31, డిసెంబర్ 2013, మంగళవారం

గుడి ఉన్న ఊళ్ళోనే మనుగడ

ప్రతిష్ఠ చేసిన ప్రదేశాల్లో జీవించే అర్హత ప్రతి మానవునికీ ఉంది.

ఆదియోగి శివుడు అగస్త్య మహామునిని దక్షిణ భారతావనికి పంపించారు.  దక్కను  పీఠభూమికి దక్షిణాన ప్రతి పల్లెనూ, జనావాసాన్నీ ఆ మహాముని ఏదో రకమైన ప్రతిష్ఠలతో పవిత్రం చేశారు.  తద్వారా ఆ ప్రాంతాల్లో ఆథ్యాత్మిక ప్రక్రియ ప్రారంభమై, కొనసాగేలా చూశారు. మానవుడు నివసించే ఏ ఒక్క జనావాసాన్నీ కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఇలా చేయడానికి ఆయనకు 4,౦౦౦ సంవత్సరాల కాలం పట్టిందని చెబుతారు.  అయితే అది నాలుగు వేల ఏళ్ళా, నాలుగు వందల ఏళ్ళా, అంత కాకుంటే పోనీ 140 ఏళ్ళా అనేది మనకు తెలియదు.  కానీ, ఆయన చేసిన ఈ బృహత్తర కార్యక్రమం, అందుకోసం ఆయన చేసిన సుదీర్ఘ యాత్ర గమనిస్తే, ఆయన అసాధారణ రీతిలో ఎంతో దీర్ఘకాలం సాధన చేశారన్నది అర్థమవుతుంది.

ప్రతిష్ఠ చేయడమనేది ఓ సజీవ ప్రక్రియ.  మట్టిని ఆహారంగా మార్చామనుకోండి, దాన్ని వ్యవసాయం అంటున్నాం. అదే ఆహారాన్ని మాంసంగా, ఎముకలుగా మార్చేదాన్ని జీర్ణ క్రియగా, మళ్ళీ ఈ మాంస శరీరాన్ని మట్టిగా మార్చడాన్ని దహనం లేదా ఖననం అంటున్నాం.  ఇక్కడ పేర్కొన్న ఈ మాంసాన్ని లేదా ఓ రాయిని, ఇవీ అవీ కాకుంటే ఏ ఖాళీ ప్రదేశాన్నయినా దివ్య భూమికగా మార్చగలిగితే, ఆ ప్రక్రియే ప్రతిష్ఠ.  ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఒకే శక్తి రూపాలనీ, ఒకే శక్తి కోట్లాది రూపాల్లో, అనేక విధాలుగా వక్తమవుతోందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతోంది కదా.  విషయం అదే అయినప్పుడు, దివ్యత్వమని, రాయి అని, మగాడు లేదా ఆడది అని, రాక్షసుడని మనం అంటున్నవన్నీ వివిధ రూపాల్లో గోచరిస్తున్న, పనిచేస్తున్న ఒకే శక్తి మాత్రమె.  ఉదాహరణకు విద్యుత్తు ఒకటే.  కాని అదే దీపంగా వెలుగుతుంది, ధ్వనిగా వినవస్తుంది.  సాంకేతికతను బట్టి విద్యుత్తూ వివిధ రకాలుగా వ్యక్తమవుతుంది.  అలాగే ఈ ప్రతిష్ఠ కూడా ఒక సామ్కేతికతే.  అవసరమైన సాంకేతికత అందుబాటులో ఉంటే, మన చుట్టు ఉన్న ఈ సామాన్యమైన సాధారణమైన ప్రదేశాలను దివ్యంగా మార్చగలుగుతాం.  దారి పక్కనున్న ఓ చిన్న రాయిని తీసుకుని దాన్ని ఓ దేవుడిగానో, దేవత గానో మార్చేయ గలుగుతాం.  అదే ప్రతిష్ఠ అనే అద్భుతం.

మన సంస్కృతిలో ఈ అఖండ విజ్ఞానాన్ని శాశ్వతంగా నిలిచిపోయేలా చేయడం జరిగింది.  మన సంస్కృతిలో ఈ విజ్ఞానాన్ని పరమోత్క్రుష్టమైనదిగా నిర్ధారించారు.  మన సంస్కృతిలో మనమేమి తింటున్నాం, మనమెలా ఉన్నాం, మనమెంత కాలం బతుకుతాం అనేవి అంత ముఖ్యమైనవి కాదు.  మన జీవితంలో ఏదో ఓ తరుణంలో సృష్టిమూలాలను అన్వేషించాలనే వాంఛ ప్రతివారికీ తప్పకుండా వచ్చి తీరుతుంది.  దీన్ని అందుకోవాలనే తపన పడే ప్రతి మానవునకూ ఈ అవకాశం అందివచ్చే విధంగా చేయక పొతే, అతనికి యదార్థమైన సంక్షేమాన్ని అందించడంలో సమాజం విఫలమైనట్లే.

మానవాళి అభ్యున్నతికి అవసరమైన ఈ సంక్షేమ దృష్టి తోనే ప్రతివీధిలో కనీసం ముడేసి దేవాలయాలు ఉండడాన్ని ఈ సంస్కృతిలో భాగం చేశారు.  ఎందుకంటే, పవిత్రమైన వాతావరణం లేని ప్రదేశం, కొన్ని అడుగులైనా సరే, ఉండరాదన్న విజ్ఞతతో  చేసిన గొప్ప ఏర్పాటు ఇది.  ఇదేదో ఓ గుడికి పోటీగా మరో గుడి నిర్మించాలనుకోవడం కానే కాదు.  ఎవరూ కూడా ప్రతిష్ఠ కాని ప్రదేశంలో ఒక్క అడుగు కూడా వేయరాడనే సదుద్దేశంతో చేసినది.  ఎవరు కూడా ప్రతిష్ఠ కాని వాతావరణంలో జీవితం దుర్భరం చేసుకోరాదన్న విశేష ఆదరణ బుద్ధితో చేసిన మహాత్కార్యమిది.  అందుకే ముందుగా గుడిని నిర్మించి ఆ తరువాతే దానిచుట్టూ నివాసాలు నిర్మిస్తూ వచ్చారు.

దక్షిణాది యావత్తూ, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం యావత్తూ ఇదే తీరున నిర్మితమైంది. తమిళ నాడు లోని చెప్పుకోదగిన ప్రతి పట్టణంలో ఓ బృహత్ దేవాలయం తప్పనిసరిగా ఉంటుంది.  దాని చుట్టూనే పట్టణం.  ఎందుకంటే మనమేలాంటి ఇంటిలో ఉంటున్నాం అన్నది ముఖ్యం కాదు.  ఆ ఇల్లు పదివేల చదరపు అడుగుల్లో నిర్మిమ్చినదా, లేక వెయ్యి చదరపు అడుగుల్లో కట్టినాడా అనేది అంతకన్నా ముఖ్యం కాదు.  దానివల్ల చివరకు మన జీవితంలో తేడా ఏదీ ఉండదు.  కానీ, ప్రతిష్ఠ చేసిన వాతావరణంలో నివాసం వల్ల మన జీవితం ఎంతో ప్రభావితం అవుతుంది.  ఎంతో తేడా కనిపిస్తుంది.  ఈ విజ్ఞానంతోనే, ఈ అనుభవసారంతోనే, వారు మానవ ఆవాసాలను ఈ విధంగా నిర్మించారు.  ఊళ్ళో 25 గడపలు ఉన్నాయంటే, కచ్చితంగా ఓ దేవాలయం ఉండి తీరాలి.  మనం ఆ గుడికి వెళ్ళినా, వెళ్లక పోయినా, మనం అక్కడ ప్రార్థించినా, ప్రార్థించక పోయినా, మనకు ఏదైనా మంత్రం తెలిసినా, తెలియకున్నా పరవాలేదు.  అసలది సమస్యే కాదు.  జీవితంలో ప్రతి క్షణం మనం ప్రతిష్టించిన వాతావరణంలోనే ఉండాలి.  అదే దీని పరమార్థం. 
[kbn sharma]

18, డిసెంబర్ 2013, బుధవారం

కంచి శంకరాచార్యపై ఇంతటి కుట్రకు పాల్పడినవారెవరు?

కంచి శంకరాచార్యపై ఇంతటి కుట్రకు పాల్పడినవారెవరు?


తొమ్మిది సంవత్సరాలపాటు సాగిన కంచి కథకు ఎట్టకేలకు నవంబర్ 26వ తేదీన పుదుచ్చేరి ప్రత్యేక కోర్టు ముగింపు పలికింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంకర్ రామన్ హత్య కేసులో కంచి స్వామీజీ జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాములు ఇద్దరూ నిర్దోషులని కోర్టు తీర్పు చెప్పింది. మొత్తం 24 మంది నిందితులలో ఒక నిందితుడు 2013 మార్చిలో చెన్నైలో హత్యకు గురవగా మిగిలిన 23 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్లు జస్టిస్ మురుగన్ ప్రకటిస్తూ తీర్పునిచ్చారు. 

ఈ తీర్పు మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. శంకర్ రామన్ ను హత్య చేసింది ఎవరు? 9 సంవత్సరాలు విచారణ చేసిన తరువాత కూడా అసలైన హంతకులను ఎందుకు పట్టుకోలేదు? ఇక రెండవ ప్రశ్న. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అందరూ గౌరవించే కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాములను అక్రమంగా నిర్బంధించి, కేసులో ఇరికించి వారి గౌరవ ప్రతిష్ఠలను దిగజార్చటానికి పన్నిన వ్యూహంలో భాగస్వాములు ఎవరు? హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా కేసులు నడిపించిన తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు ఏమి చెప్పింది? ఏమి చెబితే, ఎంత చెబితే పోయిన స్వామీజీల గౌరవం తిరిగి వస్తుంది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం, కోర్టు, విచారణ యంత్రాంగం, మీడియా ఏమి సమాధానం చెబుతుంది?

శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామికి, తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలితకు మధ్య మీడియా కూడా గుర్తించని వైరం ఏదో ఉండి ఉంటుందని ఆ సమయంలో (2004లో) వార్తలు వచ్చాయి. ఆ కక్షసాధింపు చర్యలో భాగంగా ఈ ఘాతుకం జరిగి ఉంటుందా?

2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలమూరు జిల్లాలో తెల్లవారితే దీపావళి పండుగ అనగా అర్థరాత్రి పూట పోలీసులు స్వామీజీని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. ఆ సమయంలో ''అర్థరాత్రి చడీచప్పుడు కాకుండా నిర్బంధించటానికి నేనేమైనా వీరప్పన్ నా?'' అని స్వామీజీ పోలీసులను ప్రశ్నించారు. తెల్లవారితే దీపావళి పండుగ అనగా అభియోగాలపై అభియోగాలు మోపి బెయిల్ పై త్వరగా బైటపడకుండా కూడ చూసారు. చేసిన ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం అనేక తప్పులు చేసింది.  ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరును జ్ఞాపకం చేసుకొంటే ఒక్కసారిగా మనస్సు కలుక్కుమంటుంది. 80 కోట్లకు పైగా జనాభా ఉన్న హిందూ సమాజం, హిందూ సంస్థల నాయకులు దీనిపై వెంటనే ఏమీ చేయలేకపోయారు...!? రాజకీయ అధికారం ముందు ఏమీ తోచనివారయ్యారా? అటువంటి పరిస్థితులు ఎందుకు నిర్మాణమయ్యాయి? ఆలోచించవలసిన అవసరం మనందరకు ఉంది.

నిర్ధారణగా ఇది అని చెప్పలేము గాని, ఒక్కసారి గతంలోకి వెళితే కొన్ని విషయాలు, కొన్ని చేదు నిజాలు మనకు జ్ఞాపకం వస్తాయి. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పోప్ జాన్ పాల్-2 భారత్ కు వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీలో పోప్ జాన్ పాల్ చేసిన వ్యాఖ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. "ఆసియా ఖండం, అందులో భారతదేశం కోతకు సిద్ధంగా ఉంది" - అంటే భారతదేశాన్ని క్రైస్తవదేశంగా చేయటానికి అనువుగా ఉంది అని ప్రకటించారు. దేశంలో క్రైస్తవ ప్రాబల్యం పెరిగితే దానిని నిరోధించేది, ఎదుర్కొనేది హిందూ సమాజంలోని సాధుసంతులు, సంఘము, విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థలు. వాటి గౌరవ ప్రతిష్ఠలను సమాజంలో దిగజార్చాలని నిర్ణయించారా? అందుకే ఈ పథకం రచించబడిందా?

కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకం అమలులో భాగంగా ఈ అరెస్టులు, స్వామీజీల మీద, సంఘం మీద దాడులు, ఆరోపణ పర్వాలు సాగుతున్నాయా? ఇవి ఏవి హిందూ సమాజానికి పట్టవు. ఇక్కడ మీడియా రంగం కూడా వ్యవహరించిన తీరు ఎంతో గర్హించదగినది. ప్రపంచంలో అనేక దేశాలలో అమెరికా అండదండలతో క్రైస్తవం ఎన్నో అరాచకాలు సృష్టించింది. ఎక్కడోదాక అవసరం లేదు - కేరళ, తమిళనాడులలో క్రైస్తవుల అకృత్యాలే అనేకం. వాటిని విచారణ జరిపించి దోషులను శిక్షించారా? కేరళలో నన్స్ పై అత్యాచారాలు, హత్యలు మొదలైనవి పుస్తకాలే వచ్చాయి. అధికారుల అండదండల కారణంగా వేటిపైన సరియైన చర్య తీసుకోలేదు. పెరిగిపోతున్న క్రైస్తవుల అరాచకాల గురించి అనేక మంది పెద్ద మనుషులను వ్యక్తిగతంగా కలిసినప్పుడు తమ బాధను, ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తారు. కాని క్రైస్తవానికి వ్యతిరేకంగా గళం మాత్రం విప్పరు. ఇది కాంగ్రెసుకు కలిసి వస్తున్నది. ఇప్పుడున్న కేంద్రప్రభుత్వం చేజారుతున్న తన ఆశలను పెంచుకొనేందుకు ఏమైనా చేసేందుకు సిద్ధం కావచ్చు. మైనార్టీల సంరక్షణ పేరుతో హిందూ సంస్థలను స్వామీజీలను వేధించే ప్రయత్నం చేయవచ్చు. ఇది హిందూ సమాజానికి ఒక హెచ్చరిక.

వైరము లేని హింసను చేయటానికి సిద్ధపడని హిందూసమాజం తన పైన శతృత్వం వహించి పని చేస్తున్న శక్తులను గుర్తించే పరిస్థితులు లేవు. శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ కేవలం ఆధ్యాత్యిక రంగంలోనే కాదు, సామాజిక రంగంలో కూడా గడిచిన రెండు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమానికి జనకల్యాణ పరిషత్ స్థాపించారు. దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు వారి మార్గదర్శనంలో నడుస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాలని క్రైస్తవులు అనుకొని ఉండి ఉండవచ్చు. వాళ్లకు ప్రభుత్వాలు సహకరిస్తూ ఉండి ఉండవచ్చు. ఇది ఈ రోజు హిందూ సమాజానికి ఎదురవుతున్న సవాళ్లు. ఈ సవాలును స్వీకరించి ఆ ఎత్తుగడలను వమ్ము చేయగలుగుతామా?

యుపిఎ ప్రభుత్వం 2009లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత నుండి హిందూ సమాజంలోని పెద్దలు, స్వామీజీల సంస్థలను నైతికంగా (తాత్కాలికంగానైనా) దిగజార్చాలనే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఇది గమనించదగ్గ పరిణామం.

దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దూషణల పర్వం ఎప్పుడో ప్రారంభమయింది. ఇక కావలసింది ప్రజలను గందరగోళంలో పడేయటం. దానిద్వారా తిరిగి అధికారం కాపాడుకోగలుగుతామా అన్నది ఇప్పటి కాంగ్రెస్ వ్యూహం. దీనిని జాగ్రత్తగా గమనించి మరిన్ని దాడులు జరగకుండా హిందూసమాజం అప్రమత్తం కావాలి. మీడియా ఎత్తుగడలను కూడా గమనించాలి. అప్పడు మనం మన సమాజాన్ని కాపాడుకోగలుగుతాం.

9 సంవత్సరాల కంచి కథకు ఇప్పుడు ముగింపు లభించింది. భవిష్యత్తులో మరిన్ని కథలు నిర్మాణం కాకుండా చూసుకోవటం ఇప్పుడు హిందూ సమాజం ముందున్న కర్తవ్యం.
- రాము
http://www.lokahitham.net/

10, డిసెంబర్ 2013, మంగళవారం

అప్పులన్నీ తీరిన తరువాత పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత, దేవునిగూర్చి తలంచుకొనవచ్చును.

ఒకానొక పట్టణము నందు మధ్యతరగతికి చెందిన ఒక కుటుంబము కలదు. అందు ఇంటి
యజమానికి ఒక చిన్న ఉద్యోగము. భార్య సదాచారవతి. ఆ యిల్లాలు ప్రతిదినము
ఉషఃకాలముననే నిద్రలేచి స్నానాదులను నిర్వర్తించుకొని దైవధ్యానము
చేసికొనుచుండును. ఒక జపమాలను తీసుకుని భక్తితో రామనామమును
నూటెనిమిదిసార్లు జపించుచుండును. తదుపరి ఒక అధ్యాయమును గీతాపారాయణము
చేయుచుండెను. పూర్వ్జజన్మార్జిత సుకృతవశమున ఆమెకు పుట్టుకతోనే చక్కని
దైవసంస్కార మేర్పడెను. ప్రార్థన చేయక ఒక్కనాడైనను గంగపుచ్చు కొనదు.
అసారమగు ఈ సంసారమున సర్వేశరుడొక్కడే సారమను పూర్ణవిశ్వాసము అమె
కలిగియుండుట వలన గృహకృత్యములను యథావిధి జరుపుకొనుచుండినను మనస్సు మాత్రము
భగవంతుని పాదపద్మములందే సంలగ్నమై యుండును.

ఇక ఆ పై భర్త గారి సంస్కారము వేరుగ నుండెను. భగవంతుని అస్తిత్వమును అతడు
కాదనడుకాని 'ఇపుడే ఏమితొందర, నిదానముగా తరువాత ఎపుడైన దైవచింతన
చేసికొనవచ్చును' అను ధోరణిని అతడు ప్రదర్శించుచుండును. ఈ పద్దతి భార్యకు
నచ్చలేదు. ఒకనాడామె భర్త తీరికగ ఉన్న సమయము చూచి అతనితో నిట్లనెను -
"ఏమండీ! ఒక్కసారైనను రామనామము ఉచ్చరించక, భగవంతుని సేవింపక జీవితమును
గడుపుచున్నారే! ఇది ఎంత ప్రమాదము! ఏ సమయమున ఏమి ఆపద సంభవించునో
ఎవరికెరుక! ఈ జీవిత సమయమున ఏమి ఆపద సంభవించునో ఎవరికెరుక! ఈ జీవితములు
ఏమి శాశ్వతము! ఏ క్షణము ఈ ప్రాణవాయువు దేహమును విడిచిపోవునో ఎవరును
చెప్పలేరు. బ్రతికిన నాలుగురోజులు కృష్ణా, రామా యని భగవన్నామము
ఉచ్చరించుచు పుణ్యము కట్టుకొనిన మాత్రమే ఈ జీవితము సార్థక మగునుగాని,
వ్యర్థముగ ప్రాపంచిక కార్యములందే గడిపివైచినచో మహా ప్రమాదము సంభవింపగలదు.
కాబట్టి ప్రతిరోజు కనీసము ఒక్కసారైన భగవంతుని గూర్చి చింతింపుడు.
రామనామమును ఉచ్చరింపుడు. రవ్వంత పుణ్యమైనా ప్రతిదినము సంపాదింపుడు. ఇదిగో
జపమాల తీసికొని భక్తితో జపము ప్రారంభించుడు!

సహధర్మచారిణి యొక్క భావగర్భితములగు ఆ వాక్యములను విని భర్త ఇట్లనెను.
"ఓసీ! నీవు చెప్పినదంతయు సత్యమే. దేవుని గూర్చి తలంచుట మన ధర్మమని నేను
ఒప్పుకొనుచున్నాను. అధి చేయ వలసిన కార్యమే. కాని ఇప్పుడెమి తొందర?
ఇప్పుడు నేను ఉద్యోగము చేయుచున్నాను. అది పూర్తి అయిన పిదప,
'రిటైర్‌మెంట్‌' వచ్చిన తరువాత, పిల్లలు పెండిండ్లు అయిన పిదప,
అప్పులన్నీ తీరిన తరువాత పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత, దేవునిగూర్చి
తలంచుకొనవచ్చును. అప్పుడిక ఏ గొడవలు ఉండవు" కాబట్టి శాంతముగా, నిశ్చలముగా
ధ్యానము చేసికొనవచ్చును.

భర్తయొక్క ఆ వాక్యములను వినగానే గృహిణికి గొప్ప హృదయా వేదన కలిగి భర్తకు
తన మనోనిశ్చయమును గూర్చి నచ్చజెప్పుటకై ఎంతయో ప్రయత్నించెను. కాని ఫలితము
లేకపోయెను. భర్త ఈషణ్మాత్రమైనను తన హృదయమును మార్చుకొనలేదు. పాత
పద్దతిలోనే తన కార్యక్రమమును నిర్వహించుకొనుచు పోవుచుండెను. భర్త యొక్క
మనస్సును దైవమార్గమున ఎట్లు మరలించవలెనో ఆమెకు తోచకుండెను.

ఇట్లుండ కొంతకాలమునకు విధివశాత్తు భర్తయొక్క ఆరోగ్యము లోపించెను. అతడు
తీవ్రమగు జ్వరముతో బాధపడుచుండెను. డాక్టరుగారు వచ్చి రోగిని పరిశీలించి
ఒక సీసాలో మందు పోసియిచ్చి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కొక్క
జౌంసు చొప్పున ఇచ్చుచుండుమని భార్యకు చెప్పి, ఆ విషయమును భర్తకు కూడ
తెలియజేసి వెడలి పోయెను. వైద్యుడు గృహమును వీడిన తదుపరి భార్య ఆ మందును
దాచివైచి ఊరకుండెను. భర్తకు ఇవ్వలేదు. ఒకపూట గడచిపోయెను. రెండుపూటలు
గడచిపోయెను. కాని భర్తకు ఏమాత్రము మందు ఒసంగలేదు. ఈ విషయము తెలిసికొని
భర్త వెంటనే భార్యను పిలిపించి "డాక్టరుగారు మందు ఇచ్చినది త్రాగుటకా,
దాచి పెట్టుకొనుటకా?" అని ప్రశ్నింప వెంటనే ఆ గృహిణి సమయోచితముగ
నిట్లుపలికెను.

'మందు విషయమై ఇపుడు ఎమితొందర? నిదానముగా ఇంకొక వారందినములైన పిదప
త్రాగవచ్చును.' ఆ వాక్యములను విని భర్త "నీకు మతి పోయినట్లుగా ఉన్నదే!
రోగము వచ్చినపుడుగదా మందు త్రాగవలె" అని పలుక అంతట ఆ యిల్లాలు భర్తకు ఈ
ప్రకారముగ చక్కతిబోధ సలిపెను -

"మహాశయా! ఇపుడు మీరు దారికి వచ్చినారు. రోగము వచ్చి నపుడు కదా మందు
త్రాగవలె అను మీ వాక్యము చాలా హేతుకమైనది. అయితే పుట్టిన ప్రతిప్రాణి
భవరోగముచే బాధపడుచుండగా ఆ రోగమును బాపుకొనుటకు భగవన్నామామృతమును ఔషధమును
వెంటనే ఏల త్రాగరాదు? ఆలస్యమేల చేయ్యవలెను? శరీరము క్షణికము కదా! రేపునకు
రూపు లేదుకదా! అట్టిచో వార్థక్యము వరకు ఆ భగవచ్చింతనమును పవిత్రకార్యమును
వాయిదావేయుట పాడియా! కాబట్టి సంసార రోగము, పుట్టుక చావు అనురోగము
తగుల్కొనిన ఈ క్షణమందే ఆ రోగమును తొలగించుటకు రామనామమును, కృష్ణనామమును,
భగవన్నామమును స్మరించవలెను. దైవచింతన, భగవద్ధ్యానము చేయవలెను.
వార్ధక్యము, మృత్యువు కాచుకొనియున్నవి. రోగములు జీవుని ఆక్రమించుటకు
సిద్ధము గానున్నవి. ఇట్టి పరిస్థితి యందు మీనమేషములు లెక్క పెట్టుచు
భవరోగ చికిత్సయగు దైవద్ధ్యానామృతమును గ్రోలక ఆలసించుట పాడికాదు. అలసత్వము
ప్రమాదహేతువు. కాబట్టి ఇపుడే రామనామమును ఉచ్చరింపుడు,జపించుడు!"

పత్నియొక్క ఈ చక్కటి బోధను ఆలకించి భర్త వెంటనే రామనామమును భక్తితో
జపించసాగెను. వెనువెంటనే భార్య భర్తకు ఔషధమును ఒసంగ అతనిరోగము
ఉపశమించెను. ఈ ప్రకారముగ శారీరక, మానసికములను రెండు రోగములున్ను
తొలిగిపోయి అతడు పరమ శాంతిని బడసెను.

నీతి: సంసారరోగము తగుల్కొని పుట్టుచు, చచ్చుచు నానా బాధలను పొందుచున్న
జీవుడు ఆరోగము తొలగుటకు అవసరమైన ఆత్మజ్ఞానమును ఔషధమును సేవించి శాంతిని
బడయవలెను. ఆలస్యము చేయరాదు.

by  k.radhakrishna

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి