాట్‌వార్మ్ జీవులపై అధ్యయనం
అంతులేని కణవిభజనతో కొత్త కణాల సృష్టి

క్రోమోజోముల్లోని టెలోమెర్ పొడవులోనే కిటుకు
టెలోమెర్‌ను పరిరక్షించే ఎంజైమ్ గుర్తింపు
విసృతంగా సాగుతున్న పరిశోధనలు
మనుషుల్లోనూ ఆయుష్షు పెంచడమే లక్ష్యం!
చేపలు తింటే మెదడు పెరుగుతుంది..
వయసు తగ్గుతుందంటున్న అమెరికన్ పరిశోధకులు

లండన్, ఫిబ్రవరి 29: వయసు పెరుగుదలను అరికట్టవచ్చా? జీవితకాలాన్ని పెంచడం సాధ్యమేనా? మరణాన్ని కూడా జయించవచ్చా?.. సెక్సుకు దూరమైతేనే అది సాధ్యమా? అవును, లింగ భేదంలేని ఒక జాతి జీవులు ఆ మార్గాన్ని చూపిస్తున్నాయంటున్నారు లండన్ శాస్త్రవేత్తలు! ఫ్లాట్ వార్మ్ వర్గానికి చెందిన ప్రాణులపై నాటింగ్‌హామ్ యూనివర్సిటీ పరిశోధకులు చేస్తున్న అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వయసు పెరుగుదలను అరికట్టి ఎప్పటికీ యవ్వనంగా ఉండగలిగే శక్తి వాటిలో ఉందని గుర్తించారు. ఈ జీవుల్లో జరిగే ప్రక్రియ మనిషి ఆయుష్షు పెంచడానికి కూడా మార్గం చూపుతుందని భావిస్తున్నారు.

ఫ్లాట్ వార్మ్ జీవుల అపరిమితమైన పునరుత్పత్తి సామర్థ్యం ఆశ్చర్యపరుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వయసు మీద పడిన, చెడిపోయిన కణాలను, కణజాలాన్ని ఈ క్రిములు ఎప్పటికప్పుడు కొత్తవాటితో మార్చేసుకుంటాయట! దాంతో అవి ఎప్పుడూ యవ్వనంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఫ్లాట్ వార్మ్ జాతికి చెందిన రెండు రకాల (లైంగిక చర్యతో పునరుత్పత్తి జరిపేవి, రెండుగా విడిపోయి తమ సంఖ్య పెంచుకునేవి) జీవులపై అధ్యయనం జరుగుతోంది.

'సాధారణంగా కొత్త కణాల అభివృద్ధికి మూలకణాలు (స్టెమ్ సెల్స్) ఉపయోగపడతాయి. కణాల పునరుత్పత్తి ప్రక్రియలో పాల్గొనే మూలకణాలు కూడా క్రమంగా శక్తిని కోల్పోయి చివరకు నశిస్తాయి. అయితే ఫ్లాట్‌వార్మ్ జీవుల్లో మాత్రం అలా జరగడం లేదు. అవి అపరిమితంగా అన్ని రకాల కణాలను పునరుత్పత్తి చేస్తున్నాయి. మెదడును కూడా ఎన్నిసార్లయినా కొత్తగా సృష్టించగలుగుతున్నాయి' అని పరిశోధకులు వివరించారు. 'కణ విభజన జరిగినపుడు మాతృ కణంలోని డీ ఎన్ఏ కొత్త కణానికి అందుతుంది. వాటిలోని క్రోమోజోముల జతలను ముడిపెట్టి ఉంచే టెలోమెర్ చాలా కీలకమైనది. గొలుసుకట్టుగా ఉండే క్రోమోజోమ్‌ల చివరన ఇది రక్షణ తొడుగులా ఉంటుంది. ప్రతిసారీ కణవిభజన జరిగినపుడు ఈ టెలోమెర్ పొడవు తగ్గిపోతుంది.

దీంతో కణాల్లోని జన్యు సమాచారం క్రమంగా నశించి.. వాటికి కొత్త కణాలను సృష్టించే శక్తి క్షీణిస్తుంది. అయితే మరణంలేని ఫ్లాట్‌వార్మ్ వంటి అలైంగిక జీవుల్లో మాత్రం టెలోమెర్ పొడవు ఎన్నటికీ మారడం లేదని భావిస్తున్నాం' అని ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ థామస్ టాన్ తెలిపారు. ఈ జీవుల్లో టెలోమెర్ నశించకపోవడానికి 'టెలోమెరాస్' అనే ఎంజైమ్ కారణమని ఆయన గతంలోనే కనుగొన్నారు. ఇందుకుగాను 2009లో ఆయనకు వైద్య రంగంలో నోబెల్ బహుమతి లభించింది.

మనుషుల్లో ఈ ఎంజైమ్ తొలినాళ్లలో మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని, అలైంగిక జీవుల్లో మాత్రం పునరుత్పత్తి జరిగిన ప్రతిసారీ ఇది పనిచేస్తుందని థామస్ గుర్తించారు. లైంగిక చర్య జరుపుకొనే జీవుల్లో మాత్రం ఈ ఎంజైమ్ ఎందుకు ఎక్కువ కాలం పనిచేయడం లేదన్నది శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. సెక్స్‌కు దూరంగా ఉండటం వల్లే 'టెలోమెరాస్' శక్తివంతంగా పనిచేస్తోందా? అన్న విషయాన్నీ వారు పరిశీలిస్తున్నారు. ఈ రహస్యాన్ని ఛేదించి మనుషుల్లోనూ టెలోమెర్ పొడవు తగ్గకుండా చేస్తే ఇక మరణం అనేదే ఉండకపోవచ్చు! లేదా జీవితకాలం అసాధారణంగా పెరగవచ్చు!

మరోవైపు.. వయసుకు సంబంధించే అమెరికన్ పరిశోధకులు మరో కొత్త విషయం బయటపెట్టారు. 'మీ మెదడు చురుగ్గా ఉండాలంటే చేపలు బాగా తినండి' అని కాలిఫోర్నియా యూనిర్సిటీ నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని పాటిస్తే మన మెదడుకు ముసలితనం రాదట! మనం తీసుకునే ఆహారంలో ఒమెగా-3 వంటి ఆమ్లాలు తగ్గడం వల్ల మెదడు కణాలు క్షీణిస్తున్నాయని, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని పరిశోధకులు గుర్తించారు. చేపలు అధికంగా తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, చేపనూనె వల్ల మెదడు చురుగ్గా మారుతుందని చెబుతున్నారు. 



1, మార్చి 2012, గురువారం

హిందువులలో అనైక్యం, ఇతరులలో సమైక్యం : కారణాలూ, పరిణామాలూ

ఒక గూగుల్ గుంపులో ఇటీవల జఱిగిన చర్చ

ఒక సభ్యుడు : 

మిషనరీలు ఇండియాలో రోజూ హిందూ దేవుళ్ళను/ దేవతలను/ పవిత్ర గ్రంథాలను బహిరంగంగా దూషిస్తుంటారు. హిందువులనుండి  రియాక్షన్ ఎందుకు రావడం లేదు? చిన్న పామునైనా, పెద్ద కఱ్ఱతో కొట్టటం అబ్రహామిక్ కల్ట్స్ యొక్క విధానం. దీనితో ఎవఱినైనా ఎలా భయభ్రాంతులకు గుఱిచేయాలో వారికి తెలుసు. హిందువులు మనగల్గాలంటే వారినుంచి కొన్ని ఉపాయాలను తప్పకుండా నేర్చుకోవాలి. ఒక పాతకాలం నాటి మసీదును కూలకొడితే, దానికి రియాక్షన్ గా 10,000 - 20,000 గుడులను పగలగొట్టారు పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్ లో, మలేషియాలో, ఇండొనేషియాలో, ఇతర మహ్మదీయ దేశాలలో ! ఇవే కుతంత్రాలను కమ్యునిష్టులు కూడా వాడుతుంటారు. 

రెండో సభ్యుడు :

మన గుళ్ళవద్ద కిరస్తానీ మిషనరీలు కరపత్రాలను పంచుతుంటే ఒక్కఱూ కిమ్మనరు. ఇక దూషిస్తే మటుకు ఏం చేస్తారూ? మనం చర్చిలవద్దకు వెళ్ళి అలాంటి కరపత్రాలిస్తే జఱగగల పరిణామాలు అనూహ్యం. అదీ మన ఐక్యత. అదీ మన సమాజపు "బలం". 

మొదటి సభ్యుడు : 

మాస్టారూ, (౧) హిందువులు ఐక్యంగా లేకపోవడానికి కారణాలను వెతకవలసి ఉంది. What is preventing Hindus unification ?  

(౨) హిందువులలో ఐక్యత రావడానికి కావలసిన అవకాశాలను (మార్గాలను) వెతకవలసి ఉంది. How can we achieve Hindu unity ? 

గమనిక (౧) : హిందువులు అందరు కులాల కతీతం ఏకంగా కావాలి, తమ ఆర్థిక, సామాజిక, మత, సాంస్కృతిక, భాషా ప్రయోజనాలను సాధించడానికి ! ఇది సాధ్యం కాని పక్షంలో గమనిక (౩), మఱియు గమనిక (౨) చూడండి. 

౩) కుల హిందువుల మధ్య ఐక్యత సాధ్యం కాని పక్షంలో (లేక ఎక్కువ కాలం పట్టుతుంది అనిపించినప్పుడు), *హీనపక్షంగా* (minimum) ఏ కులానికి ఆ కులంలో ఐక్యత తీసుకు రావడానికి కావలసిన అవకాశాలను వెతకవలసి ఉంది. ముందు ఏ కులానికి ఆ కులంలో ఐక్యత వస్తే, ఆ తరువాత ఇతర హిందూ కులాలతో కలసి పరస్పర సహకారం (హిందూ విషయాలమీద) ఎలా చేసుకోవాలో చూడవలసి వుంది. 

గమనిక (౨) : ఏ కులానికి ఆ కులం, "మొత్తము హిందువులకు హానికరమైన పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయము" అని ఒట్టు పెట్టుకోవాలి. ఏ కులానికి ఆ కులం తమ *ఆర్థిక ప్రయోజనాలను* కాపాడుకోవడంలో తప్పులేదు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం హిందువులకు హానికరమైన పనులు చేయరాదు. నీవు (నీ కులం) మైనారిటీల పార్టీ అయిన కాంగ్రేస్ తో జట్టు కట్టు, లేక కమ్యునిష్టులతో జట్టు కట్టు, కాని కాంగ్రేస్ గాని, కమ్యూనిష్టులు గాని హిందువుల ప్రయోజనాలకు హాని చేస్తుంటే వారికి మద్దతివ్వకు. వారిచేత హిందువులకు అవసరమైన పనులు చేయించు. ఒక ఎడారిమతస్థులు తాము మైనారిటీలుగా ఉన్న దేశాలలో ఈ విధానాన్ని పాటిస్తుంటారు. తాము మెజారిటీలుగా ఉన్న దగ్గఱ, ఆ దేశాన్ని తమ మతదేశంగా ఆధికారికంగా ప్రకటించి, ఇతరులను దోచుకుంటూ ఉంటారు. అందుకే ఆ దేశాలలో 95 - 99.99% ఆ మతస్థులే ఉంటారు. ఆ దేశాల్లో నివసించే ఇతరులు షరియా వ్యవస్థలో నీళ్ళ బైట ఉన్న చేపల్లాగా గిలగిలా కొట్టుకుంటారు. 

గమనిక (౩) : ఇండియాలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న "సామాజిక న్యాయం" అనేదాన్ని, కులకోణంలోంచి నిర్వచించి హిందువులను ఇంకో పార్శ్వం నుంచి విడగొడుతున్నారు. భవిష్యత్తులో దీని బదులు "సామాజిక న్యాయం" అనే దాన్ని మతస్థాయిలో నిర్వచించాలి. అంటే హిందూ సామాజికన్యాయం, మహ్మదీయ సామాజికన్యాయం, కిరస్తానీ సామాజికన్యాయం మొదలైనవి. అప్పుడు కులాల మధ్య ఉన్న ఈ వీథిపోరాటాలు తగ్గి, వాటి మధ్య ఐక్యత వస్తుంది. 

గమనిక (౪) ఈ రోజున సైంటిఫిక్ గా ఆలోచించగల హిందూ తత్త్వవేత్తలు (community leaders) ఎవఱూ లేకుండా పోయారు. ఈ శూన్యాన్ని (vaccum) హిందువులు త్వరగా భర్తీ చేసుకోవాలి. 

మూడో సభ్యుడు :

నేనిక్కడ చెబుతున్నది  పైకి చిన్నవిషయంలా కనిపిస్తుంది. కానీ ఇది చాలా పెద్ద విషయం. అబ్రహామిక మతాలవారు ఐక్యంగా ఉండడాని క్కారణాలు కొన్ని ఉన్నాయి. 

౧. ఏ జాతికైనా తన గుఱించి తనకు కొంత సామూహిక స్మృతి (collective memory) ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే అబ్రాహామిక మతాలు నిజానికి మతాలు కావు. అవి వాళ్ళ కమ్యూనిటీల యొక్క చరిత్రపుస్తకాలు. వాటిల్లో మతం/ ఉపాసన ఎలిమెంట్ చాలా తక్కువ. వాటినుంచి వారు స్ఫూర్తి పొందుతారు. చరిత్రని మర్చిపోని/ మఱియు దాన్నుంచి గుణపాఠాలు నేర్చుకునే జాతిని ఎవడూ ఓడించలేడు. హిందువుల పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ హిందువుల స్మృతిపథంలో తమందఱి యొక్క సామూహిక చరిత్ర లేకపోవడమే కాక తప్పుడుచరిత్ర ఒకటి, తమది కాని చరిత్ర ఒకటి  వాళ్ళల్లో విద్యావిధానం ద్వారా చొప్పించబడుతున్నది. 

౨. అబ్రహామిక మతాలు గత 1500 సంవత్సరాల్లో ఇతర సంస్కృతులపై ఆధిపత్యం కోసం ప్రపంచవ్యాప్తమైన యుద్ధాలు చేశాయి భౌతికంగానూ, సాంస్కృతికంగానూ ! ఈ యుద్ధవ్యూహాలన్నీ వాళ్ళకి కొట్టిన పిండి. ఎలా ఆర్గనైజ్ అవ్వాలో వాళ్ళు నేర్చుకున్నారు. దాన్నొక సైన్సుగా రూపొందించారు. అందుచేత (మతపరంగా) లోకజ్ఞానం లేని పసిబిడ్డల్లాంటి హిందువుల్ని చుట్టబెట్టడం వాళ్ళకో లెక్కలోది కాదు. ఇక్కడ కూడా వాళ్ళ సామూహికస్మృతి, ఉమ్మడి అనుభవం వారికి అక్కఱకొస్తోంది. ఈ విషయంలో మన హిందువులు వాళ్ళతో పోలిస్తే నిన్నమొన్న కళ్ళు తెఱిచిన పసిబిడ్డల్లాంటివాళ్ళు. యుద్ధం చేయాల్సివస్తే కంగారుపడిపోవడమే తప్ప మనకి గుఱి చూసి ఎక్కడ బాణం సంధించాలో తెలీదు. ఉదాహరణకి - ఈ మధ్య భగవద్గీత గుఱించి ఒక రష్యన్ కోర్టులో చెలరేగిన రభస. ఒకవేళ నిజంగానే రష్యాలో భగవద్గీతని నిషేధిస్తే మనం కూడా పోటీగా ఎదురుచర్యలకి దిగుతామని హెచ్చఱించే పాటి వృషణాలు లేని జాతి ఇది. ఊరికే ఉచ్చపోసుకుంటూంటారు ప్రతీవాణ్ణీ చూసి ! 

అయితే ఇంత మొనగాళ్ళయిన అబ్రహామిక మతాలు కూడా హిందూమతం దగ్గఱికొచ్చేసరికి ఘోరపరాభవాన్ని ఎదుర్కుంటున్న మాట వాస్తవం. వేఱే దేశాల్లో సాధించినంత సులభంగా వాళ్ళిక్కడ హిందూమతాన్ని సాధించలేకపోతున్నారు. ఈ అవమానభారం మూలాన్నే యావత్తు క్రైస్తవలోకమూ, మహ్మదీయలోకమూ మనల్ని ద్వేషిస్తుంది. నిజానికి వాళ్ళ దేశాల్లో హిందువులు ఆట్టే లేరు.వాళ్ళ చరిత్రల్లో వాళ్ళకి మనం చేసిన అపకారమూ ఏమీ లేదు. అయినా ఊరికే ద్వేషిస్తారు, వాళ్ళ మతాల్లో ఇండియా చేఱలేదనే అక్కసుతో ! మన మతం ప్రపంచం కంటే వేఱైనది కావడం వల్లనే మనకి నమ్మదగ్గ మిత్రులు గానీ సానుభూతిపరులు గానీ ఎవఱూ లేరు ప్రపంచ దేశాల మధ్య ! మహా అయితే మన సైజు చూసి కాస్త భయపడతారంతే ! సింగపూరు, శ్రీలంకలాంటి చిన్నచిన్న దేశాలక్కూడా ఇండియా అంటే ద్వేషమే. 

౩. హిందువులకి మతం కంటే కులమే పెద్దవిషయం. ఇప్పటికీ హిందువుల్లో ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే మతం తమకి సంబంధం లేదనీ, అది బ్రాహ్మలకి సంబంధించిన టాపిక్ అనీ, దాని బాగోగులు బ్రాహ్మలే చూసుకోవాలనీ ! దానికి తోడు ఈ మతం గుఱించి ఎక్కువగా పట్టించుకునేదీ, ఆందోళన చెందేదీ కూడా బ్రాహ్మణులే కావడం ఈ దురభిప్రాయానికి మఱింత ఆజ్యం పోసింది. 

ఇండియాలో నాన్-హిందూవర్గాలు తమంతట తాము సహజంగా ఆర్గనైజ్ అయిలేవు. వాటిని మొదట్నుంచీ ప్రభుత్వమే మెజారిటీకి వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేస్తూ వచ్చింది. ఈ పని మొదట బ్రిటీషువారు, తరువాత నెహ్రూ, ఆ తరువాత ఇందిరాగాంధీ etc etc. చేస్తూ వచ్చారు. హిందూ వోట్ ని చీల్చి అందులో తమ కనుకూలమైన వోట్లకి మైనారిటీ వోట్లని కలుపుకుని అధికారంలోకి రావడం కోసం ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తూ వచ్చారు. వీళ్ళ స్కీములో హిందువుల్ని కులాల వారీగా (రిజర్వేషన్ల ద్వారా ) విడగొట్టాలి. కులాభిమానాల్ని పెంపొందించాలి. ఈ రకంగా వ్యవస్థాగతమైన ఏర్పాట్లన్నీ మతపరంగా కాక కులపరంగా ఉండడంతో హిందువులు కూడా మతపరంగా కాక కులపరంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నారు. ముందేమో ఇలా ఎస్సీ ఎస్టీల విషయంలో ప్రయోగించారు. ఇహ ఇప్పుడా అవసరం తీఱిపోయింది. కనుక ఆ తరువాత - అంటే ఇప్పుడు బీసీల్నీ, ఓబీసీల్ని రెచ్చగొడుతున్నారు. 

దీనికి పరిష్కారమేంటంటే హిందూ-అనుకూల పార్టీ ఏదైనా అధికారంలోకి వచ్చినప్పుడు, నేనిదివఱకు మనవి చేసినట్లుగా హిందువులందఱినీ (పోప్ లాంటి) ఒకే ధర్మపీఠం కిందికి తీసుకొచ్చి ఆ పీఠానికి ఆధికారిక, ప్రభుత్వ గుర్తింపునివ్వడం, అలా ఒక హిందూ వోట్‍బ్యాంకుని కృత్రిమంగా సృష్టించడం. కాంగ్రెస్ ఇలాంటిదాన్ని ఇమామ్ బుఖారీ, దేవబంద్ ముస్లిమ్ సెమినరీల ద్వారా ముస్లిముల కోసం చేస్తోంది.

మొదటి సభ్యుడు :

దీనిని బట్టి మనకు ఏమి తెలుస్తుంది. Abrahamic "ideology driven cults" లో *మనుషుల జీవితాలకు విలువ లేదు* అని. వారికి - మనుషులు పనిముట్టులు (సాధనాలు) మాత్రమే. అబ్రహామిక్ cults లో (కిరస్తానీలు, ఎడారిమతస్థులు, కమ్యునిష్ట్ లు) ఎవఱు ఎక్కువ హింస (యుద్దాలు) చేయగలిగితే వారు విజేతలు. అందుకే వారు హింసను ఒక ఆయుధంగా వాడతారు. ఇండియాలో 1000 సంవత్సరాల ఎడారిమతపు రక్తమయ హింసాచరిత్రను మసిపూసి మన (హిందువుల) పిల్లలచేత చదివిస్తున్నారు. అసలు చరిత్రను రాస్తే/ చదివితే, కుల హిందువులు సిగ్గుతో చచ్చిపోతారు. మన సమాజము గత 1000 సంవత్సరాలుగా ఇంత దయనీయంగా ఉన్నా కూడా, కులహిందువులు దాన్నుంచి పాఠాలేమీ నేర్చుకోవడం లేదు, మనలాంటి చాలా కొద్ది మంది తప్ప ! ఈనాడు మన కళ్ళ ముందు జఱుగుతున్న ఇలాంటి సంఘటనలు చూసిన తరువాత కూడా వారి యొక్క అసలుఉద్దేశాల నగ్నస్వరూపాన్నికుల హిందువులు గ్రహించలేకపోతున్నారు. 

ఉదాహరణకు (ఇది ఒక ఊహ మాత్రమే, నిజంగా జఱుగుతుందని కాదు ), హిందువుల పవిత్రవస్తువులకి ఏదైనా అపచారం జఱిగితే, హిందువుల రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏమీ ఉండదు. ఎప్పటిలానే కుల హిందువులు తమ జీవితాలను వెళ్ళదీస్తారు. అదే ఇండియాలో ఒక అబ్రహామిక్ cult కి అపచారం జఱిగితే, ఇండియా మొత్తం అల్లకల్లోలం అవుతుంది. దీని బట్టి అర్దమయ్యేది ఏమంటే, అల్లకల్లోలాల మీద కూడా వారికి గుత్తాధిపత్యం (monopoly) ఉంది. అవి వారు మాత్రమే చేయాలి.

వాస్తవం ఇలా ఉన్నప్పటికీ, నా అభిప్రాయంలో We, the Hindus must always follow the Gandhian method of Ahimsa. We should reach wider audiences and educate other people. ఎంత మంది హిందువులు ఎంత త్వరగా చైతన్యవంతులయితే, అంత త్వరగా హిందువుల ఐక్యత సాధ్యమవుతుంది. చిన్న చిన్న అవరోధాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి