హిందువుల విజ్ఞానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హిందువుల విజ్ఞానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఫిబ్రవరి 2012, బుధవారం

జ్యోతిష్యం ఒక అనుభవాధారిత శాస్త్రం

ఒక పాతబ్లాగునుండి యథాతథ పునః ప్రదర్శన


SUNDAY, DECEMBER 23, 2007

Is astrology scientific? -scietific method continued

ఏది విజ్ఞానం? ఏది కాదు?
తన పరిధిలో పరిశీలనకు వచ్చిన వాస్తవాలను సంతృప్తికరంగా వివరించకపోతే వైజ్ఞానిక సిద్ధాంతం ఏదీ కూడా అట్టేకాలం నిలబడదు. కాని విజ్ఞాన చరిత్ర నిండా ఉత్తరోత్తరా దోషాలని రుజువైన సిద్ధాంతాలు లేకపోలేదు. న్యూటన్ పేర్కొన్న వెలుగుకణ సిద్ధాంతం ఇందులో ఒకటి. ఇంత మాత్రానే విజ్ఞాన స్థాయికి భంగం వాటిల్లదు. మనో విశ్లేషణవంటి అన్వేషణారంగాలనేకం ఉన్నాయి. వాటిలో సర్వసాధారణంగా ఆమోదించే వైజ్ఞానిక సిద్ధాంతం ఇంకా రావలసి ఉంది. అంటే మనో విశ్లేషణ ఉబుసుపోక అనుకోరాదు. చాలా ఆసక్తికరమైన, ఉపయోకరమైనకృషి ఈ రంగంలో జరిగింది. అనేక సందర్భాలలో ఈ పద్ధతి ప్రయోగించే చికిత్సా విధానాలను చూస్తుంటే దీనిని తేలికగా కొట్టిపారేయడానికి వీల్లేదు. అయినప్పటికీ ఆ సిద్ధాంతంగా పేర్కొన్న దానిలో అద్భుతమైన అంతర్ దృష్టి కనిపిస్తున్నదేగాని, కీలకమైన పరీక్షకు గురికాలేదు. విజ్ఞాన సిద్ధాంతంగా ఆవిర్భవించడానికి మనో విశ్లేషణ అన్వయించే పద్ధతులు, ఉద్దేశాలు ఉన్నాయికూడా. దీనికి వ్యతిరేకంగా వ్యవస్థాపితమైఉన్న సిద్ధాంతం ఏదీ లేదు. అందు వల్లనే, మనో విశ్లేషణ రానురాను విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందవచ్చు. ఆ లక్ష్యం చేరుకోడానికి ఎంతో దూరం పయనించవలసి రావచ్చు.
మరో విధమైన సిద్ధాంతాలు కూడా ఇక్కడ చర్చించబోతున్నాం. వాటిలో పరిమితంగా ప్రాపంచికానుభవ సత్యం కొంతమేరకు ఉన్న సందర్భాలు లేకపోలేదు. అయినా అవి విజ్ఞానపరంగా లేవు. ఈ సిద్ధాంతాలు ప్రతిపాదించే వాటిననుసరించి, అందులో ఇమిడి ఉన్నవాటిని పరోక్షంగానైనా రుజువుపరచవీల్లేదు. అదే రంగంలో విజయవంతంగా పనిచేస్తున్న వైజ్ఞానిక సిద్ధాంతాలలో పెసగకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పైగా అటువంటి విజ్ఞాన-విజ్ఞానేతర సిద్ధాంతాలను (ఒకే రంగంలో) కొన్నింటిని చూద్దాం.

ఖగోళం-జ్యోతిష్యం
ఈ రెండూ మానవుడు చిరకాలంగా పరిశీలిస్తున్న ఆకాశానికి చెందినవే. ఆకాశంలో ఒకే తీరుగా చలిస్తున్నవాటిని, అందుకు సంబంధించిన భౌతిక సంఘటనలను మానవుడు పరిశీలిస్తున్నాడు. ఆధునిక విజ్ఞానం ఆవిర్భవించేటంత వరకూ జ్యోతిష్యం-ఖగోళ శాస్త్రం భిన్నమైనవని భావించనేలేదు. మానవ వ్యవహారాలకు ఖగోళ విషయాలను అన్వయిస్తే జ్యోతిష్యం అవుతుంది. మానవుడి వ్యవహారాలకు ఖగోళ విషయాలను అన్వయిస్తే జ్యోతిష్యం అవుతుంది. ప్రతి నక్షత్రం, ప్రతి గ్రహానికి కూడా ఒక దేవత ఉంటుందనీ, ఆ దేవత మానవుడి వ్యవహారాలలో ఆసక్తి చూపడమేగాక, ప్రభావితం చేస్తుందని భావించారు. గ్రహాల చలన నియమాలను కనుక్కొన్న కెప్లర్ సైతం జ్యోతిష్యంలో నమ్మకం గలవాడే. అతడి సమకాలీనులకు ఈ ధోరణిలో దోషం కనిపించలేదు. ఆకాశంలోని ఈ నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకున్న తరవాత, సామాజిక సంస్థలు పనిచేసే తీరు, మానవుడి శారీరక మానసిక రీతుల గురించి తగినంతగా తెలిసిన అనంతరం, గడ్డినుంచి గింజలు వేరు చేయడానికి వీలుచిక్కింది. ఖగోళశాస్త్రం విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందింది. మానవుడిపై గ్రహాల, నక్షత్రాల ప్రభావం ఉంటుందనే జ్యోతిష్యం విజ్ఞానపరంగా అపఖ్యాతి పాలైంది. ఇది అవగాహన చేసుకోవడం సులభమే. ప్రతిపాదన చేసిరాబట్టే నిర్మాణం ఖగోళంలో ఉంది. అనేక పరిశీలనాంశాలకు స్పష్టమైన వివరణలను ఖగోళ శాస్త్రం ఇస్తోంది. పరీక్షకు తట్టుకొనే ప్రమాణానికి నిలబడకలుగుతోంది. ఇందుకు భిన్నంగా, జ్యోతిష్యంలోని మూల సూత్రం దోషపూరితమైంది. నక్షత్రాలకు, గ్రహాలకు అంటి పెట్టుకొని దేవతలు అనేవారెవరూ లేరు. ఆకాశంలోగాని భూమిపైన గాని ఎక్కడా అలాంటి వారు లేరు కనక వారు మానవుడి వ్యవహారంలో ఆసక్తి చూపే ప్రశ్నేరాదు. జ్యోతిష్యం అశాస్త్రీయం. మనకు గల ప్రత్యక్షజ్ఞానానికి, వ్యవస్థాపిత సిద్ధాంతాలకు పొసగకుండా జ్యోతిషం ఉంది. జ్యోతిష్యం అశాస్త్రీయమే కాదు. విజ్ఞాన వ్యతిరేకం కూడా, జ్యోతిష్యంలో లాగే, యోగసిద్ధాంతం వంటి వాటిల్లోనూ ఇలాంటి విజ్ఞాన వ్యతిరేక ధోరణి ఉంది. విజ్ఞానం రుజువు పరచిన నియమాలను పాటించకుండా, గతం, వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించి జ్ఞానాన్ని మానవుడు యోగం ద్వారా సిద్ధింపజేసుకోవచ్చుననటం వాస్తవ వ్యతిరేకమే.

Next-Is ayurveda scientific?

14 COMMENTS:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

గత కొద్ది శతాబ్దాలుగా బాగా ప్రచారంలోకి వచ్చిన భావాలనే మీరూ రాశారు. కొత్తదనమేమీ లేదు. జ్యోతిష్యం అన్ని శాస్త్రాల వంటిదే. అంటే-ఏ శాస్త్రసత్యాలనైనా దాన్ని నేర్చుకుని ప్రయోగించి అన్వయించుకుని సాక్షాత్కరించుకోవలసినదే. జ్యోతిష్యమైనా అంతే. ఒక శాస్త్రం మీకు రానప్పుడు మీరందులో ప్రయోగాలు చెయ్యనప్పుడు మీకు దాన్ని గుఱించి మాట్లాడే అర్హత లేదు. మీకెందులో నైనా నోబెల్ బహుమతి వచ్చినా సరే ! నాకు న్యూక్లియర్ ఫిజిక్సు రాదు. అంతమాత్రాన న్యూక్లియర్ ఫిజిక్సు మొత్తం అబద్ధమైపోదు.

ఒక శాస్త్రపు సూత్రాలని ఇంకో శాస్త్రపు పరిభాష (terminology)తో వివరించబూనుకోవడం నిష్‌ప్రయోజనం. అజ్ఞానపూర్వకం కూడా. Mathematics పరిభాషతో గాని దాని ప్రయోగసరణితో గానీ మీరు Zoology, biology principles ని వివరించజాలరు. విషయాల్ని వివరించడానికి ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క పద్ధతినీ ఒక్కొక్క పరిభాషనీ ఆశ్రయిస్తుంది. అంతే కాక ఒక శాస్త్రపు conclusions ఆధారంగా ఇంకో శాస్త్రపు conclusions ని త్రోసిపుచ్చడం మూర్ఖత్వం. కారణం-దృశ్యమాన జగత్తులో ప్రతివస్తువుకూ విషయానికీ అనేక Dimensions, aspects ఉంటాయి. శాస్త్రాలనబడేవి వాటిని కల్పించిన మానవుల అవగాహనా పరిధికి కోణానికీ ప్రతిబింబాలు కనుక వారి వ్యక్తిత్వపు లోపాల్ని అవి కూడా జీర్ణించుకుని బాధపడుతూంటాయి. అవి మన ముందు project చెయ్యబడే విధానంలో వారి వ్యక్తిత్వపు లొసుగుల్ని సైతం ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి అవి పూర్తి సత్యాలు కావు.

ఉదాహరణకు- మీఱొక పుస్తకాన్ని బల్ల మీద పెడితే-ఒక పిల్లవాడు దాన్ని చూసి అందులో రంగుల బొమ్మలున్నాయేమో వెతుక్కుంటాడు. ఒక పాతపేపర్ల వ్యాపారి చూస్తే దాని బరువుని బట్టి దానికి ఎంత రద్దు-సామాను విలువ పలుకుతుందో అంచనా వేసుకుంటాడు. ఒక DTP operator చూసి అందులో ఏ మాత్రం Graphics నైపుణ్యం ఉందో పరిశీలిస్తాడు. ఒక రచయిత దానిలో Chapterization లాంటివి ఎంత బాగా చేశారా అని ఆలోచిస్తాడు. ఒక విద్యార్థి చూస్తే latest model paper కి పనికొచ్చే సమాధానాల కోసం అన్వేషిస్తాడు. మీరు చెప్పే శాస్త్రాలూ శాస్త్రీయ దృష్టులూ వీళ్ళవంటివే. మనకు పనికొచ్చే విషయాలకు మనం శాస్త్రాలని పేరుపెడతాం. మనకు పనికిరానివి మన దృష్టికే ఆనవు.అందవు.అర్థం కావు. ఆ విషయంలో మనం బౌద్ధిక లిల్లీపుట్లం.

గ్రహాలకు అనేక ఇతర ప్రాకృతిక దృగ్విషయాలకూ ఇలాగే అనేకమైన dimensions, aspects ఉంటాయి. వాటిల్లో కొన్ని పంచేంద్రియాలకు కనిపిస్తాయి. కొన్ని కనిపించవు. కారణం-అవి తమను తాము స్వయంగా వ్యక్తీకరించుకుంటేనే తప్ప మనం వాటి స్వరూపాన్ని తెలుసుకోలేము. అవి మీరు భావిస్తున్నట్లు ప్రాణం లేనివీ, చైతన్యం లేనివీ, వెఱ్ఱిమొఱ్ఱివీ కావు. పాత, కొత్త శాస్త్రాలు చెప్పే aspects, dimensions అన్నీ ఏకకాలంలో సత్యాలే. ఒక వ్యక్తి పొట్టివాడు అనే సత్యం అతడు బలవంతుడు అనే సత్యాన్ని ఆటోమేటిగ్గా ఖండించదు. అలాంటివే, పైకి ఘర్షిస్తున్నట్లు కనిపించే ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాల conclusions కూడా.

ఇహపోతే "శాస్త్రీయం".

ఇది ఈమధ్యకాలంలో చాలా దుర్వినియోగానికి గురౌతున్న పదం. A highly vulgarizerd term as well. శాస్త్రీయమంటే- ఈ కాలంలో ఒకటే అర్థం -"నాకు తెలిసిన పదజాలాన్నే నువ్వు వాడాలి. వేఱే పదజాలం వాడితే నేను భరించలేను. ఈ ప్రపంచంలో అన్ని విషయాల వివరణా నేను నేర్చుకున్న సైన్సు కోడిలో, నా టెక్నాలజీ కుంపట్లో ఇమడాలి. అలా ఇమడకపోతే నువ్వు చెప్పే విషయానికి నేను unscientific అని బ్రాండు వేస్తాను." ఇది భాష గుఱించిన తగవు మాత్రమే. ఇది తెలుసులేక కొంతమంది సంప్రదాయవాదులు కూడా ప్రాచీన శాస్త్ర సూక్తులకు ఆధునికుల్ని ఒప్పించాలనే వ్యర్థమైన పట్టుదలతో కోడి-కుంపటి భాష్యాలు చెప్పడం మొదలుపెట్టారు.

వాస్తవం చెప్పాలంటే-ఇప్పుడు సైన్సు పేరుతో, శాస్త్రీయత పేరుతో చెలామణి అవుతున్నది-తెల్లవాళ్ళు ప్రపంచాన్ని చూసే విధానం. వాళ్ళు విషయాల్ని అర్థం చేసుకోవడానికి దూఱిన ఒక సంకుచిత గూభ్యం.అది మనం కూడా అంగీకరిస్తే మనం మంచివాళ్ళం. లేకపోతే పిచ్చివాళ్ళం.

Mallik said...

లలితా సుబ్రహ్మణ్యం గారితో నేను ఏకీభవిస్తున్నాను. ఒకప్పుడు విశ్వం ఒక్కటే అనే వారు. విశ్వం అంచులు ఎక్కడి వరకూ ఉన్నయో ఎవరైనా చెప్పగలరా? ఆ అంచుల అవతల ఏమైనా ఉన్నయేమో చెప్పగలరా? పైగా ఈ మధ్య రీసెర్చిలో అనేక విశ్వాలు ఉన్నాయని చెపుతున్నారు. దీనంతటికీ మూలకారణుడు లేక కారణురాలు యెవరు? యెవరైనా చెప్పగలరా? కొన్నిటికి సమాధానాలు ఉండవు.

oremuna said...

వాదనలో తిమ్మిని బమ్మిని చేయడానికి కాకుండా జ్యోతిష్కాన్ని ఎందుకు నమ్మాలో ఓ ఐదు ఉదాహరణలు చెప్పగలరా?

ఎందుకు నమ్మకూడదో చెప్పడానికి చాలా ఉదాహరణలు కళ్ళ ముందే కన్పిస్తున్నాయి.
1. మన పత్రికల్లో వచ్చే దినవారఫలాలు
2. మన ఉగాది పంచాంగ శ్రవణంలో వర్షాల రాకపోకలు
3. నాడీ జ్యోతిష్క్యం
...

ఇలా కోకొల్లలుగా చెప్పవచ్చు

జ్యోతిష్కం ఓ బలహీనత/ బలహీనతను మాపుకొనె సాధనం తప్ప మరేమీ కాదు!

innaiah said...

I understand your reactions and comments.
Let us see the position from positive side.
Take astrology in India. It depends on nine planets.
Rahu and Ketu are non existent. So the count is seven.
Moon is not planet. It is satellite to earth.
The count becomes six.
Sun is not planet. It is self luminous body. It is star. The count remains five only.
If the major premises is wrong, naturally conclusions cannot become right.
There must be some connection between persons and planets. What is that connection? Without knowing the verified connection how can it possible to predict?
Let us think and proceed in stead of hastily come to comments.
Stars mentioned in astrology are not available for test.
The constellations are shapes mentioned by our people which are not verifiable.They are not in existence.
Think and proceed carefully before come to comments

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఎవరు చెప్పినదీ ఎవరూ నమ్మాల్సిన పని లేదు. మీరు జ్యోతిష్యాన్ని ఖండించే ముందు దాన్ని నేర్చుకుని ఫలితాలు సరిచూచుకుని ఖండించండి. జ్యోతిష్కులమని చెప్పుకునేవాళ్ళ వ్యక్తిగత లోపాలకు ఒక శాస్త్రాన్ని నిందించకండి. అలా నిందించాల్సి వస్తే ప్రపంచవ్యాప్తంగా అల్లోపతీ చికిత్స తీసుకుని మఱీ చనిపోతున్న కోట్లాదిమంది శవాల సాక్షిగా అల్లోపతీ వైద్యవిధానాన్ని కూడా నిందించాల్సి వస్తుంది. వాతావరణ శాస్త్రజ్ఞుల weather forecasts ని కూడా నిందించాల్సి వస్తుంది. ఏ శాస్త్రంలో నైనా సిద్ధాంతభాగం ఉన్నంత ఖచ్చితంగా ఫలితభాగం ఉండదు.

ఇహపోతే, రాహుకేతువుల సంగతి. భూమి orbit చంద్రుడి orbit తో సమద్విఖండన చేసే బిందువుల మధ్య కుడియెడమల దూరాలకు మన పూర్వీకులు రాహుకేతువులని పేరుపెట్టారు. వాటి వల్ల భవిష్యత్ ఫలితాల్లో తేడా వస్తున్నట్లు గ్రహించడం వల్ల వాటిని కూడా గ్రహాలన్నారు. గ్రహాలంటే planets అనుకోకండి. జ్యోతిశ్శాస్త్రం చెప్పే గ్రహాలు planets గుఱించి మాత్రమే కాదు, జాతకం మీద ప్రభావం కలిగించే యావత్తు జ్యోతిస్సుల (Luminary bodies) గుఱించి. మీరు జ్యోతిశ్శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తే ఇలాంటివన్నీ బోధపడతాయి. ఇలా కూర్చుంటే ఏమీ తెలియదు.

ప్రస్తుతం scientific పేరుతో చెలామణీ అవుతున్నది ఒక గూభ్యాలోచన విధానం. ఈ విధానంలో ఏ పదార్థానికా పదార్థం, ఏ వస్తువుకా వస్తువు ఇతర పదార్థాలతోను వస్తువులతోను సంబంధం లేనిదిగా భావించబడుతూ అపార్థం చేసుకోబడుతూ ఉంటుంది. వాస్తవానికి ప్రకృతి ఆ విధంగా నిర్మించబడలేదు. ప్రకృతిలో ప్రతిదానికీ ఇంకో విషయంతో గొలుసుకట్టు సంబంధాలున్నాయి. మనకు తెలియనంత కాలం ఏమీ లేదనుకుంటాము. ఇప్పుడు scientific అని భావించబడుతున్న అనేక విషయాల గుఱించి గతంలో అలాగే అనుకున్నాం. అయితే జ్యోతిష్యం మన పూర్వులు మనకంటే ముందే ఆలోచించినది కావడం వల్ల దాని క్లెయిములు, అన్నీ తెలుసుననుకుంటున్న మన అహంకారానికి గొడ్డలిపెట్టులా ఉన్నాయి. ఒకటి ఒప్పుకుంటే అన్నీ ఒప్పుకోవాల్సి వస్తుందనే భయంతో అన్నిటినీ ఊచమట్టుగా త్రోసిపుచ్చడానికి ఆధునిక మానవుడు అలవాటు పడ్డాడు. కాని నిజం నిప్పులాంటిది. ఒకప్పుడు మానవ నాగరికతలో జ్యోతిష్యం లేదు. తరువాత కొన్ని వందల సంవత్సరాల పరిశోధనా పరిశీలనా ఫలితంగా ఆ శాస్త్రం ఆవిర్భవించింది. ఇప్పుడు మీరు "కాదు" అంటే తాత్కాలికంగా విజయం మీదే. కాని మానవ కుతూహలం "కాదు, కూడదు"ల దగ్గర ఆగిపోదు. కుతూహలాన్ని ఎవరూ నిషేధించలేరు. అది మళ్ళీ ఆవిర్భవిస్తుంది. మీరు ఆకాశాని కెత్తుతున్న so-called scientific people నుంచే పునర్జన్మ ఎత్తుతుంది.

"నాకు తెలియదు" అని ఒప్పుకోవడం ఒకప్పటి మర్యాద. "నేను నమ్మను" అనడం ఈనాటి ఫ్యాషన్. మన:స్థితి మాత్రం ఒకటే.

"అది వాడి రక్తంలోనే ఉందిరా !" అని వెనకటి తరం వాళ్ళు అంటే, మొన్నమొన్నటి దాకా నవ్వారు-రక్తంలోనే అన్నీ ఉంటాయా ? అంటూ ! ఇప్పుడు ప్రతిదానికీ జీన్సుతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఎవరు గెలిచారు ?

అందుచేత, మన పూర్వీకుల్ని వఠ్ఠి వెధవాయిలుగా శుంఠలుగా త్రోసిపుచ్చకండి. మీరు అనుకుంటున్నట్లు కాదు. మీకు సంస్కృతం రాకపోవడం, ప్రాచీన గ్రంథాలు చదవకపోవడం-ఇలాంటి పొఱపాటు అభిప్రాయాలకు కారణం. ప్రతి వృద్ధుడూ ఒకప్పుడు మనలాంటి యువకుడేనని అర్థం చేసుకోండి.

బ్లాగేశ్వరుడు said...

నేను తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారితో ఏకిభవిస్తున్నాను. జ్యోతిష్యశాస్త్రము కూడా ఒక సైన్సు వంటిది.

innaiah said...

Scientific method follows self correction. Never claimed omniscience, omnipotence. That is essential difference between belief and research.Blind belief in the old systems and ancient people is not monopoly of east, it is similar in west too.
Astrology is not proved scientific anywhere. But some astrologers claimed it as scientific to get respectability.
James Randi put 5 crores of rupees in the trust and offered to give to anyone who establishes the scientific nature of astrology.
please go and see website at:
www.randi.org and find details.

innaiah said...

The burden of proof always remains with those who claim scientific status to astrology.If some one says-come what may- I blindly adhere to my belief, there cannot be argument and reason

వింజమూరి విజయకుమార్ said...

వాదనతో తిమ్మిని బమ్మిని చేయడానికి యిది చదువురానోళ్ళ చోటు కాదు. చదువుకున్నోళ్ళుండే చోటు. ఇక్కడ వాదనకి సరైన ప్రతివాదన చూపి వాళ్ళ వాదన తిప్పికొట్టడం జరిగి తీరుతుంది. అసలు తాడేపల్లి గారి వాదన ఒక base మీద నిలబడినట్టు, వాదనకి ఒక stand ఉన్నట్టు అన్పించదు. ఉదాహరణకి ఇది చూడండి. "ప్రకృతిలో ప్రతిదానికీ ఇంకో విషయంతో గొలుసుకట్టు సంబంధాలున్నాయి" అన్నారీ వ్యాఖ్యలలోనే. అదే విధంగా "ఒక శాస్త్రపు సూత్రాలని ఇంకో శాస్త్రపు పరిభాష (terminology)తో వివరించబూనుకోవడం నిష్‌ప్రయోజనం. అజ్ఞానపూర్వకం కూడా. Mathematics పరిభాషతో గాని దాని ప్రయోగసరణితో గానీ మీరు Zoology, biology principles ని వివరించజాలరు." ఇలా అనడం వైరుధ్యం కాదా. ప్రకృతితో అంతటికీ గొలుసు కట్టు వున్నప్పుడు లెక్కలకీ, జువాలజీ కీ గొలుసుండదా? సృష్టినంతటినీ ఏక సూత్రబద్ధం (ఒకే గొలుసుతో కలపబూనడం)చేయబూనిన ఐన్ స్టీన్ లెక్కల్లో సాపేక్ష సిద్ధాంతం (భౌతిక శాస్త్రం) చెప్పలేదా? ఈ మాట చూడండి. ఇది Science గురించి తెలిసిన ఏ వ్యక్తీ అనకూడని మాట. "ఏ పదార్థానికా పదార్థం, ఏ వస్తువుకా వస్తువు ఇతర పదార్థాలతోను వస్తువులతోను సంబంధం లేనిదిగా భావించబడుతూ అపార్థం చేసుకోబడుతూ ఉంటుంది." ఐన్ స్టీన్ దగ్గర నుండీ ఏ బుర్రున్న శాస్త్రవేత్తా "ఏ పదార్ధానికా పదార్థం" భావనలో వుండడు.ఐన్ స్టీన్ దాకా ఎందుకు mathematics తో నేను నా http://abhinayani.blogspot.com లో 'ఇంటి పేరు పురుషుడిదే' వ్యాసంలో లెక్కల మూలాలతో జీన్స్ నీ, జీన్స్ తో 'ఇంటిపేరు'నీ వివరించగలిగితిని కదా. జీన్స్ Zoology, biology ల్లో భాగం కాదా? చేతనయితే ఆ విషయం ఎవరైనా పూర్వపక్ష చేసి చూపండి. అయినా ఇప్పటి వరకూ ప్రామాణికం లేదనుకున్నప్పుడూ, ప్రస్తుతానికి సైన్సుదే విజయం అనుకున్నప్పుడూ, ఎప్పుడో నిరూపణకి రాబోయే వ్యక్తిగత విశ్వాసాల్ని జనాల నెత్తిన రుద్దబూనడం ఎంత వరకూ సమంజసం?

వింజమూరి విజయకుమార్ said...

ఇంతకు ముందు నేనొక వ్యాఖ్య రాయడం జరిగింది. అందులో జ్యోతిష్యాన్ని వకాల్తా పుచ్చుకున్న వ్యక్తి వ్యాఖ్యానం లోని లోపాల్ని బహిర్గతం చేయడం జరిగింది.

ఇప్పుడు బ్లాగ్విషయం గురించి. జ్యోతష్యశాస్త్రం శాస్త్రీయమో కాదో నాకు తెలీదు. కానీ నా వ్యక్తిగతంగా మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయాలే వున్నాయి. మచ్చుకి రెండు చెపుతాను. నాకు 1993 మార్చి 10 వ తేదీతో రాహు మహాదశ పూర్తయి, గురు మహాదశ మొదలైంది. నా అపాయింట్ ఆర్ఢరు 17-03-1993 న టైపు అయింది. నేను 30వ తేదీన ఉద్యోగంలో జాయిన్ అవడం జరిగింది. అలాగే మా బాబు పుట్టే సమయానికి వాడికి సింహరాశిలో కేతు మహాదశ నాల్గవపాదంలో(ఈ కేతు నాల్గవ పాదం లోనే యన్.టీ.ఆర్ మరణించింది) యిక రెండు రోజులే మిగిలివున్నాయి. విచిత్రంగా ఆ రెండు రోజులూ బాబుకి గ్యారంటీ యివ్వలేమన్నారు డాక్టర్లు. ఎలాగో ఇంటెన్సివ్ కేర్ లోనే ఆ రెండ్రోజులూ గడిచాయి. ఇక వాడికి శుక్ర మహాదశ ప్రారంభమయింది.ఆ తర్వాత అంతా శుభమేననుకోండి. అలా చెప్పాలంటే చాలానే వున్నాయి. అయినా నా వ్యక్తిగత నమ్మకాన్ని నేను శాస్త్రబద్ధం చేయబోను. అలాగే జరగనివి కూడా చాలా వున్నాయి. హిట్లర్ జాతకంలో కుజుడి స్వస్థానాలైన మేష, వృచ్ఛికాల్లో ఏదో ఒక దాన్లోనే కుజుడున్నాట్ట. అందుకే అతడు లోక కంటకుడయ్యారంటారు. కానీ, నేను మేషంలో కుజుడున్న వ్యక్తుల్ని ఇద్దర్ని చూసాను. వాళ్ళు చాలా మంచి వ్యక్తులూ, ముఖ్యంగా కోప స్వభావం లేని వారూనూ.

ఇక మీరు యోగ సిద్ధాంతం కూడా విజ్ఞాన వ్యతిరేక వాదం అన్నారు. ఒక మాటనుకుందాం. విజ్ఞానం అనంతమైనది. అదెప్పుడూ అనంతంగా తెలుసుకుంటూ పోవాల్సిన విషయం. ఇక మనిషి జీవిత కాలం పరిమితమైనది. అలా విజ్ఞానాన్ని తెలుసుకుంటూ పోవడంలోనే మనిషి మరణించడమూ జరిగిపోతుంది. ఇక మానవజీవితానికి పరమార్థం యేమిటనే ప్రశ్న అలాగే మిగిలిపోతుంది. అందుకే పెద్దలు మనం మనసులో పోగు చేసి పెట్టుకున్న విజ్ఞానం (ఇది పరిమితమైనది)గతం రూపంలో వుండి, అది వర్తమానాన్ని ప్రభావితం చేస్తూ భవిష్యత్తుని కలుషితం చేస్తున్నదంటారు. గతం లోంచి మనం సృజించిందేదైనా అది పాతదైన గతానికి మరో రూపమే కానీ అసలైన సృజనాత్మకం కాదంటారు. అసలైన సృజనాత్మక శక్తి మనసు గతంతో నిండిపోకుండా ఖాళీగా వున్నప్పుడే కొత్తది అందులోకి ప్రవేశించడానికి వీలుంటుందంటారు. అది తెలుసుకోడానికి మనం వర్తమానాన్ని గతంతో నింపకుండా ఋజువు చేసుకొని వ్యాఖ్యానించాలి గానీ, యిలా విజ్ఞానం ఋజువు పరచిన నియమాలను పాటించాలనడం భావ్యం కాదు గదా. ఆ నియమాలను పాటిస్తే అది మళ్ళీ మనం గతాన్ని practice లేదా exercise చేస్తున్నట్టే అవుతుంది గదా. అందుచేత యోగసిద్ధాంతం అనేది ఒక పేపర్ మీద పెట్టగలిగిన map కాదనీ, అది beyond thought అనావరణంగా వున్న మనసులో మాత్రమే చొరబడడానికి వీలుండే సృజనాత్మకమైనదనీ, దాన్ని వ్యక్తి తనంతట తాను ఋజువు చేసుకోవాల్సివుంటుందనీ, అంతా సైన్సుకి అణుగుణంగానే వుండాలను కోవడమూ తప్పేనేమోననీ విన్నవించుకుంటున్నాను.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

నా వాదనలో లేని లోపాల్ని కనుగొని బహిర్గతం చేసిన వింజమూరిగారికి నెనర్లు.

1. ప్రకృతిలో ఒక విషయానికి మఱో విషయంతో గొలుసుకట్టు సంబంధం ఉండడం.

2. ఒక శాస్త్రపు పరిభాషతో ఇంకో శాస్త్రాన్ని వివరించబూనుకోవడం.

ఈ రెండూ ఒకటేనా ? మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. లోపం ఎవరి వాదనలో ఉందో మీకే అర్థమౌతుంది.

మీకర్థం కాకపోతే నేనే చెబుతాను.

ప్రకృతి ఏ శాస్త్రాలూ లేనిది. మానవుడు ఎన్నో శాస్త్రాలు ఉన్నవాడు. మానవుడి శాస్త్రాలన్ని తనకు అర్థమయ్యే విధంగాను తనకర్థమైనదాన్ని ఇతరులకు బోధపఱిచే విధంగాను ఏర్పఱచుకున్న సంకేతావళితో కూడుకొన్నవి. ఒక శాస్త్రపు సంకేతాలు ఇంకో శాస్త్రానికి వర్తించవు. ఒక శాస్త్రంలో నిజనిర్ధారణకు వాడే ప్రయోగసరణి ఇంకో శాస్త్రానికి అన్వయించదు.

ఈ ప్రస్తావన ఏ సందర్భంలో వచ్చిందో గమనించండి. గ్రహాలకూ మనిషి జీవితానికీ సంబంధం ఉందని నేను చెప్పిన సందర్భంలో వచ్చింది. ఇతర శాస్త్రాల ఆధారంగా జ్యోతిష్యం మీద తీర్పు చెప్పడం తప్పనీ జ్యోతిశ్శాస్త్రాన్ని దాని సొంత సూత్రాల మీదా దాని సొంత నిజనిర్ధారణపద్ధతి మీదా అర్థం చేసుకోవాలనీ చెప్పిన సందర్భంలో వచ్చింది.

ఒక ప్రక్క సోదాహరణంగా నా వాదనని బలపరుస్తూ మఱో ప్రక్క నా గుఱించి ప్రతికూల ప్రస్తావన తేవడం సందర్భోచితమేనా ? లేక దీనికేమైనా నేపథ్యం ఉందా ?

సరే ! కానివ్వండి. మీ ఇష్టం.

-ఇట్లు భవదీయుడు

(జ్యోతిష్యం తరఫున వకాల్తా పుచ్చుకున్న ఒక వ్యక్తి)

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఇన్నయ్యగారూ !

"జ్యోతిష్యం ఒక విశ్వాసం కాబట్టి అది అలా ! సైన్సు సైన్సే కాబట్టి ఇది ఇలా..." అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. అభినందనలు.

నా ప్రశ్న ఏమిటంటే-సైన్సుగా చెలామణీ అవుతున్నదాంట్లో విశ్వాసాలకు స్థానమే లేదా ? సైన్సు అంటే సెల్ఫు కరెక్షన్ అని చెప్పారే ! జ్యోతిష్యం కూడా అంతేనని మీకు తెలియదు. ఇక్కడ సమస్య జ్యోతిష్యంతో కాదు. దానికి మూఢవిశ్వాసమని పేరుపెట్టి దాన్ని గ్రుడ్డిగా త్రోసిపుచ్చేవాళ్ళ గ్రుడ్డి-చెవిటి మనస్తత్వంతో ! దానికలా పేరుపెట్టి ఎప్పుడైతే కళ్ళు మూసేసుకున్నారో అప్పుడు దానిమీద ఇలా బురద జల్లుతూ శతాబ్దాల తరబడి వ్యాసాలూ బ్లాగులూ రాయాల్సి వస్తుంది. ఎందుకంటే జ్యోతిష్యం అబద్ధమని కొన్నివేల సంవత్సరాలుగా చాలామంది మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా జ్యోతిష్యం చనిపోలేదు. దాని లెక్కలూ విశ్లేషణా జనానికి తమ వ్యక్తిగత జీవితాల్లో ఫలితాలు చూపిస్తున్నంతకాలం అది చనిపోదు. ఇతరుల అనుభవాల్ని త్రోసిపుచ్చినంత తేలిగ్గా ఎవరూ తమ వ్యక్తిగత అనుభవాల్ని త్రోసిపుచ్చలేరు.

సైన్సు చదువుతున్నవాళ్ళంతా అందులోనివన్నీ సత్యాలని అర్థమయ్యాక ఆ కోర్సుల్లో చేరారా ? లేక చేరాక అవి సత్యాలని తెలుసుకున్నారా ? మొదటిది నిజమైతే వాళ్ళు చేరాల్సిన అవసరం లేదు. రెండోది నిజమైతే సైన్సు సత్యమనే ప్రచారం వల్ల చేరారని చెప్పాల్సి ఉంటుంది. మఱి సైన్సు విషయంలో positive bias లేదని ఎలా అంటారు ? మఱి జ్యోతిష్యం దగ్గరికొచ్చేసరికి negative bias సృష్టించడానికి మీవంటివారు ఇతోధికంగా కృషి చేస్తున్నారు కదా ! ఇదేనా scientific method అంటే ?

నా వ్యక్తిగత విశ్వాసాల్ని జనం మీద రుద్దుతున్నానని వింజమూరిగారు అన్నారు. జ్యోతిష్యం నా ఒక్కడి వ్యక్తిగత విశ్వాసమైతే ఆ శాస్త్రాన్ని నేను సృష్టించి ఉండాలి. కాని నేను సృష్టించలేదని అందరికీ తెలుసు. ఒకవేళ జ్యోతిష్యం వ్యక్తిగత విశ్వాసమైతే అలాంటి వ్యక్తిగతవిశ్వాసం మీద దాడి చెయ్యడానికి ఎందుకిలా సర్వశక్తులూ ఒడ్డుతున్నారు ? "ఎవడి పిచ్చి వాడికానందం" అని వదిలెయ్యొచ్చు గదా ?

innaiah said...

చర్చ్గ లొ వ్యక్తిగత దూషణ వలదు.
జ్యొతిశ్యం శాస్త్రం అయితే అంగీకరించడానికి సిధం.ఎలాగో చెపాలి.
గ్రహాలకు మనుషులకు సంబంధం చూపాలి.
తారలకు మనుషులకు సంబంధం తెలుపాలి.
లేని గ్రహాలు రాహు కే తు ఎలా మనుషులమీద ప్రభవం చూపుతాయి ?
శాస్త్ర పధతి లొ పెత్తనం వుందదు .రుజువు అవసరం. రుజువు కొరకు ఆగాలి. మన పెద్దలు చెప్పారు గనక రుజువు అదగరాదు అనదం శాస్త్రం కాజాలదు.

28, డిసెంబర్ 2011, బుధవారం

ఆవు నెయ్యి గురించిన చిన్న విశేషం

శ్రీ గురుభ్యోన్నమః

నమస్తే
ఆవు నెయ్యి గురించిన చిన్న విశేషాన్ని గురించిన వివరం..

గోమాత నామావళిలో హవ్య కవ్య ప్రదాయిని అన్న నామమున్నది. గోఘృతం లేదా ఆవు నెయ్యితోనే దేవతలకు హవిస్సులర్పిస్తాము అలానే పితృదేవతలకు కవ్యమూ.. ఇది అందరకూ తెలిసినదే, ఐతే నిత్యమూ యజ్ఞ యాగాదులు జరిగేచోట, ఆవు నెయ్యి ఇతర సమిధలతో కాలి ఆవిరి అయ్యిన చోట రేడియోధార్మిక పదార్థాల యొక్క విషపు గాలులయొక్క ప్రభావం నామమాత్రం లేదా అసలు ఉండదని రష్యన్ శాస్త్రజ్ఙ్యులు డా శిరోవిచ్ తమ పరిశోధనలో తెలిపి నిరూపించారు. మనవాళ్ళు చెప్తే నమ్మని మన వారు ఇతరులు చెప్పినా కొన్ని సార్లు సనాతన ధర్మ గొప్పదనాన్ని ఒప్పుకోలేరు. ఈ విషయం 1980వ దశకంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదమైన భోపాల్ గ్యాస్ విషవాయువులు, రేడియోధార్మికశక్తిల వలన ఆ ప్రాంత చుట్టూ ఐదారు మైళ్ళ వరకూ అత్యంత ఉపద్రవంతో కూడిన వ్యాధులు సోకాయి, ఎందరో చనిపోయారు, కొందరికి చర్మం కాలిపోయింది, ఇప్పటికీ ఆ ప్రాంతం వారిలో కొంతమందికి ఆ రసాయనాల వల్ల కలిగిన రోగాలను పోగొట్టుకోలేని స్థితిలో ఉన్నారు.

ఇంత అత్యంత దారుణ బాధాకరవిపత్కర పరిస్థితులలో ఈ ప్రమాదం సంభవించిన కర్మాగారానికి ఒక మైలులోపు ఉన్న రెండు కుటుంబాలకు మాత్రం ఎటువంటి హానీ జరగలేదు, ఎవరి ప్రాణాలకీ ముప్పు కలగలేదు, కనీసం ఎవరూ అనారోగ్యం పాలు కాలేదు. కారణం ఈ రెండు కుటుంబాలు......
for full article https://groups.google.com/group/gomata/browse_thread/thread/ae65a756272eb1ec?hl=en
This email and any attachments are confidential, and may be legally privileged and protected by copyright. If you are not the intended recipient dissemination or copying of this email is prohibited. If you have received this in error, please notify the sender by replying by email and then delete the email completely from your system. Any views or opinions are solely those of the sender. This communication is not intended to form a binding contract unless expressly indicated to the contrary and properly authorised. Any actions taken on the basis of this email are at the recipient's own risk.


This email is sent for and on behalf of Ivy Comptech Private Limited. Ivy Comptech Private Limited is a limited liability company.

This email and any attachments are confidential, and may be legally privileged and protected by copyright. If you are not the intended recipient dissemination or copying of this email is prohibited. If you have received this in error, please notify the sender by replying by email and then delete the email completely from your system.
Any views or opinions are solely those of the sender. This communication is not intended to form a binding contract on behalf of Ivy Comptech Private Limited unless expressly indicated to the contrary and properly authorised. Any actions taken on the basis of this email are at the recipient's own risk.

Registered office:
Ivy Comptech Private Limited, Cyber Spazio, Road No. 2, Banjara Hills, Hyderabad 500 033, Andhra Pradesh, India. Registered number: 37994. Registered in India. A list of members' names is available for inspection at the registered office.

10, సెప్టెంబర్ 2011, శనివారం

ఆయుర్వేదాన్ని శాస్త్రీయ పునాదులపై పునర్ నిర్మించడం-2 (సమాప్తం)

ఆయుర్వేదాన్ని ఒక వైజ్ఞానిక శాస్త్రంగా అభివృద్ధి చేయాలంటే-

౧. దాని మీద పడ్డ మతముద్ర తొలగాలి. ఆయుర్వేదంలో కొన్ని మందులకి నారాయణతైలం, నరసింహచూర్ణం మొదలైన పేర్లు ఉండడాన్ని గమనించవచ్చు. ఈ పేర్లు వాటిని తయారుచేసినవాళ్ళ భక్తిప్రపత్తుల్ని సూచిస్తాయే తప్ప శాస్త్రీయ దృక్పథాన్ని ఆవిష్కరించవు. ఇలాంటి పేర్లు పెట్టకూడదు. ఆయా మందులు ఏ పదార్థాలతో తయారయ్యాయో వాటి పేరు మీదుగా పెట్టాలి. లేదా ఏ నలతలకి వాటిని అభిసూచిస్తున్నారో వాటి పేర్ల ననుసరించి పెట్టాలి.

ఔషధాలకి ఇలా మతనామాలు రావడానికి ఒక కారణం - పూర్వం వైద్యులంతా బ్రాహ్మణులే, అందులోనూ శ్రీవైష్ణవులే కావడం. వారు ఈ కాలపు డాక్టర్లలా వైద్యానికి పరిమితమైన స్పెషలిస్టులు కారు. పౌరోహిత్యం, జోతిష్యం, వైద్యం లాంటి రెండుమూడు వృత్తులు ఏకకాలంలో చేసేవారు. అందువల్ల పాతపుస్తకాల ద్వారా తాము నేర్చుకున్నదాన్ని ప్రాక్టీస్ చేయడానికే తప్ప నవీన పరిశోధనలకి ప్రాధాన్యమిచ్చేవారు కారు. నేను విన్నదేమిటంటే - ఆ రోజుల్లో ఎక్కువమంది వైద్యవిద్యా జాఱుకోలరులు (drop-outs in medical education) అని ! వారు ఆయుర్వేద గురువు దగ్గఱ విద్యాభ్యాసానికి చేఱిన ఒకటి-రెండేళ్ళకే "చదివింది చాల్లే, జనానికి ఏదో ఒక మందిచ్చి బతకడానికి ఈమాత్రం పరిజ్ఞానం సరిపోతుంది" అనుకొని లేచి ఇంటికొచ్చేసేవాళ్ళు. కానీ దేశంలోకి ఇంగ్లీషువైద్యం అడుగుపెట్టాక ఇలాంటివాళ్ళ చికిత్సల మీద జనానికి క్రమంగా విశ్వాసం నశించసాగింది. "ఇంగ్లీషుడాక్టర్ ముందు ఆచారిగారు బలాదూర్" అనే మాట వచ్చింది. అలా ఈ అఱకొఱ శిక్షితులు ఆయుర్వేదానికి కొఱివిపెట్టేశారు.

౨. అధునాతన పరిశోధనల వెలుగులో ప్రతిరోగాన్నీ పునర్ నిర్వచించాలి, పునర్ వర్ణించాలి.

౩. వస్తుగుణదీపిక (Ayurvedic Pharmacopeia) ని మఱింత విస్తరించి వ్రాయాలి. కేవలం వనౌషధుల చికిత్సకలక్షణాలనే కాకుండా, ఆ ఔషధులలో ఏయే పదార్థాలు ఏయే అవయవాల మీద ఎలా పనిచేస్తాయో వివరించడం అవసరం. లేకపోతే వాటిని అంతర్జాతీయంగా సమర్థించుకోవడం కష్టమవుతుంది. ఈ రకంగా నిషేధాలకి గుఱికావాల్సి వస్తుంది. మన దేశస్థులకి సొంతబుఱ్ఱ శూన్యమనీ, తెల్లతోలువాళ్ళు ఏదంటే దానికల్లా తానతందానా పాడతారనీ మనకి తెలుసు గనుక, వాళ్ళని అనుసరించి ఇక్కడ కూడా ఆయుర్వేదాన్నినిషేధించాలని డిమాండ్లు బయలుదేఱితే ఆశ్చర్యం లేదు.

౪. విస్తృతమైన ప్రజామద్దతు సంపాదిస్తే తప్ప - ఆయుర్వేదం యొక్క శాస్త్రీయకరణకి అవసరమైన మానవవనరుల్నీ, ఆర్థిక వనరుల్నీ సమకూర్చుకోలేం. అలాంటి మద్దతు కావాలంటే ఆయుర్వేద వైద్యానికి కొన్ని బాహ్యాలంకారాలు కూడా అవసరం. అవి జనాన్ని ఇన్‌స్పైర్ చేసేలా ఉండాలి.

ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు దేశకాలానుగుణంగా తమ వేషభాషల్ని సమూలంగా మార్చుకోవాల్సి ఉంది. ఆయుర్వేదమంటే జనానికి పెద్దగా కళ్ళకి ఆనకపోవడానికీ, తేలిగ్గా చప్పరించేయడానికీ సగం కారణం ఈ నిరాడంబర వేషభాషలే. వీటి మూలాన యువ ఆయుర్వేద వైద్యులకి పెళ్ళికావడం కూడా కష్టమంటే అతిశయోక్తి లేదు. తమదగ్గఱికొచ్చే రోగులకి ఆయుర్వేద పరిభావనల్నీ, రోగలక్షణాల్నీ తెలుగు- సంస్కృత పదాల్లోనే కాక ఇంగ్లీషువాక్యాల్లో కూడా వివరించడం నేర్చుకోవాలి. అలాగే, ఎల్లప్పుడూ మెడలో ఒక స్టెతస్కోపుతో కనిపించాలి. ఒక కారునీ, డ్రైవర్ నీ కూడా మెయిన్‌టెయిన్ చేయాలి. అప్పుడు ఎక్కువమంది నమ్ముతారు. తప్పదు. నువ్వు మంచివాడివైతే సరిపోదు. మంచివాడిలా కనిపించాలి కూడా ! ఇంకొకటి - ఆయుర్వేద వైద్యశాలల్నీ, క్లినిక్కుల్నీ కూడా పాశ్చాత్య పద్ధతిలో తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఈ రంగంలో ఈ కాలానికి దేశీయ అలంకరణ బొత్తిగా పనికిరాదు.

7, సెప్టెంబర్ 2011, బుధవారం

ఆయుర్వేదాన్ని శాస్త్రీయ పునాదులపై పునర్ నిర్మించడం

కొన్నేళ్ళ క్రితం ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక నల్లజాతి క్రీడాకారుడు (పేరు గుర్తులేదు) హైదరాబాదులో పత్రికలవారికి ముఖాముఖీ ఇస్తూ "ఆఫ్రికా, ఇండియా రెండూ ఐరోపేయుల వలసపాలనలో వందలాది సంవత్సరాలు మగ్గిన ప్రాంతాలే. కానీ మీకూ, మాకూ చాలా తేడా ఉందని ఇక్కడికొచ్చినాక గ్రహించాను. వలసపాలనలో మేము మా సర్వస్వమూ పోగొట్టుకున్నాం. మా కట్టూబొట్టూ, ఆచారవ్యవహారాలూ, మతమూ, భాషా అన్నీ పోయాయి, మేమిప్పుడు క్రైస్తవమతాన్ని అవలంబిస్తూ, ఇంగ్లీష్, ఫ్రెంచిలాంటి ఐరోపేయ భాషలు మాట్లాడుతూ జీవిస్తున్నాం. కానీ మీ దేశంలో మీ భాషలు ఇంకా జీవించే ఉన్నాయి. మీ మతం కూడా జీవించే ఉంది. మీ ఆడవాళ్ళు ఇప్పటికీ చీరల్లోనే కనిపిస్తున్నారు. మీ శాస్త్రాలూ, ఆచారాలూ, దేవాలయాలూ అన్నీ సలక్షణం (intact) గా ఉన్నాయి. వందలాది సంవత్సరాల వలసపాలన మిమ్మల్నేమీ చేయలేకపోయింది." అంటూ అభినందించాడు.

అతను కొంతే గమనించాడనీ, పూర్తిగా లోతుల్లోకి వెళ్ళలేదనీ మనకి తెలుసు. మన మతమూ, భాషలూ, ఆచార వ్యవహారాలూ, శాస్త్రాలూ ఎంత ప్రమాదంలో ఉన్నాయో మనకి మాత్రమే తెలుసు.

ఇలా ప్రమాదంలో పడ్డ భారతీయ శాస్త్రాల్లో ఆయుర్వేదం కూడా ఒకటి. ఇది 4 రకాలుగా ప్రమాదంలో పడింది. ఒకటి - ఈ శాస్త్రానికి ప్రభుత్వపోషణ కఱువవుతున్నది. ప్రభుత్వం కొత్త ఆయుర్వేద కళాశాలల్ని గానీ, వైద్యశాలల్ని గానీ స్థాపించడం మానేసింది. ఉన్నవాటికి సరైన నిధులూ, సిబ్బందీ సౌకర్యాలూ లేవు. తద్ద్వారా ప్రజాదరణ కూడా అడుగంటుతున్నది. ప్రత్యేకంగా ఆయుర్వేద ఔషధాలమ్మే కొట్లు తగ్గిపోతున్నాయి. వాటిని కూడా మామూలు అల్లోపతీ మందుల దుకాణాలవాళ్లే అమ్ముతున్నారు.

రెండో కోణం - ఆయుర్వేదం ప్రధానంగా వనమూలికల మీద ఆధారపడ్డ వైద్యం. అడవుల్ని నఱికేయడం వల్లా, గ్రామకంఠాల్ని స్థానికులు దురాక్రమించి నానా ఇతరేతర అవసరాలకి వాడుతూండడం వల్లా అక్కడ సహజంగా పెఱిగే మొక్కలూ, వనమూలికలూ పునరుత్పత్తికి నోచుకోక నశించిపోతున్నాయి. ఉదాహరణకి - స్త్రీలకి ఋతుసమయంలోనూ, ఋత్వంతం (మెనోపాజ్) లోనూ అధిక రక్తస్రావం కాకుండా నిరోధించే తుఱకవేపాకు అనే మొక్క ఇప్పుడు అరుదైపోయింది. అందుకోసమే ఉపయోగపడే రెడ్డివారి నానుబ్రాలు అనే మఱో మొక్క కూడా అలాగే అదృశ్యమైపోతోంది. దాన్తో ఇప్పుడు ఇలాంటివాటన్నింటికీ ఖరీదైన అల్లోపతీ మందులు వాడుతూ, శస్త్రచికిత్సలు చేయించుకుంటూ జనం శాశ్వతంగా మంచాన పడుతున్నారు. ఇలాంటి అద్భుతమైన వనమూలికలెన్నో ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇవన్నీ క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి.అలనాటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు గారు ఇలాంటి వనౌషధుల ప్రాశస్త్యాన్ని గుర్తించి 1988 లో అనుకుంటా, తిరుపతిలో ఒక ఆయుర్వేదిక్ హెర్బేరియమ్‌ని (వనమూలికల ఉద్యానవనం) స్థాపించారు. కానీ అనంతరకాలంలో అధికారంలోకి వచ్చినవాళ్ళు ఆ హెర్బేరియమ్ ని ఏం చేశారో, రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకున్నారో ఏంటో ఏమీ తెలియదు.

మూడో కోణం - ఆయుర్వేదం మీద నాస్తికులూ, తదితర సంస్కృతివ్యతిరేకులూ (anti-culture elements), అల్లోపతీ మందుల ఉత్పాదకులైన బహుళ జాతీయ సార్థవాహాలూ పనిగట్టుకొని దుర్బుద్ధితో, ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారం. ఇది అంతర్జాతీయ స్థాయిలో విచక్షణారహితంగా చెలరేగిపోతోంది. ముఖ్యంగా ఆయుర్వేద మందుల్లో పాదరసం, బంగారం, వెండి, సీసం లాంటి ఘనలోహాల్ని (hard metals) ప్రమాదకర స్థాయిల్లో మిశ్రమం చేస్తున్నారనీ, అవి వాడితే శరీరం లోపలి కీలక అవయవాలు శాశ్వతంగా దెబ్బ దింటాయనీ ప్రచారం చేస్తూ అమెరికా యూరప్ జనాల్ని భయభ్రాంతులకి గుఱి చేస్తున్నారు. ఈ దుష్ప్రచార ఫలితంగా ఇటీవల యూరోపియన్ యూనియన్ ఆయుర్వేద మందుల్ని నిషేధించింది. త్వరలో అమెరికా చేత కూడా నిషేధింపజేయడానికి ప్రయత్నాలు ముమ్మరం గా జఱుగుతున్నాయి.

నాలుగో పార్శ్వం - ఆయుర్వేదాన్ని ఇతర వైద్యవిధానాలతో కలుషితం చేయడం. కొందఱు ఆయుర్వేద వైద్యులైతే ఆయుర్వేద మందుల్లో ఉత్తేజకాల్ని (steroids) కలిపి పక్కప్రభావాలకి కారకులవుతూ శాస్త్రానికి చాలా చెడ్డపేరు తెస్తున్నారు.

ఆయుర్వేదానికి వంకలు లేవని వాదించడం నా ఉద్దేశం కాదు. అయితే ప్రతివైద్యవిధానం లోనూ ఏదో ఒక లోపం ఉన్నది. ఉదాహరణకి - శరీరాన్ని కోయకుండా అల్లోపతివాళ్ళు ఏ చికిత్సా చేయలేరు. కానీ తెఱవబడ్డ యంత్రాలు తెఱవక ముందున్ననాటి పనితీరు (functioning) ని యథాతథంగా చూపించలేవు ఎట్టి పరిస్థితుల్లోనూ ! అటువంటప్పుడు కేవలం ఆయుర్వేదాన్నే విమర్శించడమూ, దుష్ప్రచారం చేయడమూ సబబు కాదు. అయితే విమర్శలు ఇలా వస్తున్నాయి గనుక ఆయుర్వేద వైద్యులూ, ఔషధ ఉత్పాదకులూ తమ వ్యూహాల్ని కాస్త మార్చుకుంటే బావుంటుంది. లోకుల సంతృప్తి కోసమైనా ఘనలోహాల మిశ్రమం లేకుండా ఔషధాల్ని తయారు చేయాలి. ఏ లోపలి అవయవం ఎలా పనిచేస్తుందో సరైన అవగాహన కల్పించే పాఠ్యపుస్తకాలు ఆయుర్వేదంలో లేవు. ఉన్నవి ఈ కాలపు అవగాహనకి సరిపోవు. అటువంటప్పుడు వాటిని ఇతర వైద్యవిధానాల నుంచి గ్రహించడంలో తప్పులేదు.ఆయుర్వేద వైద్యులిచ్చే మందులు తప్పకుండా పని చేస్తాయి. కానీ ఎలా పనిచేస్తాయో వారు ఈ కాలపు పరిభాషలో వివరించలేరు. ఆయుర్వేదవైద్యులు ఆధునిక రోగనిదాన (డయాగ్నాస్టిక్) పరికరాల్ని ఉపయోగించుకోలేక పోతున్నారు. ఆ పరికరాల ద్వారా తెలియవచ్చిన పరీక్షా ఫలితాలకి అనుగుణంగా మందుల్ని ఉత్పాదించాల్సి ఉంటుంది.

ఇవన్నీ ఎవఱూ గంభీరంగా పట్టించుకుంటున్నట్లు కనిపించదు. అసలు ఆయుర్వేదంలో పరిశోధనే స్తంభించిపోయినట్లు కనిపిస్తోంది. పరిశోధన కుంటువడ్డ శాస్త్రానికి భవిష్యత్తు లేదు. మన పూర్వీకులకి ఏమీ తెలియదనుకోవడం ఎంత మూర్ఖత్వమో, అనీ తెలుసు ననుకోవడమూ అంతే మూర్ఖత్వం. కనుక మన పూజ్య పూర్వీకుల కానుక, జాతికి గర్వకారణమూ అయిన ఈ వేదాంగం ఆయుర్వేదానికి ప్రత్యేక ప్రయోగశాలల్ని నెలకొల్పి సరికొత్త పద్ధతులలో, పరిశోధనాత్మకంగా నూతన జవసత్త్వాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి