శనివారం 28 ఎప్రిల్ 2012

ఆది హిందువులను అంతంచేయడానికే డానికే బీఫ్ ఫెస్టివల్

నాగరికత నేర్చిన మానవుడు సహజంగా తన శరీర నిర్మాణానికి అనువుగా ఉన్న శాఖాహారాన్ని భుజిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ వస్తున్నాడు ,,ప్రపంచమంతా శాఖాహారం తీసుకొనే జాతుల ను నాగరికంగా అభివ్రుద్ది చెందినట్లుగా అనేక మానవ పరిశోధనల ద్వారా స్పష్టం చేస్తున్నా నాగరికం గా అభివ్రుద్ది చెంది  విజ్ఞానవంతుల ను అందించాల్సిన విశ్వవిద్యాలయాల్లో బీఫ్ ఫెస్టివల్లు జరగడానికి ప్రయత్నం చేయడం అనాగరికత నే అవుతుంది.
బీఫ్ తినడం వల్ల వచ్చే నష్టాల ను గమనిస్తే ఐలయ్య బౄందం ఆది హిందువుల ను సంపూర్తి గా నిర్ములించి కేవలం అగ్ర కులాల వారినే బతికించేవిధం గా కుట్ర లు పన్నినట్లు తెలుస్తోంది.
బీఫ్ లో ప్రమాదకరమైన సుక్ష్మ క్రిములు ఉంటాయి,ఇ కోలి అనే ప్రమాదకరమైన బాక్టీరియా అలా గే స్తఫిలోకాస్ అరెఇస్ అనే ప్రమాదకర బాక్టీరియా ,సాల్మొనెల్లా అనే మరో రోగాకారక సుక్ష్మ క్రిములు ఉంటాయని పరీక్షా ల ద్వారా తేలింది .
      • బీఫ్ లొ డయాక్సిన్ అనే ప్రమాదకరమైన రోగ కారక పదర్థం స్థాయి మాములు పదార్థాలకంటె ముదూ వందల రెట్లు ఉంటుంది .డయాక్సిన్ వాళ్ళ కాన్సర్ ,ఎందోమేత్ర్యోసిస్ ,మానసిక సమస్య లు ,ప్రుత్యుఆక త్పత్తి వ్యవస్థ పాడవడం ,నిస్సత్తువ,అలాగే రోగ నిరోధక వ్యవస్థ క్షీణత లాంటి ప్రమాదాలు ,అసాధారణ రక్త ,నరాల జబ్బులు బీఫ్ తినడం వాళ్ళ సంభవిస్తాయని పరిశిలన లో అమెరికా లో ఆరోగ్య సంస్థ లు ప్రచురించిన పాత్రా ల ద్వారా తెలుస్తోంది
      • బీఫ్ ను ఉత్పత్తి చేయాలంటే చెట్ల వాడకం పెరిగి అడవులు అంతరీంచే ప్రమాదం ఉంది
      • బీఫ్ ను ఎక్కువగా తినడం వల్ల ప్రక్రుతి సమతౌల్యం దెబ్బతినే ప్రమాదం ఉంది
      • బీఫ్ తినడం వల్ల ఈ కోలి అనే వైరస్ విజ్రుంభించి ప్రజల ను మట్టు బెడుతుందని కనుక్కొన్నారు
      • బీఫ్ ను జీర్ణం చేసుకోవడం మానవ జీర్ణ వ్యవస్థ కు కష్ట మైన విషయం గా పరిశోధ కు లు కనుకొన్నారు ముఖ్యంగా ఉడికించిన బీఫ్ ను తింటే జీర్ణ వ్యవస్థ పైన  శ్రమ  ను కలిగించిన వారవుతారు.
      • బీఫ్ తినడం వల్ల, మానవ శరీరం లో అందుబాటు లో ఉన్న ఎంజైముల ను తక్కువ వయసులో వాడేయాల్సి వస్తుంది ,కొత్త ఎంజైముల ను శరీరం లో సృష్టించడానికి సమయం పడుతుంది కనుక సరిర సమతౌల్యం దెబ్బతింటుంది
      • బీఫ్ వల్ల శరీరం లో అనుసంధాన వ్యవస్థ క్షిణ దశ కి చేరుతుంది ,బీఫ్ తినే వారి కి వొళ్ళు నొప్పు లు ఎక్కువయ్యి సామర్థ్యం తగ్గి పోతుంది
      • శరీరం లో ని మినరల్స్ కుడా బీఫ్ వాడకం తో తగ్గిపోయే ప్రమాదం ఉంది
      • మరణ హార్మోన్లు బీఫ్ లో మిగితా మాంసా లకంటే ఎక్కువగా ఉండడం వల్ల తిన్న వాళ్ళు మత్తు లో స్పృహ కోల్పోయే ప్రమాదా లు ఉంటాయి
      • మాడ్ కౌ అనే వ్యాధి తో వేల మంది చనిపోయిన సంఘటన ,రోజు బీఫ్ తినడతో చిన్న వయసులో నే చనిపోతున్న లక్ష లాది మరణా ల గురించి ప్రాచ్యాత్య దేశాల్లో జరుగుతున్న చర్చ లన్ని బీఫ్ తినడం తో ,ఆ తిన్న వారితో పాటు వారి కి పుట్టే వారికి కలిగే ప్రమాద కర ఆరోగ్య లోపాలు కొన్ని జాతు ల నే అమ్తరింప చేస్తాయని స్పష్టం చేస్తున్నాయి
అనేక రకాలుగా ఆరోగ్యం నాశనం చేసే బీఫ్ ఫెస్టివల్ ను విశ్వవిద్యాలం లో జరుపడం మంచిది కాదు, కులం పేరుతో వేరు చేసి చంపవద్దని  చెప్పాలి ...
క్రిశ్టియన్లు భారత దేశం లో మతమార్పిడి చేయడానికి మేము  హిందు వులమనే స్పృహ ,ఆధ్యాత్మిక ఆలోచన ల తో ఉన్న ఉన్నతమైన సాహిత్యం అద్దంకి గా తోచింది అందుకే సమాజం లో ఉన్న విస్మృతి, విజాతియుల దాడి వల్ల కొన్ని కులా లు హిందు ఆధ్యాత్మిక చింతన కు సాహిత్యాని దూరం గా, భక్తీ మార్గం లో నే, దైవ ప్రార్థ న చేసుకొనే వారిని  సులభం గా మతమార్పిడి చేయవచ్చొని గ్రహించిన మిషనరీ లు దెస వ్యాప్తం గా ఒకే కులం వారు ఉపనిషి త్తు ల కు,వేదాల కు  దూరం గా లేరని, ప్రాంతీయం గా వివిధ కులాలు వారి వారి భావన దృష్ట్యా ,విడి విడి గా చేస్తున్న సాధన తో, ఈ కులా ల వారిని మతం మార్పించడానికి,దెస వ్యాప్తం గా వీరిని కలపి ఒకే సారి మతం మార్పిమ్చావచ్చని అంబేద్కర్ ద్వారా ప్రయత్నా లు చేసారు ..,అంబేద్కర్ క్రైస్తవ కుట్ర ల ను తెలివిగా అర్థం చేసుకొని , బౌద్ద మతం లో కి మారడం తో, ఖంగు తిన్న క్రిష్టియన్ మిషనరీ లు ,దేశవ్యాప్తం గా ఈ కులా ల ను గుర్తింపు గా ఒక పేరు ఉండాలని తద్వారా ఈ కులా ల కు మొదట తాము హిందువు లము అనే స్పృహ నుంచి దూరం చేసి హిందుత్వం ,ఆర్యులు,వైదిక మతం అనే అయోమయపు వాదన లను జత చేసి ఈ కులా లను తమ అసలైన అస్మిత ను గుర్తించకుండా ఒక రకమైన  ద్వేష భావాన్ని పెంచి, తమిళనాడు లో కొన్ని కులాలను క్రైస్తవం లో కి విజయవంతం గా మార్చగలిగారు .
తమిళ నాడు లో జరిగిన ప్రయోగాన్ని దేశవ్యాప్తం గా అమలు చేసే క్రమం లో ఈ కులా ల గుర్తింపు కు  గాంధి వాడి న హరిజన శబ్దం మతం మారినా తాము ఎస్ సి, ఎస్ టి ల మని వాదించెందు కు  అడ్డం గా ఉందా ని "దళిత" అనే పదాన్ని విస్తృతం గా వాడుక లో కి తీసుకువచ్చి మొదట దేశవ్యాప్తం గా ఉన్న ఈ కులాలందరి ని ఐక్యం  చేసి తాము వేరు హిందువు లు వేరు, తమకు ఈ దేశం లో తర తారా లుగా వస్తున్నా వారసత్వానికి సంభంధం లేదనే ఆలోచన ను పెంచి పెద్ద చేసి కొన్ని కులా ల ను దేశవ్యాప్తం గా తమ మత మార్పిడి అనే వల లో సులభం గా చిక్కే లా నిశ్శబ్దం గా తర తారా లుగా ప్రవహిస్తున్న ప్రవాహం లో దళితు లు వేరు హిందువు లు వేరు అనే ఆలోచన ను అబద్దాన్ని అమాయక విశ్వవిద్యాలయ యువకుల మెదళ్ళలో నింపే ప్రయత్నా లు గత యాభై ఏళ్ళు గా కొనసాగుతున్నాయి.
దళిత అనే పేరుతొ వేరు చేసినా కోర్టు లు ప్రజ లు ఇంకా దళితు లు హిందు వు లే అనే ఆలోచనతో నే ఉండడం తో ,యునివార్సి టి ల లో ఉన్న క్రైస్తవ మిషనరీ తోత్తులైన ఐలయ్య లాంటి ఆమాయక ఆచార్యుల ను వాడుకొంటూ మొదలెట్టిన ప్రయత్నమే బీఫ్ ఫెస్టివల్ .ఆహారం తినే స్వేచ్చ ను చెప్పడానికి ఈ ఫెస్టివల్ అని ప్రకటిస్తున్న ఈ ఆచార్యులు పోర్క్ (పంది మాసం ) ఫెస్టివల్ ను ఎందుకు చేయటం లేదో హిందు వు లు గమనిస్తున్నారు .
పాపం మిషనరీ ల కలలు, కుట్ర లు ,ఇక్కడ అందరి లో దేవుడున్నాడు ,అందరు సమానం అనే నిత్య సత్యాలు ఇక్కడ కళ్ళ ముందర కనపడుతుంటే ఎన్నిరోజులు దళితుల మనే గంట లు కట్టి మోసం చేయగలరో చూడాలి,దళిత అనే పదాన్ని వాడుక లో నించి తొలగించి క్రమంగా ఆది హిందువులుగా ఈ కులా లను వ్యవహరించడం మొదలెట్టాలి

మంగళవారం 3 ఎప్రిల్ 2012

కాపురాలు కూలిపోతాయి ... కొత్తవిడాకులచట్టంపై అభిప్రాయాలు


 [ఆంధ్రభూమి దినపత్రికలో జరిగిన చర్చ ఇది]


 భార్యాభర్తల మధ్య వివాదాలు వస్తే పరిష్కరించడానికి పంచాయితీలు, పెద్దమనుషులు ఉండేవారు. సమస్యను పరిష్కరించి కుటుంబాలను బతికించేవారు, అలా వందేళ్లు బతికిన కుటుంబాలు ఉండేవి. దీనిని పరిష్కరించాల్సిన కోర్టు వ్యక్తులనే దూరం చేసేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అవగాహన లోపం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఆ లోపాన్ని తొలగించగలిగితే సమస్య పరిష్కారం అవుతుంది. ఆ సమస్యలను పరిష్కరించే బదులు వ్యక్తుల్నే దూరం కమ్మంటే సమస్య మరింత జఠిలమవుతుంది. దంపతులు విడాకుల కోసం కోర్టుకెళితే వారిద్దరి మధ్య ఉన్న అవగాహనా లోపాన్ని సరిదిద్దాల్సింది పోయి, వారిద్దరినీ విడిపోమంటే, వారు విడిపోతారు. అక్కడితో సమస్య పరిష్కారం అవుతుందా? వారు మళ్లీ పెళ్లి చేసుకుంటే మళ్లీ ఇవే సమస్యలు వస్తే మళ్లీ విడిపోమని చెబుతారా? అలా ఎంత దూరం వెళ్తారు? ఒక జబ్బు వస్తే ఒక డాక్టర్‌కు చూపించాం, ఆయనతో తగ్గలేదని చెప్పి మరో డాక్టర్ దగ్గరకు పోతాం, ఆయనతోనూ తగ్గలేదని ఇంకో డాక్టర్ దగ్గరకు పోతే సమస్య పరిష్కారం అవుతుందా? జబ్బు తగ్గుతుందా? డాక్టర్లను మారిస్తే జబ్బు తగ్గదు, రోగానికి మందువేయాలి అంతేకదా. కోర్టు విధానం ఏమిటి? సమస్యను పరిష్కరించే విధానం ఉండాలి కదా... కాని మనుషులను మార్చే విధానమే కోర్టులో కనిపిస్తోంది. మనుషులను చివరివరకూ వదులుకుంటూ పోతే ఏమవుతుంది? అంతిమంగా మరణమే. సమాజంలో ఇలాంటి చర్యలు వల్ల దారుణమైన పోకడలు వస్తాయి. విదేశీ విధానాలను చొప్పిస్తున్నారు. విడాకులు అడిగితే వెంటనే ఇచ్చేస్తామంటున్నారు. మహమ్మదీయుల్లో అసహనానికి గురైనవారు లేరా? క్రైస్తవుల్లో లేరా వారూ ఇలాగే తీసుకుంటున్నారా? జబ్బు ఏ మతస్థుడికి వచ్చినా, మందు ఒకటే కదా... శరీరానికి వచ్చే రుగ్మతలకు ఒకే మందు ఇస్తున్నాం కదా... ఇది జీవితానికి వచ్చే రుగ్మత, మనసుకు వచ్చే రుగ్మత, అది పోగొట్టగలగడమే చట్టం చేయాల్సిన పని. ఇలాంటి సమస్యలు వచ్చినపుడు ఏ మతం వారికైనా మనసుకు ఒకే మందు ఇవ్వాల్సి ఉంటుంది. అలాకాకుండా జలుబు చేసిందని ముక్కును, చేతికి దెబ్బతగిలిందని చేతిని తొలగిస్తూ పోతే అసలు శరీరమే మిగలదు, అలాగే సమాజంలోని ఇలాంటి పరిస్థితులకు మనుషులను కలపాలే తప్ప విడదీసుకుంటూపోతే సమాజానికే ఇది గొడ్డలిపెట్టు అవుతుంది. రోజురోజుకూ స్ర్తిల సంతతి తగ్గిపోతోంది. స్ర్తి చెప్పుచేతల్లో పురుషుడు బతుకుతున్న సమయంలో మరింతగా స్ర్తిలను రెచ్చగొట్టి ఇంకా ఒప్పుకోకు అన్న రీతిలో వారిని ప్రేరేపించడం సరికాదు. నిజానికి స్ర్తిలు ఎదుర్కొనే అనేక సమస్యలు అత్యాచారాలు, గృహ హింసను పరిష్కరించాల్సిందే, వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, స్ర్తి బాగుంటేనే కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ బాగుంటుంది. దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆ స్ర్తిని పరిరక్షించుకునే దిశగా మనం ముందుకు వెళ్లాలి. న్యాయస్థానాలు స్ర్తిలను గౌరవించే విధానం ఇదా? చిన్న అసహనానికి విడిపోవచ్చు అనడం సరికాదు, ఇద్దరు కలిసి విడిపోవాలనే నిర్ణయం తీసుకుంటే అపుడు విడిపోవచ్చు. మానసిక రుగ్మతలను పెంచుకుని ఘర్షణలకుగురికావడం సరికాదు.
- శ్రీ పరిపూర్ణానంద సరస్వతి
శ్రీపీఠం



----------------------------------------------------------------------------------

 ఆర్థిక పరాధీనత - తత్ఫలితంగా సమాజపరంగా తలెత్తే అనేకానేక ఇతర సమస్యల కారణంగా వైవాహిక బంధంలో జీవితాంతం నిస్సహాయంగా మగ్గిపోయే మహిళలకు ఊరట, వారికి అండగా నిలిచేలా, వీలైనంత ఆర్థిక భరోసా కల్పించేలా విడాకుల ప్రక్రియ ఇకపై మరింత సులభతరం అవుతుందని న్యాయస్థానాలు చెబుతున్నాయి. వాస్తవానికి న్యాయస్థానాలు ఆలోచిస్తున్నట్టు సమాజంలో పరిణామాలు ఉండవు, తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. ఏదైనా అంశం మీద అవగాహన లేకుంటే ఫర్వాలేదు, కాని దురవగాహన వల్ల సమస్యలు జఠిలం అవుతాయి. సమాజం విచ్ఛిన్నమవుతున్న తరుణంలో ఈ వ్యవస్థను ఏకోన్ముఖం చేసేందుకు రుషులు కొన్ని మార్గాలను అందించారు. చిన్న అలకలకు కూడా రోడ్డున పడి విడిపోయేందుకు మార్గాన్ని చూపించడం సరికాదు. స్ర్తిని మహాశక్తి స్వరూపిణిగా చూస్తాం. దానికి బదులు ఆమెను అబలగా మార్చేస్తే భయంకర పరిస్థితులు ఏర్పడతాయి. అనర్థం వేరు, అపార్థం వేరు, వాటికి పరిష్కారాలను చూపించాలి. జీవన విధానంలోని విలక్షణతను ఇరువురూ అర్థం చేసుకుని చిన్న చిన్న సవాళ్లను అధిగమిస్తూ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలే తప్ప పాశ్చాత్య ధోరణులను స్వాగతించడం సరికాదు. సంబంధాలు సరిదిద్దలేనంతగా పాడయ్యాయనే కారణంతో ఇకపై భార్య విడాకులు కోరవచ్చని న్యాయస్థానం చెబుతోంది. ఆ మేరకు ఆమె కోర్టు ఎక్కితే వ్యతిరేకించేందుకు కూడా భర్తకు అవకాశం ఉండదు. ఇదే కారణంపై ఒకవేళ భర్త విడాకుల పిటిషన్ దాఖలు చేస్తే మాత్రం దానిని భార్య వ్యతిరేకించవచ్చు. అంతేగాక, వేచి ఉండే కాలం పేరుతో విడాకులు కోసం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అనివార్యత కూడా ఇకపై ఉండదు. పైగా విడిపోయిన భర్త నుండి చాలీచాలని నామమాత్రపు భరణంతోనే సరిపుచ్చుకుంటున్న మహిళలకు వివాహానంతరం అతను సంపాదించిన ఆస్తిలో ఇకపై వాటా కూడా లభించనుంది. అయితే వేచి ఉండే కాలం ఆస్తిలో భార్యకు లభించాల్సిన వాటా ఎంతనేది న్యాయస్థానమే నిర్ణయిస్తుంది. దంపతులు విడిపోతే ఇక నుండి వారి దత్త సంతానానికి కూడా కన్నబిడ్డలతో సమానంగా అన్ని హక్కులూ లభిస్తాయి. వివాహ చట్టానికి చేసిన ఇలాంటి కీలక సవరణలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. ఈ మేరకు పార్లమెంటరీ స్థాయి సంఘం చేసిన సిఫార్సుల ఆధారంగా రూపొందించిన వివాహ చట్టాల సవరణ బిల్లు 2010కు ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన ఉన్న కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. కొత్త బిల్లు ప్రకారం ఇకపై విడిపోయే మహిళకు భర్త ఆస్తిలో వాటా లభించనున్నా ఈ మొత్తాన్ని కేసు ఆధారంగా కోర్టు నిర్ణయిస్తుంది. ఆ విషయంలో స్పష్టమైన నిబంధనలను బిల్లులో పొందుపరచలేదు. అలాగే ఆరు నుండి 18 నెలల పాటు వేచి ఉండే కాలాన్ని కూడా పరిస్థితుల ఆధారంగా కోర్టు తన విచక్షణ మేరకు నిర్ణయించే వీలుంది. వివాహ చట్టాల సవరణ బిల్లు 2010ను రెండేళ్ల క్రితమే రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం దానిని న్యాయసిబ్బంది విభాగాల పార్లమెంటరీ స్థాయి సంఘానికి పరిశీలనకు పంపించారు.
-ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి
-----------------------------------------------------------------------------------------------------
 అడిగిన వెంటనే విడాకులు మంజూరు చేసే విధానం మన సమాజానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల కాపురాలు కూలిపోతాయి. ఇప్పటికే దేశంలో విడాకుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఇప్పుడు ఆడవారు అడిగిన వెంటనే విడాకులు మంజూరు చేసే విధానం ఉండడం వల్ల విడాకుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. కేంద్రం ఒక మంచి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ఆడవారు ఇబ్బందిపడుతున్నారని, కాపురం చేయలేని పరిస్థితిలో విడాకులు కోరితే తక్షణం మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ ఆచరణలో అలా జరగదు. క్షణికమైన ఆవేశంతో విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు వెనక్కి వెళ్లే అవకాశం ఉండదు. ఇది మహిళలకు ఏ మాత్రం మేలు చేయదు. పైగా నష్టం చేస్తుంది. కాలం ఇప్పుడు చాలా మారిపోయింది. ఆడవారిని వేధించే మగవాళ్లే కాదు, మగవాళ్లను వేధించే భార్యల సంఖ్య కూడా ఇప్పుడు తక్కువేమీ కాదు. గతంలో విడాకులు తీసుకోవాలని అనుకుంటే కోర్టును ఆశ్రయిస్తే ఆరు నుంచి 18 నెలల పాటు వేచి చూడాల్సి వచ్చేది. ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకున్నా, ఈ గడువులో వారి ఆలోచనలో మార్పు రావచ్చు, సర్దుకు పోవచ్చును అనే ఉద్దేశంతో ఈ గడువు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆడవారు కోరితే వెంటనే విడాకులు మంజూరు చేసే వెసులుబాటు వల్ల నష్టపోయేది ఆడవారే. వరకట్నం వల్ల ఆడవారు ఎంతో నష్టపోయారు. వరకట్నాన్ని నిషేధించి, చట్టం తీసుకు వచ్చినప్పుడు మహిళలకు కొంతవరకు ప్రయోజనం కలిగింది. అదే సమయంలో ఈ చట్టం దుర్వినియోగం కూడా జరిగింది. చిన్నచిన్న కలహాలతో కుటుంబ సభ్యులందరిపైన వరకట్న వేధింపు కేసులు పెట్టారు. దాంతో మొత్తం కుటుంబం జైలు పాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదే విధంగా అంటరానితనాన్ని నిషేధిస్తూ మంచి ఉద్దేశంతో చట్టం తీసుకువస్తే కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం తమ ప్రత్యర్థులపై ఈ కేసులు పెట్టారు. నిజమైన బాధితులకు ప్రయోజనం కలిగే విధంగా చట్టం ఉంటే మంచిదే కానీ ఆ చట్టాన్ని కక్షసాధింపు కోసం ఉపయోగించుకుంటేనే చిక్కు వస్తుంది. ఇప్పుడు విడాకుల చట్టంలో తీసుకువచ్చిన మార్పులు ఆడవారికి ఉపయోగపడితే మంచిదే కానీ నష్టం కలిగించే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు తలెత్తితే కుటుంబ పెద్దలు సర్దిచెప్పేవారు. దాంతో దంపతులు కలకాలం కలిసి ఉండేవారు.
ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడవారికి కోపం వచ్చిందంటే విడాకుల కోసం ప్రయత్నిస్తే అంతేనా? పెళ్లి చేసుకునేప్పుడే అన్ని కోణాల్లో ఆలోచించాలి. దంపతులు విడాకులు తీసుకుని ఎవరికి వారు సుఖంగా ఉండొచ్చు, కానీ వీరి పిల్లలు మాత్రం బాధితులుగా మిగిలిపోతున్నారు. విడాకులు తీసుకున్న మగవాళ్లు మళ్లీ పెళ్లి చేసుకుంటే పిల్లలపై శ్రద్ధ చూపకపోవచ్చు, ఒకవేళ పిల్లలు తల్లి వద్ద ఉంటే ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ పిల్లల బాధ్యత ఎవరిది? తాత్కాలికమైన ఆవేశం వల్ల అటు దంపతులు, పిల్లలు నష్టపోతున్నారు. దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా విడాకుల సంఖ్య పెరిగిపోతోంది. దీన్ని నివారించేందుకు ఏం చేయాలో ఆలోచించాలి కానీ అడగ్గానే విడాకులు ఇచ్చేసే నిర్ణయం సమస్యకు పరిష్కారం కాదు.
- నన్నపనేని రాజకుమారి
శాసన మండలి సభ్యురాలు, టిడిపి అధికార ప్రతినిధి




-------------------------------------------------------------------------------------------------
 హిందూ వివాహ చట్టంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచనల మేరకు తాజాగా సవరణలు చేయడం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఈ అంశంపై కేంద్రం తొందరపాటుగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం సముచితం కాదు. వాస్తవాలు మాట్లాడుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న చట్టాల్లో ఎలాంటి మార్పులు తీసుకువచ్చినా ఇబ్బందులే ఎదురవుతాయి తప్ప, సమస్యల పరిష్కారానికి మార్గాలు సుగమం కావు. ఇప్పటివరకు ఉన్న చట్టాల ప్రకారం భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి, ఇద్దరూ పరస్పర ఆమోదంతోనే విడాకులు కావాలంటూ కోర్టుకు వెళ్లినప్పటికీ, సదరు కోర్టు వెంటనే విడాకులు మంజూరు చేయదు. ఆరు నెలల నుండి ఏడాది వరకు ఆగుతుంది. ఈలోగా విడాకులకోసం కోర్టుకు వచ్చిన దంపతుల ఆలోచనల్లో మార్పులు వచ్చి, మళ్లీ కలిసి ఉండాలన్న నిర్ణయానికి వస్తారన్నదే జాప్యంలో పరమార్థం. సాధారణంగా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలవల్ల సత్ఫలితాల కంటే దుష్ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. విడాకుల కోసం కోర్టుకు వచ్చే దంపతులను విడివిడిగానూ, కలిపి కూచోబెట్టి, వారి సమస్యలను విని, వాటికి పరిష్కార మార్గాలు చూపగలిగితే పరిస్థితి చక్కబడే అవకాశాలు లేకపోలేదు. అందుకే విడాకుల కోసం వచ్చే దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఇందుకోసం ఫ్యామిలీ కోర్టులు 1984లో ఏర్పాటయ్యాయి. ఈ కోర్టుల్లో న్యాయమూర్తులకు చేదోడుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ కౌన్సిలర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ కౌన్సిలర్లు న్యాయశాస్త్రం అభ్యసించినవారే కానక్కర్లేదు. సమాజం పట్ల, సమస్యల పట్ల అవగాహన ఉండి, కుటుంబ తగాదాలను పరిష్కరించగలిగే ఇంగిత జ్ఞానం ఉంటే సరిపోతుంది. ఫ్యామిలీ కోర్టులు ఏర్పాటు చేసి 27 సంవత్సరాలు పూర్తయినా, ఫ్యామిలీ కౌన్సిలర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. నేను ‘రక్ష’ అనే సామాజిక న్యాయసేవా సంస్థ ద్వారా హైకోర్టులో ప్రజాహిత వాజ్యాన్ని (పిల్) వేయగా, 2002లోనే కోర్టు తీర్పు చెప్పింది. వెంటనే ఫ్యామిలీ కౌన్సిలర్లను నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి, స్వయంగా హైకోర్టు ప్రభుత్వానికి అనేక పర్యాయాలు లేఖలు రాసింది. అయినా ఫలితం లేదు. ఫ్యామిలీ కౌన్సిలర్లు లేకపోవడం వల్ల కోర్టుల్లో విడాకుల కేసుల పరిష్కారానికి తీవ్రమైన జాప్యం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలోని న్యాయవిభాగం ఈ అంశంపై సరైన నిర్ణయాలు తీసుకుంటే సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది. మనది లౌకిక దేశం. ఈ దేశంలో ఫ్యామిలీ కోర్టుల్లో ఏ మతానికి చెందినవారైనా కేసులు నమోదుచేయవచ్చు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు కేవలం హిందూ వివాహ చట్టానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. అంటే ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జోరాష్ట్రియన్ తదితర మతాల వారికి వర్తించదు. ఈ విషయంలో లోతుగా అధ్యయనం చేస్తే, ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన సవరణల వల్ల హిందూ మతానికి చెందినవారికి ఎక్కువ నష్టం జరుగుతుంది. దంపతులు వేర్వేరు కారణాల వల్ల విడాకుల కోసం కోర్టుకు వెళితే కొత్త సవరణ ప్రకారం వెంటనే కోర్టు విడాకులు మంజూరు చేయాల్సి ఉంటుంది. అంటే దంపతులు తమ నిర్ణయంపై పునరాలోచించుకునేందుకు కూడా అవకాశం లభించదంటే అతిశయోక్తి కాదు.
- సి.వి.ఎల్. నరసింహారావు
అధ్యక్షుడు, ‘రక్ష’, న్యాయ సలహా స్వచ్ఛంద సేవా సంస్థ

------------------------------------------------------------------------------------------------------------


 మన దేశంలో అనేక మతాలకు చెందినవారు ఉండటం వల్ల అందరికీ వర్తించేలా సమగ్రంగా ఉండే కామన్ సివిల్ కోడ్ తీసుకురావలసిన అవసరం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన హిందూ వివాహ చట్టం-1955తో పాటు ప్రత్యేక వివాహాల చట్టం-1954లలో సవరణ వల్ల పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. ప్రభుత్వం తీసుకువచ్చే ఎలాంటి చట్టాలయినా ప్రజలందరికీ వర్తించేలా ఉండాలే తప్ప, ఏ ఒక మతానికో పరిమితం కారాదు. హిందూ వివాహ చట్టంలో తలపెట్టిన సవరణల వల్ల భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయనడంలో సందేహం లేదు. యువతీ-యువకుల్లో సామాజిక అంశాలు, కుటుంబపరమైన అంశాల్లో పూర్తిగా అవగాహన ఉండదు. సాధారణంగా మన దేశంలో 18-25 సంవత్సరాల వయస్సులో వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ శాతం పెద్దలు కుదిర్చిన వివాహాలే ఉంటాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలైనా, ప్రేమ వివాహాలైనా సజావుగా ఉంటే బాగానే ఉంటుంది. యుక్త వయస్సులో, క్షణికావేశంలో చిన్న చిన్న విషయాల్లో కూడా కొత్త దంపతుల మధ్య అవగాహన ఉండకపోవడం వల్ల వారి నిర్ణయాలు సుదీర్ఘ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండవు. దాంతో చిన్న అంశాలకు కూడా వచ్చే మనస్పర్థలు విడాకులు తీసుకోవాలన్న ఆలోచన వరకు వెళతాయి. విడాకుల మూలంగా తలెత్తే పరిణామాల గురించి యువతీ యువకులు ఆలోచించలేరు. అందువల్ల విడాకుల కోసం దరఖాస్తు చేసే ఇలాంటి వారికి విడాకులు ఇచ్చే గడువు ఇప్పటివరకు ఆరు నెలల నుండి 18 నెలల వరకు ఉండేది. ఈలోగా విడాకుల కోసం దరఖాస్తు చేసేవారి ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావచ్చు. పునరాలోచించుకునేందుకు కొంత వ్యవధి లభించేది. కేంద్ర మంత్రివర్గం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతిపాదిత హిందూ వివాహ చట్టం-1955లో మార్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం రెండేళ్ల క్రితం రాజ్యసభలో ప్రతిపాదించిన వివాహ చట్టం (సవరణ) బిల్లు-2010ని రాజ్యసభ నేరుగా ఆమోదించకుండా, న్యాయవిభాగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీనలకు పంపించింది. జయంతీ నటరాజన్ నేతృత్వంలోని ఈ కమిటీ చేసిన సిఫార్సుల మేరకే కొత్తప్రతిపాదనలతో రూపొందించిన బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లు అమలులోకి వస్తే విడాకుల కోసం కోర్టుకు వచ్చే దంపతులు మరోపర్యాయం పునరాలోచించుకునే అవకాశాన్ని కోల్పోతారనడంలో సందేహం లేదు. విడాకులు మంజూరైన తర్వాత మహిళలు ఎక్కువ బాధలకు, ఇక్కట్లకు గురికావలసి వస్తుంది. ఉద్యోగినిలు అయిన మహిళలు అయితే ఈ బాధలు మరిన్ని ఎక్కువగానే ఉంటాయి. వారికి పిల్లలు కూడా ఉంటే సామాజికంగా అనేక ఇక్కట్లను గురికావలసి వస్తుంది. పిల్లల ఆలనాపాలనా చూసేవారు లేక ఇబ్బందులకు గురికాలసి ఉంటుంది. మగవారు మరో పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని తిరిగి గడుపుతారు. మహిళలు అనేక కారణాల వల్ల పునర్వివాహం చేసుకోలేక మానసికంగా సమస్యలకు లోనయ్యే అవకాశాలున్నాయి. చిన్న చిన్న కుటుంబాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. మన సమాజం మహిళలనే విమర్శిస్తుంది. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని విడాకుల కోసం గడువు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. విడాకులకోసం వచ్చేవారిని కలిపి ఉంచేందుకు న్యాయమూర్తులు కూడా ప్రయత్నిసుంటారు. విడాకుల కోసం వచ్చే దంపతులను కౌన్సిలింగ్ సెంటర్‌కు న్యాయమూర్తి పంపిస్తారు. కొత్త చట్టం వల్ల ఈ అవకాశాలన్నీ పోతాయి.
- జస్టిస్ కె. రామస్వామి
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి.





-------------------------------------------------------------------------------------------------------------



విడాకుల చట్టాన్ని మరింత సులభతరం చేస్తూ కేంద్ర మంత్రివర్గం రూపొందించిన ముసాయిదాలోని ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో మాత్రం కష్టసాధ్యంగానే ఉన్నాయి. అసలు వివాహ చట్టాలు, విడాకుల చట్టాలపై 95 శాతం మహిళలకు అవగాహనే లేదు. అలాంటప్పుడు ఎన్ని మంచి చట్టాలున్నా, ఏమిటి ప్రయోజనం అనిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన వివాహ చట్టాల సవరణ బిల్లు-2010లో ప్రధానంగా మూడు అంశాలపై స్పష్టత లేదు. ఇలాంటి అస్పష్ట చట్టాలను ప్రతివాదులు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు తమ వివాహం రద్దు కోసం దరఖాస్తు చేసుకుంటే, గతంలో స్థాయి సంఘం చేసిన సూచన మేరకు వేచిచూసే సమయాన్ని 18 నెలల నుంచి ఆరు నెలలకు కుదించాలని ప్రతిపాదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ, ఆ వ్యవధిని నిర్ణయించే అధికారాన్ని న్యాయస్థానానికి వదిలేసింది. భార్యభర్తలు ఇద్దరూ విడాకులు తీసుకునేందుకు ముందుకు వచ్చాక కూడా గడువు ఇచ్చే విచక్షణను కోర్టులకు అప్పగించడం వల్ల బాధిత మహిళకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. భర్తకానీ, వారి తరఫు కుటుంబ సభ్యులు పెట్టే వేధింపులను తట్టుకోలేక విడాకులకు సిద్ధమైన బాధితురాలికి సత్వరం న్యాయం జరగకుండా చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకునే అవకాశం ప్రతివాదులకు ఈ చట్టం కల్పించినట్టు అవుతుంది. కొన్ని సందర్భాల్లో విడాకుల కోసం ముందుకు వచ్చిన భార్యకు అవి లభించకుండా చట్టంలోని లొసుగులతో భర్త కోర్టును ప్రభావితం చేసే అవకాశం కూడా లేకపోలేదు. విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే బాధితురాలికి సత్వర న్యాయం లభించకుండా నిబంధనలు పెట్టడం సరికాదని మా అభిప్రాయం. అలాగే ఈ చట్టంలో మరో లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. విడాకులు తీసుకునే భార్యకు భర్త ఆస్తిలో వాటా ఉంటుందని ఒకవైపు పేర్కొంటూనే, మరోవైపు పెళ్లి తర్వాత వచ్చిన సంపదపైన మాత్రమే వాటా ఉంటుందని మెలిక పెట్టడం వల్ల బాధితురాలికి న్యాయం జరగదు. పెళ్లి చేసేటప్పుడే తమ కూతురు సుఖంగా ఉండగలదా? ఆ మేరకు వారికి ఆస్తి పాస్తులు ఉన్నాయా? లేదా అని చూస్తారు. కానీ పెళ్లి తర్వాత వారి ఆస్తి పాస్తులపై ఎలాంటి హక్కులు ఉండవని పరోక్షంగా ఈ చట్టం ద్వారా అమలులోకి రానుంది. పెళ్లి తర్వాత కేవలం భార్య జీతంపైనా, ఆమె తెచ్చే కట్నంపై ఆధారపడి వేధింపులకు గురి చేసేవారి బారినపడే భార్యకు ఈ కొత్త చట్టం ద్వారా న్యాయం లభించే అవకాశాలు లేకుండా పోతాయి. అలాగే పెళ్లి తర్వాత తనకు ఎలాంటి ఆదాయం లేనట్టుగా చూపించి విడాకులు తీసుకున్న భార్యకు మనోవర్తిని ఎగ్గొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. దత్తత పిల్లలకు విడాకులు పొందాక కూడా ఆస్తిపై హక్కు ఉండటం గతంలో ఉన్నదే. అసలు స్థూలంగా చూస్తే విడాకుల చట్టంపై ఎంత మందికి అవగాహన ఉందనేది ముఖ్యం. గ్రామీణ ప్రాంత మహిళలకు అయితే ఈ చట్టంపై ప్రాథమిక అవగాహన ఏమాత్రం ఉండదు. గ్రామ న్యాయస్థానాల వ్యవస్థ అమలోకి వస్తే, వారికి దీనిపై అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటిపై అవగాహన కల్పించేందుకు డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాన్ని గుజరాత్, హర్యానా రాష్ట్రాలు చేసి సత్ఫలితాన్ని పొందాయి.
- డాక్టర్ అచంట మమతా రఘువీర్
తరుణి స్వచ్ఛంద సేవా సంస్థ

శుక్రవారం 2 మార్చి 2012

శృంగారం లేకుంటే.. చావేరాదు!

శృంగారం లేకుంటే.. చావేరాదు!
అలైంగిక ప్రాణుల్లో అపరిమిత పునరుత్పత్తి
మరణంలేని ఫ్లాట్‌వార్మ్ జీవులపై అధ్యయనం
అంతులేని కణవిభజనతో కొత్త కణాల సృష్టి

క్రోమోజోముల్లోని టెలోమెర్ పొడవులోనే కిటుకు
టెలోమెర్‌ను పరిరక్షించే ఎంజైమ్ గుర్తింపు
విసృతంగా సాగుతున్న పరిశోధనలు
మనుషుల్లోనూ ఆయుష్షు పెంచడమే లక్ష్యం!
చేపలు తింటే మెదడు పెరుగుతుంది..
వయసు తగ్గుతుందంటున్న అమెరికన్ పరిశోధకులు
లండన్, ఫిబ్రవరి 29: వయసు పెరుగుదలను అరికట్టవచ్చా? జీవితకాలాన్ని పెంచడం సాధ్యమేనా? మరణాన్ని కూడా జయించవచ్చా?.. సెక్సుకు దూరమైతేనే అది సాధ్యమా? అవును, లింగ భేదంలేని ఒక జాతి జీవులు ఆ మార్గాన్ని చూపిస్తున్నాయంటున్నారు లండన్ శాస్త్రవేత్తలు! ఫ్లాట్ వార్మ్ వర్గానికి చెందిన ప్రాణులపై నాటింగ్‌హామ్ యూనివర్సిటీ పరిశోధకులు చేస్తున్న అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వయసు పెరుగుదలను అరికట్టి ఎప్పటికీ యవ్వనంగా ఉండగలిగే శక్తి వాటిలో ఉందని గుర్తించారు. ఈ జీవుల్లో జరిగే ప్రక్రియ మనిషి ఆయుష్షు పెంచడానికి కూడా మార్గం చూపుతుందని భావిస్తున్నారు.

ఫ్లాట్ వార్మ్ జీవుల అపరిమితమైన పునరుత్పత్తి సామర్థ్యం ఆశ్చర్యపరుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వయసు మీద పడిన, చెడిపోయిన కణాలను, కణజాలాన్ని ఈ క్రిములు ఎప్పటికప్పుడు కొత్తవాటితో మార్చేసుకుంటాయట! దాంతో అవి ఎప్పుడూ యవ్వనంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఫ్లాట్ వార్మ్ జాతికి చెందిన రెండు రకాల (లైంగిక చర్యతో పునరుత్పత్తి జరిపేవి, రెండుగా విడిపోయి తమ సంఖ్య పెంచుకునేవి) జీవులపై అధ్యయనం జరుగుతోంది.

'సాధారణంగా కొత్త కణాల అభివృద్ధికి మూలకణాలు (స్టెమ్ సెల్స్) ఉపయోగపడతాయి. కణాల పునరుత్పత్తి ప్రక్రియలో పాల్గొనే మూలకణాలు కూడా క్రమంగా శక్తిని కోల్పోయి చివరకు నశిస్తాయి. అయితే ఫ్లాట్‌వార్మ్ జీవుల్లో మాత్రం అలా జరగడం లేదు. అవి అపరిమితంగా అన్ని రకాల కణాలను పునరుత్పత్తి చేస్తున్నాయి. మెదడును కూడా ఎన్నిసార్లయినా కొత్తగా సృష్టించగలుగుతున్నాయి' అని పరిశోధకులు వివరించారు. 'కణ విభజన జరిగినపుడు మాతృ కణంలోని డీ ఎన్ఏ కొత్త కణానికి అందుతుంది. వాటిలోని క్రోమోజోముల జతలను ముడిపెట్టి ఉంచే టెలోమెర్ చాలా కీలకమైనది. గొలుసుకట్టుగా ఉండే క్రోమోజోమ్‌ల చివరన ఇది రక్షణ తొడుగులా ఉంటుంది. ప్రతిసారీ కణవిభజన జరిగినపుడు ఈ టెలోమెర్ పొడవు తగ్గిపోతుంది.

దీంతో కణాల్లోని జన్యు సమాచారం క్రమంగా నశించి.. వాటికి కొత్త కణాలను సృష్టించే శక్తి క్షీణిస్తుంది. అయితే మరణంలేని ఫ్లాట్‌వార్మ్ వంటి అలైంగిక జీవుల్లో మాత్రం టెలోమెర్ పొడవు ఎన్నటికీ మారడం లేదని భావిస్తున్నాం' అని ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ థామస్ టాన్ తెలిపారు. ఈ జీవుల్లో టెలోమెర్ నశించకపోవడానికి 'టెలోమెరాస్' అనే ఎంజైమ్ కారణమని ఆయన గతంలోనే కనుగొన్నారు. ఇందుకుగాను 2009లో ఆయనకు వైద్య రంగంలో నోబెల్ బహుమతి లభించింది.

మనుషుల్లో ఈ ఎంజైమ్ తొలినాళ్లలో మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని, అలైంగిక జీవుల్లో మాత్రం పునరుత్పత్తి జరిగిన ప్రతిసారీ ఇది పనిచేస్తుందని థామస్ గుర్తించారు. లైంగిక చర్య జరుపుకొనే జీవుల్లో మాత్రం ఈ ఎంజైమ్ ఎందుకు ఎక్కువ కాలం పనిచేయడం లేదన్నది శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. సెక్స్‌కు దూరంగా ఉండటం వల్లే 'టెలోమెరాస్' శక్తివంతంగా పనిచేస్తోందా? అన్న విషయాన్నీ వారు పరిశీలిస్తున్నారు. ఈ రహస్యాన్ని ఛేదించి మనుషుల్లోనూ టెలోమెర్ పొడవు తగ్గకుండా చేస్తే ఇక మరణం అనేదే ఉండకపోవచ్చు! లేదా జీవితకాలం అసాధారణంగా పెరగవచ్చు!

మరోవైపు.. వయసుకు సంబంధించే అమెరికన్ పరిశోధకులు మరో కొత్త విషయం బయటపెట్టారు. 'మీ మెదడు చురుగ్గా ఉండాలంటే చేపలు బాగా తినండి' అని కాలిఫోర్నియా యూనిర్సిటీ నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని పాటిస్తే మన మెదడుకు ముసలితనం రాదట! మనం తీసుకునే ఆహారంలో ఒమెగా-3 వంటి ఆమ్లాలు తగ్గడం వల్ల మెదడు కణాలు క్షీణిస్తున్నాయని, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని పరిశోధకులు గుర్తించారు. చేపలు అధికంగా తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, చేపనూనె వల్ల మెదడు చురుగ్గా మారుతుందని చెబుతున్నారు. 



గురువారం 1 మార్చి 2012

హిందువులలో అనైక్యం, ఇతరులలో సమైక్యం : కారణాలూ, పరిణామాలూ

ఒక గూగుల్ గుంపులో ఇటీవల జఱిగిన చర్చ

ఒక సభ్యుడు : 

మిషనరీలు ఇండియాలో రోజూ హిందూ దేవుళ్ళను/ దేవతలను/ పవిత్ర గ్రంథాలను బహిరంగంగా దూషిస్తుంటారు. హిందువులనుండి  రియాక్షన్ ఎందుకు రావడం లేదు? చిన్న పామునైనా, పెద్ద కఱ్ఱతో కొట్టటం అబ్రహామిక్ కల్ట్స్ యొక్క విధానం. దీనితో ఎవఱినైనా ఎలా భయభ్రాంతులకు గుఱిచేయాలో వారికి తెలుసు. హిందువులు మనగల్గాలంటే వారినుంచి కొన్ని ఉపాయాలను తప్పకుండా నేర్చుకోవాలి. ఒక పాతకాలం నాటి మసీదును కూలకొడితే, దానికి రియాక్షన్ గా 10,000 - 20,000 గుడులను పగలగొట్టారు పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్ లో, మలేషియాలో, ఇండొనేషియాలో, ఇతర మహ్మదీయ దేశాలలో ! ఇవే కుతంత్రాలను కమ్యునిష్టులు కూడా వాడుతుంటారు. 

రెండో సభ్యుడు :

మన గుళ్ళవద్ద కిరస్తానీ మిషనరీలు కరపత్రాలను పంచుతుంటే ఒక్కఱూ కిమ్మనరు. ఇక దూషిస్తే మటుకు ఏం చేస్తారూ? మనం చర్చిలవద్దకు వెళ్ళి అలాంటి కరపత్రాలిస్తే జఱగగల పరిణామాలు అనూహ్యం. అదీ మన ఐక్యత. అదీ మన సమాజపు "బలం". 

మొదటి సభ్యుడు : 

మాస్టారూ, (౧) హిందువులు ఐక్యంగా లేకపోవడానికి కారణాలను వెతకవలసి ఉంది. What is preventing Hindus unification ?  

(౨) హిందువులలో ఐక్యత రావడానికి కావలసిన అవకాశాలను (మార్గాలను) వెతకవలసి ఉంది. How can we achieve Hindu unity ? 

గమనిక (౧) : హిందువులు అందరు కులాల కతీతం ఏకంగా కావాలి, తమ ఆర్థిక, సామాజిక, మత, సాంస్కృతిక, భాషా ప్రయోజనాలను సాధించడానికి ! ఇది సాధ్యం కాని పక్షంలో గమనిక (౩), మఱియు గమనిక (౨) చూడండి. 

౩) కుల హిందువుల మధ్య ఐక్యత సాధ్యం కాని పక్షంలో (లేక ఎక్కువ కాలం పట్టుతుంది అనిపించినప్పుడు), *హీనపక్షంగా* (minimum) ఏ కులానికి ఆ కులంలో ఐక్యత తీసుకు రావడానికి కావలసిన అవకాశాలను వెతకవలసి ఉంది. ముందు ఏ కులానికి ఆ కులంలో ఐక్యత వస్తే, ఆ తరువాత ఇతర హిందూ కులాలతో కలసి పరస్పర సహకారం (హిందూ విషయాలమీద) ఎలా చేసుకోవాలో చూడవలసి వుంది. 

గమనిక (౨) : ఏ కులానికి ఆ కులం, "మొత్తము హిందువులకు హానికరమైన పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయము" అని ఒట్టు పెట్టుకోవాలి. ఏ కులానికి ఆ కులం తమ *ఆర్థిక ప్రయోజనాలను* కాపాడుకోవడంలో తప్పులేదు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం హిందువులకు హానికరమైన పనులు చేయరాదు. నీవు (నీ కులం) మైనారిటీల పార్టీ అయిన కాంగ్రేస్ తో జట్టు కట్టు, లేక కమ్యునిష్టులతో జట్టు కట్టు, కాని కాంగ్రేస్ గాని, కమ్యూనిష్టులు గాని హిందువుల ప్రయోజనాలకు హాని చేస్తుంటే వారికి మద్దతివ్వకు. వారిచేత హిందువులకు అవసరమైన పనులు చేయించు. ఒక ఎడారిమతస్థులు తాము మైనారిటీలుగా ఉన్న దేశాలలో ఈ విధానాన్ని పాటిస్తుంటారు. తాము మెజారిటీలుగా ఉన్న దగ్గఱ, ఆ దేశాన్ని తమ మతదేశంగా ఆధికారికంగా ప్రకటించి, ఇతరులను దోచుకుంటూ ఉంటారు. అందుకే ఆ దేశాలలో 95 - 99.99% ఆ మతస్థులే ఉంటారు. ఆ దేశాల్లో నివసించే ఇతరులు షరియా వ్యవస్థలో నీళ్ళ బైట ఉన్న చేపల్లాగా గిలగిలా కొట్టుకుంటారు. 

గమనిక (౩) : ఇండియాలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న "సామాజిక న్యాయం" అనేదాన్ని, కులకోణంలోంచి నిర్వచించి హిందువులను ఇంకో పార్శ్వం నుంచి విడగొడుతున్నారు. భవిష్యత్తులో దీని బదులు "సామాజిక న్యాయం" అనే దాన్ని మతస్థాయిలో నిర్వచించాలి. అంటే హిందూ సామాజికన్యాయం, మహ్మదీయ సామాజికన్యాయం, కిరస్తానీ సామాజికన్యాయం మొదలైనవి. అప్పుడు కులాల మధ్య ఉన్న ఈ వీథిపోరాటాలు తగ్గి, వాటి మధ్య ఐక్యత వస్తుంది. 

గమనిక (౪) ఈ రోజున సైంటిఫిక్ గా ఆలోచించగల హిందూ తత్త్వవేత్తలు (community leaders) ఎవఱూ లేకుండా పోయారు. ఈ శూన్యాన్ని (vaccum) హిందువులు త్వరగా భర్తీ చేసుకోవాలి. 

మూడో సభ్యుడు :

నేనిక్కడ చెబుతున్నది  పైకి చిన్నవిషయంలా కనిపిస్తుంది. కానీ ఇది చాలా పెద్ద విషయం. అబ్రహామిక మతాలవారు ఐక్యంగా ఉండడాని క్కారణాలు కొన్ని ఉన్నాయి. 

౧. ఏ జాతికైనా తన గుఱించి తనకు కొంత సామూహిక స్మృతి (collective memory) ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే అబ్రాహామిక మతాలు నిజానికి మతాలు కావు. అవి వాళ్ళ కమ్యూనిటీల యొక్క చరిత్రపుస్తకాలు. వాటిల్లో మతం/ ఉపాసన ఎలిమెంట్ చాలా తక్కువ. వాటినుంచి వారు స్ఫూర్తి పొందుతారు. చరిత్రని మర్చిపోని/ మఱియు దాన్నుంచి గుణపాఠాలు నేర్చుకునే జాతిని ఎవడూ ఓడించలేడు. హిందువుల పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ హిందువుల స్మృతిపథంలో తమందఱి యొక్క సామూహిక చరిత్ర లేకపోవడమే కాక తప్పుడుచరిత్ర ఒకటి, తమది కాని చరిత్ర ఒకటి  వాళ్ళల్లో విద్యావిధానం ద్వారా చొప్పించబడుతున్నది. 

౨. అబ్రహామిక మతాలు గత 1500 సంవత్సరాల్లో ఇతర సంస్కృతులపై ఆధిపత్యం కోసం ప్రపంచవ్యాప్తమైన యుద్ధాలు చేశాయి భౌతికంగానూ, సాంస్కృతికంగానూ ! ఈ యుద్ధవ్యూహాలన్నీ వాళ్ళకి కొట్టిన పిండి. ఎలా ఆర్గనైజ్ అవ్వాలో వాళ్ళు నేర్చుకున్నారు. దాన్నొక సైన్సుగా రూపొందించారు. అందుచేత (మతపరంగా) లోకజ్ఞానం లేని పసిబిడ్డల్లాంటి హిందువుల్ని చుట్టబెట్టడం వాళ్ళకో లెక్కలోది కాదు. ఇక్కడ కూడా వాళ్ళ సామూహికస్మృతి, ఉమ్మడి అనుభవం వారికి అక్కఱకొస్తోంది. ఈ విషయంలో మన హిందువులు వాళ్ళతో పోలిస్తే నిన్నమొన్న కళ్ళు తెఱిచిన పసిబిడ్డల్లాంటివాళ్ళు. యుద్ధం చేయాల్సివస్తే కంగారుపడిపోవడమే తప్ప మనకి గుఱి చూసి ఎక్కడ బాణం సంధించాలో తెలీదు. ఉదాహరణకి - ఈ మధ్య భగవద్గీత గుఱించి ఒక రష్యన్ కోర్టులో చెలరేగిన రభస. ఒకవేళ నిజంగానే రష్యాలో భగవద్గీతని నిషేధిస్తే మనం కూడా పోటీగా ఎదురుచర్యలకి దిగుతామని హెచ్చఱించే పాటి వృషణాలు లేని జాతి ఇది. ఊరికే ఉచ్చపోసుకుంటూంటారు ప్రతీవాణ్ణీ చూసి ! 

అయితే ఇంత మొనగాళ్ళయిన అబ్రహామిక మతాలు కూడా హిందూమతం దగ్గఱికొచ్చేసరికి ఘోరపరాభవాన్ని ఎదుర్కుంటున్న మాట వాస్తవం. వేఱే దేశాల్లో సాధించినంత సులభంగా వాళ్ళిక్కడ హిందూమతాన్ని సాధించలేకపోతున్నారు. ఈ అవమానభారం మూలాన్నే యావత్తు క్రైస్తవలోకమూ, మహ్మదీయలోకమూ మనల్ని ద్వేషిస్తుంది. నిజానికి వాళ్ళ దేశాల్లో హిందువులు ఆట్టే లేరు.వాళ్ళ చరిత్రల్లో వాళ్ళకి మనం చేసిన అపకారమూ ఏమీ లేదు. అయినా ఊరికే ద్వేషిస్తారు, వాళ్ళ మతాల్లో ఇండియా చేఱలేదనే అక్కసుతో ! మన మతం ప్రపంచం కంటే వేఱైనది కావడం వల్లనే మనకి నమ్మదగ్గ మిత్రులు గానీ సానుభూతిపరులు గానీ ఎవఱూ లేరు ప్రపంచ దేశాల మధ్య ! మహా అయితే మన సైజు చూసి కాస్త భయపడతారంతే ! సింగపూరు, శ్రీలంకలాంటి చిన్నచిన్న దేశాలక్కూడా ఇండియా అంటే ద్వేషమే. 

౩. హిందువులకి మతం కంటే కులమే పెద్దవిషయం. ఇప్పటికీ హిందువుల్లో ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే మతం తమకి సంబంధం లేదనీ, అది బ్రాహ్మలకి సంబంధించిన టాపిక్ అనీ, దాని బాగోగులు బ్రాహ్మలే చూసుకోవాలనీ ! దానికి తోడు ఈ మతం గుఱించి ఎక్కువగా పట్టించుకునేదీ, ఆందోళన చెందేదీ కూడా బ్రాహ్మణులే కావడం ఈ దురభిప్రాయానికి మఱింత ఆజ్యం పోసింది. 

ఇండియాలో నాన్-హిందూవర్గాలు తమంతట తాము సహజంగా ఆర్గనైజ్ అయిలేవు. వాటిని మొదట్నుంచీ ప్రభుత్వమే మెజారిటీకి వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేస్తూ వచ్చింది. ఈ పని మొదట బ్రిటీషువారు, తరువాత నెహ్రూ, ఆ తరువాత ఇందిరాగాంధీ etc etc. చేస్తూ వచ్చారు. హిందూ వోట్ ని చీల్చి అందులో తమ కనుకూలమైన వోట్లకి మైనారిటీ వోట్లని కలుపుకుని అధికారంలోకి రావడం కోసం ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తూ వచ్చారు. వీళ్ళ స్కీములో హిందువుల్ని కులాల వారీగా (రిజర్వేషన్ల ద్వారా ) విడగొట్టాలి. కులాభిమానాల్ని పెంపొందించాలి. ఈ రకంగా వ్యవస్థాగతమైన ఏర్పాట్లన్నీ మతపరంగా కాక కులపరంగా ఉండడంతో హిందువులు కూడా మతపరంగా కాక కులపరంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నారు. ముందేమో ఇలా ఎస్సీ ఎస్టీల విషయంలో ప్రయోగించారు. ఇహ ఇప్పుడా అవసరం తీఱిపోయింది. కనుక ఆ తరువాత - అంటే ఇప్పుడు బీసీల్నీ, ఓబీసీల్ని రెచ్చగొడుతున్నారు. 

దీనికి పరిష్కారమేంటంటే హిందూ-అనుకూల పార్టీ ఏదైనా అధికారంలోకి వచ్చినప్పుడు, నేనిదివఱకు మనవి చేసినట్లుగా హిందువులందఱినీ (పోప్ లాంటి) ఒకే ధర్మపీఠం కిందికి తీసుకొచ్చి ఆ పీఠానికి ఆధికారిక, ప్రభుత్వ గుర్తింపునివ్వడం, అలా ఒక హిందూ వోట్‍బ్యాంకుని కృత్రిమంగా సృష్టించడం. కాంగ్రెస్ ఇలాంటిదాన్ని ఇమామ్ బుఖారీ, దేవబంద్ ముస్లిమ్ సెమినరీల ద్వారా ముస్లిముల కోసం చేస్తోంది.

మొదటి సభ్యుడు :

దీనిని బట్టి మనకు ఏమి తెలుస్తుంది. Abrahamic "ideology driven cults" లో *మనుషుల జీవితాలకు విలువ లేదు* అని. వారికి - మనుషులు పనిముట్టులు (సాధనాలు) మాత్రమే. అబ్రహామిక్ cults లో (కిరస్తానీలు, ఎడారిమతస్థులు, కమ్యునిష్ట్ లు) ఎవఱు ఎక్కువ హింస (యుద్దాలు) చేయగలిగితే వారు విజేతలు. అందుకే వారు హింసను ఒక ఆయుధంగా వాడతారు. ఇండియాలో 1000 సంవత్సరాల ఎడారిమతపు రక్తమయ హింసాచరిత్రను మసిపూసి మన (హిందువుల) పిల్లలచేత చదివిస్తున్నారు. అసలు చరిత్రను రాస్తే/ చదివితే, కుల హిందువులు సిగ్గుతో చచ్చిపోతారు. మన సమాజము గత 1000 సంవత్సరాలుగా ఇంత దయనీయంగా ఉన్నా కూడా, కులహిందువులు దాన్నుంచి పాఠాలేమీ నేర్చుకోవడం లేదు, మనలాంటి చాలా కొద్ది మంది తప్ప ! ఈనాడు మన కళ్ళ ముందు జఱుగుతున్న ఇలాంటి సంఘటనలు చూసిన తరువాత కూడా వారి యొక్క అసలుఉద్దేశాల నగ్నస్వరూపాన్నికుల హిందువులు గ్రహించలేకపోతున్నారు. 

ఉదాహరణకు (ఇది ఒక ఊహ మాత్రమే, నిజంగా జఱుగుతుందని కాదు ), హిందువుల పవిత్రవస్తువులకి ఏదైనా అపచారం జఱిగితే, హిందువుల రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏమీ ఉండదు. ఎప్పటిలానే కుల హిందువులు తమ జీవితాలను వెళ్ళదీస్తారు. అదే ఇండియాలో ఒక అబ్రహామిక్ cult కి అపచారం జఱిగితే, ఇండియా మొత్తం అల్లకల్లోలం అవుతుంది. దీని బట్టి అర్దమయ్యేది ఏమంటే, అల్లకల్లోలాల మీద కూడా వారికి గుత్తాధిపత్యం (monopoly) ఉంది. అవి వారు మాత్రమే చేయాలి.

వాస్తవం ఇలా ఉన్నప్పటికీ, నా అభిప్రాయంలో We, the Hindus must always follow the Gandhian method of Ahimsa. We should reach wider audiences and educate other people. ఎంత మంది హిందువులు ఎంత త్వరగా చైతన్యవంతులయితే, అంత త్వరగా హిందువుల ఐక్యత సాధ్యమవుతుంది. చిన్న చిన్న అవరోధాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

బుధవారం 29 ఫిబ్రవరి 2012

మహాత్ముడికే మత మార్పిడి ; మరణానంతరం బాపూజీకి బాప్టిజం ; లేటర్ డే సెయింట్స్ చర్చ్ నిర్వాకం?

మహాత్ముడికే మత మార్పిడి ;
మరణానంతరం బాపూజీకి బాప్టిజం ;
లేటర్ డే సెయింట్స్ చర్చ్ నిర్వాకం?


బయటపెట్టిన పరిశోధకురాలు రాడ్ కీ
రికార్డులు మాయమయ్యాయని వెల్లడి
మహాత్ముడి మనవడి విస్మయం
మండిపడ్డ హిందూ అమెరికా ఫౌండేషన్
చర్చి అధ్యక్షుడి క్షమాపణకు డిమాండ్

"ప్రపంచంలో అన్ని మతాలూ నిజమే, అన్నిట్లోనూ ఏవో కొన్ని లోపాలున్నాయి. అయినప్పటికీ నా మతం నాకు గొప్పది. ఒక మతం వ్యక్తి మరొక మతంలోకి మారాల్సిన అవసరం లేదు. అయితే, ఒక హిందువు మరింత ఉత్తమమైన హిందువుగా మారాలి. ఒక క్రైస్తవుడు మరింత ఉత్తమమైన క్రైస్తవుడుగా, ఒక ముసల్మాన్ మరింత ఉత్తమమైన ముసల్మాన్‌గా మారాలి.'' - మహాత్మా గాంధీ (యంగ్ ఇండియా 28.01.1928)

వాషింగ్టన్, ఫిబ్రవరి 28: వ్యక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రైస్తవ మత సంస్థలు... మరణానంతరం మహాత్ములకూ మతాన్ని అంటగడుతున్నాయా? హిందూమత సిద్ధాంతాల్నీ.. గీతాసారాన్నీ బలంగా విశ్వసించిన మహాత్ముడికి ఒక అమెరికన్ చర్చ్ బలవంతంగా క్రైస్తవం ఇచ్చిందా? మరణానంతరం ఆయన పేరు మీద బాప్టిజం 'ప్రసాదించిందా'? ..ఈ ప్రశ్నలన్నిటికీ హెలెన్ రాడ్ కీ అనే పరిశోధకురాలు అవుననే సమాధానమిస్తున్నారు.

1996 మార్చి 27న అమెరికాలోని ఉటాహ్ రాష్ట్రంలోని సాల్ట్‌లేక్ నగరంలో ఉన్న చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ (ఎల్డీఎస్) గాంధీజీ పేరిట బాప్టిజం ఇచ్చిందని, సావోపాలో బ్రెజిల్ టెంపుల్‌లో 2007 నవంబరు 17న ఈ ప్రక్రియ పూర్తయిందని చెబుతున్నారు. ఈ ఎల్డీఎస్ చర్చ్ మోర్మన్ చర్చ్‌గా బహుళప్రాచుర్యం పొందింది. గతంలో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీపడిన జాన్‌కెర్రీ, 2012 అధ్యక్ష పదవి రేసులో ఉన్న మిట్ రోమ్నీ వంటివారు ప్రముఖ మోర్మన్లు. గాంధీజీ పేరు మీదబాప్టిజం ఇచ్చినట్టు వెల్లడించిన హెలెన్ రాడ్‌కీ సైతం ఒకప్పుడు మోర్మనే. అనంతరకాలంలో ఆమె చర్చ్ నుంచి వెలికి గురయ్యారు.

'ది డైరీ ఆఫ్ ఏన్ ప్రాంక్' రాసిన యూదు చిన్నారి ఏన్‌ఫ్రాంక్ కు కూడా ఎల్డీఎస్ ఇలాగే మరణానంతరం బాప్టిజం ఇచ్చినట్టు గతంలో వెల్లడించి సంచలనం సృష్టించిన చరిత్ర రాడ్‌కీకి ఉంది. ఇదే కోవలో.. గాంధీజీకి కూడా లేటర్‌డే సెయింట్స్ చర్చ్ బాప్టిజం ఇచ్చినట్టు నెవడాలోని హిందూ కార్యకర్త రాజన్ జెడ్‌కు ఆమె ఒక ఈమెయిల్ పంపారు. గాంధీజీ పేరు మీద బాప్టిజం ఇచ్చినట్టుగా ఉన్న రికార్డును తాను ఫిబ్రవరి 16న చూసినట్టు అందులో పేర్కొన్నారు. అయితే... తాను చూసిన కొద్దిరోజులకే ఆ రికార్డును మాయం చేశారని, అదిప్పుడు దొరికే అవకాశం లేదని వెల్లడించారు. ఇలా ఒక రికార్డు మాయమవడం అసాధారణమైన విషయమని తన మెయిల్‌లో పేర్కొన్నారు.

ఈ విషయం ఇతరులకు తెలియకూడదన్నది మోర్మన్ల ఉద్దేశంగా భావిస్తున్నానన్నారు. కాగా.. ఈ విషయం తెలిసి మహాత్ముడి మనుమడు అరుణ్‌గాంధీ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ఇలా ఒక వ్యక్తి మరణించాక, అతని పేరు మీద ఇష్టం వచ్చినట్టు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. హిందువులుగానీ, ఇతర మతస్థులెవరైనాగానీ... మతమార్పిడికి పాల్పడటాన్ని తన తాతయ్య పూర్తిగా వ్యతిరేకించేవారని అరుణ్ అన్నారు. గాంధీజీ అన్ని మతాలనూ గౌరవించేవారని, ఏ మతాన్ని అనుసరించాలన్నది వ్యక్తులు స్వయంగా నిర్ణయించుకోవాలని, ఇతరులు వారిని బలవంతం చేయకూడదని భావించేవారని అరుణ్‌గాంధీ వివరించారు.

ఇక... హిందూ మతం పట్ల ప్రగాఢ విశ్వాసం గల గాంధీజీ పేరు మీద ఆయన మరణానంతరం బాప్టిజం ఇవ్వడమంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని వాషింగ్టన్‌లోని హిందూ అమెరికా ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్)కు చెందిన సుహాగ్ శుక్లా మండిపడ్డారు. ఈ విషయమై రాడ్‌కీ నుంచి లేఖ అందుకున్న రాజన్ జెడ్... దీనిపై తాను ఎల్‌డీఎస్ చర్చ్ అధ్యక్షుడు థామస్ ఎస్ మాన్సన్‌కు ఫిబ్రవరి 24న లేఖ రాశానని తెలిపారు. అయితే ఇప్పటికీ ఆయన వద్ద నుంచి జవాబు రాలేదన్నారు. "మాన్సన్ దీనికి క్షమాపణ చెప్పాలి. ఇదెలా జరిగిందో ఆయన చెప్పాల్సిందే'' అన్నారు. 

andhrajyothy  news 

శుక్రవారం 24 ఫిబ్రవరి 2012

తమవేమో పవిత్రనమ్మకాలు, ఇతరులవేమో మూఢవిశ్వాసాలు !

౧) ఒక  తెల్ల  మిషనరి, ఇతర సమాజాలను (Societies) స్టడి చేస్తే దానిని "Anthropology" అంటాడు. తన సమాజాన్ని స్టడి చేస్తే దానిని "Sociology" అంటాడు.

౨) తెల్ల మిషనరి, ఇతర మత నమ్మకాలను Myth (Mythology) అంటాడు. తన మత నమ్మకాలను "Sacred Beliefs" అంటాడు 

౩) తెల్ల మిషనరి, ఇతరుల చరిత్రను "కల్పితము, మతవిశ్వాసము" అంటాడు. తన మతగ్రంథం మాత్రం "నిజమైన, నిఖార్సైన చరిత్ర" అని బుకాయిస్తాడు.

౪) తెల్ల మిషనరి, "ఇతరులు సైతానును కొలుస్తారు" అంటాడు "తాను ఒక్కడే నిజమైన దేవుడిని కొలుస్తున్నాను" అంటాడు 

౫) తాను 1st World అంటాడు. ఇతరులు 3rd World అంటాడు 

౬) "తాను ప్రపంచవ్యాప్తంగా ఇతర సమాజాలలోకి చొచ్చుకుపోయి మత మార్పిడి చేసి ఆ సమాజాన్ని నాశనం చేయవచ్చు" అంటాడు అక్కడి స్థానిక ప్రజలు దానికి అభ్యంతరం చెబితే (ప్రతిఘటిస్తే) , వారిని "తీవ్రవాదులు" అంటాడు 

 ౭) "తన పుస్తకమే నిజమైనది" అంటాడు. "ఇతరుల పవిత్ర గ్రంధాలు సైతాను ప్రేరేపించినవి" అంటాడు. అవి మూడు వేల సంవత్సరాలకు ముందునుంచి ఉన్నా, తమ మతం వయసు కేవలం 2 వేల సంవత్సరాలే అయినా !

గురువారం 23 ఫిబ్రవరి 2012

ఎక్కడైనా మహాసముద్రం ఇంకిపోతుందా?!!!

మహాసముద్రం ఇంకిపోతుందా?
గీతాంజలి మూర్తి


'ఎక్కడ ఆత్మ గౌరవం నిర్భయంగా తలెత్తుకుని తిరుగుతుందో 
ఎక్కడ లోకం సంకుచిత అడ్డుగోడలతో విచ్ఛిన్నం కాదో
అట్టి సర్వస్వతంత్ర స్వర్గంలోకి, 
తండ్రీ, నా దేశాన్ని నడిపించు'

- రవీంద్రనాథ్ టాగూర్ 'గీతాంజలి'

'ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ఉండాలి. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం లేనందువల్లే భారతదేశంలో శ్రామిక కులాలు అణచివేయబడ్డాయని' కంచ ఐలయ్య తన 'హిందూ మతానంతర భారతదేశం'లో అన్నారు. ఇది పూర్తిగా తప్పుడు అవగాహనతో చేసిన ఆరోపణ. ఆధ్యాత్మిక రంగంలో రాజకీయ సామాజిక రంగాలలో వలే ప్రజాస్వామ్యం ఉండటమేమిటి? మనమేదో కొత్త భావాలు, 'పదజాలం' నేర్చుకున్నాం కాబట్టి, వాటిని అలౌకికమైన ఆధ్యాత్మిక రంగానికి పులమటమే తప్పు. అయినా హిందూ వ్యవస్థలో, మానవులందరూ సమానమేననీ, అందరికీ ఆ భగవంతుని దృష్టిలో సమానావకాశాలు ఇవ్వబడినాయనీ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

దార్శనికులైన భారతీయ ఋషులు సమస్త మానవ జాతి సుఖ సంతోషాలతో ఏ భేద భావం లేకుండా జీవించాలనీ, పశుపక్ష్యాదులను సైతం కరుణతో చూడాలనీ బోధించారు. వారి స్ఫూర్తితోనే మహాత్మా గాంధీ 'సత్యాహింసలను' ఉద్యమ సాధనలుగా చేసుకొని దేశ స్వాతంత్య్రం సాధించారు. అయితే పూర్వకాలంలో అజ్ఞానంతో, అహంభావంతో కొందరు మూర్ఖులు, కొన్ని మూఢాచారాలతో సమాజంలో ఎక్కువ తక్కువలను పాటించిన మాట వాస్తవం. అయినా కాలక్రమంలో ఇప్పుడు చాలా మంది అవన్నీ వదిలివేసి, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ఇష్టంగా ఆచరణలో పెడుతున్నారు.

ఆధునిక జీవన విధానంలో, విప్లవాత్మక మార్పులు వచ్చి, సమాజంలో, కులాంతర, మతాంతర వివాహాలు కూడా చాలా అసాధారణంగా జరిగిపోతున్నాయి. పెద్దలు కూడా విశాల హృదయంతో వాటిని ఆమోదించి, పరిణతి చెందిన మనసులతో అందరూ కలిసి మెలసి ఉండటం చూస్తున్నాం. హిందువులలో ఇలా విప్లవాత్మక మార్పులు నిశ్శబ్దంగా చోటుచేసుకోవటం గమనార్హం. ఇదొక గొప్ప మార్పు. ఇలా మార్పు జరిగింది. ఇంకా జరుగుతోంది. దీనిని ఐలయ్య గుర్తించి హర్షించరా? అంతేకాక అన్ని దేవాలయాలలోనూ, పరిపాలనా మండలులు చాలావరకు బ్రాహ్మణేతరుల చేతిలోనే ఉన్నవి కదా.

చాలాచోట్ల అన్ని కులాల, వర్గాల ప్రజలకు దేవాలయ ప్రవేశం నిరాటంకంగా హాయిగా జరుగుతోంది కదా. ఈ మధ్య మా తెనాలిలో శ్రీశ్రీ దండి స్వాముల వారి ఆధ్వర్యంలో సహస్ర హోమయాగం జరిగింది. అందులో అన్ని కులాల వారికీ వర్గాల వారికీ ఏ భేద భావం లేకుండా, ఆ యజ్ఞం స్వయంగా జరుపుకునే అవకాశం ఇవ్వబడింది. ఎందరో, ఎవరెవరో చుట్టు పక్కల ఊళ్ళ నుంచీ స్వేచ్ఛగా వచ్చి మహదానందంగా ఆ యజ్ఞంలో పాల్గొన్నారు. తరువాత, అందరికీ సమానంగా ప్రసాదం (భోజనాలు) అందజేయ బడినాయి. నేను ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి చాలా ఆనందించాను. ఇలా ఎన్నో కార్యక్రమాలు కుల భేదం లేకుండా అనేక చోట్ల జరుగుతున్నది వాస్తవం.

మరొక అద్భుత మార్పు. డాక్టర్ అంబేద్కర్ వంటి మహనీయుని, దార్శనికుని నేతృత్వంలో రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి కలిగించిన రిజర్వేషన్ల వలన అన్ని రకాల క్రింది వర్గాల వారికి విద్య/ఉపాధి ఇతర రంగాలలో అవకాశాలు మెండుగా ఇవ్వబడుతున్నాయి కదా. అన్ని రకాల, రాజకీయ పరిణతి వలన వివిధ అత్యున్నత రాజ్యాంగ పదవులను సైతం ఆ వర్గాల వారు అలంకరించటం కూడా వాస్తవమే కదా. నాకైతే ఈ ప్రగతిశీల పరిణామాలు ఎంతో సంతోషదాయకంగా ఉన్నవి.

ఇలా అన్ని భేద భావాలూ పోగొట్టుకుని అందరూ సమానావకాశాలతో ముందుకు సాగుతున్న ఈ రోజులలో ఐలయ్య లాంటివారు పనిగట్టుకొని కులద్వేషాన్ని రెచ్చగొట్టే రాతలు రాయటం ఎంత మాత్రం సబబు కాదు. అంతే కాదు ఎంతమందో మఠాధిపతులు, పీఠాధిపతులుగా కూడా బ్రాహ్మణేతరులే ఉన్నారు. నేను శిష్యుడిగా ఉన్న యోగదా సత్సంగ సొసైటీ (రాంచి)లో నిర్వాహకులు (అధిపతులు) దాదాపు అందరూ బ్రాహ్మణేతరులే. చక్కగా సన్యాసం పుచ్చుకొని, అందరికీ యోగ సాధనలను శాస్త్రీయంగా నేర్పుతున్నారు.

ఆశ్రమంలో, నాకు దీక్షనిచ్చిన సాధువు, హిందూ మతాన్ని ఇష్టంతో స్వీకరించిన ఒక విదేశీ సాధువు అంటే నమ్ముతారా? ఇది నా అనుభవంలో జరిగిన వాస్తవం. ఈ వాస్తవ నేపథ్యంలో కంచ ఐలయ్య లాంటివారు కళ్ళు బాగా తెరిచి, వారి భాషలోనే 'ప్రజాస్వామ్యం' హిందూయిజంలో సజావుగా అమలవుతోందనీ, వారేమీ ఆందోళన పడనవసరం లేదని, ఉచిత సలహాల పేరుతో, తప్పుడుభాష్యాలు చెప్పొద్దనీ నా సలహా.

ఇక భారతదేశంలో శ్రామిక కులాలు అణచివేయబడటానికీ హిందూయిజం మాత్రమే కారణం కాదు. కొన్ని ఆచార వ్యవహారాలు పాటించలేకపోవటం వలన, పూర్వం క్రింది వర్గాలను దేవాలయాలలోకి రానివ్వక పోవటం, దూరంగా ఉంచటం జరిగిన మాట వాస్తవమే. ఇది చాలా తప్పే కాని శ్రామిక వర్గాలను అణచివేసింది ఆనాటి/నేటి వ్యాపార వర్గాలు, రాజకీయులు, పాలకవర్గాలనేదే వాస్తవం. పాలనలో ఎవరుంటే వారు శ్రామికులకు న్యాయమైన ప్రతిఫలం ఇవ్వక దోపిడీ చేసి పైకిరానివ్వలేదు. హిందుయిజానికీ శ్రామికులకు ప్రత్యక్ష విరోధమెప్పుడూ లేదే.

అయితే పారిశ్రామికీకరణ జరిగిన/జరుగుతున్న క్రమంలో కమ్యూనిస్టు ఉద్యమాల ఫలితంగా మాత్రమే శ్రామికులు అభివృద్ధిలోకి వచ్చారనేది కాదనలేని వాస్తవం. ఈరోజు రైతులనూ, కూలీలనూ గిరిజనులనూ/క్రింది తరగతుల వారినందరినీ, వారి మనుగడనూ కాలరాసే వారు ఎవరు? కేవలం ఒక మతపరమైన హిందువులా లేక వ్యాపార రాజకీయ వర్గాలా? శ్రామికుల తరఫున పోరాడితే వామపక్షాలతో కలిసి పోరాడండి. ఫలితం రావచ్చు. అసలు వామపక్షాల వారు మీ పిడివాదమైన హిందూయిజం వ్యతిరేకత జోలికిరారే. వారికి ఉన్న ఇంగిత జ్ఞానం ఆచార్య పదవిని అలంకరించిన ఐలయ్యకు ఎందుకు లేదో ఆశ్చర్యం కలుగుతుంది. మోటుగా వాదిస్తే అది హేతుత్వానికి నిలవదు సుమా!

"క్రైస్తవ సమాజం ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని ఆచరించినందువల్లే, క్రిస్టియానిటీ 'వ్యాపించే గమనాన్ని' (స్ప్రెడింగ్ క్యారెక్టర్) సంతరించుకుని వేగంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ఉందని'' డాక్టర్ గోపీనాథ్ ('ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య మేదీ?' జనవరి19, ఆంధ్రజ్యోతి) అన్నారు. ఆయనే మరో మాట శెలవిచ్చారు: 'హిందూ మతం కనీసం భారతదేశంలోనైనా బ్రతకాలంటే, అది తనను తాను సంస్కరించుకోవడం ఒకటే మార్గం'. ఎంత గొప్ప అవగాహన!

ఇందుకే కాబోలు, ఆ మధ్య గౌరవనీయులు పోప్ పాల్ అన్నారు:"there is a lot of untapped potential in india, for christianity to expand...' (సరిగ్గా ఈ మాటలే కాకపోయినా, ఈ భావవ వచ్చే మాటల్లో). నేను ఒప్పుకుంటున్నాను. క్రైస్తవ మతం తన సామ దాన భేద దండోపాయాలతో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. తన కపట నాటకంతో, మాయ మాటలతో అమాయక పేదలు, గిరిజనులనే కాకుండా మితిమీరిన ధనాశ చూపించి, పెద్ద రాజకీయ నాయకులను కూడా బుట్టలో వేసుకోవటం జరుగుతోంది. మరి హిందువులు అస లు దురాశాపరులు కాదు కదా! వారిలాగా హిందూయిజం ఎలా వ్యాప్తి చెందుతుంది? చెందదు.

ప్రొఫెసర్ భూక్యా ఇలా రాశారు ('హిందూ ఫాసిజమే భారత్‌కు హాని' జనవరి 25, ఆంధ్రజ్యోతి): 'భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారకుడైన వ్యక్తిని (ఇటలీ దేశస్థుడైన ఖత్రోచీ) చట్ట విరుద్ధంగా స్వదేశానికి వెళ్ళిపోవడానికి మన పాలకులే సహకరించలేదా?' హిందూయిజానికీ, ఖత్రోచీ పారిపోవటానికీ సంబంధమేమిటో పాఠకులకు తెలియజేస్తారా? ఖత్రోచీని, మీ నాయకురాలైన ఇటలీ దేశస్తురాలి ఆదేశాల పైనే కదా, ఆమె చేతినీళ్ళు తాగి బ్రతికే పాలకులు కుట్ర పూరితంగా, సురక్షితంగా దేశ హద్దులు దాటించారు? మీ నాయకురాలిని సూటిగా అడగలేకనా? దురదృష్టం. సరే, ఏది ఏమైనా కుయుక్తులతో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం లాగా విస్తరించాలనుకున్న క్రిస్టియానిటీ పంథా హిందూ మతానికి అవసరం లేదు. హిందూ మతం అలా అధర్మ విధానానికి పాల్పడదు.

తెలిసో తెలియకో భూక్యా ఇలా రాశారు: 'ముస్లింల రాకతోనే హిందూ మతం పుట్టింది. అంతకు ముందు హిందూ అనే పదమే వాడుకలో లేదు'. రచయిత వాదనను బట్టి, ఇప్పుడు వ్యవహరిస్తున్న 'హిందూ' అనే పేరుతో పిలువబడుతున్న మతం ఈ భారతదేశంలో 'ముస్లిం' దోపిడీదారులు మన దేశంపైకి దండెత్తి వచ్చేవరకు లేదు. మరి ఈ జాతికి, అప్పుడు వ్యవహరిస్తున్న మతం ఏమిటి? ఏమీ లేదా? ఆలోచించడం. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు అనుసరించిన అప్పటి ప్రజలు దేనిని అనుసరించారు? వారి గురువులు వాటిలోని బోధనలను ఏమని చెప్పారు? ముస్లింలు రాక పూర్వం ఈ జాతి అనుసరించినది 'సనాతన ధర్మం'. ఇతర మతాలు వచ్చిన తరువాతే ఈ 'మతం' (అంటే అభిప్రాయం) అనే పదం వాడుకలోకి వచ్చినట్లు తెలుస్తున్నది. కాబట్టి, ఈ దేశానికి ఉన్న పేరు ప్రకారం- 'భారత'దేశం. అనగా భా అంటే జ్ఞానం/ప్రకాశం; రత అంటే కలిసి ఉండటం. కాబట్టి భారతదేశం అంటే జ్ఞానంతో వెలిగిపోవటం, కాంతినివ్వటం. ఈ భావమే ఈ జాతిలో/హిందువులలో, అణువణువునా నిండి నిబిడీకృతమైన, సనాతన ధర్మాచరణ.

ఐలయ్య చెప్పినట్లు హిందూయిజం అంతరించకపోవటం అటుంచి, అనూహ్యంగా, నిశ్శబ్దంగా, ప్రపంచ దేశాలలో తనదైన శైలిలో ఆధ్యాత్మికంగా (వ్యాపారాత్మకంగా కాదు) విస్తరిస్తోంది. ఇస్కాన్‌లోని అనుయాయులందరూ దాదాపు విదేశీయులే కదా. భగవద్గీత, రామాయణాలు అనేక దేశాలలో అనువదితమయ్యాయి. రష్యా/ ఇండోనేషియాలలో రామాయణం నృత్యరూపకంగా ప్రదర్శించుకుంటారట. ఈ మధ్యన, రష్యాలో భగవద్గీతను అక్కడి వారు రష్యన్ భాషలోకి అనువదించారని, అయితే ఆ అనువాదంలోని కొన్ని అంశాలు వివాదాస్పదమై కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నదనీ తెలుస్తోంది కదా. సత్యసాయిబాబా కేంద్రాలు, రామకృష్ణా మిషన్, యోగదా సత్సంగ సొసైటీ వంటి అనేక సంస్థలు, ఆశ్రమాల కేంద్రాలు ఎన్నో దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇది వ్యాప్తి కాదా? అది కూడా ఎవరినీ, ఏ ప్రలోభం పెట్టకుండా సుమా! ఇది మీరు కూడా ప్రశంసించ వలసిన విషయం, సహృదయత ఉంటే.

హిందూ మతం ఒక నిరంతర గంభీర ప్రవాహం. సనాతన ధర్మ పీఠం. అదొక మహాసముద్రం. దానిలోని నీరును ఎంత తోడి ఖాళీ చేద్దామనుకున్నా ఖాళీ అవుతుందా? ఇంకిపోతుందా? కాదు. కానేకాదు. గంభీరమైన ఆ హిందూ మహా సముద్రంలో ఎన్నో నదులు/ (మతాలు) చేరినా దాని స్వస్వరూపం, పరిమాణం ఏమీ తగ్గదు. గుణం చెడదు. ఇంకా బలోపేతమవుతుంది. దీనికి కారణం ఇదొక మతం కాదు, జీవన విధానం. సనాతన (వేద విదితమైన) శాస్త్రీయమైనది దీని ఆధ్యాత్మికత. అందుకే, ఎన్ని దుర్మార్గపు దాడులు జరిగినా, విధ్వంసాలు జరిగినా, ఘోరమైన ద్వేషపూరితమైన మత మార్పిడిలు జరిగినా, మతద్వేషం కక్కినా ఈ పుణ్యభూమిలో, ఈ కర్మ భూమిలో, అణువణువూ నిండి నిబిడీకృతమైన సహిష్ణుత, సర్వ మానవ సౌభ్రాతృత్వం, లోక కల్యాణం కోసం, ఈ జాతి పడే తపన దీనిని చెక్కు చెదరనీయదు.

గంభీరమైన ఐరావతం వలే, హుందాగా ముందుకు నిరంతరంగా కదులుతూనే ఉంటుందని మా ప్రగాఢ విశ్వాసం. మహాసముద్రం వంటి హిందూ మతానికి అంతం లేదు. ఉండదు. ఉంటుందని ఐలయ్య, గోపీనాథ్, భూక్యా వంటివారు అనుకుంటే వారు తీవ్రంగా పాత దురాక్రమణదారుల వలె భంగపడక తప్పదు. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో ఈ మేధా బ్రువులకు తెలియదనుకోను. కాని వారికి చివరిగా నాదొక సూచన. ఇప్పటికైనా ఈ ద్వేష పూరిత విషప్రచారం మాని ఆచార్య పదవి అలంకరించారు కాబట్టి పెద్ద మనుషులుగా, పెద్దమనసుతో సంస్కారయుతమైన భాషతో, తమ అభిప్రాయాలను ఇతరుల మనోభావాలను కించపరచకుండా వ్యక్తం చేయమని. వారి భాష/భాషణం హుందాగా ఉంచుకోమనీ.


- గీతాంజలి మూర్తి
వ్యాసకర్త రవీంద్రుని 'గీతాంజలి' అనువాదకులు

బుధవారం 22 ఫిబ్రవరి 2012

ధర్మంపై బురదజల్లడానికి ముందు దీనికిసమాధానం చెప్పండి

ధర్మరక్షణ
- జి.నాగేశ్వరరావు

'ఆత్మవిమర్శా, అంతర్యుద్ధమా?' (జనవరి17, ఆంధ్రజ్యోతి) అనే వ్యాసంలో అరవిందరావు (మాజీ డిజిపి) హిందూ మత విమర్శకులకు కొన్ని సహేతుకమైన ప్రశ్నలు సంధించారు. కంచ ఐలయ్య ఎప్పుడో తాను హిందువును కానని ప్రకటించుకుంటూ ఒక పుస్తకం కూడా రాశారు. ఫరవాలేదు. హిందూ మతానికొచ్చిన నష్టమేమీ లేదు. అయితే హిందువుకాని ఐలయ్య హిం దూ మతాన్ని విమర్శిస్తారేమిటి? ఆయన ముస్లిం కూడా కాదు గదా. మరి ఇస్లాంను విమర్శించరేం? ఏ మతంలోని విషయాలైనా అవి ఆ మతస్తుల వ్యక్తిగతం. ఇతరులకు అవి అప్రస్తుతం. హైందవేతరుడైన ఐలయ్య హిందూ మతాన్ని విమర్శించడానికి కారణం హిందువుల్లో ప్రతిఘటన వుండదని తెలుసు గనుకనే.

లోపరహితమైన మతంగాని, సమాజంగాని యీ ప్రపంచంలో వున్నదా? వర్ణ వివక్షను, అంటరానితనాన్ని చూపి హిందూ మతాన్ని నిందించేటట్లైతే జాతి వివక్షను చూపి క్రైస్తవాన్ని కూడా నిందించాలి కదా? నాలుగున్నర శతాబ్దాల చరిత్ర గల అమెరికాలో నేడు గదా ఒక నల్ల జాతీయుడు అధ్యక్షుడు కాగలిగింది? 1853లో బానిసత్వాన్ని రద్దు చేసినందుకు ఆగ్రహించిన దక్షిణాది అమెరికన్ రాష్ట్రాలు సౌత్ కరోలినా నాయకత్వంలో అమెరికన్ యూనియన్ నుంచి విడిపోయి స్వాతంత్య్రం ప్రకటించుకున్నా యి. అబ్రహాం లింకన్ నాయకత్వంలో ఆ పది దక్షిణాది రాష్ట్రాలపై యుద్ధం ప్రకటించి తిరిగి యూనియన్‌లో విలీనం చేసుకోవడం జరిగింది.

కె.కె.కె. అనే తీవ్రవాద సంస్థ ద్వారా నల్లవారిపై దాడు లు చేసిన అమెరికన్ ప్రజల్లోనా వివక్ష లేక వారనుసరించే క్రైస్తవమతంలోనా వివక్ష? కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన దుర్ఘటనలను పదే పదే మననం చేసుకుంటూ మతాన్ని నిందించటం న్యాయ మా? లక్షల హిందువుల్ని వధించి వేలాది దేవాలయాల్ని నేల మట్టం చేసిన గజనీ, ఘోరీ, ఔరంగజేబులను ఉటంకిస్తూ మనం ముస్లింలను ద్వేషిస్తున్నామా?

ఇంకా వారికి రిజర్వేషన్లు కల్పించి సత్కరిస్తున్నాం! నేడు తిరుపతి, కాశీ, ప్రయాగ, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల్లో ఎవరిది ఏ కులమని అడుగుతున్నామా? గ్రామాల్లో కొంత వివక్ష వుండవచ్చు కానీ ప్రభుత్వం దానికి కఠినమైన చట్టాలను చేసింది. మహిళలపై రోజూ ఎక్కడో అక్కడ అత్యాచారాలు, దాడులు జరుగుతూనే వున్నవి. అందుకు ప్రతిగా మహిళలంతా హిందూ మతం విడిచి అన్యమత ప్రవేశం చేయాలా?

హిందూ మతంపై బురద జల్లే వారికి కులవ్యవస్థ ఓ తురుఫు ముక్క. దళిత హిందువులను (దళిత క్రైస్తవులను వేరుగా గుర్తించాలి) దేవాలయాల్లో పూజారులుగా నియమించరు. దళిత హిందువులతో అగ్రవర్ణాల వారు వియ్యమందరు. కలిసి భోజనం చేయరు. దేవాలయాలలోకి రానివ్వరు. అంటరానితనాన్ని పాటిస్తారు. ఇంక హిందూ మతంలో ఎందుకుండాలి అని వాదిస్తారు? సరే, మతం మారగానే స్వర్గద్వారాలు తెరుచుకున్నాయా? క్రైస్తవులంతా సుఖంగా ఉన్నారా? అమెరికాలోని క్రైస్తవులు శ్రీమంతులు. ఆసియా, ఆఫ్రికాలలోని క్రైస్తవులు దరిద్రులుగానున్నారేమి? ఒకే దేముడిని ఆరాధించే వారంతా ఒకే తీరుగా లేరే?

అంటరానితనం, కులవివక్ష అనేదానికి మతంలో ఎటువంటి ప్రామాణికమూ లేదు. ఉంటే గనుక వాల్మీకి పూజనీయుడెలా అవుతాడు? నారాయణ గురు, నయనార్‌లు, తిన్నడు, స్వామి వివేకానంద, సాయిబాబా, ఇంకా వందలాది స్వామీజీలు వీరే కులానికి చెందినవారు? అంబేద్కర్‌కు ఆర్థిక సహాయం చేసింది బరోడా మహారాజు కాదా? ఒక మతంలో పుట్టే మహనీయుల్ని బట్టి ఆ మతాన్ని విశ్లేషించాలి తప్ప దానిలో పుట్టే అధములని బట్టికాదు. అంటరానితనాన్ని, కుల వివక్షను పాటించే వారెవరైనా సరే మూర్ఖులే. దేవాలయ పూజారులుగా బ్రాహ్మణ స్త్రీలు గూడా అర్హులు కాదు. అశౌచం వున్న కొంతమందిని ఉపేక్షించటం జరిగింది. హిందువుల్లోనే గాదు, క్రైస్తవుల్లో గూడా మహిళా పాస్టర్లు, ముస్లింలలో మహిళా ఇమాంలు లేరు. వారిదిగూడా వివక్షేనా?

మొదట్లో చాతుర్వర్ణ వ్యవస్థగావుండి తరువాత శాఖలు, ఉపశాఖలుగా విడిపోయిన హిందూ సమాజంలో ఎన్నడూ కులపరమైన ఘర్షణలు జరగలేదు. నేడు కొన్ని స్వార్థపరశక్తులు కుల వ్యవస్థను వక్రీకరించి రాజకీయం చేస్తున్నారు. దేశంలో ఒకప్పుడు సంస్కృత భాష ఒక్కటే వుండేది. క్రమేపీ అందులోనుంచి అనేక భారతీయ భాషలు పుట్టుకొచ్చాయి. కానీ వారెవరూ భాషా పరంగా కలహించుకోవటం లేదే? వివిధ కులాల వారు మాత్రం ఎందుకు కలహించుకోవాలి? ఏ కులమూ మరొక దానికంటే తక్కువదని ఎక్కడా చెప్పబడలేదు. బ్రాహ్మణులు ప్రజాపతి ముఖం నుంచి, శూద్రులు పాదాల నుంచి జన్మించారన్నదానికి విపరీతార్థాలు తీసి శూద్రులను హిందూ మతం కించపరిచిందని వాదిస్తారు. కాని ఎవరికైనా పాదాభివందనం చేసినప్పుడు ఆ పాదాలే శిరోధార్యాలు కదా?

కులాంతర వివాహాలు వ్యక్తిగతం. బ్రాహ్మణులు కూడా తమ శాఖల్లోనే చేసుకోవటానికి ఇష్టపడతారు. ఇది ప్రత్యేకంగా దళితు ల పట్ల వివక్ష ఎట్లా అవుతుంది? డబ్బు, హోదా కలిగిన ఒక ఉన్నతోద్యోగి తన కార్యాలయంలోనే పనిచేస్తున్న అటెండరుతో వియ్యమందుతాడా? ఇక్కడ డబ్బు, హోదాగల వివక్ష. దీన్నికూడా ఖండించరేం? అమెరికాలో తెల్లవారు, నల్లవారి మధ్య వివాహాలు జరుగుతాయా? క్రైస్తవుల్లో గూడా జాతి వివక్ష ఉన్నట్లేగా?

భారతదేశంలో కుల వివక్షే గనుక రాజ్యమేలుతున్నట్లైతే రాష్ట్రపతిగా ఒక దళితుడిని ఎలా ఎన్నుకున్నారు? దళితులు మన రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ ముఖ్యమంత్రులయ్యారు. కేంద్రంలోను, రాష్ట్రాలలోను పలువురు దళితులు మంత్రి పదవులు నిర్వహిస్తున్నారు. అగ్రవర్ణాల హిందువులు కుల వివక్షను పాటించి ఉండివుంటే దళితులకు రిజర్వేషన్లు ఎలా సమకూరినవి? ఊరూరా అంబేద్కర్ విగ్రహాలు ఎలా వెలిసినవి? మతం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమే గాదు; అది ఒక సాంఘిక, సాంస్కృతిక ప్రక్రియ కూడా. హిందూ మతంతో సహా ఏ మతమూ మనలను స్వర్గానికి తీసుకెడుతుందన్న ధీమా ఏమీలేదు.

కానీ ప్రతి మతానికీ ఒక సంస్కృతి, సమాజం వుంటుంది. మతం మారితే ఇవి గూడా మారిపోతాయి. ఒక దేశంలో మతాలు ఎన్ని ఎక్కువైతే అస్థిరత అంత ఎక్కువగా వుంటుంది. ప్రజలు మతపరంగా చీలిపోయి వేర్పాటు వాదం తలెత్తుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పాకిస్థాన్. 1946లో జిన్నా ఒక ప్రకటన చేస్తూ హిందువులు, ముస్లింలు రెండూ వేర్వేరు జాతుల వారు; వారెన్నడూ కలిసి సఖ్యతగా జీవించలేరు గనుక పాకిస్థాన్‌ను ఏర్పాటు చేయవలసిందేనన్నాడు. నిన్నటిదాకా హిందువుగా ఉన్నవాడు నేడు ముస్లింగా మారగానే వేరే జాతి వాడుగా, వేర్పాటు వాదిగా మారుతున్నాడు. అలాగే క్రైస్తవులైన ఈశాన్య రాష్ట్ర ప్రజలు గూడా వేర్పాటు వాదాన్ని వినిపిస్తున్నారు. అంతేగాక మన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, సంగీ తం, నాట్యం, శిల్పం ఇవన్నీ హిందూ మతం నుంచే పుట్టాయి.

మతం నశిస్తే ఇవి గూడా నశిస్తాయి. ఏదైనా ఒక మతాన్ని గాని, సంస్కృతిని గాని, వ్యవస్థను గాని నిర్మించడం కష్టం గాని దానిని నాశనం చేయటం చాలా తేలిక. హిందూ మతాన్ని సంస్కరించి దానిని పరిపుష్టం చేయడానికి సలహాలివ్వాలిగాని మతాన్ని బలహీనపరిచే చర్యలు న్యాయం కాదు. మనం కాశ్మీర్‌పై ఎన్ని చర్చలైనా జరపవచ్చు కాని ప్రధానాంశం మాత్రం కాశ్మీరు భారత్‌లో అంతర్భాగం అనేది. అలాగే హిందూ మత పునరుజ్జీవనం అనేది మౌలిక సూత్రంగా సలహాలు, సంస్కృతులకు స్వాగతం. బయటకు వెళ్లేవారు వెడుతుంటే కొత్త వారు పుడుతుంటారు తప్ప హిందూ మతానికి నాశనం లేదు. దేశ సమగ్రత కోసం, సంస్కృతీ పరిరక్షణ కోసం, జాతి వారసత్వం కోసం హిందూ మతం బ్రతికే వుండాలి. హిందువులందరూ దానిని బ్రతికించుకోవాలి.

ధర్మోరక్షతి రక్షితః
- జి.నాగేశ్వరరావు
(ధర్మప్రసార సమితి)

శనివారం 18 ఫిబ్రవరి 2012

భావి హిందూ మతవ్యవస్థ : ఒక ప్రతిపాదన

హిందువులు సమైక్యంగా లేకపోవడానికి, మన మతం నానాటికీ బలహీనపడుతూండడానికి గల కారణాల్లో కులోన్మాదం ఒకటైతే, హిందువులందఱికీ కలిపి ఒక అత్యున్నత మతపీఠం లేకపోవడం రెండో ప్రధానకారణమని నా అభిప్రాయం. ఈ కారణం చేత మన ధర్మశాస్త్ర సూత్రాల స్థానాన్ని సెక్యులర్ ప్రభుత్వ చట్టాలు ఆక్రమించుకుంటున్నాయి. మన పీఠాధిపతుల స్థానాన్ని సెక్యులర్ న్యాయమూర్తులూ, కోర్టులూ దురాక్రమించేశారు. వారిప్పుడు మన దేవాలయాల మీదా, ఆచారాల మీదా తీర్పులు చెప్పే స్థాయికొచ్చేశారు.  వీటన్నింటి ద్వారా మనం మన ఆచార వ్యవహారాలకీ, ధర్మశాస్త్ర నిర్దేశాలకీ వ్యతిరేకంగా ప్రవర్తించేలా, మాట్లాడేలా తర్ఫీదివ్వబడుతున్నాం. మఱోపక్క హిందువులుగా మన ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా మనమెవఱికి వోటెయ్యాలో మార్గదర్శనం చేసే ధార్మికనాయకులూ, సాంస్కృతిక నాయకులూ కఱువయ్యారు. లేదా తమకంటూ ఒక వ్యవస్థ లేకపోవడం చేత వారి గొంతు ఈ కలకలంలో వినపడ్డం మానేసింది. 

కనుక భవిష్యత్తులో నైనా మనం ఒక కేంద్రీకృత  అత్యున్నత మతపీఠాన్ని (Centralized Supreme Pontificate) ఏర్పఱచుకోవాలి. దేవాలయాలలో నియామకాలూ, ఆచారాలూ, జీతాలూ, హిందువుల సామాజిక, ఆర్థిక, రాజకీయ పాలసీలూ అన్నీ ఆ పరమపీఠాధిపతులే నిర్ణయించాలి. ఆ నిర్ణయాలు అన్ని స్థాయిల్లోనూ వెనువెంటనే అమల్లోకి రావాలి. ప్రతి హిందువూ తన కుటుంబ సంప్రదాయాని కనుగుణంగా ఏదో ఒక ప్రపీఠంలోనూ, ఉపపీఠంలోనూ, అనుపీఠంలోనూ తన పేరు నమోదు చేసుకోవాలి. దాని స్వరూపాన్ని నేను ఈ క్రింది విధంగా ఊహించుకుంటున్నాను. ఈ క్రింద పరిశీలించండి.

గురువారం 16 ఫిబ్రవరి 2012

విదేశంలో స్వదేశీ !

విదేశంలో స్వదేశీ !


వింతగా ఉందా? ఇది అచ్చు తప్పు కాదులెండి. మనం స్వదేశీ గురించి మాట్లాడితే చాలామంది హేళన చేస్తారు. స్వదేశీ అన్నమాట చాలా విస్తృతమైంది. భారతీయ ఉత్పత్తులు వాడడమే కాదు, మన ఆలోచనలు ప్రణాలికలూ కూడా స్వదేశీ అనే సిద్ధాంతం మీద ఆధారపడినప్పుడే మనం నిజమైన అభివృద్ధి వైపు పయనించగలం. ఒక్కమాట! జ్ఞాపకం ఉందా? నిన్నగాక మొన్న మన లోక్ సభలో 'వాల్ మార్ట్' (విదేశీ పెట్టుబడులు) మీద రగడ జరిగిన సందర్భంగా కపిల్ సిబాల్ గారు ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు. వాల్ మార్ట్ కి మన వాణిజ్యాన్ని తాకట్టు పెట్టాలని యూపియే ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకి సర్వత్రా వ్యతిరేకత వచ్చేసరికి, తట్టుకోలేక కపిల్ సిబాల్ గారు ఇలా అన్నారు -

"సరే! ఇక మనం కార్లలో తిరగడం మానేసి రిక్షాల్లో తిరుగుదాం!".
ఇదండీ ! మేధావి అయిన సిబాల్ గారి మనసులో మాట. ఇందులో తప్పేముంది అంటారా? ఇక్కడ సమస్య కార్లు, రిక్షాలు కాదు. మన నాయకులలోని బానిస స్వభావం, భావదాస్యం, బౌతిక దారిద్ర్యం. వీరి అభిప్రాయంలో భారతదేశం ఒక పాత చింతకాయ పచ్చడి. భారతీయులు వెనుకపడినవారు, ముందుకు వెళ్లలేనివారు. మన ఆలోచనలు వెయ్యి సంవత్సరాలు వెనుకకు ఉంటాయి. కాబట్టి విజ్ఞులు, ప్రాజ్ఞులు ఐన పాశ్చాత్యుల విధానాలు మనకి కావాలి. అంధ అనుకరణ మాత్రమే మనను "ఉద్ధరిస్తుంది". సరే! ఒప్పుకుందాం. స్వదేశీ కావాలంటున్న భారతీయులు అజ్ఞానులే. ఐతే మనకి స్ఫూర్తినిస్తున్న, మార్గదర్శనం చేస్తున్నారనుకొంటున్న పాశ్చాత్యుల పరిస్థితి చూద్దాం.

ప్రపంచ దేశాల నెత్తిమీద "ఆర్ధిక సరళీకరణ" విధానాలు రుద్దిన అమెరికా సంగతి చూడండి. ఇదే విధానాల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది.


ఒబామా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే సమయానికి పది లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది. అది ఇప్పుడు పదిహేను కోట్ల డాలర్లకి పెరిగింది. పేదరికంలో జీవించేవారి సంఖ్య 48 శాతానికి పెరిగింది. అమెరికా ఉద్యోగాలు అన్నీ భారతీయులూ, చైనీయులూ ఎగరేసుకుపోతున్నారనీ, ఆ ఉద్యోగాలు అమెరికా వారికే ఇవ్వాలని ఒబామా అంటున్నాడు. అమెరికా వారు అమెరికా వస్తువులనే ఉపయోగించాలని అయన పిలుపునిచ్చాడు. అమెరికా కూడా స్వదేశీ జపం మొదలుపెట్టింది. దీనికి మన నాయకులేమంటారో? ఒబామా కూడా సంఘ పరివార్ వాడేనంటారేమో ! అన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. ఏతావాతా తేలేదేమంటే భారతీయ సిద్ధాంతమే సరైనదని మరోమారు నిరూపితమైంది. ఎవ్వరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా..!  

- ధర్మపాలుడు

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి