జీవునకు ఏ లక్షణములైతే ఉన్నవో అవి లేనివాడు భగవంతుడు. ఆకలి-దప్పిక, శోకము-మోహము, జర-మరణము అను షడూర్ములు లేని వాడు భగవంతుడు.
భగవద్గీతలో భగవంతుని ఎన్నో లక్షణాలు గౌణములు చెప్పబడ్డాయి. అలాగే ఇతర పురాణాలలో కూడా-
శ్లో|| అజోపి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరోఽపినన్ |
ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామాత్మ మాయయా || (భగవద్గీత)
తా|| "నేను పుట్టుకలేనివాణ్ణి, నాశనమూ లేని వాణ్ణి, సమస్తప్రాణులకు ఈశ్వరుడను. నా ప్రకృతిని వశపరచుకొను మాయచేత నేను పుడుతున్నాను" అని కృష్ణుడన్నాడు.
చిన్మయస్య అద్వితీయస్య నిర్గుణస్య అశరీరిణః!
ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా || అని ఉపనిషత్ వాక్కు
తా|| చిన్మయుడు, తాను తప్ప రెండవది లేనివాడు, నిర్గుణుడు, శరీరము లేనివాడు అగు పరబ్రహ్మము యొక్క ఉపాసనకొరకు ఉపాసకుని భావనకొరకు ఒక రూపము రూపకల్పనచేయబడినది. పరబ్రహ్మము ఇంద్రియములచే తెలియబడడు. మనస్సుకి తెలియబడడు.
వేదము సగుణ భగవంతుని, నిర్గుణ భగవంతుని కీర్తిస్తోంది. అంటే భగవంతుడు భక్తులకొరకై సగుణుడయ్యెను. సనాతన ధర్మమునందు భగవంతుడు స్వయంగా భక్తులకొరకు అవతరిస్తాడు. అవతరించుట అంటే కిందకి దిగి వచ్చుట.
సాయిచరిత్రలో అనుకుంటా భగవంతుని ఆరు లక్షణములు శ్రీ, విభూతి, మోహము లేకపోవుట, జ్ఙానము, మహత్తు, కారుణ్యములు గా చెప్పారు...
ఇంకోటి, సనాతన ధర్మములో భగవంతుడు భక్తులనుద్దరించటానికి భక్తుల చేత చంపబడడు.
ఇలా ఒకటి అని ఏమి చెప్పగలం ? ఎన్నో ఎన్నో విశేషణాలు, సహస్రనామాలు, స్తోత్రాలనిండా ఉన్నవి. భగవంతుని లక్షణాలు, గౌణములే కదా!
నావరకు నాకు భగవంతుని లక్షణమేమంటే, అది రాశీభూతమైన కారుణ్యం / దయ / ప్రేమ...
25, మే 2011, బుధవారం
భగవంతుని లక్షణమేమిటి ?
నామాంకాలు (Labels)
హిందూవేదాంతము
23, మే 2011, సోమవారం
హిందువులు మేల్కోవాలి
ఏడాది పొడవునా అన్ని దేవాలయాలకూ భక్తులు పోటెత్తుతున్నారు. హుండీలు పొంగిపొర్లుతున్నాయి, భక్తులు చెల్లించుకున్న ముడుపులతోనూ, మ్రొక్కులతోనూ, తదితర కానుకలతోనూ ! దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఆ దేవాలయాలలో ఉద్యోగాలు చేస్తూ ఆనందంగా జీవితాలు గడిపేస్తున్నారు. దేవాలయాల యాజమాన్యం క్రింద ఉన్న నానా విద్యా, వైద్యసంస్థల్లో వేలాదిమంది చేఱుతున్నారు.
అంతా బానే ఉన్నట్లు కనిపిస్తోంది కదూ ? నిజానికి వాస్తవ పరిస్థితి అంత ఆశావహంగా లేదు. హిందూమతం ఒక అత్యవసర పరిస్థితి (Emergency) వైపు, ఒక మానవ వనరుల సంక్షోభం (Human resources' crisis) వైపు అతివేగంగా పయనిస్తోంది. ఎక్కడో అమెరికాలో కాదు, ఇక్కడే ఈ సనాతన భూమిలోనే ! ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయ దృశ్యం కనీసం పదేళ్ళ తరువాత, లేదా గరిష్ఠంగా పాతికేళ్ళ తరువాత పూర్తిగా అదృశ్యం కాబోతున్నది. అటుపిమ్మట ఆ దేవాలయాల పరిస్థితేంటో, వాటిల్లోని దేవుళ్ళ పరిస్థితేంటో, ఆ దేవాలయాల క్రింద నడుస్తున్న సంస్థల పరిస్థితేంటో, అసలు టోకుగా హిందూమతం పరిస్థితేంటో అంతా అగమ్యగోచరం. ఎందుకంటే హిందూమతానికి తీవ్రమైన పూజారి-పురోహితుల కొఱత ముంచుకు రాబోతోంది. ఇది చాప కింద నీరులా ఇప్పటికే మొదలయింది, గత కొద్ది సంవత్సరాలుగా ! మొదట్లో ఒక పదీ-పదిహేనేళ్ళ క్రితం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ అర్చక బ్రాహ్మణుల కొఱత ఇప్పుడు నగరాలక్కూడా ప్రాకింది. రాష్ట్రంలో సుమారు ఇఱవై-పాతిక లక్షలమంది బ్రాహ్మణులు ఉన్నప్పటికీ వారిలో పౌరోహిత్యం చేసేవారి జనాభా దారుణంగా పడిపోవడంతో చిన్నచిన్న వేడుకలూ, కర్మలూ చేయడానికి సైతం ఎవఱూ దొఱక్క, ఆ దొఱికిన బ్రాహ్మణుడికే అనేక రెట్లు డబ్బు కుమ్మరించి చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాదులో ఎంత చిన్న అర్చామూర్తిని ప్రతిష్ఠించాలన్నా యాభైవేలు డిమాండు చేస్తున్నారు. కాస్త పెద్ద విగ్రహాలకైతే లక్ష తప్పనిసరి. జనం "సరే"నని విధిలేక ఇస్తున్నారు, చందాలేసుకుని మఱీ !
అసలు విషయమేంటంటే - బ్రాహ్మణులంతా దాదాపుగా అర్చక-పురోహిత వృత్తిని పరిత్యజించారు. పరిత్యజించడానికి కారణం - ఆ వృత్తికి ఒకప్పుడు హిందూసమాజం ఇచ్చిన ఉద్యోగ భద్రత (Job security) ని ఆ తదుపరి ఉపసంహరించుకోవడం. అలా ఉపసంహరించుకోవడాని క్కారణం అంతకుముందటి బ్రాహ్మణ ద్వేష ప్రచారాలూ, తద్ద్వారా హిందూ మతగురువుల పట్ల ఆదరాభిమానాల్నీ, సానుభూతినీ నశింపజేయడం. ప్రస్తుతం ఎనిమిదిన్నఱ కోట్ల జనాభా గల ఈ రాష్ట్రం మొత్తమ్మీద ఆ వృత్తి చేసేవారు అంతా కలిపి పూర్తిగా ఒక యాభైవేలమంది కూడా ఉంటారో ఉండరో ! ఉన్నవారిలో ఎక్కువమంది ముసలివాళ్ళే. కొన్నిసంవత్సరాల తరువాత ఆ ముసలివాళ్ళు గనుక దాటుకుంటే వారి స్థానంలో పనిచేయడానికి వైదికంగా సుశిక్షితులైన బ్రాహ్మణ యువకులు తగినంతమంది లేరు. రాష్ట్రం నలుమూలలా వేదపాఠశాలలూ, అవీ నామమాత్రంగా ఉండడానికైతే ఉన్నాయి. కానీ అక్కడ శిక్షణ పొంది బయటికొస్తున్నవాళ్ళ సంఖ్య బొత్తిగా సరిపోదు ఈ ఏనుగుని ఎత్తడానికి !
ఉన్న పురోహితుల పిల్లలే అర్చక-పౌరోహిత్యంలో ప్రవేశించడానికి ఇష్టపడడం లేదు. అథవా కొంతమంది ఇష్టపడినా ఇంట్లో ఆడవాళ్ళు "ఠాఠ్ ! వల్లకాదు. అర్చక-పౌరోహిత్యంలో ఏముంది ? నా కొడుకు ఇంజనీరో, డాక్టరో అవ్వాల్సిందే" నని ముక్కు చీదితే కాదనలేక అటు మళ్ళిస్తున్నారు. మిహతా బ్రాహ్మణ జనాభా అలవాటు చేసుకుంటున్న డబ్బువిలువలు ఈనాడు సాంప్రదాయిక అర్చక బ్రాహ్మణ కుటుంబాల్ని కూడా ఇతోఽధికంగా ప్రభావితం చేస్తున్నాయి. తమను తాము ఉద్యోగ వర్గపు బ్రాహ్మణులతో పోల్చుకుని "మనకేం తక్కువ ? ఇంగ్లీషు చదువుకుంటే ఆ మాత్రం ఉద్యోగాలు మనం చెయ్యలేమా ? సంపాదించలేమా ?" అని బయలుదేఱుతున్నారు, ధనసంపాదనా ప్రస్థానానికి ! ఆ విధంగా ఒకసారి మా దగ్గఱ పనిచేస్తున్న యువ పురోహితుడు కూడా HDFC బ్యాంకులో చేఱాడు. కానీ ఆ బ్యాంకువాళ్ళు పొద్దున్నే పూజ చేసుకోవడానిక్కూడా వీల్లేనంత బిజీ చేసేస్తున్నారని గమనించి ఆ ఉద్యోగం వదిలేసి మళ్ళీ పౌరోహిత్యంలోకి వచ్చాడు. సరే, ఇది పురోహితుల సంగతి. ఇహ పూజారుల విషయానికొస్తే వాళ్ళని తప్పు పట్టలేం, వాళ్ళకి ఇస్తున్న జీతం ఒక మనిషిని పోషించడానిక్కూడా చాలని పరిస్థితుల్లో ! పూజారి, పురోహితుడంటే బ్రాహ్మణ అమ్మాయిలు ముందుకు రావడం లేదు పెళ్ళి చేసుకోవడానికి ! అందువల్ల కూడా చాలామంది బ్రాహ్మణులు ఈ వృత్తిని వదిలిపెట్టేస్తున్నారు. ఈ పరిస్థితి ఏ ఇతర మతంలోనూ లేదు. హిందూ పూజారులే దీనికి గుఱిచేయబడుతున్నారు.
గతంలో విస్తృతంగా ప్రచారం చేయబడ్డ బ్రాహ్మణ ద్వేషమే ఈ కొఱతకు మూలకారణం
ఈ పరిస్థితి హఠాత్తుగా తలెత్తినటువంటిది కాదని గమనించాలి. దీని అసలు చరిత్రని అందఱూ కాస్త తెలుసుకోవాలి.
౧. ఏ విధంగా మెజారిటీ బ్రాహ్మణులు దేవాలయాల్నీ, పురోహితవృత్తినీ వదిలిపెట్టి లౌకిక ఉద్యోగాల్లో చేఱాల్సి వచ్చింది ?
౨. తదుపరి కాలంలో ఆ లౌకిక ఉద్యోగాల నుంచి కూడా వారిని ఏ విధంగా బహిష్కరించడం జఱిగింది ?
౩. అది ఏ విధంగా వారిని విదేశాల పాలు చేసింది ?
౪. ఆ విదేశీ/ నవ నాగరిక బ్రాహ్మణులు ఏ విధంగా అర్చక-పురోహిత కుటుంబాలక్కూడా ఆదర్శమై కూర్చున్నారు ?
౫. తద్ద్వారా అర్చక-పురోహిత వృత్తి తన గ్లామర్ని పూర్తిగా కోల్పోయిన వైనం
౬. మతం గుఱించి బోధించేవాళ్ళు లేకుండా చేయడం ద్వారా ఈ పరిస్థితి ఏ విధంగా ముందు మతాన్నీ, తదుపరి సంఘాన్నీ దెబ్బకొట్టబోతున్నది ?
వీటి మధ్య ఉన్న గొలుసుకట్టు సంబంధమూ, పరస్పర ప్రభావమూ, సామాజిక వాతావరణమూ ఇవన్నీ లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంది.
గత కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్ద ప్రక్రియ (silent process) లో ఉన్నదే ఈనాడు బహిరంగంగా విశ్వరూపాన్ని ధరించి కనిపిస్తోంది. ఈ సామాజిక సంక్షోభం తలెత్తకుండా హిందువులూ, వారి నాయకులూ కొన్ని దశాబ్దాల క్రితమే కాస్త ముందుచూపుతో, ఈషణ్మానవత్వంతో వ్యవహరించి ఉంటే బావుండేది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ బ్రాహ్మణుల్ని అణచివేయడమూ, వారు తమకెన్నడూ చేయని అపకారాలకు వారిమీద కులకక్ష సాధించడమూ - ఇవే లక్ష్యంగా పెట్టుకున్నాయి అబ్రాహ్మణ హిందువుల నాయకత్వంలోని ప్రభుత్వాలు. ఉద్దేశపూర్వకంగా చాలా హీనమైన పేదఱికానికి గుఱిచేశారు బ్రాహ్మణ కులాన్ని ! రిజర్వేషన్ల పేరుతో ఎంత చదువుకున్నా ఉద్యోగాలివ్వకుండా హింసించారు. ప్రమోషన్లు ఇవ్వకుండా హింసించారు. ఏ పాపమూ ఎఱుగని బ్రాహ్మణ ఉద్యోగులమీద తప్పుడు అవినీతి కేసులు బనాయించి మఱీ హింసించారు. భూపరిమితి చట్టాల పేరుతో, కమిటీల పేరుతో వ్యక్తిగత భూములూ, దేవాలయ భూములూ లాగేసుకుని హింసించారు. పూజారులకు జీతాలివ్వకుండా ఎగ్గొట్టి హింసించారు. ఓరియంటల్ కళాశాలల్లో చాలీచాలని జీతాలకు తెలుగూ, సంస్కృతమూ చెప్పుకుని బతుకుతూంటే "బ్రాహ్మణుడు ఆ మాత్రం కూడా ఎందుకు బతకా"లని ఏకంగా ఆ కళాశాలల్నే ఎత్తేశారు. అలా ఎక్కడెక్కడ బ్రాహ్మణుడు ఆశ్రయం పొంది ఒక ముద్ద అన్నం తింటున్నాడో కనిపెట్టి ఆయా వ్యవస్థల్నీ, సంస్థల్నీ క్రూరంగా కూలద్రోసుకుంటూ పోతూ అతన్ని దయాదాక్షిణ్య రహితంగా లేవగొట్టారు. ఏతావతా హిందువులకు తరతరాల గురువైన బ్రాహ్మణుడికి చివఱికి ఆ హిందూసమాజంలో మనుగడనే దుర్భరం చేశారు. బ్రాహ్మణుడికి అన్నం పెడితే పుణ్యం వస్తుందనే పూర్వ నమ్మకాన్ని కాలరాచి బ్రాహ్మణుడి పొట్టగొడితే అభ్యుదయం అవుతుందనే ఒక నవీన కలికాలపు ధర్మశాస్త్రాన్ని రచించారు. బ్రాహ్మణుడి యొక్క తరతరాల సాంప్రదాయిక జీవన వనర్లన్నింటినీ ఉద్దేశ పూర్వకంగా ధ్వంసం చేశారు. ఇన్ని చేశాక, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుగా జీవించడానికి కావాల్సిన ప్రాపులూ, వాతావరణమూ సంపూర్ణంగా అదృశ్యమైనాక ఈ రోజు మీకు పూర్వపు బ్రాహ్మణుడే కావాలంటే ఎక్కడ దొఱుకుతాడు ?
అలా అబ్రాహ్మణులు ప్రభుత్వాల రూపంలో బ్రాహ్మణుల్ని బాధించడానికి పూనుకోవడం ఊరికే తమాషాగా జఱిగింది కాదు. సర్వే జనా స్సుఖినో భవన్తు అని ఆశీర్వదించే బ్రాహ్మణుడు లోకకంటకుడుగా, సంఘద్రోహిగా చిత్రించబడడం చిత్రమే అయినా ఆ విచిత్ర విద్వేష మనస్తత్త్వానికి నింపాదిగా పునాదులు వేసిన కుట్ర ఒకటుంది. దాని వెనుక ఒక కుహనా సైద్ధాంతిక ప్రాతిపదిక (false ideological basis) ఉంది. గతశతాబ్దంలో సర్వేసర్వత్రా బ్రాహ్మణుల మీద విస్తృతంగా జఱిగిన విశృంఖలమైన దుష్ప్రచారమే ఆ ప్రాతిపదిక. ఈ దుష్ప్రచారంలో నాస్తికులూ, కమ్యూనిస్టులూ అయిన బ్రాహ్మణులు కూడా అమాయకంగా పాలుపంచుకున్నారు, దాని మూలమూ పర్యవసానాలూ ఊహించలేక ! ఈ కుట్రకు నాందీప్రస్తావన చేసినది క్రైస్తవ మిషనరీలు కాగా అమలు జఱిపింది బ్రిటీషు ప్రభుత్వం. బ్రాహ్మణులకు తరతరాలుగా సమాజంలో ఉన్న ప్రాచుర్యాన్నీ, జనాదరణనీ నాశనం చేస్తే తప్ప హిందూమతాన్ని నాశనం చేయలేమనే కీలకాన్ని వారు కనిపెట్టారు. ఈ కుట్రలో భాగంలో ప్రతిరాష్ట్రంలోనూ ఎక్కడెక్కడి బ్రహ్మద్వేషుల్నీ దగ్గఱికి తీసి, దువ్వి, తెఱ వెనుక ఆర్థికాది సహకారాలు అందించి రెచ్చగొట్టారు. నిజంగా బ్రాహ్మణులు వీళ్ళు ప్రచారం చేసినంత బలవంతులూ, విలన్లే అయితే వాళ్ళ శాల్తీల్ని లేపేసి మొగ్గలోనే తుంచి అవతల పారేసి ఉండేవాళ్ళు. బలహీనులూ, నిస్సహాయులు గనుకనే తమ మీద ఇంత దుష్ప్రచారం చేస్తున్నా ఏమీ అనలేకా, ఏమీ చెయ్యలేకా దీనంగా చూస్తూ నిలబడ్డారు.
ఒక రకంగా చెప్పాలంటే - ఈనాడు తెలంగాణవాదులు ఆంధ్రా ఏరియావారి మీద చేస్తున్న దుష్ప్రచారం లాంటిదే చేశారు గత శతాబ్దంలో బ్రహ్మద్వేషులు. ఆ దుష్ప్రచారం చాలా ప్రతిభావంతంగా, సమర్థంగా జఱిగింది. బ్రాహ్మణులు ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏ స్థితిలో ఉన్నా దానికి కులగజ్జిపరమైన వక్రభాష్యాలు చెప్పారు. జాతికి బ్రాహ్మణులు చేసిన సేవలన్నీ వారి ఆధిపత్యానికి చిహ్నమని ప్రచారం చేశారు. బ్రాహ్మణులు తమ కులాచారం పాటిస్తే అది బ్రాహ్మణుల కులగజ్జి. దేశంలో ఎన్నో కులాలున్నాయి. ఏ కులానికి ఆ కులాచారం ఉంది. ఆయా కులాలు ఆయా ఆచారాల్ని పాటిస్తే అది కులగజ్జి కాదు. బ్రాహ్మణులు తమ కులాచారాన్ని పాటించడం మాత్రమే కులగజ్జి. బ్రాహ్మణులు ధనికులైతే అది రాజుల దగ్గఱ వాళ్ళు చేసిన పైరవీల ఫలితం. వాళ్ళు పేదలైతే అది వాళ్ళ సోమరిపోతుతనం. ఈ దుష్ప్రచారంలో జాతికి వేలాది సంవత్సరాలుగా బ్రాహ్మణులు చేసిన ఉపకారాలూ, ఉపచర్యలూ, దేశం కోసం వివిధ చారిత్రిక ఘట్టాల్లో వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలూ, ఆ క్రమంలో వాళ్ళు అనుభవించిన ఇక్కట్లూ, వాళ్ళతో పాటు వాళ్ళ ఆడవాళ్ళు పడ్డ బాధలూ అన్నీ మఱుగున పడవేయబడ్డాయి.
ఒక పేద, నిస్సహాయ, బడుగువర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వారిని దేశానికి విలన్లుగా చిత్రిస్తూ భారీ బడ్జెట్టుతో ప్రభుత్వస్థాయిలో అత్యంత వ్యవస్థీకృతంగా జఱిగిన ఈ తరహా బుఱదజల్లుడు ప్రచారం బహుశా ప్రపంచంలోనే న భూతో న భవిష్యతి. బహుశా ఇది కలియుగ లక్షణం. కలిపురుషుడి లీల. ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. అన్ని మతాలకూ మతగురువులున్నారు. కానీ తమ మతగురువుల్ని హిందువులు అణచివేసినట్లుగా, అవమానిస్తున్నట్లుగా ఎక్కడా ఎవఱూ చేయడం లేదు. పైపెచ్చు నెత్తిన బెట్టుకుని పూజించుకుంటున్నారు. కానీ భారతదేశంలో బ్రాహ్మణుల స్థానమూ, చారిత్రిక భూమికా ఇతరమతాలలోని మతగురువుల కంటే ఎన్నో రెట్లు గొప్పవీ, వైవిధ్య భరితమైనవీను. బ్రాహ్మణులు ఈ జాతికి ఎప్పుడు అపకారం చేశారు ? వారు ఎల్లప్పుడూ చేతనైనంత మంచే చేశారు. మనసా వాచా కర్మణా తెలుగుజాతిలో కలిసిపోయి తమ సంస్కృత నామాల్ని సైతం వర్జించి అచ్చతెలుగులో నన్నయ్య, తిక్కన్న, పోతన్న మొదలైన పేర్లు పెట్టుకుని ఇక్కడి జనసామాన్యంతో తాదాత్మ్యం చెందారు. వారు లిపిలేని తెలుగుభాషకు లిపి (బ్రాహ్మీలిపి) నిచ్చారు. వ్యాకరణం లేని తెలుగుభాషకు వ్యాకరణాన్నిచ్చారు. పదాలు లేని భాషకు సంస్కృత పదాలు జోడించి శక్తిమంతం చేశారు. సాహిత్యం లేని భాషలో సాహిత్యాన్ని సృష్టించి ప్రపంచ భాషల సరసన దీని చరిత్రని సగర్వంగా, సుస్థిరంగా నిలబెట్టారు. రాష్ట్రం సంగతి పక్కన బెడితే బ్రాహ్మణులు లేకుండా భారతదేశం అనే పరిభావన (concept) అసలెక్కడుంది ? బ్రాహ్మణ వారసత్వం కాకుండా ఈ దేశానికి ఉన్న ఉమ్మడి వారసత్వం ఏంటి ?
దేసీ ప్రభుత్వాల చేతుల్లో తమ తల్లిదండ్రులు పడ్డ బాధలు గమనించి చాలామంది తెలుగు బ్రాహ్మణుల సంతానం ఇంగ్లీషు అభ్యసించి దశాబ్దాల క్రితమే ఉత్తర అమెరికాకి పారిపోవడం ప్రారంభించారు. ఇతరులకు విదేశీ ప్రయాణం ఒక హోదాచిహ్నం (Status symbol) కాగా బ్రాహ్మణులకు మాత్రం అదొక చావుబతుకుల సమస్యగా మారింది. ఏం చేసైనా సరే, పారిపోక తప్పని పరిస్థితిని అనుభూతి చెందారు. నిరంతర కృషీ, శ్రమా ఫలితంగా బ్రాహ్మణుల ఆర్థిక హోదా (Economic status) గత పాతికేళ్ళల్లో విప్లవాత్మకమైన మార్పుకు లోనైంది. వారిలో కొంతమంది కోటీశ్వరులు కావడంతో అలాగే తానూ కోట్లకు పడగలెత్తాలనే దుగ్ధ ప్రతి బ్రాహ్మణుడిలోనూ పురివిప్పింది. ఏదేమైనా బ్రాహ్మణజాతి యావత్తూ ఉత్తర అమెరికాకు శాశ్వతంగా ఋణపడిపోయింది. స్వదేశంలో నిష్కారణమైన కులద్వేషానికి బలై కూడు లేక ఆకలితో అలమటిస్తూ వచ్చిన బ్రాహ్మణ బిడ్డల్ని అమెరికామాత ప్రేమగా దగ్గఱికి తీసుకుని అన్నం పెట్టింది. కోట్లు ప్రసాదించింది. MNC లకు అధిపతుల్ని చేసింది. అధికారాన్ని సైతం అనుగ్రహించింది.
అబ్రాహ్మణ హిందూ ప్రభుత్వాల చేతుల్లో నిష్కారణంగా అణచివేతకు గుఱైన వర్గంగా బ్రాహ్మణుల హృదయాంతరాళాల్లో ఒక కసి గూడు కట్టుకుని ఉంది. ఆ కసిలో అది తనకు పూర్వం ఉన్న అనేక అభిమానాల్నీ, సెంటిమెంట్లనీ వదులుకుంది. ఇది మిక్కిలి శోచనీయమే. వ్యక్తిగతంగా నేను హర్షించను. కానీ ఏం చేద్దాం ? చర్య (Action) కు ప్రతిచర్య (Reaction) తప్పకుండా ఉంటుంది. మానవజాతి అంతా గుఱ్ఱుపెట్టి ఆదమఱచి గాఢనిద్ర పోతున్న యుగాల్లో కళ్ళు తెఱుచుకుని మేలుకుని అన్నీ ఆలోచించిన ప్రకాశమాన చరిత్ర గల బ్రాహ్మణులు తమ అణచివేతకు రియాక్ట్ అవ్వరని అనుకోవడం ప్రభుత్వాల అమాయకత్వం, మూర్ఖత్వం. ఆ రోజున ఆ అణచివేతల్ని నిరంకుశంగా పాశవిక రాజకీయ అధికార సహాయంతో అమలు జఱుపుతున్న కాలంలో బ్రాహ్మణులు నిస్సహాయులు. పేదవారు. అప్పటికే బ్రిటీషు ప్రభుత్వం చేతిలో దెబ్బదిని చప్పున కోలుకోలేక అప్పటి దాకా తాము పాల్గొంటూ వస్తున్న అన్ని రాజకీయ, సాంఘిక కార్యకలాపాల నుంచీ స్వచ్ఛందంగా విరమించుకున్నారు. అందువల్ల ఆ ప్రభుత్వాలకు ఆనాడు ఒక మంచి అవకాశం లభించింది. తాత్కాలిక విజయం సిద్ధించింది.
అలా దేశం నుంచి పారిపోవడం వెనక బ్రాహ్మణుల్లో కూడా చారిత్రికంగా చోటు చేసుకున్న మనస్తత్త్వపరమైన లోపాలున్నాయి. బ్రాహ్మణులు మొదట్నుంచీ ప్రభుత్వ పోషణ మీదే ఇనుమిక్కిలిగా ఆధారపడి బతికారు. ప్రభుత్వాదరణ మీదే తమ సాంఘిక గౌరవ పునాదుల్ని కూడా నిర్మించుకున్నారు. వారిని ఆదరించిన ప్రభుత్వాలు పోయాయి. వాటి స్థానంలో వచ్చిన కొత్త ప్రభుత్వాలు హఠాత్తుగా తమ మీద కక్ష సాధించడం మొదలుపెట్టడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ పరిస్థితి వస్తుందనుకోలేదు. అందుకు మానసికంగా సన్నద్ధులై లేరు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. పర్యవసానమే ఈ కాందిశీకత్వం.
బ్రహ్మద్వేషపు గతం నుంచి హిందువులు ఇహనైనా పాఠాలు నేర్చుకోవాలి
బ్రాహ్మణులు ప్రాథమికంగా ఈ మత నిర్వహణకై నియోగించబడ్డవారు. కానీ ఈ కర్తవ్యాన్ని యథాపూర్వంగా నిర్వహించడానికి సమకాలీన పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకని వారు ఇందులోంచి అంతిమంగా విరమించుకోక తప్పకపోవడం అవగాహనీయం. కూడు కోసం, గుడ్డ కోసం, గౌరవం కోసం వారు ఈ హిందూసమాజంతో పోరాడి, పోరాడి పూర్తిగా అలిసిపోయినట్లు కనిపిస్తోంది. అయినా బ్రాహ్మణుల స్థానాన్ని ఇతరులతో భర్తీ చేయలేం పూర్తిగా ! ఎందుకంటే ఒక పూజారి కొడుకు తన తండ్రి చేస్తున్నవన్నీ శ్రద్ధగా గమనిస్తూ తానూ పెద్దవాడై అలా చేయాలనుకుంటాడు. ఏ శిక్షణ ఇచ్చినా ఆ నిష్కపట అమాయక భావాన్ని కలిగించలేం. అదొక అమూల్యమైన వారసత్వపు సెంటిమెంటు. ఒకసారి ఆ వారసత్వం లోంచి బయటపడ్డ కుటుంబాలు తిరిగి అందులోకి వెళ్ళడం చాలా చాలా కష్టం, మా కుటుంబం లాగే ! అయినా దేవాలయాల్ని అనాథలుగా వదిలేయలేం. అక్కడ నిరాటంకంగా నిత్యనైమిత్తికాలు నడవాల్సి ఉంది. అందుకు హిందువులే ఏదో ఒక ఏర్పాటు చూసుకోవాలి. ఏ ఏర్పాటైనప్పటికీ ఇప్పుడు బ్రాహ్మణుల్ని హింసిస్తున్నట్లుగా కొత్తవారిని కూడా హింసించకుండా కనీసం వారినైనా ప్రేమతో, గౌరవంతో, ఆదరంతో, అభిమానంతో చూసుకోవడం అవసరం. చరిత్ర అబ్రాహ్మణ కులాల మీద మోపుతున్న ఐతిహాసిక ఉత్తరవాదిత్వం ఇది.
(కలగూరగంప బ్లాగు నుంచి ఉద్ధృతం)
అంతా బానే ఉన్నట్లు కనిపిస్తోంది కదూ ? నిజానికి వాస్తవ పరిస్థితి అంత ఆశావహంగా లేదు. హిందూమతం ఒక అత్యవసర పరిస్థితి (Emergency) వైపు, ఒక మానవ వనరుల సంక్షోభం (Human resources' crisis) వైపు అతివేగంగా పయనిస్తోంది. ఎక్కడో అమెరికాలో కాదు, ఇక్కడే ఈ సనాతన భూమిలోనే ! ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయ దృశ్యం కనీసం పదేళ్ళ తరువాత, లేదా గరిష్ఠంగా పాతికేళ్ళ తరువాత పూర్తిగా అదృశ్యం కాబోతున్నది. అటుపిమ్మట ఆ దేవాలయాల పరిస్థితేంటో, వాటిల్లోని దేవుళ్ళ పరిస్థితేంటో, ఆ దేవాలయాల క్రింద నడుస్తున్న సంస్థల పరిస్థితేంటో, అసలు టోకుగా హిందూమతం పరిస్థితేంటో అంతా అగమ్యగోచరం. ఎందుకంటే హిందూమతానికి తీవ్రమైన పూజారి-పురోహితుల కొఱత ముంచుకు రాబోతోంది. ఇది చాప కింద నీరులా ఇప్పటికే మొదలయింది, గత కొద్ది సంవత్సరాలుగా ! మొదట్లో ఒక పదీ-పదిహేనేళ్ళ క్రితం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ అర్చక బ్రాహ్మణుల కొఱత ఇప్పుడు నగరాలక్కూడా ప్రాకింది. రాష్ట్రంలో సుమారు ఇఱవై-పాతిక లక్షలమంది బ్రాహ్మణులు ఉన్నప్పటికీ వారిలో పౌరోహిత్యం చేసేవారి జనాభా దారుణంగా పడిపోవడంతో చిన్నచిన్న వేడుకలూ, కర్మలూ చేయడానికి సైతం ఎవఱూ దొఱక్క, ఆ దొఱికిన బ్రాహ్మణుడికే అనేక రెట్లు డబ్బు కుమ్మరించి చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాదులో ఎంత చిన్న అర్చామూర్తిని ప్రతిష్ఠించాలన్నా యాభైవేలు డిమాండు చేస్తున్నారు. కాస్త పెద్ద విగ్రహాలకైతే లక్ష తప్పనిసరి. జనం "సరే"నని విధిలేక ఇస్తున్నారు, చందాలేసుకుని మఱీ !
అసలు విషయమేంటంటే - బ్రాహ్మణులంతా దాదాపుగా అర్చక-పురోహిత వృత్తిని పరిత్యజించారు. పరిత్యజించడానికి కారణం - ఆ వృత్తికి ఒకప్పుడు హిందూసమాజం ఇచ్చిన ఉద్యోగ భద్రత (Job security) ని ఆ తదుపరి ఉపసంహరించుకోవడం. అలా ఉపసంహరించుకోవడాని క్కారణం అంతకుముందటి బ్రాహ్మణ ద్వేష ప్రచారాలూ, తద్ద్వారా హిందూ మతగురువుల పట్ల ఆదరాభిమానాల్నీ, సానుభూతినీ నశింపజేయడం. ప్రస్తుతం ఎనిమిదిన్నఱ కోట్ల జనాభా గల ఈ రాష్ట్రం మొత్తమ్మీద ఆ వృత్తి చేసేవారు అంతా కలిపి పూర్తిగా ఒక యాభైవేలమంది కూడా ఉంటారో ఉండరో ! ఉన్నవారిలో ఎక్కువమంది ముసలివాళ్ళే. కొన్నిసంవత్సరాల తరువాత ఆ ముసలివాళ్ళు గనుక దాటుకుంటే వారి స్థానంలో పనిచేయడానికి వైదికంగా సుశిక్షితులైన బ్రాహ్మణ యువకులు తగినంతమంది లేరు. రాష్ట్రం నలుమూలలా వేదపాఠశాలలూ, అవీ నామమాత్రంగా ఉండడానికైతే ఉన్నాయి. కానీ అక్కడ శిక్షణ పొంది బయటికొస్తున్నవాళ్ళ సంఖ్య బొత్తిగా సరిపోదు ఈ ఏనుగుని ఎత్తడానికి !
ఉన్న పురోహితుల పిల్లలే అర్చక-పౌరోహిత్యంలో ప్రవేశించడానికి ఇష్టపడడం లేదు. అథవా కొంతమంది ఇష్టపడినా ఇంట్లో ఆడవాళ్ళు "ఠాఠ్ ! వల్లకాదు. అర్చక-పౌరోహిత్యంలో ఏముంది ? నా కొడుకు ఇంజనీరో, డాక్టరో అవ్వాల్సిందే" నని ముక్కు చీదితే కాదనలేక అటు మళ్ళిస్తున్నారు. మిహతా బ్రాహ్మణ జనాభా అలవాటు చేసుకుంటున్న డబ్బువిలువలు ఈనాడు సాంప్రదాయిక అర్చక బ్రాహ్మణ కుటుంబాల్ని కూడా ఇతోఽధికంగా ప్రభావితం చేస్తున్నాయి. తమను తాము ఉద్యోగ వర్గపు బ్రాహ్మణులతో పోల్చుకుని "మనకేం తక్కువ ? ఇంగ్లీషు చదువుకుంటే ఆ మాత్రం ఉద్యోగాలు మనం చెయ్యలేమా ? సంపాదించలేమా ?" అని బయలుదేఱుతున్నారు, ధనసంపాదనా ప్రస్థానానికి ! ఆ విధంగా ఒకసారి మా దగ్గఱ పనిచేస్తున్న యువ పురోహితుడు కూడా HDFC బ్యాంకులో చేఱాడు. కానీ ఆ బ్యాంకువాళ్ళు పొద్దున్నే పూజ చేసుకోవడానిక్కూడా వీల్లేనంత బిజీ చేసేస్తున్నారని గమనించి ఆ ఉద్యోగం వదిలేసి మళ్ళీ పౌరోహిత్యంలోకి వచ్చాడు. సరే, ఇది పురోహితుల సంగతి. ఇహ పూజారుల విషయానికొస్తే వాళ్ళని తప్పు పట్టలేం, వాళ్ళకి ఇస్తున్న జీతం ఒక మనిషిని పోషించడానిక్కూడా చాలని పరిస్థితుల్లో ! పూజారి, పురోహితుడంటే బ్రాహ్మణ అమ్మాయిలు ముందుకు రావడం లేదు పెళ్ళి చేసుకోవడానికి ! అందువల్ల కూడా చాలామంది బ్రాహ్మణులు ఈ వృత్తిని వదిలిపెట్టేస్తున్నారు. ఈ పరిస్థితి ఏ ఇతర మతంలోనూ లేదు. హిందూ పూజారులే దీనికి గుఱిచేయబడుతున్నారు.
గతంలో విస్తృతంగా ప్రచారం చేయబడ్డ బ్రాహ్మణ ద్వేషమే ఈ కొఱతకు మూలకారణం
ఈ పరిస్థితి హఠాత్తుగా తలెత్తినటువంటిది కాదని గమనించాలి. దీని అసలు చరిత్రని అందఱూ కాస్త తెలుసుకోవాలి.
౧. ఏ విధంగా మెజారిటీ బ్రాహ్మణులు దేవాలయాల్నీ, పురోహితవృత్తినీ వదిలిపెట్టి లౌకిక ఉద్యోగాల్లో చేఱాల్సి వచ్చింది ?
౨. తదుపరి కాలంలో ఆ లౌకిక ఉద్యోగాల నుంచి కూడా వారిని ఏ విధంగా బహిష్కరించడం జఱిగింది ?
౩. అది ఏ విధంగా వారిని విదేశాల పాలు చేసింది ?
౪. ఆ విదేశీ/ నవ నాగరిక బ్రాహ్మణులు ఏ విధంగా అర్చక-పురోహిత కుటుంబాలక్కూడా ఆదర్శమై కూర్చున్నారు ?
౫. తద్ద్వారా అర్చక-పురోహిత వృత్తి తన గ్లామర్ని పూర్తిగా కోల్పోయిన వైనం
౬. మతం గుఱించి బోధించేవాళ్ళు లేకుండా చేయడం ద్వారా ఈ పరిస్థితి ఏ విధంగా ముందు మతాన్నీ, తదుపరి సంఘాన్నీ దెబ్బకొట్టబోతున్నది ?
వీటి మధ్య ఉన్న గొలుసుకట్టు సంబంధమూ, పరస్పర ప్రభావమూ, సామాజిక వాతావరణమూ ఇవన్నీ లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంది.
గత కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్ద ప్రక్రియ (silent process) లో ఉన్నదే ఈనాడు బహిరంగంగా విశ్వరూపాన్ని ధరించి కనిపిస్తోంది. ఈ సామాజిక సంక్షోభం తలెత్తకుండా హిందువులూ, వారి నాయకులూ కొన్ని దశాబ్దాల క్రితమే కాస్త ముందుచూపుతో, ఈషణ్మానవత్వంతో వ్యవహరించి ఉంటే బావుండేది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ బ్రాహ్మణుల్ని అణచివేయడమూ, వారు తమకెన్నడూ చేయని అపకారాలకు వారిమీద కులకక్ష సాధించడమూ - ఇవే లక్ష్యంగా పెట్టుకున్నాయి అబ్రాహ్మణ హిందువుల నాయకత్వంలోని ప్రభుత్వాలు. ఉద్దేశపూర్వకంగా చాలా హీనమైన పేదఱికానికి గుఱిచేశారు బ్రాహ్మణ కులాన్ని ! రిజర్వేషన్ల పేరుతో ఎంత చదువుకున్నా ఉద్యోగాలివ్వకుండా హింసించారు. ప్రమోషన్లు ఇవ్వకుండా హింసించారు. ఏ పాపమూ ఎఱుగని బ్రాహ్మణ ఉద్యోగులమీద తప్పుడు అవినీతి కేసులు బనాయించి మఱీ హింసించారు. భూపరిమితి చట్టాల పేరుతో, కమిటీల పేరుతో వ్యక్తిగత భూములూ, దేవాలయ భూములూ లాగేసుకుని హింసించారు. పూజారులకు జీతాలివ్వకుండా ఎగ్గొట్టి హింసించారు. ఓరియంటల్ కళాశాలల్లో చాలీచాలని జీతాలకు తెలుగూ, సంస్కృతమూ చెప్పుకుని బతుకుతూంటే "బ్రాహ్మణుడు ఆ మాత్రం కూడా ఎందుకు బతకా"లని ఏకంగా ఆ కళాశాలల్నే ఎత్తేశారు. అలా ఎక్కడెక్కడ బ్రాహ్మణుడు ఆశ్రయం పొంది ఒక ముద్ద అన్నం తింటున్నాడో కనిపెట్టి ఆయా వ్యవస్థల్నీ, సంస్థల్నీ క్రూరంగా కూలద్రోసుకుంటూ పోతూ అతన్ని దయాదాక్షిణ్య రహితంగా లేవగొట్టారు. ఏతావతా హిందువులకు తరతరాల గురువైన బ్రాహ్మణుడికి చివఱికి ఆ హిందూసమాజంలో మనుగడనే దుర్భరం చేశారు. బ్రాహ్మణుడికి అన్నం పెడితే పుణ్యం వస్తుందనే పూర్వ నమ్మకాన్ని కాలరాచి బ్రాహ్మణుడి పొట్టగొడితే అభ్యుదయం అవుతుందనే ఒక నవీన కలికాలపు ధర్మశాస్త్రాన్ని రచించారు. బ్రాహ్మణుడి యొక్క తరతరాల సాంప్రదాయిక జీవన వనర్లన్నింటినీ ఉద్దేశ పూర్వకంగా ధ్వంసం చేశారు. ఇన్ని చేశాక, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుగా జీవించడానికి కావాల్సిన ప్రాపులూ, వాతావరణమూ సంపూర్ణంగా అదృశ్యమైనాక ఈ రోజు మీకు పూర్వపు బ్రాహ్మణుడే కావాలంటే ఎక్కడ దొఱుకుతాడు ?
అలా అబ్రాహ్మణులు ప్రభుత్వాల రూపంలో బ్రాహ్మణుల్ని బాధించడానికి పూనుకోవడం ఊరికే తమాషాగా జఱిగింది కాదు. సర్వే జనా స్సుఖినో భవన్తు అని ఆశీర్వదించే బ్రాహ్మణుడు లోకకంటకుడుగా, సంఘద్రోహిగా చిత్రించబడడం చిత్రమే అయినా ఆ విచిత్ర విద్వేష మనస్తత్త్వానికి నింపాదిగా పునాదులు వేసిన కుట్ర ఒకటుంది. దాని వెనుక ఒక కుహనా సైద్ధాంతిక ప్రాతిపదిక (false ideological basis) ఉంది. గతశతాబ్దంలో సర్వేసర్వత్రా బ్రాహ్మణుల మీద విస్తృతంగా జఱిగిన విశృంఖలమైన దుష్ప్రచారమే ఆ ప్రాతిపదిక. ఈ దుష్ప్రచారంలో నాస్తికులూ, కమ్యూనిస్టులూ అయిన బ్రాహ్మణులు కూడా అమాయకంగా పాలుపంచుకున్నారు, దాని మూలమూ పర్యవసానాలూ ఊహించలేక ! ఈ కుట్రకు నాందీప్రస్తావన చేసినది క్రైస్తవ మిషనరీలు కాగా అమలు జఱిపింది బ్రిటీషు ప్రభుత్వం. బ్రాహ్మణులకు తరతరాలుగా సమాజంలో ఉన్న ప్రాచుర్యాన్నీ, జనాదరణనీ నాశనం చేస్తే తప్ప హిందూమతాన్ని నాశనం చేయలేమనే కీలకాన్ని వారు కనిపెట్టారు. ఈ కుట్రలో భాగంలో ప్రతిరాష్ట్రంలోనూ ఎక్కడెక్కడి బ్రహ్మద్వేషుల్నీ దగ్గఱికి తీసి, దువ్వి, తెఱ వెనుక ఆర్థికాది సహకారాలు అందించి రెచ్చగొట్టారు. నిజంగా బ్రాహ్మణులు వీళ్ళు ప్రచారం చేసినంత బలవంతులూ, విలన్లే అయితే వాళ్ళ శాల్తీల్ని లేపేసి మొగ్గలోనే తుంచి అవతల పారేసి ఉండేవాళ్ళు. బలహీనులూ, నిస్సహాయులు గనుకనే తమ మీద ఇంత దుష్ప్రచారం చేస్తున్నా ఏమీ అనలేకా, ఏమీ చెయ్యలేకా దీనంగా చూస్తూ నిలబడ్డారు.
ఒక రకంగా చెప్పాలంటే - ఈనాడు తెలంగాణవాదులు ఆంధ్రా ఏరియావారి మీద చేస్తున్న దుష్ప్రచారం లాంటిదే చేశారు గత శతాబ్దంలో బ్రహ్మద్వేషులు. ఆ దుష్ప్రచారం చాలా ప్రతిభావంతంగా, సమర్థంగా జఱిగింది. బ్రాహ్మణులు ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏ స్థితిలో ఉన్నా దానికి కులగజ్జిపరమైన వక్రభాష్యాలు చెప్పారు. జాతికి బ్రాహ్మణులు చేసిన సేవలన్నీ వారి ఆధిపత్యానికి చిహ్నమని ప్రచారం చేశారు. బ్రాహ్మణులు తమ కులాచారం పాటిస్తే అది బ్రాహ్మణుల కులగజ్జి. దేశంలో ఎన్నో కులాలున్నాయి. ఏ కులానికి ఆ కులాచారం ఉంది. ఆయా కులాలు ఆయా ఆచారాల్ని పాటిస్తే అది కులగజ్జి కాదు. బ్రాహ్మణులు తమ కులాచారాన్ని పాటించడం మాత్రమే కులగజ్జి. బ్రాహ్మణులు ధనికులైతే అది రాజుల దగ్గఱ వాళ్ళు చేసిన పైరవీల ఫలితం. వాళ్ళు పేదలైతే అది వాళ్ళ సోమరిపోతుతనం. ఈ దుష్ప్రచారంలో జాతికి వేలాది సంవత్సరాలుగా బ్రాహ్మణులు చేసిన ఉపకారాలూ, ఉపచర్యలూ, దేశం కోసం వివిధ చారిత్రిక ఘట్టాల్లో వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలూ, ఆ క్రమంలో వాళ్ళు అనుభవించిన ఇక్కట్లూ, వాళ్ళతో పాటు వాళ్ళ ఆడవాళ్ళు పడ్డ బాధలూ అన్నీ మఱుగున పడవేయబడ్డాయి.
ఒక పేద, నిస్సహాయ, బడుగువర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వారిని దేశానికి విలన్లుగా చిత్రిస్తూ భారీ బడ్జెట్టుతో ప్రభుత్వస్థాయిలో అత్యంత వ్యవస్థీకృతంగా జఱిగిన ఈ తరహా బుఱదజల్లుడు ప్రచారం బహుశా ప్రపంచంలోనే న భూతో న భవిష్యతి. బహుశా ఇది కలియుగ లక్షణం. కలిపురుషుడి లీల. ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. అన్ని మతాలకూ మతగురువులున్నారు. కానీ తమ మతగురువుల్ని హిందువులు అణచివేసినట్లుగా, అవమానిస్తున్నట్లుగా ఎక్కడా ఎవఱూ చేయడం లేదు. పైపెచ్చు నెత్తిన బెట్టుకుని పూజించుకుంటున్నారు. కానీ భారతదేశంలో బ్రాహ్మణుల స్థానమూ, చారిత్రిక భూమికా ఇతరమతాలలోని మతగురువుల కంటే ఎన్నో రెట్లు గొప్పవీ, వైవిధ్య భరితమైనవీను. బ్రాహ్మణులు ఈ జాతికి ఎప్పుడు అపకారం చేశారు ? వారు ఎల్లప్పుడూ చేతనైనంత మంచే చేశారు. మనసా వాచా కర్మణా తెలుగుజాతిలో కలిసిపోయి తమ సంస్కృత నామాల్ని సైతం వర్జించి అచ్చతెలుగులో నన్నయ్య, తిక్కన్న, పోతన్న మొదలైన పేర్లు పెట్టుకుని ఇక్కడి జనసామాన్యంతో తాదాత్మ్యం చెందారు. వారు లిపిలేని తెలుగుభాషకు లిపి (బ్రాహ్మీలిపి) నిచ్చారు. వ్యాకరణం లేని తెలుగుభాషకు వ్యాకరణాన్నిచ్చారు. పదాలు లేని భాషకు సంస్కృత పదాలు జోడించి శక్తిమంతం చేశారు. సాహిత్యం లేని భాషలో సాహిత్యాన్ని సృష్టించి ప్రపంచ భాషల సరసన దీని చరిత్రని సగర్వంగా, సుస్థిరంగా నిలబెట్టారు. రాష్ట్రం సంగతి పక్కన బెడితే బ్రాహ్మణులు లేకుండా భారతదేశం అనే పరిభావన (concept) అసలెక్కడుంది ? బ్రాహ్మణ వారసత్వం కాకుండా ఈ దేశానికి ఉన్న ఉమ్మడి వారసత్వం ఏంటి ?
దేసీ ప్రభుత్వాల చేతుల్లో తమ తల్లిదండ్రులు పడ్డ బాధలు గమనించి చాలామంది తెలుగు బ్రాహ్మణుల సంతానం ఇంగ్లీషు అభ్యసించి దశాబ్దాల క్రితమే ఉత్తర అమెరికాకి పారిపోవడం ప్రారంభించారు. ఇతరులకు విదేశీ ప్రయాణం ఒక హోదాచిహ్నం (Status symbol) కాగా బ్రాహ్మణులకు మాత్రం అదొక చావుబతుకుల సమస్యగా మారింది. ఏం చేసైనా సరే, పారిపోక తప్పని పరిస్థితిని అనుభూతి చెందారు. నిరంతర కృషీ, శ్రమా ఫలితంగా బ్రాహ్మణుల ఆర్థిక హోదా (Economic status) గత పాతికేళ్ళల్లో విప్లవాత్మకమైన మార్పుకు లోనైంది. వారిలో కొంతమంది కోటీశ్వరులు కావడంతో అలాగే తానూ కోట్లకు పడగలెత్తాలనే దుగ్ధ ప్రతి బ్రాహ్మణుడిలోనూ పురివిప్పింది. ఏదేమైనా బ్రాహ్మణజాతి యావత్తూ ఉత్తర అమెరికాకు శాశ్వతంగా ఋణపడిపోయింది. స్వదేశంలో నిష్కారణమైన కులద్వేషానికి బలై కూడు లేక ఆకలితో అలమటిస్తూ వచ్చిన బ్రాహ్మణ బిడ్డల్ని అమెరికామాత ప్రేమగా దగ్గఱికి తీసుకుని అన్నం పెట్టింది. కోట్లు ప్రసాదించింది. MNC లకు అధిపతుల్ని చేసింది. అధికారాన్ని సైతం అనుగ్రహించింది.
అబ్రాహ్మణ హిందూ ప్రభుత్వాల చేతుల్లో నిష్కారణంగా అణచివేతకు గుఱైన వర్గంగా బ్రాహ్మణుల హృదయాంతరాళాల్లో ఒక కసి గూడు కట్టుకుని ఉంది. ఆ కసిలో అది తనకు పూర్వం ఉన్న అనేక అభిమానాల్నీ, సెంటిమెంట్లనీ వదులుకుంది. ఇది మిక్కిలి శోచనీయమే. వ్యక్తిగతంగా నేను హర్షించను. కానీ ఏం చేద్దాం ? చర్య (Action) కు ప్రతిచర్య (Reaction) తప్పకుండా ఉంటుంది. మానవజాతి అంతా గుఱ్ఱుపెట్టి ఆదమఱచి గాఢనిద్ర పోతున్న యుగాల్లో కళ్ళు తెఱుచుకుని మేలుకుని అన్నీ ఆలోచించిన ప్రకాశమాన చరిత్ర గల బ్రాహ్మణులు తమ అణచివేతకు రియాక్ట్ అవ్వరని అనుకోవడం ప్రభుత్వాల అమాయకత్వం, మూర్ఖత్వం. ఆ రోజున ఆ అణచివేతల్ని నిరంకుశంగా పాశవిక రాజకీయ అధికార సహాయంతో అమలు జఱుపుతున్న కాలంలో బ్రాహ్మణులు నిస్సహాయులు. పేదవారు. అప్పటికే బ్రిటీషు ప్రభుత్వం చేతిలో దెబ్బదిని చప్పున కోలుకోలేక అప్పటి దాకా తాము పాల్గొంటూ వస్తున్న అన్ని రాజకీయ, సాంఘిక కార్యకలాపాల నుంచీ స్వచ్ఛందంగా విరమించుకున్నారు. అందువల్ల ఆ ప్రభుత్వాలకు ఆనాడు ఒక మంచి అవకాశం లభించింది. తాత్కాలిక విజయం సిద్ధించింది.
అలా దేశం నుంచి పారిపోవడం వెనక బ్రాహ్మణుల్లో కూడా చారిత్రికంగా చోటు చేసుకున్న మనస్తత్త్వపరమైన లోపాలున్నాయి. బ్రాహ్మణులు మొదట్నుంచీ ప్రభుత్వ పోషణ మీదే ఇనుమిక్కిలిగా ఆధారపడి బతికారు. ప్రభుత్వాదరణ మీదే తమ సాంఘిక గౌరవ పునాదుల్ని కూడా నిర్మించుకున్నారు. వారిని ఆదరించిన ప్రభుత్వాలు పోయాయి. వాటి స్థానంలో వచ్చిన కొత్త ప్రభుత్వాలు హఠాత్తుగా తమ మీద కక్ష సాధించడం మొదలుపెట్టడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ పరిస్థితి వస్తుందనుకోలేదు. అందుకు మానసికంగా సన్నద్ధులై లేరు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. పర్యవసానమే ఈ కాందిశీకత్వం.
బ్రహ్మద్వేషపు గతం నుంచి హిందువులు ఇహనైనా పాఠాలు నేర్చుకోవాలి
బ్రాహ్మణులు ప్రాథమికంగా ఈ మత నిర్వహణకై నియోగించబడ్డవారు. కానీ ఈ కర్తవ్యాన్ని యథాపూర్వంగా నిర్వహించడానికి సమకాలీన పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకని వారు ఇందులోంచి అంతిమంగా విరమించుకోక తప్పకపోవడం అవగాహనీయం. కూడు కోసం, గుడ్డ కోసం, గౌరవం కోసం వారు ఈ హిందూసమాజంతో పోరాడి, పోరాడి పూర్తిగా అలిసిపోయినట్లు కనిపిస్తోంది. అయినా బ్రాహ్మణుల స్థానాన్ని ఇతరులతో భర్తీ చేయలేం పూర్తిగా ! ఎందుకంటే ఒక పూజారి కొడుకు తన తండ్రి చేస్తున్నవన్నీ శ్రద్ధగా గమనిస్తూ తానూ పెద్దవాడై అలా చేయాలనుకుంటాడు. ఏ శిక్షణ ఇచ్చినా ఆ నిష్కపట అమాయక భావాన్ని కలిగించలేం. అదొక అమూల్యమైన వారసత్వపు సెంటిమెంటు. ఒకసారి ఆ వారసత్వం లోంచి బయటపడ్డ కుటుంబాలు తిరిగి అందులోకి వెళ్ళడం చాలా చాలా కష్టం, మా కుటుంబం లాగే ! అయినా దేవాలయాల్ని అనాథలుగా వదిలేయలేం. అక్కడ నిరాటంకంగా నిత్యనైమిత్తికాలు నడవాల్సి ఉంది. అందుకు హిందువులే ఏదో ఒక ఏర్పాటు చూసుకోవాలి. ఏ ఏర్పాటైనప్పటికీ ఇప్పుడు బ్రాహ్మణుల్ని హింసిస్తున్నట్లుగా కొత్తవారిని కూడా హింసించకుండా కనీసం వారినైనా ప్రేమతో, గౌరవంతో, ఆదరంతో, అభిమానంతో చూసుకోవడం అవసరం. చరిత్ర అబ్రాహ్మణ కులాల మీద మోపుతున్న ఐతిహాసిక ఉత్తరవాదిత్వం ఇది.
(కలగూరగంప బ్లాగు నుంచి ఉద్ధృతం)
18, మే 2011, బుధవారం
నమస్కరించడం అంటే శరణాగతి చేయడానికి సూచన
శ్రీ గురుభ్యోన్నమః
అందరికీ నమస్కారం.
నఇతి భావనను పెంచుకొని అసలుదేదో దాన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎక్కే మొట్టమొదటి మెట్టు నమస్కరించడం. భగవంతుణ్ణే ఐనా సరే, గురువులనే ఐనా సరే, లేక బుధ జనులనైనా సరే వారిముందు మన ఈ శరీరాహంకార భావనలను వదిలి మనం మనయొక్క విధేయతను చాటి వారినుంచి ఆశీఃపూర్వక అనుగ్రహాన్ని కోరే ప్రక్రియే నమస్కరం. మన మనస్సులోని వినయాన్ని,భక్తిని, ప్రేమను బుద్ధితోకలిపి రెండుచేతులు జోడించి తలవంచి ఎదుటనున్నవారి వద్ద నుంచోవడమే నమస్కారం. వినయంతో మీకు నమస్కరించుచున్నాని చెప్పడమే "నమః+తే =నమస్తే" ఇది నాది కాదు మీది అన్న మనలోపలి ప్రసాద బుద్ధిని బయట పెట్టటమే నమస్తే, న= నాది,మః= కాదు, తే= మీది. ఇది నాది కాదు మీది మీ ప్రసాదంగా నేను వాడుకుంటున్నాను లేదా మీ ప్రసాదంగా నేనున్నాను అని చెప్పడమే నమస్కరించటం.
ఐదు జ్ఙానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలకి సూచనగా పదెవేళ్ళు దగ్గర చేసి, బుద్ధికి సూచనగా తలవంచి బొటనవేళ్ళు లలాటం వైపు (బుద్ధి వైపు)చూపిస్తున్నట్టుగా చేయడం. అంటే తన లోని పంచ జ్ఙానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు నిశ్చయాత్మకమైన బుద్ధి ఈ మూడు కలుస్తే నేను అనే అహంకారం. వీటిని మీ ఎదుట వదిలి వినమ్రుడనై ఏమీ లేనివాడనై మీ కృపకొరకు ఎదురుచూస్తున్నాను అని చెప్పడం నమస్కారంచేయడం.
తల్లి తండ్రులకు ఒక్క నమస్కారం, భగవంతునికి మూడుమార్లు, గురువులకు, సన్యాసాశ్రమంలో ఉన్నవారికి నాలుగు నమస్కారాలు ఐతే వీరిలో ఒక్క భగవంతుని తప్ప మిగిలిన ఎవ్వరినీ నమస్కారం చేసి కోరికలు కోరకూడదు.ఒంటిచేతితో నమస్కారం నిషిద్ధం. కొంతమంది నమస్కారంచేస్తూ ఉంగరాలు వేళ్ళు ముద్దు పెట్టుకుంటుంటారు, అలా నమస్కారం చేయాలని ఎక్కడా చెప్పబడలేదు, పైగా అందరి ముందూ అలా చేయడం అసహ్యకరంగా ఉంటుంది కూడా.
నమస్కరించడం అంటే శరణాగతి చేయడానికి సూచన, సద్యః ఫలితాన్నీ ఇస్తుంది. అందుకే నమస్కారం నవవిధ భక్తుల్లో ఒక్కటైంది.అక్రూరుడు చిన్ని కృష్ణుని పాదముద్రలు అందులోని పర చిహ్నాలు నేలపై చూసి, నా దేవుడు నడచిన తోవ నేను రథమెక్కి వెళ్ళడమా అని రథంలోంచి అప్పటికప్పుడు స్వర్ణదండం పడినట్టు నేలమీద పడి శ్రీకృష్ణుని పాదాల గుర్తులు ఉన్న చోట ఆ మట్టి అంతా తనకి అంటుకునేలా మట్టిలో పొర్లి కృష్ణదర్శనానికి వెళ్ళాడు. అక్రూరుడు స్వతహాగా ఎటువంటివాడైనా, ఎవరిని ఆశ్రయించి ఉన్నా ఆయనకి కృష్ణునిమీద ఉన్న భక్తికి పైఘట్టం పరాకాష్ట, అందుకే ఇప్పటికీ వందనానికి అక్రూరుడే ఉదాహరణ.
అన్నిటికన్నా ఉత్కృష్టమైనది సాష్టాంగ నమస్కారం. తాను శరీరంతో సహా ఎదుటివారి వద్ద సాష్టాంగ పడితే అర్థం ఏంటంటే, మీ ఎదుట నేను అన్నిటికన్నా తక్కువవాణ్ణి అందుకుగానూ నేలమీద పడి నమస్కరిస్తున్నాను అని చెప్పడం.ఉదాహరణకు భగవంతుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేశామనుక్కోండి. దానర్థం భగవంతుడా నేను అన్నిటికన్నా కిందున్న నేల మీదపడి నీ అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నాను అని శరణాగతి చేయటం. అప్పుడు భగవంతుడు ఏంచేయాలి తన రెండు చేతులతో మన భుజాలు పట్టుకుని పైకి లేపాలి. అంటే మనని నేలమీదినుంచి లేపి వృద్ధినివ్వాలి మళ్ళీ మళ్ళీ నేలమీదపడకుండా ఉన్నతుణ్ణి చేయాలి (తిరిగి జన్మలేనిస్థితిని ఇవ్వాలి) . ఈ ప్రక్రియలో భక్తుడికోసం తానే సగం వంగాలి. (ఇదే గురువు ఇతర బుధ జనుల విషయంలో కూడా) అందుకే అంతగొప్పది సాష్టాంగ నమస్కారం. ఇది భౌతికంగా జరగకపోయినా మానసికంగా అదే భావనతో భగవంతుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేయాలి. అక్రూరుడు చేసినదదేకదా కృష్ణుడు లేకపోయినా కృష్ణపాదాల గుర్తులు చూస్తే ఆయన భక్తిభావం ఆగలేదు. అందుకేయద్భావం తద్భవతి. కృష్ణుణ్ణి చేరాడు, ఇప్పటికీ నమస్కారభక్తికి గుర్తుగా మిగిలిపోయాడు, ఎప్పటికీ అలానే నిలిచి ఉంటాడు.
ముఖ్యం: మగవారు సాష్టాంగ నమస్కారం, ఆడవారు పంచాంగ నమస్కారం చేయాలి.
ఇందులో ఒక్కొక్క అంగానికీ శ్లోకంచెప్పి ఒక్కొక్కమారు ఆ అంగంతో సాష్టాంగ నమస్కారం చేసే పద్ధతి ఉన్నది. అలానే అన్ని అంగాల పేర్లు చెప్పి ఒకేసారి నమస్కారం చేసే పద్దతీ ఉన్నది.
శ్లో|| ఉరసా శిరసా దృష్ట్యా వచసా మనసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||
ఇందులో అన్ని అంగాలనూ నేలకానించి నమస్కారం చేయవచ్చు చేతుల్ని నేలకానించి నమస్కారం చేయవచ్చు,కాళ్ళను ఆనించవచ్చు, చెవులను ఆనించవచ్చు కళ్ళని కూడా, సాష్టాంగ నమస్కారంలో ఉన్న గమ్మత్తేమంటే మనస్సుని కూడా నేలకానించాలి,అదెలా సాధ్యం? కాళ్ళు చేతులు ఇతరాలంటే నేలమీద పడేస్తాం మరి మనస్సునెక్కడనుంచి తెస్తాం? అంటే మన మనస్సుకి వినయంతో కూడిన తర్ఫీదునిస్తే, నమస్కారం చేసేటప్పుడు మనస్సుకూడా మనం ఎవరికి నమస్కారం చేస్తున్నామో వారి పాదాల పరం కావడానికి అలవాటు పడుతుంది. మనస్సుని కూడా శరీరంతోపాటు కృష్ణుని పాదగుర్తులమీద పడేశాడు కాబట్టే అక్రూరిని నమస్కారం అంతగొప్పదైంది.
ఇంకా మిగిలిన విషయాలు పెద్దలు చెప్పారు, ఈ చర్చ ఇంకా కొనసాగవలసి ఉంది, అందరూ మీ మీ అభిప్రాయాలను, తెలిసిన విషయాలను (ఈ చర్చకు సంబంధించి) ఇక్కడ పొందుపరిస్తే అందరికీ ఉపయుక్తం.
మీ
శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్
అందరికీ నమస్కారం.
నఇతి భావనను పెంచుకొని అసలుదేదో దాన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎక్కే మొట్టమొదటి మెట్టు నమస్కరించడం. భగవంతుణ్ణే ఐనా సరే, గురువులనే ఐనా సరే, లేక బుధ జనులనైనా సరే వారిముందు మన ఈ శరీరాహంకార భావనలను వదిలి మనం మనయొక్క విధేయతను చాటి వారినుంచి ఆశీఃపూర్వక అనుగ్రహాన్ని కోరే ప్రక్రియే నమస్కరం. మన మనస్సులోని వినయాన్ని,భక్తిని, ప్రేమను బుద్ధితోకలిపి రెండుచేతులు జోడించి తలవంచి ఎదుటనున్నవారి వద్ద నుంచోవడమే నమస్కారం. వినయంతో మీకు నమస్కరించుచున్నాని చెప్పడమే "నమః+తే =నమస్తే" ఇది నాది కాదు మీది అన్న మనలోపలి ప్రసాద బుద్ధిని బయట పెట్టటమే నమస్తే, న= నాది,మః= కాదు, తే= మీది. ఇది నాది కాదు మీది మీ ప్రసాదంగా నేను వాడుకుంటున్నాను లేదా మీ ప్రసాదంగా నేనున్నాను అని చెప్పడమే నమస్కరించటం.
ఐదు జ్ఙానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలకి సూచనగా పదెవేళ్ళు దగ్గర చేసి, బుద్ధికి సూచనగా తలవంచి బొటనవేళ్ళు లలాటం వైపు (బుద్ధి వైపు)చూపిస్తున్నట్టుగా చేయడం. అంటే తన లోని పంచ జ్ఙానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు నిశ్చయాత్మకమైన బుద్ధి ఈ మూడు కలుస్తే నేను అనే అహంకారం. వీటిని మీ ఎదుట వదిలి వినమ్రుడనై ఏమీ లేనివాడనై మీ కృపకొరకు ఎదురుచూస్తున్నాను అని చెప్పడం నమస్కారంచేయడం.
తల్లి తండ్రులకు ఒక్క నమస్కారం, భగవంతునికి మూడుమార్లు, గురువులకు, సన్యాసాశ్రమంలో ఉన్నవారికి నాలుగు నమస్కారాలు ఐతే వీరిలో ఒక్క భగవంతుని తప్ప మిగిలిన ఎవ్వరినీ నమస్కారం చేసి కోరికలు కోరకూడదు.ఒంటిచేతితో నమస్కారం నిషిద్ధం. కొంతమంది నమస్కారంచేస్తూ ఉంగరాలు వేళ్ళు ముద్దు పెట్టుకుంటుంటారు, అలా నమస్కారం చేయాలని ఎక్కడా చెప్పబడలేదు, పైగా అందరి ముందూ అలా చేయడం అసహ్యకరంగా ఉంటుంది కూడా.
నమస్కరించడం అంటే శరణాగతి చేయడానికి సూచన, సద్యః ఫలితాన్నీ ఇస్తుంది. అందుకే నమస్కారం నవవిధ భక్తుల్లో ఒక్కటైంది.అక్రూరుడు చిన్ని కృష్ణుని పాదముద్రలు అందులోని పర చిహ్నాలు నేలపై చూసి, నా దేవుడు నడచిన తోవ నేను రథమెక్కి వెళ్ళడమా అని రథంలోంచి అప్పటికప్పుడు స్వర్ణదండం పడినట్టు నేలమీద పడి శ్రీకృష్ణుని పాదాల గుర్తులు ఉన్న చోట ఆ మట్టి అంతా తనకి అంటుకునేలా మట్టిలో పొర్లి కృష్ణదర్శనానికి వెళ్ళాడు. అక్రూరుడు స్వతహాగా ఎటువంటివాడైనా, ఎవరిని ఆశ్రయించి ఉన్నా ఆయనకి కృష్ణునిమీద ఉన్న భక్తికి పైఘట్టం పరాకాష్ట, అందుకే ఇప్పటికీ వందనానికి అక్రూరుడే ఉదాహరణ.
అన్నిటికన్నా ఉత్కృష్టమైనది సాష్టాంగ నమస్కారం. తాను శరీరంతో సహా ఎదుటివారి వద్ద సాష్టాంగ పడితే అర్థం ఏంటంటే, మీ ఎదుట నేను అన్నిటికన్నా తక్కువవాణ్ణి అందుకుగానూ నేలమీద పడి నమస్కరిస్తున్నాను అని చెప్పడం.ఉదాహరణకు భగవంతుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేశామనుక్కోండి. దానర్థం భగవంతుడా నేను అన్నిటికన్నా కిందున్న నేల మీదపడి నీ అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నాను అని శరణాగతి చేయటం. అప్పుడు భగవంతుడు ఏంచేయాలి తన రెండు చేతులతో మన భుజాలు పట్టుకుని పైకి లేపాలి. అంటే మనని నేలమీదినుంచి లేపి వృద్ధినివ్వాలి మళ్ళీ మళ్ళీ నేలమీదపడకుండా ఉన్నతుణ్ణి చేయాలి (తిరిగి జన్మలేనిస్థితిని ఇవ్వాలి) . ఈ ప్రక్రియలో భక్తుడికోసం తానే సగం వంగాలి. (ఇదే గురువు ఇతర బుధ జనుల విషయంలో కూడా) అందుకే అంతగొప్పది సాష్టాంగ నమస్కారం. ఇది భౌతికంగా జరగకపోయినా మానసికంగా అదే భావనతో భగవంతుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేయాలి. అక్రూరుడు చేసినదదేకదా కృష్ణుడు లేకపోయినా కృష్ణపాదాల గుర్తులు చూస్తే ఆయన భక్తిభావం ఆగలేదు. అందుకేయద్భావం తద్భవతి. కృష్ణుణ్ణి చేరాడు, ఇప్పటికీ నమస్కారభక్తికి గుర్తుగా మిగిలిపోయాడు, ఎప్పటికీ అలానే నిలిచి ఉంటాడు.
ముఖ్యం: మగవారు సాష్టాంగ నమస్కారం, ఆడవారు పంచాంగ నమస్కారం చేయాలి.
ఇందులో ఒక్కొక్క అంగానికీ శ్లోకంచెప్పి ఒక్కొక్కమారు ఆ అంగంతో సాష్టాంగ నమస్కారం చేసే పద్ధతి ఉన్నది. అలానే అన్ని అంగాల పేర్లు చెప్పి ఒకేసారి నమస్కారం చేసే పద్దతీ ఉన్నది.
శ్లో|| ఉరసా శిరసా దృష్ట్యా వచసా మనసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||
ఇందులో అన్ని అంగాలనూ నేలకానించి నమస్కారం చేయవచ్చు చేతుల్ని నేలకానించి నమస్కారం చేయవచ్చు,కాళ్ళను ఆనించవచ్చు, చెవులను ఆనించవచ్చు కళ్ళని కూడా, సాష్టాంగ నమస్కారంలో ఉన్న గమ్మత్తేమంటే మనస్సుని కూడా నేలకానించాలి,అదెలా సాధ్యం? కాళ్ళు చేతులు ఇతరాలంటే నేలమీద పడేస్తాం మరి మనస్సునెక్కడనుంచి తెస్తాం? అంటే మన మనస్సుకి వినయంతో కూడిన తర్ఫీదునిస్తే, నమస్కారం చేసేటప్పుడు మనస్సుకూడా మనం ఎవరికి నమస్కారం చేస్తున్నామో వారి పాదాల పరం కావడానికి అలవాటు పడుతుంది. మనస్సుని కూడా శరీరంతోపాటు కృష్ణుని పాదగుర్తులమీద పడేశాడు కాబట్టే అక్రూరిని నమస్కారం అంతగొప్పదైంది.
ఇంకా మిగిలిన విషయాలు పెద్దలు చెప్పారు, ఈ చర్చ ఇంకా కొనసాగవలసి ఉంది, అందరూ మీ మీ అభిప్రాయాలను, తెలిసిన విషయాలను (ఈ చర్చకు సంబంధించి) ఇక్కడ పొందుపరిస్తే అందరికీ ఉపయుక్తం.
మీ
శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్
నామాంకాలు (Labels)
ధార్మిక జీవన పద్ధతి
23, ఫిబ్రవరి 2011, బుధవారం
ధర్మమంటే ఏమిటి ?
"యతో అభ్యుదయాయ నిశ్రేయససిద్ధిః స ధర్మః "
ఏది అభ్యుదయ కారకమో ఏది మోక్ష సాధనమోలేదా మోక్షాన్ని సిద్ధింపజేయటంలో తోడ్పడుతుందో అదే ధర్మం.
అభ్యుదయం అంటే కేవల లౌకికం కాదు, నాకు లక్ష రూపాయలు వస్తున్నాయి కాబట్టి అది నాకు అభ్యుదయం అన్న వాదన అసంబద్ధం, అది మోక్ష కారకమైనదా అన్నది అవసరం. ధర్మం అంటే తెలుసుకొని ఆచరించేది.
మానవుడు లౌకిక పార లౌకిక వ్యాపారాలను నిర్వర్తించడానికి వేదం చెప్పిన త్రోవలే ధర్మాలు. ఆ ధర్మాచరణమే మోక్షానికి దైవ సాక్షాత్కారానికి మార్గం. ఒకే వ్యక్తికి ఒకే ధర్మం ఒకేలా అన్నివేళలా అన్ని దేశాలలో ఉంటుందన్నది సత్య దూరం.
.
నేను నా గురువుల దగ్గర ఉన్నప్పుడు నేను పాటించాల్సింది శిష్య ధర్మం. అలాగే నా తల్లిదండ్రుల దగ్గర పుత్రధర్మం, అదే సమయంలో నాపిల్లల దగ్గర నాది పితృధర్మం. ఏకాదశినాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు పారణ ( త్వరగా భుజించడం) ధర్మం. అదే ఏకాదశినాడు ఇక్కడ ఉంటే ఉపవాసం ధర్మం, కాశీలో ఉంటే అన్నపూర్ణ అనుగ్రహంగా ఉపవాసం ఉండకపోవడం ధర్మం. కొన్ని మాసాల్లో సముద్ర స్నానం నదీ స్నానం ధర్మం కొన్నిమాసాల్లో నిషిద్ధం. ఇలాగే చాలా మారుతూ ఉంటుంది.
అలాగే వర్ణాశ్రమాలలో కూడా, బ్రహ్మచారికి ఉన్న ధర్మం వేరు. అదేబ్రహ్మచారి వివాహం చేసుకుంటే పాటించాల్సిన గృహస్థ ధర్మాలు వేరు అలాగే సన్యాసికీ వానప్రస్తుకీ... ధర్మం మారడం అంటే ఒకే వ్యక్తికి దేశ కాల అవస్థ వర్ణ ఆశ్రమాదులని బట్టి మార్పుచెందుతుంది. అదే ఇద్దరు వ్యక్తులు ఒకే దేశ, కాల, ఆశ్రమ, వర్ణ, అవస్థాదులలో ఉంటేఇద్దరికీ ఒకే ధర్మం ఏ ఒక్కటి మారినా ధర్మం మారుతుంది.... స్థూలంగానో, సూక్ష్మంగానో....
ధర్మ శాస్త్రాల వాఖ్యానాలు చదివి గురువుల వద్ద నేర్చుకొని అనుష్టించడమే ఉత్తమం. అంతా కాకపోయినా కొంత మన ప్రస్తుత జీవన సరళికి కావల్సిన ధర్మ సూక్ష్మాలు తెలుసుకొని ఆచరించడం శ్రేయస్కరం, మోక్ష ప్రదం.
నాకు ధర్మం తెలుసు ఏది చేయాలో ఎలా చేయాలో తెలుసు కాని చేయను అంటే అది నా ధర్మమును నిర్వర్తించడము కాదు నేను ధర్మాత్ముడను కాను. లేదా ధర్మ సూత్రములను నాకు ఇష్టం వచ్చినట్టు అన్వయించుకోవడం కూడా ధర్మాచరణము కాదు.
ధర్మం గురించి రాస్తూ ధర్మ పరాయణుడైన రాముని తలచుకోకుండా ఎలా ఉంటాం. రామాయణం అంతా ధర్మాచరణమే దానిని ధర్మాయణం అనచ్చేమో. ఇక అంత స్థాయిలోనివారు హరిశ్చంద్రుడు, భీష్ముడు, ధర్మ రాజు, ఆది శంకరులు మొదలైనవారు. ధర్మం అనేమాట సనాతన ధర్మం లోనిదే దానికి ఇతర ఏ భాషలోనైనా పర్యాయ పదంలేదు. ఆంగ్లేయులేతత్సమాన పదం వారి భాషలోలేక వారు మాట్లాడేటప్పుడు వారి వాఙ్మయంలోనూ "Dharma" అనే వాడారు.
ఇక ధర్మాన్ని పట్టుకుంటే ఒరిగేది ఉత్తరదిశా ప్రయాణమే.. ధర్మాన్ని పట్టుకున్న రాముడు ఉత్తర దిశగా పుష్పకం ఎక్కి ధర్మాన్ని పట్టుకున్న వారినందరినీ పుష్పకం ఎక్కించుకున్నాడు, ఎంత మంది ఎక్కినా అందులో మరొకరికి స్థానం ఉంటుంది.ధర్మాన్ని పట్టుకుంటే రాముని పుష్పకంలో ఎక్కగలం ఉత్తర దిశా ప్రయాణం చేయగలం ఎవరూ భేదించలేని మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలం (అయోధ్య / కైలాసం). వదిలేస్తే రావణునితో కూడి దక్షిణాపథంలో ప్రయాణించి, పుట్టుక చావులమధ్య ఎంకా ఎన్నో దురవస్థలమధ్య తిరుగుతూనే ఉంటాం.
ధర్మో రక్షతి రక్షితః అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించటమే ధర్మ రక్షణం. గీతాచార్యుడు కూడా ఇదే అంటాడు. స్వధర్మమే శ్రేయస్కరం పరధర్మం భయంకరమైనది. బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మాన్ని పాటించాలి కాని గృహస్థు ధర్మాన్ని కాదు అలానేగృహస్థు గృహస్థధర్మాన్ని అలా......... రాజ ధర్మాన్ని రాజు, సేవక ధర్మాన్ని సేవకుడు అలా.... కాకుండా ఒకరి ధర్మాన్ని ఒకరు విస్మరించి ఇంకొకరి ధర్మాన్ని అనుసరిస్తే కలిగే పరిస్థితి అతి గందరగోళం ( ప్రస్తుతం ఉన్న స్థితి అదేనేమో)
--
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
ఏది అభ్యుదయ కారకమో ఏది మోక్ష సాధనమోలేదా మోక్షాన్ని సిద్ధింపజేయటంలో తోడ్పడుతుందో అదే ధర్మం.
అభ్యుదయం అంటే కేవల లౌకికం కాదు, నాకు లక్ష రూపాయలు వస్తున్నాయి కాబట్టి అది నాకు అభ్యుదయం అన్న వాదన అసంబద్ధం, అది మోక్ష కారకమైనదా అన్నది అవసరం. ధర్మం అంటే తెలుసుకొని ఆచరించేది.
మానవుడు లౌకిక పార లౌకిక వ్యాపారాలను నిర్వర్తించడానికి వేదం చెప్పిన త్రోవలే ధర్మాలు. ఆ ధర్మాచరణమే మోక్షానికి దైవ సాక్షాత్కారానికి మార్గం. ఒకే వ్యక్తికి ఒకే ధర్మం ఒకేలా అన్నివేళలా అన్ని దేశాలలో ఉంటుందన్నది సత్య దూరం.
.
నేను నా గురువుల దగ్గర ఉన్నప్పుడు నేను పాటించాల్సింది శిష్య ధర్మం. అలాగే నా తల్లిదండ్రుల దగ్గర పుత్రధర్మం, అదే సమయంలో నాపిల్లల దగ్గర నాది పితృధర్మం. ఏకాదశినాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు పారణ ( త్వరగా భుజించడం) ధర్మం. అదే ఏకాదశినాడు ఇక్కడ ఉంటే ఉపవాసం ధర్మం, కాశీలో ఉంటే అన్నపూర్ణ అనుగ్రహంగా ఉపవాసం ఉండకపోవడం ధర్మం. కొన్ని మాసాల్లో సముద్ర స్నానం నదీ స్నానం ధర్మం కొన్నిమాసాల్లో నిషిద్ధం. ఇలాగే చాలా మారుతూ ఉంటుంది.
అలాగే వర్ణాశ్రమాలలో కూడా, బ్రహ్మచారికి ఉన్న ధర్మం వేరు. అదేబ్రహ్మచారి వివాహం చేసుకుంటే పాటించాల్సిన గృహస్థ ధర్మాలు వేరు అలాగే సన్యాసికీ వానప్రస్తుకీ... ధర్మం మారడం అంటే ఒకే వ్యక్తికి దేశ కాల అవస్థ వర్ణ ఆశ్రమాదులని బట్టి మార్పుచెందుతుంది. అదే ఇద్దరు వ్యక్తులు ఒకే దేశ, కాల, ఆశ్రమ, వర్ణ, అవస్థాదులలో ఉంటేఇద్దరికీ ఒకే ధర్మం ఏ ఒక్కటి మారినా ధర్మం మారుతుంది.... స్థూలంగానో, సూక్ష్మంగానో....
ధర్మ శాస్త్రాల వాఖ్యానాలు చదివి గురువుల వద్ద నేర్చుకొని అనుష్టించడమే ఉత్తమం. అంతా కాకపోయినా కొంత మన ప్రస్తుత జీవన సరళికి కావల్సిన ధర్మ సూక్ష్మాలు తెలుసుకొని ఆచరించడం శ్రేయస్కరం, మోక్ష ప్రదం.
నాకు ధర్మం తెలుసు ఏది చేయాలో ఎలా చేయాలో తెలుసు కాని చేయను అంటే అది నా ధర్మమును నిర్వర్తించడము కాదు నేను ధర్మాత్ముడను కాను. లేదా ధర్మ సూత్రములను నాకు ఇష్టం వచ్చినట్టు అన్వయించుకోవడం కూడా ధర్మాచరణము కాదు.
ధర్మం గురించి రాస్తూ ధర్మ పరాయణుడైన రాముని తలచుకోకుండా ఎలా ఉంటాం. రామాయణం అంతా ధర్మాచరణమే దానిని ధర్మాయణం అనచ్చేమో. ఇక అంత స్థాయిలోనివారు హరిశ్చంద్రుడు, భీష్ముడు, ధర్మ రాజు, ఆది శంకరులు మొదలైనవారు. ధర్మం అనేమాట సనాతన ధర్మం లోనిదే దానికి ఇతర ఏ భాషలోనైనా పర్యాయ పదంలేదు. ఆంగ్లేయులేతత్సమాన పదం వారి భాషలోలేక వారు మాట్లాడేటప్పుడు వారి వాఙ్మయంలోనూ "Dharma" అనే వాడారు.
ఇక ధర్మాన్ని పట్టుకుంటే ఒరిగేది ఉత్తరదిశా ప్రయాణమే.. ధర్మాన్ని పట్టుకున్న రాముడు ఉత్తర దిశగా పుష్పకం ఎక్కి ధర్మాన్ని పట్టుకున్న వారినందరినీ పుష్పకం ఎక్కించుకున్నాడు, ఎంత మంది ఎక్కినా అందులో మరొకరికి స్థానం ఉంటుంది.ధర్మాన్ని పట్టుకుంటే రాముని పుష్పకంలో ఎక్కగలం ఉత్తర దిశా ప్రయాణం చేయగలం ఎవరూ భేదించలేని మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలం (అయోధ్య / కైలాసం). వదిలేస్తే రావణునితో కూడి దక్షిణాపథంలో ప్రయాణించి, పుట్టుక చావులమధ్య ఎంకా ఎన్నో దురవస్థలమధ్య తిరుగుతూనే ఉంటాం.
ధర్మో రక్షతి రక్షితః అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించటమే ధర్మ రక్షణం. గీతాచార్యుడు కూడా ఇదే అంటాడు. స్వధర్మమే శ్రేయస్కరం పరధర్మం భయంకరమైనది. బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మాన్ని పాటించాలి కాని గృహస్థు ధర్మాన్ని కాదు అలానేగృహస్థు గృహస్థధర్మాన్ని అలా......... రాజ ధర్మాన్ని రాజు, సేవక ధర్మాన్ని సేవకుడు అలా.... కాకుండా ఒకరి ధర్మాన్ని ఒకరు విస్మరించి ఇంకొకరి ధర్మాన్ని అనుసరిస్తే కలిగే పరిస్థితి అతి గందరగోళం ( ప్రస్తుతం ఉన్న స్థితి అదేనేమో)
--
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
నామాంకాలు (Labels)
ధార్మిక జీవన పద్ధతి
25, డిసెంబర్ 2010, శనివారం
ఏమిటీ అప్రస్తుత విమర్శ ? దీనివెనుకున్న కుట్రలేమిటి ?
పొద్దుట ఆరున్నర/ఆరూ ముప్పావుకి తొమ్మిదో టీవీ పెట్టాను. పూజలు, దీక్షల పేరిట భక్తులను దోచేస్తున్నారంటూ ఒక వార్తను ప్రసారం చేసాడు. బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో భవానీ దీక్షల పేరిట ఏటా నూటయాభై కోట్ల దాకా భక్తుల దగ్గర్నుండి నొల్లుకుంటున్నారంటూ ఒక వార్తా విశేషాన్ని ప్రసారం చేసాడు. అదేదో నిన్న జరిగిన సంఘటనా అంటే.., కాదు. మామూలు వార్తల్లో భాగం కాదది.. ఒక ప్రత్యేక వార్తా విశేషం! పది పదిహేను నిమిషాలు వచ్చినట్టుంది.
ఓ పక్క క్రిస్మస్ జరుపుకుంటూంటే మనమీద ఏమిటీ వ్యతిరేక వార్తలు అని నాకు అనిపించింది. నేనేమైనా నెగటివుగా ఆలోచిస్తున్నానా?
[ ఓమితృని ఆవేదన]
--------------------------------------------------------------
క్రిమస్ పేరిట ఇక్కడ కొన్ని బిలియన్ డాలర్ల వ్యాపారం నడుస్తుంది -
క్రిస్మస్ షాపింగ్. మన వెన్నెముక లేని జీవాలకు అవేకనిపిస్తాయ్. ఏంచేస్తాం
మన కర్మం.
[అమెరికా లో ఉన్న ఓ హిందువు ఆవేదన ]
------------------------------------------------------------
లేదండీ, మీరు సరిగానే ఆలోచిస్తున్నారు. ఇది ఒక పెద్ద దోపిడీ విధానం. ఆ కుట్రలో భాగమే ఈ వ్యతిరేక ప్రచారం
[విషయాలను గమనిస్తున్న ఓ సామాన్య హిందువు విశ్లేషణ]
------------------------------------------------------------
ఈమధ్య దసరా ఉత్సవాలలో కూడా మహిషుని పై మాయదారి ప్రేమకురిపిస్తూ భక్తులమనసులను చికాకు పరచేందుకు టీవీ 9 అనే దిక్కుమాలిన చానల్ లో ఒక చర్చ. అక్కడ స్వయం ప్రకటిత మేధావుల పీత మెదళ్లలోంచి వచ్చిన అద్భుత పాండిత్యం . ఇవన్నీ గమనిస్తుంటే మనమీద మనధర్మం మీద స్లోపాయిజన్ ప్రయోగం జరుగుతుందనిపించటం లేదూ !???
[మన మనసులో మాట]
ఓ పక్క క్రిస్మస్ జరుపుకుంటూంటే మనమీద ఏమిటీ వ్యతిరేక వార్తలు అని నాకు అనిపించింది. నేనేమైనా నెగటివుగా ఆలోచిస్తున్నానా?
[ ఓమితృని ఆవేదన]
--------------------------------------------------------------
క్రిమస్ పేరిట ఇక్కడ కొన్ని బిలియన్ డాలర్ల వ్యాపారం నడుస్తుంది -
క్రిస్మస్ షాపింగ్. మన వెన్నెముక లేని జీవాలకు అవేకనిపిస్తాయ్. ఏంచేస్తాం
మన కర్మం.
[అమెరికా లో ఉన్న ఓ హిందువు ఆవేదన ]
------------------------------------------------------------
లేదండీ, మీరు సరిగానే ఆలోచిస్తున్నారు. ఇది ఒక పెద్ద దోపిడీ విధానం. ఆ కుట్రలో భాగమే ఈ వ్యతిరేక ప్రచారం
[విషయాలను గమనిస్తున్న ఓ సామాన్య హిందువు విశ్లేషణ]
------------------------------------------------------------
ఈమధ్య దసరా ఉత్సవాలలో కూడా మహిషుని పై మాయదారి ప్రేమకురిపిస్తూ భక్తులమనసులను చికాకు పరచేందుకు టీవీ 9 అనే దిక్కుమాలిన చానల్ లో ఒక చర్చ. అక్కడ స్వయం ప్రకటిత మేధావుల పీత మెదళ్లలోంచి వచ్చిన అద్భుత పాండిత్యం . ఇవన్నీ గమనిస్తుంటే మనమీద మనధర్మం మీద స్లోపాయిజన్ ప్రయోగం జరుగుతుందనిపించటం లేదూ !???
[మన మనసులో మాట]
నామాంకాలు (Labels)
నాస్తికతాఖండన
13, డిసెంబర్ 2010, సోమవారం
ఆలయ రక్షణ భారం దేవుడిదే
ఆలయ రక్షణ భారం దేవుడిదే
ఆందోళన రేకెత్తిస్తున్న ఐ.ఎం. హెచ్చరికలు
చేతులు ఎత్తేస్తున్న పోలీసులు
--హైదరాబాద్ - న్యూస్టుడే
దేవాలయాల్లో విధ్వంసం రేపుతామని కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ బహిరంగంగా హెచ్చరించినప్పటికీ మన రాష్ట్రంలో మందిరాలకు కనీస రక్షణ కల్పించే పరిస్థితి కనిపించడంలేదు. ఉన్న సిబ్బందిని ఇతరత్రా తప్పనిసరి విధులకు వినియోగించాల్సి వస్తుండటంతో హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా దేవాలయాలకు అదనపు సిబ్బందిని కేటాయించలేకపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, కనకదుర్గ దేవాలయం వంటి పెద్దపెద్ద ప్రార్థనా మందిరాలు తమ ఖర్చుతో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్.పి.ఎఫ్.)ను నియమించుకొని తంటాలు పడుతున్నాయి. కాని మధ్య, చిన్నతరహా దేవాలయాలకు కనీస భద్రత కరవైంది. ఉగ్రవాద సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు వీటి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
అయోధ్య వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా గత మంగళవారం వారణాసిలోని దేవాలయంలో ఇండియన్ముజాహిద్దీన్ (ఐ.ఎం.) బాంబు పేలుళ్లకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. అనంతరం భారతీయ మందిరాల్లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిస్తు కొన్ని పత్రికా కార్యాలయాలకు ఐ.ఎం. ప్రతినిధులు ఈమెయిల్ సందేశం పంపారు. 2008 ఆగస్టు 25వ తేదీన హైదరాబాద్లోని గోకుల్చాట్, లుంబినీపార్కుల వద్ద జరిగిన పేలుళ్ళు ఈ సంస్థ పనే. ఐ.ఎం. వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్, సాంకేతిక నిపుణుడు పీర్భాయ్ మొదలు అనేక మంది ఐ.ఎం. కీలక సభ్యులు గతంలో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహించారు. జంట పేలుళ్ళకు ముందు కొన్ని నెలలపాటు ఇక్కడ తిష్ట వేశారు. గతంలో ఈ సంస్థ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి తాజా హెచ్చరికల నేపథ్యంలో అది మరోమారు విరుచుకుపడే అవకాశాలు తోసిపుచ్చలేం. పైగా మందిరాలను లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా ప్రకటించింది కాబట్టి ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలో చిన్నాచితకా అన్నీ కలిపి మొత్తం 37వేల దేవస్థానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 27వేల దేవాలయాలకు ఎలాంటి రక్షణా లేదు. ఇందులో నిత్యం వేలమంది దర్శించే దేవాలయాల సంఖ్య కనీసం 500 వరకూ ఉంటుంది. పర్వదినాల సమయంలో ఈ దేవాలయాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో వీటికి కనీస స్థాయి భద్రత అయినా కల్పించాల్సిఉంది. అయితే దేవాలయాలన్నింటకి భద్రత కల్పించడం తమవల్ల కాదని పోలీసులు చేతులు ఎత్తివేస్తున్నారు. రాష్ట్రంలో లక్షకుపైగా పోలీసు సిబ్బంది ఉండగా వీరిలో శాంతిభద్రతలు పర్యవేక్షించే పోలీసులకు దైనందిన విధులతోనే సరిపోతోంది. రిజర్వు బలగాల సంఖ్య దాదాపు 20వేల వరకూ ఉన్నా ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోవడంతో వీరంతా తీరికలేకుండా పనిచేస్తున్నారు. వారంతపు సెలవులు కూడా తీసుకోలేకపోతున్నామని వీరు వాపోతున్నారు. ఈ నెలాఖరుకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దానిపై పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచే బలగాలను సిద్దం చేస్తున్నారు. ఇప్పుడున్న పోలీసులను వారి విధుల నుంచి తప్పించి ఇతర పనులు అప్పగించడం సాధ్యమయ్యేలా లేదు. దాంతో ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో దేవాలయాల భద్రతపై ఆందోళణ నెలకొంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది.
-----------------------------------------------------------------
చారిత్రక కట్టడాలు మన గుళ్ళు. వేల సంవత్సరాల చరిత్ర. రాజకీయ లబ్దికోసం బలిపెడుతున్నారు. మన గుళ్ళను మనమే కాపాడుకునే సమయం ఆసన్నమైంది. వెన్నెముకలేని ప్రభుత్వాన్ని, రాజకీయాలకూ, డబ్బుకూ అమ్ముడుపోయిన న్యాయ చట్ట వ్యవస్థనీ నమ్ముకుంటే మన మూలాలే మిగిలేలా లేవు.
ఆందోళన రేకెత్తిస్తున్న ఐ.ఎం. హెచ్చరికలు
చేతులు ఎత్తేస్తున్న పోలీసులు
--హైదరాబాద్ - న్యూస్టుడే
దేవాలయాల్లో విధ్వంసం రేపుతామని కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ బహిరంగంగా హెచ్చరించినప్పటికీ మన రాష్ట్రంలో మందిరాలకు కనీస రక్షణ కల్పించే పరిస్థితి కనిపించడంలేదు. ఉన్న సిబ్బందిని ఇతరత్రా తప్పనిసరి విధులకు వినియోగించాల్సి వస్తుండటంతో హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా దేవాలయాలకు అదనపు సిబ్బందిని కేటాయించలేకపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, కనకదుర్గ దేవాలయం వంటి పెద్దపెద్ద ప్రార్థనా మందిరాలు తమ ఖర్చుతో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్.పి.ఎఫ్.)ను నియమించుకొని తంటాలు పడుతున్నాయి. కాని మధ్య, చిన్నతరహా దేవాలయాలకు కనీస భద్రత కరవైంది. ఉగ్రవాద సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు వీటి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
అయోధ్య వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా గత మంగళవారం వారణాసిలోని దేవాలయంలో ఇండియన్ముజాహిద్దీన్ (ఐ.ఎం.) బాంబు పేలుళ్లకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. అనంతరం భారతీయ మందిరాల్లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిస్తు కొన్ని పత్రికా కార్యాలయాలకు ఐ.ఎం. ప్రతినిధులు ఈమెయిల్ సందేశం పంపారు. 2008 ఆగస్టు 25వ తేదీన హైదరాబాద్లోని గోకుల్చాట్, లుంబినీపార్కుల వద్ద జరిగిన పేలుళ్ళు ఈ సంస్థ పనే. ఐ.ఎం. వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్, సాంకేతిక నిపుణుడు పీర్భాయ్ మొదలు అనేక మంది ఐ.ఎం. కీలక సభ్యులు గతంలో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహించారు. జంట పేలుళ్ళకు ముందు కొన్ని నెలలపాటు ఇక్కడ తిష్ట వేశారు. గతంలో ఈ సంస్థ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి తాజా హెచ్చరికల నేపథ్యంలో అది మరోమారు విరుచుకుపడే అవకాశాలు తోసిపుచ్చలేం. పైగా మందిరాలను లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా ప్రకటించింది కాబట్టి ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలో చిన్నాచితకా అన్నీ కలిపి మొత్తం 37వేల దేవస్థానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 27వేల దేవాలయాలకు ఎలాంటి రక్షణా లేదు. ఇందులో నిత్యం వేలమంది దర్శించే దేవాలయాల సంఖ్య కనీసం 500 వరకూ ఉంటుంది. పర్వదినాల సమయంలో ఈ దేవాలయాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో వీటికి కనీస స్థాయి భద్రత అయినా కల్పించాల్సిఉంది. అయితే దేవాలయాలన్నింటకి భద్రత కల్పించడం తమవల్ల కాదని పోలీసులు చేతులు ఎత్తివేస్తున్నారు. రాష్ట్రంలో లక్షకుపైగా పోలీసు సిబ్బంది ఉండగా వీరిలో శాంతిభద్రతలు పర్యవేక్షించే పోలీసులకు దైనందిన విధులతోనే సరిపోతోంది. రిజర్వు బలగాల సంఖ్య దాదాపు 20వేల వరకూ ఉన్నా ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోవడంతో వీరంతా తీరికలేకుండా పనిచేస్తున్నారు. వారంతపు సెలవులు కూడా తీసుకోలేకపోతున్నామని వీరు వాపోతున్నారు. ఈ నెలాఖరుకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దానిపై పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచే బలగాలను సిద్దం చేస్తున్నారు. ఇప్పుడున్న పోలీసులను వారి విధుల నుంచి తప్పించి ఇతర పనులు అప్పగించడం సాధ్యమయ్యేలా లేదు. దాంతో ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో దేవాలయాల భద్రతపై ఆందోళణ నెలకొంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది.
-----------------------------------------------------------------
చారిత్రక కట్టడాలు మన గుళ్ళు. వేల సంవత్సరాల చరిత్ర. రాజకీయ లబ్దికోసం బలిపెడుతున్నారు. మన గుళ్ళను మనమే కాపాడుకునే సమయం ఆసన్నమైంది. వెన్నెముకలేని ప్రభుత్వాన్ని, రాజకీయాలకూ, డబ్బుకూ అమ్ముడుపోయిన న్యాయ చట్ట వ్యవస్థనీ నమ్ముకుంటే మన మూలాలే మిగిలేలా లేవు.
నామాంకాలు (Labels)
హిందూ సమాజం
8, డిసెంబర్ 2010, బుధవారం
కాశిలో గంగా హారతి సమయంలో పేలుడు [పరమేశ్వరా !ఇక నీవే దిక్కు]
కాశిలో గంగా హారతి సమయంలో పేలుడు
లక్నో: కాశీలో ఈరోజు సాయంత్రం గంగాహారతి సమయంలో పేలుడు సంభవించింది. ఇక్కడి దశ అశ్వమేథ ఘాట్లో మంగళవారం గంగానదికి సాంప్రదాయకంగా మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. శివుడు, మహాకాళేశ్వరుని ఆలయాలకు సమీపంలో ఈ ఘాట్ ఉంది. హారతిని వీక్షించేందుకు వందలమంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. హారతి కార్యక్రమం జరుగుతుండగా పేలుడు సంభవించటంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ విదేశీయుడు మృతి చెందగా 20 మంది వరకు గాయపడ్డారు. నదిలో పడవలో ఉండి చూస్తున్న భక్తులకూ శకలాలు తగిలాయి. రెండు కిలోమీటర్ల దూరం వరకు పేలుళ్లు వినిపించాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం వారణాశి జిల్లా ఆసుపత్రికి తరలించారు.గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇంత గోల దేనికి, కాశీ విశ్వనాథ ఆలయం తాళాంచేతులు వీళ్ళకే ఇచ్చి, అబ్బాయిలూ కూలగొట్టండీ అంటే సరిపోతుందిగా. గోల వదిలిపోతుంది.
ప్రశ్న :- ఇలా ఎంతకాలం?
పేలుడు మా పనే: ఇండియన్ ముజాహిదీన్
లక్నో: కాశీలో పేలుడుకు పాల్పడింది తమ సంస్థేనని ఇండియన్ ముజాహిద్ ప్రకటించింది. దీంతో విదేశీయుల లక్ష్యంగానే వారు ఈ పనికి పాల్పడి ఉంటారని కేంద్ర హోం శాఖ నిర్ధారణకు వచ్చింది. పేలుడు శబ్ధాలు రెండు కిలో మీటర్ల దూరం వరకు వినిపించడంతో చాలా శక్తివంతమైనవే ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. వరుసపేలుళ్లకు వారు కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్లలో కూడా కేంద్ర హోం శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
హోం శాఖ ఏం నిర్థారణకు వస్తే మనకేంటి? అవ్వాల్సిన పని అయ్యాక, రెడ్ ఎలర్టులు ప్రకటించి ప్రయోజనం ఏంటీ? వీళ్ళు అంతలోపలిదాకా వెళ్ళి బాంబులు పెట్టగల్గుతున్నారంటే, ఏంటో, నోటమాట రావట్లా.
ఇంకెన్ని ఘోరాలు జరగబోటున్నాయో ఏంటో.
నేనూ వెళ్ళాను రెండు సార్లు ఈ హారతిని చూట్టానికి. అత్భుతంగా ఉంటుంది మహా హారతి. పరమేశ్వరా ! నీ ఇంటిని ఇక నువ్వే కాపాడుకోవాలయ్యా !
లక్నో: కాశీలో ఈరోజు సాయంత్రం గంగాహారతి సమయంలో పేలుడు సంభవించింది. ఇక్కడి దశ అశ్వమేథ ఘాట్లో మంగళవారం గంగానదికి సాంప్రదాయకంగా మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. శివుడు, మహాకాళేశ్వరుని ఆలయాలకు సమీపంలో ఈ ఘాట్ ఉంది. హారతిని వీక్షించేందుకు వందలమంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. హారతి కార్యక్రమం జరుగుతుండగా పేలుడు సంభవించటంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ విదేశీయుడు మృతి చెందగా 20 మంది వరకు గాయపడ్డారు. నదిలో పడవలో ఉండి చూస్తున్న భక్తులకూ శకలాలు తగిలాయి. రెండు కిలోమీటర్ల దూరం వరకు పేలుళ్లు వినిపించాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం వారణాశి జిల్లా ఆసుపత్రికి తరలించారు.గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇంత గోల దేనికి, కాశీ విశ్వనాథ ఆలయం తాళాంచేతులు వీళ్ళకే ఇచ్చి, అబ్బాయిలూ కూలగొట్టండీ అంటే సరిపోతుందిగా. గోల వదిలిపోతుంది.
ప్రశ్న :- ఇలా ఎంతకాలం?
పేలుడు మా పనే: ఇండియన్ ముజాహిదీన్
లక్నో: కాశీలో పేలుడుకు పాల్పడింది తమ సంస్థేనని ఇండియన్ ముజాహిద్ ప్రకటించింది. దీంతో విదేశీయుల లక్ష్యంగానే వారు ఈ పనికి పాల్పడి ఉంటారని కేంద్ర హోం శాఖ నిర్ధారణకు వచ్చింది. పేలుడు శబ్ధాలు రెండు కిలో మీటర్ల దూరం వరకు వినిపించడంతో చాలా శక్తివంతమైనవే ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. వరుసపేలుళ్లకు వారు కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్లలో కూడా కేంద్ర హోం శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
హోం శాఖ ఏం నిర్థారణకు వస్తే మనకేంటి? అవ్వాల్సిన పని అయ్యాక, రెడ్ ఎలర్టులు ప్రకటించి ప్రయోజనం ఏంటీ? వీళ్ళు అంతలోపలిదాకా వెళ్ళి బాంబులు పెట్టగల్గుతున్నారంటే, ఏంటో, నోటమాట రావట్లా.
ఇంకెన్ని ఘోరాలు జరగబోటున్నాయో ఏంటో.
నేనూ వెళ్ళాను రెండు సార్లు ఈ హారతిని చూట్టానికి. అత్భుతంగా ఉంటుంది మహా హారతి. పరమేశ్వరా ! నీ ఇంటిని ఇక నువ్వే కాపాడుకోవాలయ్యా !
నామాంకాలు (Labels)
హిందూ సమాజం
7, డిసెంబర్ 2010, మంగళవారం
మాస శివరాత్రి అంటే ఏమిటి ? : ఒక చర్చ
ప్రశ్న :
సభాయై నమః
మున్ముందుగా మాస శివరాత్రి సాధారణంగా ఏరోజు జరుపుకుంటారో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు చతుర్దసి తరువాత వచ్చే అమావాస్య అని అనుకుంటున్నాను. తెలిసిన వారు సరిదిద్ద గలరు.
తరువాత విషయంగా శివరాత్రిని మాసానికి ఒకసారి చేసుకోవడం వెనకాల విశేషమేమిటో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వచ్చేదే అని. ఇలా మాసమునకు ఒకసారి శివరాత్రి చేసుకోవడం వెనకాల ఉన్న ప్రాశస్త్యం తెలిసిన వారు వివరించ మనవి.
--భవదీయుడు
_______________________________________
సమాధానము
నమస్తే!
ముందుగా ఈ శివరాత్రులు సంవత్సరానికొకసారో నెలకొకసారో కాక ప్రతి రాత్రి శివరాత్రిగానే భావించే సాంప్రదాయముంది. ఉదయాన్నే లేచి (శ్రీ హరి అని మూడుసార్లు తలచి లేవాలి ఎందుకంటే నిద్రలేచినది మొదలు నిద్ర కుపక్రమించేవరకు(జాగ్రదావస్థకు) ఉన్న కాలమునకు విష్ణువే అధిపతి ఆయన అనుగ్రహముతో ఆ రోజు కార్యములన్నీ శుభప్రదంగా జరగడాని కొరకు, మీరు చేసే మొదటి సంకల్పమే బ్రహ్మతత్వమైన సృష్టికి గుర్తు). నిత్య కర్మానుష్టనములు చేసుకొని శివలింగము నారాధించి, తను చేసే ప్రతి పనిలో ప్రతి ఒక్కరిలో శివును చూస్తూ సాత్వికాహార బద్ధుడై తిరిగి సాయంత్రం శివారాధన చేసి నివేదన చేయబడిన పదార్థములను ప్రసాద బుద్ధితో తీసుకొని రాత్రి నిద్రకు ఉపక్రమించడం. ఈ నిద్రనే శివుని స్వల్పకాలిక లయం అంటారు. ఈ నిద్రను పొందటను గమనిస్తూ శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోవాలని శాస్త్ర వచనం / పెద్దల వచనం . ఇలా రోజూ త్రిమూర్తులను తన అవస్థలలో గుర్తిస్తూ సాధన ద్వారా జ్ఞానం వేపుకి అడుగులేయడం. ప్రతి రోజు శివరాత్రి.
ఇక త్రయోదశి తిథి పరమ శివుని తిథిగా శాస్త్రాలు పెద్దలు గుర్తించారు. శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడుకుని ఉన్న చతుర్థశిని శుక్లపక్ష శివరాత్రి అని పిలుస్తూ ఉంటారు ఇది సంపూర్ణ జ్ఙానం వైపు వెళ్ళేసాధకునికి గుర్తు (చాలా వరకు శుక్ల పక్ష శివరాత్రిని ఉపాసన చేయడమన్నది ఈమధ్య కాలంలో కనబడడంలేదు, దీనికి తగిన ఆఖ్యానాలు కూడా ప్రచారంలో లేవు. ఉన్నవేమో తెలీదు.) ఇక కృష్ణ పక్షంలో త్రయోదశి తిథిని కూడిన చతుర్దశీ తిథిని మాస శివరాత్రి అని పిలుస్తారు అదే కృష్ణ పక్ష శివరాత్రి. ఒక రోజులో అసుర సంధ్య వేళ కేవలం శివ పూజకు ఎంత విశిష్టమో అలా ఒక నెలలో మాస శివరాత్రి అటువంటిది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం పరిపాటి. ఆరాధనలో ఎటువంటి తేడాలేదు. ఐతే రోజూ చేసే ఉపాసనకన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత అధికం.
అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహా శివరాత్రి అని నిర్ధారించారు. ఆరోజే రాత్రే శివలింగము ఆవిర్భవించిందని శాస్త్ర వాక్కు. ఆనాడు పగలంతా శివ పూజలతో, శివ కథా కాలక్షేపములతో సాత్విక ఆహారము లేదా ఉపవాసము (ఉపవాసమంటే లంఖణం కాదు ఉప= దగ్గర, వాసము= ఉండుట, భగవంతునికి దగ్గరగా ఉండుట. వీలైనంత తక్కువైన ఆహారము సాత్వికమైనది తీసుకొని భగవంతుని గుణములను కొలుస్తూ, స్తోత్ర పాఠాలను చేస్తూ, ఆ లీలా మూర్తి అనుగ్రహాలను తలచుకొంటూ భగవత్కార్యక్రమాలలో పాల్గొనుట).
శివలింగం అర్థ రాత్రి ఆవిర్భవించడం అంటే ఏదో ఒక రాయిలానో శిల గానో ఆవిర్భవించటం అని కాదు. మాఘ మాసం వచ్చేసరికి, (ఆషాడ మాసంనుంచి వర్షాలవల్ల లోకంలో సృష్టి ప్రతి సృష్టి జరిగుతుంది. భౌతికంగా అన్ని జీవాలు అంధకారంలోఉంటాయి, సరిగ్గా కనపడదు అందునా మాఘ మాసం చతుర్దశి అర్థ రాత్రి అమావాస్య ఘడియలలో లేదా అమావాస్య వస్తుందనగా ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో శివుడు ఆవిర్భవించాడు అదే అజ్ఙానరూపంలో ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో ఆవిర్భవించాడు. అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తమైనాడు. ఆరోజు రాత్రి జాగరణ చేసి లింగావిర్భావ సమయమున ఒక జ్యోతి (దీపమును లేదా కర్పూర దీపమునుగాని) గాని ఈ క్రింది శ్లోకము చదువుతూ చూడవలెను అప్పుడు శివరాత్రి వ్రత పూర్ణ ఫలము.
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః , జలేస్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం నీచజన్మభాగినః , భవన్తి త్వం శ్వపచా హి విప్రాః ||
మన సనాతన ధర్మ గొప్పదనమెంతో చూడండి. ఈ శ్లోకం చదివి, ఆ దీపాన్ని వెలిగించిన యజమానే కాక, దానిని చూస్తున్న వారందరే కాక, కీటకములు, పక్షులు, దోమలు, చెట్లు, జల నివాసములు, ఏ ఏ జీవములు ఆ దీపమును చూచుచున్నవో లేదా ఏ ఏ జీవములపై ఆ దీపపు కాంతి పడుతున్నదో అవన్నీ ఉద్ధరణ పొందవలెను అని ఆ యజమాని భావన చేయాలి. దీనితోనే ఆ శివరాత్రి వ్రతం సంపూర్ణం. (ఇదే శ్లోకం కార్తీక పౌర్ణమి దీపాన్ని చూస్తూ కూడా చెప్పవలెను)
ఈ విషయాన్ని మీకు తెలిసినవారందరకీ తెల్పండి. [పూర్తిగా శివరాత్రి, కార్తీక పౌర్ణమి వ్రతాలు చేయకపోయినా (ఏ అస్వస్తత వల్లనో) అ నాటి రాత్రి జ్యోతి స్వరూపుడైన శివుని దీపము లో చూస్తూ ఈ శ్లోకం చెప్పినా చాలు అని పెద్దలెవరో చెప్పగా విన్నట్లు గుర్తు ]
ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి, స్వయంగా ఆ పరమేశ్వరుడే మన అజ్ఙానపు చీకట్లను తొలగించడానికి జ్యోతీరూప శివలింగంగా ఆవిర్భవించిన రోజు కాబట్టీ, ప్రతి రోజూ అంత గొప్పగా ఉపాసన చేయడం అందరికీ సాధ్యం కాబట్టీ, కనీసం ప్రతి సంవత్సరం మహా శివరాత్రైనా జరుపుకోవాలని(జన్మానికో శివరాత్రి అని నానుడి) పెద్దలు నిశ్చయం చేశారు.
మీ ప్రశ్నకు పూర్తిగా సమాధానము చెప్పకపోయి ఉండవచ్చు. నాకు తెలిసినంత మేరకు మాత్రమే చెప్పాను కాని అంతా చెప్పినట్లు కాదు. ఇంకా విజ్ఙులైన పెద్దలు మరికొన్ని విశేష విషయములేమన్నా ఉన్నవేమో తెల్పండి, తప్పులేమైనాఉంటే సరిదిద్ధండి.
సూర్యనాగేంద్రకుమార్ అయ్యగారి
సభాయై నమః
మున్ముందుగా మాస శివరాత్రి సాధారణంగా ఏరోజు జరుపుకుంటారో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు చతుర్దసి తరువాత వచ్చే అమావాస్య అని అనుకుంటున్నాను. తెలిసిన వారు సరిదిద్ద గలరు.
తరువాత విషయంగా శివరాత్రిని మాసానికి ఒకసారి చేసుకోవడం వెనకాల విశేషమేమిటో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వచ్చేదే అని. ఇలా మాసమునకు ఒకసారి శివరాత్రి చేసుకోవడం వెనకాల ఉన్న ప్రాశస్త్యం తెలిసిన వారు వివరించ మనవి.
--భవదీయుడు
_______________________________________
సమాధానము
నమస్తే!
ముందుగా ఈ శివరాత్రులు సంవత్సరానికొకసారో నెలకొకసారో కాక ప్రతి రాత్రి శివరాత్రిగానే భావించే సాంప్రదాయముంది. ఉదయాన్నే లేచి (శ్రీ హరి అని మూడుసార్లు తలచి లేవాలి ఎందుకంటే నిద్రలేచినది మొదలు నిద్ర కుపక్రమించేవరకు(జాగ్రదావస్థకు) ఉన్న కాలమునకు విష్ణువే అధిపతి ఆయన అనుగ్రహముతో ఆ రోజు కార్యములన్నీ శుభప్రదంగా జరగడాని కొరకు, మీరు చేసే మొదటి సంకల్పమే బ్రహ్మతత్వమైన సృష్టికి గుర్తు). నిత్య కర్మానుష్టనములు చేసుకొని శివలింగము నారాధించి, తను చేసే ప్రతి పనిలో ప్రతి ఒక్కరిలో శివును చూస్తూ సాత్వికాహార బద్ధుడై తిరిగి సాయంత్రం శివారాధన చేసి నివేదన చేయబడిన పదార్థములను ప్రసాద బుద్ధితో తీసుకొని రాత్రి నిద్రకు ఉపక్రమించడం. ఈ నిద్రనే శివుని స్వల్పకాలిక లయం అంటారు. ఈ నిద్రను పొందటను గమనిస్తూ శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోవాలని శాస్త్ర వచనం / పెద్దల వచనం . ఇలా రోజూ త్రిమూర్తులను తన అవస్థలలో గుర్తిస్తూ సాధన ద్వారా జ్ఞానం వేపుకి అడుగులేయడం. ప్రతి రోజు శివరాత్రి.
ఇక త్రయోదశి తిథి పరమ శివుని తిథిగా శాస్త్రాలు పెద్దలు గుర్తించారు. శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడుకుని ఉన్న చతుర్థశిని శుక్లపక్ష శివరాత్రి అని పిలుస్తూ ఉంటారు ఇది సంపూర్ణ జ్ఙానం వైపు వెళ్ళేసాధకునికి గుర్తు (చాలా వరకు శుక్ల పక్ష శివరాత్రిని ఉపాసన చేయడమన్నది ఈమధ్య కాలంలో కనబడడంలేదు, దీనికి తగిన ఆఖ్యానాలు కూడా ప్రచారంలో లేవు. ఉన్నవేమో తెలీదు.) ఇక కృష్ణ పక్షంలో త్రయోదశి తిథిని కూడిన చతుర్దశీ తిథిని మాస శివరాత్రి అని పిలుస్తారు అదే కృష్ణ పక్ష శివరాత్రి. ఒక రోజులో అసుర సంధ్య వేళ కేవలం శివ పూజకు ఎంత విశిష్టమో అలా ఒక నెలలో మాస శివరాత్రి అటువంటిది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం పరిపాటి. ఆరాధనలో ఎటువంటి తేడాలేదు. ఐతే రోజూ చేసే ఉపాసనకన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత అధికం.
అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహా శివరాత్రి అని నిర్ధారించారు. ఆరోజే రాత్రే శివలింగము ఆవిర్భవించిందని శాస్త్ర వాక్కు. ఆనాడు పగలంతా శివ పూజలతో, శివ కథా కాలక్షేపములతో సాత్విక ఆహారము లేదా ఉపవాసము (ఉపవాసమంటే లంఖణం కాదు ఉప= దగ్గర, వాసము= ఉండుట, భగవంతునికి దగ్గరగా ఉండుట. వీలైనంత తక్కువైన ఆహారము సాత్వికమైనది తీసుకొని భగవంతుని గుణములను కొలుస్తూ, స్తోత్ర పాఠాలను చేస్తూ, ఆ లీలా మూర్తి అనుగ్రహాలను తలచుకొంటూ భగవత్కార్యక్రమాలలో పాల్గొనుట).
శివలింగం అర్థ రాత్రి ఆవిర్భవించడం అంటే ఏదో ఒక రాయిలానో శిల గానో ఆవిర్భవించటం అని కాదు. మాఘ మాసం వచ్చేసరికి, (ఆషాడ మాసంనుంచి వర్షాలవల్ల లోకంలో సృష్టి ప్రతి సృష్టి జరిగుతుంది. భౌతికంగా అన్ని జీవాలు అంధకారంలోఉంటాయి, సరిగ్గా కనపడదు అందునా మాఘ మాసం చతుర్దశి అర్థ రాత్రి అమావాస్య ఘడియలలో లేదా అమావాస్య వస్తుందనగా ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో శివుడు ఆవిర్భవించాడు అదే అజ్ఙానరూపంలో ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో ఆవిర్భవించాడు. అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తమైనాడు. ఆరోజు రాత్రి జాగరణ చేసి లింగావిర్భావ సమయమున ఒక జ్యోతి (దీపమును లేదా కర్పూర దీపమునుగాని) గాని ఈ క్రింది శ్లోకము చదువుతూ చూడవలెను అప్పుడు శివరాత్రి వ్రత పూర్ణ ఫలము.
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః , జలేస్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం నీచజన్మభాగినః , భవన్తి త్వం శ్వపచా హి విప్రాః ||
మన సనాతన ధర్మ గొప్పదనమెంతో చూడండి. ఈ శ్లోకం చదివి, ఆ దీపాన్ని వెలిగించిన యజమానే కాక, దానిని చూస్తున్న వారందరే కాక, కీటకములు, పక్షులు, దోమలు, చెట్లు, జల నివాసములు, ఏ ఏ జీవములు ఆ దీపమును చూచుచున్నవో లేదా ఏ ఏ జీవములపై ఆ దీపపు కాంతి పడుతున్నదో అవన్నీ ఉద్ధరణ పొందవలెను అని ఆ యజమాని భావన చేయాలి. దీనితోనే ఆ శివరాత్రి వ్రతం సంపూర్ణం. (ఇదే శ్లోకం కార్తీక పౌర్ణమి దీపాన్ని చూస్తూ కూడా చెప్పవలెను)
ఈ విషయాన్ని మీకు తెలిసినవారందరకీ తెల్పండి. [పూర్తిగా శివరాత్రి, కార్తీక పౌర్ణమి వ్రతాలు చేయకపోయినా (ఏ అస్వస్తత వల్లనో) అ నాటి రాత్రి జ్యోతి స్వరూపుడైన శివుని దీపము లో చూస్తూ ఈ శ్లోకం చెప్పినా చాలు అని పెద్దలెవరో చెప్పగా విన్నట్లు గుర్తు ]
ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి, స్వయంగా ఆ పరమేశ్వరుడే మన అజ్ఙానపు చీకట్లను తొలగించడానికి జ్యోతీరూప శివలింగంగా ఆవిర్భవించిన రోజు కాబట్టీ, ప్రతి రోజూ అంత గొప్పగా ఉపాసన చేయడం అందరికీ సాధ్యం కాబట్టీ, కనీసం ప్రతి సంవత్సరం మహా శివరాత్రైనా జరుపుకోవాలని(జన్మానికో శివరాత్రి అని నానుడి) పెద్దలు నిశ్చయం చేశారు.
మీ ప్రశ్నకు పూర్తిగా సమాధానము చెప్పకపోయి ఉండవచ్చు. నాకు తెలిసినంత మేరకు మాత్రమే చెప్పాను కాని అంతా చెప్పినట్లు కాదు. ఇంకా విజ్ఙులైన పెద్దలు మరికొన్ని విశేష విషయములేమన్నా ఉన్నవేమో తెల్పండి, తప్పులేమైనాఉంటే సరిదిద్ధండి.
సూర్యనాగేంద్రకుమార్ అయ్యగారి
నామాంకాలు (Labels)
ప్రశ్న - సమాధానం,
హిందూ అనుష్ఠాన వేదాంతము
5, డిసెంబర్ 2010, ఆదివారం
ఉపాసనామార్గాలన్నీ భగవత్ ప్రసాదితాలే సుమా !
ఒక పిల్లవాడికి "అమ్మా ! నాన్నా !" అనే పిలుపులు ఎవఱు నేర్పుతారు ? తల్లిదండ్రులే కదా. ఆ బిడ్డడికీ, తమకూ మధ్య ఉన్న వావి (సంబంధం) తెలిసినవారు వారు. ఆ పిలుపుల ద్వారా ఆ సంబంధాన్ని వారు ఆ పిల్లవాడికి తెలియజెబుతారు. అదే విధంగా "భగవాన్, దేవుడు, దైవం" అనే ఈ మాటలు కూడా మనకు నేర్పినది బహుశా భగవంతుడే సాక్షాత్తు ! లేకపోతే భగవద్ భావనని కల్పించుకునే పాటి తెలివి ఎక్కడిది మనిషికి ? ఊరికే అవిశ్వాసులు ఊదరగొట్టడం తప్ప ! ఊహించుకోవడానికీ, కల గనడానికీ సహితం ఒక ఆధారం కావాలి. ఉదాహరణకు - తాను చనిపోయినట్లు కల గనజాలినవాళ్ళెవఱున్నారు ? ఆ అనుభవాన్ని ఊహించుకోవడానికి మానవ మనస్సుకు ఏ జాడా దొఱకదు గదా !
ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ కథామృతంలోని ఒక సంభాషణ నా స్మృతిపథంలో మెదుల్తున్నది. ఆ పుస్తక రచయిత శ్రీ గుప్తా శ్రీరామకృష్ణులకు సమకాలికులూ, శిష్యులున్ను. శ్రీ పరమహంసగారితో తన ప్రథమ సమావేశాన్ని "మణి" అనే మారుపేరు పెట్టుకొని అక్షరబద్ధం కావించారు. అప్పటిదాకా ఆయన బ్రహ్మసమాజ మతస్థుడుగా ఉన్నారు. అందుకని ఆ సమయానికి క్షవరం చేయించుకుంటున్న శ్రీ పరమహంసగారి దగ్గఱ కూర్చుని "మట్టి, చెక్క, ఱాయి ఇలాంటి పదార్థాలతో చేసిన విగ్రహాల్ని పూజించడం పొఱపాటు కదండీ ! అవి దేవుడు కాదు గదా ! అది తప్పు అని సామాన్యప్రజలకు తెలియకపోతే మనం వెళ్ళి చెప్పాలి కదండీ !" అన్నారు. అందుకు శ్రీ పరమహంస నవ్వి "విగ్రహం అని ఎవఱు చెప్పారోయ్ ! చిన్మయప్రతిమ !" అన్నారు. మణికి చిన్మయప్రతిమ కాన్సెప్టు అర్థం కాలేదు. అప్పుడు పరమహంస "ఒకటి తప్పు, అని, ఇంకొకటి ఒప్పు అని నీకెలా తెలుసు ? నువ్వేమైనా దేవుణ్ణి చూశావా ?" అని అడిగారు. తాను గొప్ప ఇంగ్లీషు విద్యావంతుణ్ణి అనే అహంకారం ఉండేది మణికి.శ్రీ పరమహంస వేసిన ఈ ఒక్క ప్రశ్నతో అతని అహంకారం అధః పాతాళానికి క్రుంగిపోయింది. బడికే వెళ్ళని శ్రీ పరమహంసకు పాదాక్రాంతుడయ్యాడా కలకత్తా బాబు. అప్పుడు శ్రీ పరమహంస అతనికిలా వివరించారు "ఒక మార్గం తప్పు అనీ, ఇంకొక మార్గం ఒప్పు అనీ మనం ఎలా చెబుతాం ? భగవంతుడే ఆయా మానవుల పరిపక్వతను బట్టి వివిధ ఆరాధనా పద్ధతుల్ని సృష్టించి (ఉపదేశించి) ఉన్నాడు"
ఆయనే మఱో సందర్భంలో మాట్లాడుతూ "ఒక తల్లి తన సంతానంలో ఒక్కొక్కఱి వయస్సు, ఆరోగ్యాన్నీ బట్టి ఒక్కొక్క రకంగా అన్నం పెట్టినట్లే భగవంతుడు కూడా ఆయా మానవజాతుల స్థాయిని బట్టి వివిధ మతాల్ని కల్పించి ఉన్నాడు." అని అనుగ్రహభాషణ చేశారు.
మనం చదివే విష్ణుసహస్రనామాలూ, రుద్రం, దేవీసప్తశతి ఇవన్నీ ఋషుల ద్వారా భగవంతుడు మనపై ప్రేమతో అనుగ్రహించినటువంటివి. మఱో రకంగా చేస్తే ఫలితం తక్కువ. పైగా అలాంటి అనధికృత స్వతంత్రత (unauthorized liberty) నిషిద్ధ పాషండ మతం అనిపించుకుంటుంది. ఉపాసనా పద్ధతుల్ని బ్రాహ్మణులు గానీ, లేదా వారిలాంటి మఱో మానవ ఏజన్సీ గానీ సృష్టించలేదనేది, అవి నేరు (direct) గా భగవదాదేశమనీ నాక్కూడా అనుభవమే. చాలా కాలం క్రితం నేనొకసారి శివుడిమీద వేఱే విధంగా నామాలు కల్పించి వ్రాయగా ఆయన స్వప్నదర్శనమిచ్చి నాపై కోపించి వాటిని ధ్వంసం చేయమని సూచించారు.
ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ కథామృతంలోని ఒక సంభాషణ నా స్మృతిపథంలో మెదుల్తున్నది. ఆ పుస్తక రచయిత శ్రీ గుప్తా శ్రీరామకృష్ణులకు సమకాలికులూ, శిష్యులున్ను. శ్రీ పరమహంసగారితో తన ప్రథమ సమావేశాన్ని "మణి" అనే మారుపేరు పెట్టుకొని అక్షరబద్ధం కావించారు. అప్పటిదాకా ఆయన బ్రహ్మసమాజ మతస్థుడుగా ఉన్నారు. అందుకని ఆ సమయానికి క్షవరం చేయించుకుంటున్న శ్రీ పరమహంసగారి దగ్గఱ కూర్చుని "మట్టి, చెక్క, ఱాయి ఇలాంటి పదార్థాలతో చేసిన విగ్రహాల్ని పూజించడం పొఱపాటు కదండీ ! అవి దేవుడు కాదు గదా ! అది తప్పు అని సామాన్యప్రజలకు తెలియకపోతే మనం వెళ్ళి చెప్పాలి కదండీ !" అన్నారు. అందుకు శ్రీ పరమహంస నవ్వి "విగ్రహం అని ఎవఱు చెప్పారోయ్ ! చిన్మయప్రతిమ !" అన్నారు. మణికి చిన్మయప్రతిమ కాన్సెప్టు అర్థం కాలేదు. అప్పుడు పరమహంస "ఒకటి తప్పు, అని, ఇంకొకటి ఒప్పు అని నీకెలా తెలుసు ? నువ్వేమైనా దేవుణ్ణి చూశావా ?" అని అడిగారు. తాను గొప్ప ఇంగ్లీషు విద్యావంతుణ్ణి అనే అహంకారం ఉండేది మణికి.శ్రీ పరమహంస వేసిన ఈ ఒక్క ప్రశ్నతో అతని అహంకారం అధః పాతాళానికి క్రుంగిపోయింది. బడికే వెళ్ళని శ్రీ పరమహంసకు పాదాక్రాంతుడయ్యాడా కలకత్తా బాబు. అప్పుడు శ్రీ పరమహంస అతనికిలా వివరించారు "ఒక మార్గం తప్పు అనీ, ఇంకొక మార్గం ఒప్పు అనీ మనం ఎలా చెబుతాం ? భగవంతుడే ఆయా మానవుల పరిపక్వతను బట్టి వివిధ ఆరాధనా పద్ధతుల్ని సృష్టించి (ఉపదేశించి) ఉన్నాడు"
ఆయనే మఱో సందర్భంలో మాట్లాడుతూ "ఒక తల్లి తన సంతానంలో ఒక్కొక్కఱి వయస్సు, ఆరోగ్యాన్నీ బట్టి ఒక్కొక్క రకంగా అన్నం పెట్టినట్లే భగవంతుడు కూడా ఆయా మానవజాతుల స్థాయిని బట్టి వివిధ మతాల్ని కల్పించి ఉన్నాడు." అని అనుగ్రహభాషణ చేశారు.
మనం చదివే విష్ణుసహస్రనామాలూ, రుద్రం, దేవీసప్తశతి ఇవన్నీ ఋషుల ద్వారా భగవంతుడు మనపై ప్రేమతో అనుగ్రహించినటువంటివి. మఱో రకంగా చేస్తే ఫలితం తక్కువ. పైగా అలాంటి అనధికృత స్వతంత్రత (unauthorized liberty) నిషిద్ధ పాషండ మతం అనిపించుకుంటుంది. ఉపాసనా పద్ధతుల్ని బ్రాహ్మణులు గానీ, లేదా వారిలాంటి మఱో మానవ ఏజన్సీ గానీ సృష్టించలేదనేది, అవి నేరు (direct) గా భగవదాదేశమనీ నాక్కూడా అనుభవమే. చాలా కాలం క్రితం నేనొకసారి శివుడిమీద వేఱే విధంగా నామాలు కల్పించి వ్రాయగా ఆయన స్వప్నదర్శనమిచ్చి నాపై కోపించి వాటిని ధ్వంసం చేయమని సూచించారు.
నామాంకాలు (Labels)
హిందూవేదాంతము
23, అక్టోబర్ 2010, శనివారం
సౌందర్యచిట్కాలు (Beauty Tips)
లుక్కు మారితే లక్కు మారుతుంది. అందుకే అందంగా పుట్టాలనీ, అందంగా తయారవ్వాలనీ చాలామంది కోరుకుంటారు. ఈ అందం అనేది ఒక సాపేక్షభావన (Relative concept) అని ఈస్థటిస్టుల అభిప్రాయం. ఆఫ్రికన్ల అందం కాన్సెప్టూ, భారతీయుల అందం కాన్సెప్టూ ఒకటి కావు. అలాగే వీరివీ తక్కిన జంబూద్వీపవాసులవీ ఒకటి కావు. అందం అనేది దాన్ని చూసే కళ్ళల్లో ఉంటుందని అందుకే పెద్దలు చెబుతూ వచ్చారు. ఇతరులకు అందంగా కనిపించకపోయినా ప్రతితల్లికీ తన బిడ్డ ముద్దులు మూటగట్టేస్తూ ఉంటాడు. అయితే అందంగా ఉండడంలో చాలా మతలబులున్నాయని చాలామందికి తెలియదు. అందం ఒక బాధ్యత. ఎందుకంటే అందం ఒక సంపద, ఒక వారసత్వం. అందం ఒక మత్తుమందు.
అయితే - చూడగానే ఆకట్టుకునే సూదంటుఱాయిలాంటి వ్యక్తిత్వం, చూపు తిప్పుకోలేనంత సుందరరూపం మొదలైన వాటితో ఎన్ని ఇబ్బందులున్నా ఫర్వాలేదనుకొని అవే కావాలని ప్రగాఢంగా అభిలషించేవారు వాటిని సాధించే ప్రక్రియలో కూడా చాలా ఇబ్బందులున్నాయని గ్రహించాలి. అందం యొక్క భౌతికస్వరూపమే ఎక్కువమందికి ఎఱుక. దాని ఆధ్యాత్మిక స్వరూపం గుఱించి చింతన చేసేవారు అఱుదు. అందం అంతిమ ఫలస్వరూపమే తప్ప దానికది ఒక స్వతంత్ర స్వమూర్తి (independent entity) కాదు. ఈ అంతిమ ఫలాన్ని కాచిన ఆ అందమైన వృక్షం పేరేంటి ? అందాన్ని మించిన ఆకర్షణపరిమళాన్ని వెదజల్లే ఆ పూలతీగ ఎక్కడిది ?
మానవుడి గొప్పతనాలన్నీ ఆతనియందు భగవంతుడు ప్రసన్నుడై ప్రసాదించగా వ్యక్తమౌతున్న భగవద్ విభూతులేననీ, అవి ఆయన ఆస్తి అనీ, ఒక తండ్రి తన ఆస్తిని కుమారులకు పంచి యిచ్చినట్లుగా ఆయన మనకు వాటిని పంచి యిస్తాడనీ గతంలో ఒకసారి ఒక ప్రసంగంలో అన్నాను. అదే అందానిక్కూడా వర్తిస్తుంది. మన అందం ద్వారా వ్యక్తమయ్యేది నిజానికి మనం కాము, ఆ భగవంతుడే. ఈ ముఖాలు భగవంతుడివి. ఈ శరీరాలు భగవంతుడివి. ఈ ఆకర్షణశక్తి భగవంతుడిది. మనం వాస్తవంగా భూతకాలిక పిండాలం, భవిష్యత్ శవాలం మాత్రమే. భౌతికమైన అందం మానసికమైన అందానికి ప్రతిబింబం మాత్రమే. అవ్యక్తుడైన పరమాత్మకు వ్యక్తరూపమే ఈ ప్రపంచం. అదే విధంగా సూక్ష్మమైన మనస్సు ధరించిన స్థూలరూపమే ఈ శరీరం. ఏదో ఒక జన్మలో ఒకనాడు మనం చేసిన మంచి ఆలోచనలు ఈ జన్మలో మన అందంగా వ్యక్తమౌతున్నాయి.
అందానికి ఏ ఆధ్యాత్మిక సత్యం వర్తిస్తుందో అందవిహీనత్వానికీ అదే సత్యం వర్తిస్తుంది. అంటే పూర్వజన్మలో మనం చేసిన అందవికారపు ఆలోచనల ప్రతిఫలమే ఇప్పటి అందవిహీనత్వం. పూర్వజన్మల దాకా పోనక్కఱలేదు. ఒక వ్యక్తి ఈ జన్మలోనే హత్య గానీ మఱో దుష్టుపని గానీ చేసేటప్పుడు అతను స్వతహాగా ఎంత అందగాడైనా సరే, అతని ముఖకవళికలు అతనికి తెలియకుండానే ఎంత అందవిహీనంగా మారిపోతాయో గమనించండి. ఆనాటి ఆ ముఖకవళికలే కర్మఫలం అనే రిఫ్రిజిరేటర్ లో దాచబడి భద్రంగా అతనికి మఱుజన్మలో అందించబడతాయి. ఆ తరువాత అతను తన ముఖాన్ని అద్దంలో చూసుకొని తననెందుకిలా భగవంతుడు అందవికారంగా పుట్టించాడో అర్థం కాక కుమిలిపోతూంటాడు. అది భగవంతుడు ఇవ్వాలనుకొని ఇచ్చిన అందవికారం కాదు. ఇతను ఒకప్పుడు కోరి యెంచుకున్నదే.
"అందమైన ప్రతివారూ మానసికంగా అందంగా ఉంటారనే హామీ ఏముంది ? ఈ అందగాళ్ళు/ అందగత్తెలు అంత మంచి పూర్వజన్మసంస్కారం గలవారైతే మఱి ఇప్పుడు ఈ జన్మలో ఆ సంస్కారం కొనసాగలేదెందుకని ? వీరిలో పిసినిగొట్లూ, కుట్రదారులూ, ద్రోహులూ, రౌడీలూ, కేడీలూ, వ్యభిచారిణులూ కూడా ఉన్నారెందువల్ల ?" అనే విచికిత్స తలెత్తుతుంది. సత్సంస్కారాలు మఱుజన్మలో కొనసాగాలన్నా దానికి మానవుడు ప్రయత్నపూర్వకంగా సంకల్పించుకోవాలి. అలా కొనసాగకుండా మధ్యలోనే చెడిపోవాలని నిర్ణయించుకుంటే దేవుడేం చేస్తాడు ? అందుకే సాయిబాబా ఒక భక్తుడితో అన్నారు : "నా దగ్గఱికి వచ్చేవారంతా మోక్షం పొందుతారా అనుకుంటున్నావు కదూ నీ మనసులో ? ఆ మామిడిచెట్టు వైపు చూడు. అక్కడున్న పూత అంతా కాపైతే ఎంత మంచి పంట అవుతుంది ? కానీ అలా జఱగదు. పూతగానే చాలా మట్టుకు రాలిపోతుంది. కొన్ని పిందెలుగా రాలిపోతాయి. కొన్ని మాత్రమే పండ్లవుతాయి." అలాగే ఒకప్పుడు మనిషి చేసిన మంచి ఆలోచనల ఫలితంగా అతనికి మంచి రూపం లభిస్తుంది. కానీ తదనంతరం అలవాటు చేసుకొన్న, అతనికి అత్యంత ప్రియమైన దుష్టసంస్కారాలు సమాంతరంగా కొనసాగుతాయి.
మనం చేసే ప్రతి వక్రాలోచనా, పలికే ప్రతి వంకరమాటా, చేసే ప్రతివంకర చేష్టా ఆత్మతేజస్సుపై దుమ్ములా కప్పేసి దాని సౌందర్యాన్ని మఱుగుపఱుస్తుంది. ఇందుకు విపర్యస్తంగా సదుద్దేశంతో మనం చేసే ప్రతి సత్కర్మ మన ఆత్మని పరిశుభ్రం చేసే చీపురుగా ఉపయోగపడి దాని సత్యస్వరూపాన్ని వెలికి తీస్తుంది. ఆత్మే అసలైన దీపం. దేహాలు పైపై చిమ్నీలు మాత్రమే. ఆత్మ అంటే మఱింకేమీ కాదు. మనలోని సూక్ష్మ భగవంతుడే. శ్రీ రామకృష్ణపరమహంస కఠోర తపస్సాధనల్ని ఆచరించే రోజులలో ఆయన శరీరం బంగారంలా ధగధగ మెఱిసిపోతూండేదనీ దిష్టి తగుల్తుందేమోనన్న భయంతో శిష్యులు ఆయన మీద పట్టుపీతాంబరాలు కప్పేవారనీ చదివాం. కనుక సదాలోచనల ద్వారా ఆత్మతేజస్సును వృద్ధి పొందించుకుంటే శరీరతేజస్సు దానంతట అదే జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది.
అయితే - చూడగానే ఆకట్టుకునే సూదంటుఱాయిలాంటి వ్యక్తిత్వం, చూపు తిప్పుకోలేనంత సుందరరూపం మొదలైన వాటితో ఎన్ని ఇబ్బందులున్నా ఫర్వాలేదనుకొని అవే కావాలని ప్రగాఢంగా అభిలషించేవారు వాటిని సాధించే ప్రక్రియలో కూడా చాలా ఇబ్బందులున్నాయని గ్రహించాలి. అందం యొక్క భౌతికస్వరూపమే ఎక్కువమందికి ఎఱుక. దాని ఆధ్యాత్మిక స్వరూపం గుఱించి చింతన చేసేవారు అఱుదు. అందం అంతిమ ఫలస్వరూపమే తప్ప దానికది ఒక స్వతంత్ర స్వమూర్తి (independent entity) కాదు. ఈ అంతిమ ఫలాన్ని కాచిన ఆ అందమైన వృక్షం పేరేంటి ? అందాన్ని మించిన ఆకర్షణపరిమళాన్ని వెదజల్లే ఆ పూలతీగ ఎక్కడిది ?
మానవుడి గొప్పతనాలన్నీ ఆతనియందు భగవంతుడు ప్రసన్నుడై ప్రసాదించగా వ్యక్తమౌతున్న భగవద్ విభూతులేననీ, అవి ఆయన ఆస్తి అనీ, ఒక తండ్రి తన ఆస్తిని కుమారులకు పంచి యిచ్చినట్లుగా ఆయన మనకు వాటిని పంచి యిస్తాడనీ గతంలో ఒకసారి ఒక ప్రసంగంలో అన్నాను. అదే అందానిక్కూడా వర్తిస్తుంది. మన అందం ద్వారా వ్యక్తమయ్యేది నిజానికి మనం కాము, ఆ భగవంతుడే. ఈ ముఖాలు భగవంతుడివి. ఈ శరీరాలు భగవంతుడివి. ఈ ఆకర్షణశక్తి భగవంతుడిది. మనం వాస్తవంగా భూతకాలిక పిండాలం, భవిష్యత్ శవాలం మాత్రమే. భౌతికమైన అందం మానసికమైన అందానికి ప్రతిబింబం మాత్రమే. అవ్యక్తుడైన పరమాత్మకు వ్యక్తరూపమే ఈ ప్రపంచం. అదే విధంగా సూక్ష్మమైన మనస్సు ధరించిన స్థూలరూపమే ఈ శరీరం. ఏదో ఒక జన్మలో ఒకనాడు మనం చేసిన మంచి ఆలోచనలు ఈ జన్మలో మన అందంగా వ్యక్తమౌతున్నాయి.
అందానికి ఏ ఆధ్యాత్మిక సత్యం వర్తిస్తుందో అందవిహీనత్వానికీ అదే సత్యం వర్తిస్తుంది. అంటే పూర్వజన్మలో మనం చేసిన అందవికారపు ఆలోచనల ప్రతిఫలమే ఇప్పటి అందవిహీనత్వం. పూర్వజన్మల దాకా పోనక్కఱలేదు. ఒక వ్యక్తి ఈ జన్మలోనే హత్య గానీ మఱో దుష్టుపని గానీ చేసేటప్పుడు అతను స్వతహాగా ఎంత అందగాడైనా సరే, అతని ముఖకవళికలు అతనికి తెలియకుండానే ఎంత అందవిహీనంగా మారిపోతాయో గమనించండి. ఆనాటి ఆ ముఖకవళికలే కర్మఫలం అనే రిఫ్రిజిరేటర్ లో దాచబడి భద్రంగా అతనికి మఱుజన్మలో అందించబడతాయి. ఆ తరువాత అతను తన ముఖాన్ని అద్దంలో చూసుకొని తననెందుకిలా భగవంతుడు అందవికారంగా పుట్టించాడో అర్థం కాక కుమిలిపోతూంటాడు. అది భగవంతుడు ఇవ్వాలనుకొని ఇచ్చిన అందవికారం కాదు. ఇతను ఒకప్పుడు కోరి యెంచుకున్నదే.
"అందమైన ప్రతివారూ మానసికంగా అందంగా ఉంటారనే హామీ ఏముంది ? ఈ అందగాళ్ళు/ అందగత్తెలు అంత మంచి పూర్వజన్మసంస్కారం గలవారైతే మఱి ఇప్పుడు ఈ జన్మలో ఆ సంస్కారం కొనసాగలేదెందుకని ? వీరిలో పిసినిగొట్లూ, కుట్రదారులూ, ద్రోహులూ, రౌడీలూ, కేడీలూ, వ్యభిచారిణులూ కూడా ఉన్నారెందువల్ల ?" అనే విచికిత్స తలెత్తుతుంది. సత్సంస్కారాలు మఱుజన్మలో కొనసాగాలన్నా దానికి మానవుడు ప్రయత్నపూర్వకంగా సంకల్పించుకోవాలి. అలా కొనసాగకుండా మధ్యలోనే చెడిపోవాలని నిర్ణయించుకుంటే దేవుడేం చేస్తాడు ? అందుకే సాయిబాబా ఒక భక్తుడితో అన్నారు : "నా దగ్గఱికి వచ్చేవారంతా మోక్షం పొందుతారా అనుకుంటున్నావు కదూ నీ మనసులో ? ఆ మామిడిచెట్టు వైపు చూడు. అక్కడున్న పూత అంతా కాపైతే ఎంత మంచి పంట అవుతుంది ? కానీ అలా జఱగదు. పూతగానే చాలా మట్టుకు రాలిపోతుంది. కొన్ని పిందెలుగా రాలిపోతాయి. కొన్ని మాత్రమే పండ్లవుతాయి." అలాగే ఒకప్పుడు మనిషి చేసిన మంచి ఆలోచనల ఫలితంగా అతనికి మంచి రూపం లభిస్తుంది. కానీ తదనంతరం అలవాటు చేసుకొన్న, అతనికి అత్యంత ప్రియమైన దుష్టసంస్కారాలు సమాంతరంగా కొనసాగుతాయి.
మనం చేసే ప్రతి వక్రాలోచనా, పలికే ప్రతి వంకరమాటా, చేసే ప్రతివంకర చేష్టా ఆత్మతేజస్సుపై దుమ్ములా కప్పేసి దాని సౌందర్యాన్ని మఱుగుపఱుస్తుంది. ఇందుకు విపర్యస్తంగా సదుద్దేశంతో మనం చేసే ప్రతి సత్కర్మ మన ఆత్మని పరిశుభ్రం చేసే చీపురుగా ఉపయోగపడి దాని సత్యస్వరూపాన్ని వెలికి తీస్తుంది. ఆత్మే అసలైన దీపం. దేహాలు పైపై చిమ్నీలు మాత్రమే. ఆత్మ అంటే మఱింకేమీ కాదు. మనలోని సూక్ష్మ భగవంతుడే. శ్రీ రామకృష్ణపరమహంస కఠోర తపస్సాధనల్ని ఆచరించే రోజులలో ఆయన శరీరం బంగారంలా ధగధగ మెఱిసిపోతూండేదనీ దిష్టి తగుల్తుందేమోనన్న భయంతో శిష్యులు ఆయన మీద పట్టుపీతాంబరాలు కప్పేవారనీ చదివాం. కనుక సదాలోచనల ద్వారా ఆత్మతేజస్సును వృద్ధి పొందించుకుంటే శరీరతేజస్సు దానంతట అదే జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది.
నామాంకాలు (Labels)
ధార్మిక జీవన పద్ధతి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)