7, నవంబర్ 2009, శనివారం

ఆ ఋణం తీఱుద్దామా ? లేక ఇంకా ఋణాల ఊబిలో కూరుకుపోదామా ?

ಎನಿತು ಜನ್ಮದಲಿ ಎನಿತು ಜೀವರಿಗೆ ಎನಿತು ನಾವು ಋಣಿಯೋ
ತಿಳಿದು ನೋಡಿದರೆ ಬಾಳು ಎಂಬುದಿದು ಋಣದ ರತ್ನಗಣಿಯೋ"


(ఎనితు జన్మదలి ఎనితు జీవరిగె ఎనితు నావు ఋణియో
తిళిదు నోడిదరె బాళు ఎంబుదిదు ఋణద రత్నగణియో)


"ఎన్ని జన్మల్లో ఎందఱు జీవులకి మనం ఋణగ్రస్తులమో
కనిపెట్టి చూస్తే ఈ జీవితమనేది ఋణరత్నాల నిక్షేపమేమో"


అంటారు ప్రముఖ కన్నడకవి శ్రీ ఎమ్.ఎస్. శివరుద్రప్ప. మనిషి పుడుతూనే దేవఋణం, పితృఋణం, ఋషిఋణం అని మూడురకాల ఋణాలతో జన్మిస్తాడని మన పూర్వగ్రంథాలు తెలుపుతున్నాయి. వివిధ దేవతలు మన శరీరంలోని వివిధ అవయవాలకి అధిష్ఠాన దేవతలై ఈ రూపాన్ని మనకి ప్రసాదించారు. వారే పంచభూతాల్లోను, సమస్త ప్రకృతిలోను నివసిస్తున్నారు. అందుచేత లోపలా, వెలుపలా కూడా వారే ఉన్నారు. వారు లోపల ఉన్నప్పుడు జీవశక్తులనీ, వెలుపల ఉన్నప్పుడు ప్రకృతిశక్తులనీ పిలవబడతారు. ఆ విధంగా వారు మనతో నిత్యనివాసం చేస్తున్నారు. కనుక దేవఋణాన్ని జప తపో ధ్యాన హోమ యజ్ఞాదుల ద్వారాను, పూజాదికాల ద్వారాను తీర్చాలి. అప్పుడు వారు సంతుష్టి చెంది మన జీవితానికి కావాల్సిన ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తారు.

పితృదేవతలు మన తండ్రుల వృషణాలలో నివసించి మన పుట్టుకకి కారణమయ్యారు. పైపైన చూడ్డానికి మన జన్మకి నిమిత్త కారకుడు మన తండ్రి అయినప్పటికీ, తెఱ వెనుకనున్న అసలు కారకులు పితృదేవతలే. వారి అనుగ్రహం లేకపోతే భార్యాభర్తలు ఎంత హోమ్ వర్క్ చేసినా ఏమీ లాభం లేదు. వారు మన పూర్వీకులు కారు. పితృలోకం అని ఒకటుంది. చనిపోయినవారు తమ పాపపుణ్యాల అనుసారంగా ఊర్ధ్వ, అధో లోకాలకి వెళ్ళబోయేముందు అక్కడ మజిలీ చేస్తారు. ఆ లోకానికి అధిపతులు పితృదేవతలు. అందుచేత వారిని సంతృప్తిపఱచడం కోసం ప్రతి సంవత్సరమూ తద్దినాలు పెట్టాలి. లేకపోతే వారు ఆగ్రహిస్తారు. విధివిహితంగా వివాహం చేసుకొని పెద్దల వంశాన్ని కొనసాగించడమే వారి ఋణాన్ని తీర్చుకునే మార్గం.

ఇహపోతే ఋషిఋణం. దీన్ని ఒక రకంగా గురుఋణం అని చెప్పుకోవచ్చు. మానవులకి నాగరికత లేని రోజుల్లో భగవదాదేశం మీద వారి మధ్య జన్మించి వారికి ప్రాథమికమైన మంచి, చెడు, శుచీ, శుభ్రం, వావి-వరుస, రాజ-ప్రజా ధర్మాలూ, పతి-పత్నీధర్మాలూ, పితాపుత్ర ధర్మాలూ, గురుశిష్య ధర్మాలూ, దైవభక్తి, పాపభీతి గట్రా బోధించి, చూపించి వెళ్ళిన ఆదిమ గురువులున్నారు. వారికే ఋషులని పేరు. వారి బోధల్ని అచంచల విశ్వాసంతో వేలాది సంవత్సరాల పాటు మానవజాతి అనుసరించడం వల్లనే మానవ నాగరికత ఇప్పుడు ఇంత మహోన్నత స్థితికి చేఱుకుంది. అయితే ఇప్పుడు వాటిని ధైర్యంగా ఉల్లంఘిస్తున్నారు కనుక ఇది త్వరలో సంపూర్ణంగా పతనం (collapse) అవుతుంది. ఆ తరువాత ఆ ఆదిగురువులే పతనమైన ధర్మాల్ని తిరిగి నిలబెట్టడం కోసం భావి-అనాగరికుల మధ్యకి దిగిరావాల్సి వస్తుంది. వారికి సేవ చేద్దామంటే వారిప్పుడు మనకి లభించరు కనుక వారి గ్రంథాల్ని మనం అధ్యయనం చెయ్యడం, ఇతరులకి అధ్యాపనం చెప్పడం, ఆచరించడం - ఇవే వారి ఋణాన్ని తీర్చుకునే మార్గాలు.

నా దృష్టిలో ఇంకో ఋణం ఉంది. అది ప్రకృతిఋణం. ప్రకృతి జగదంబా స్వరూపం. ఓమ్ ప్రకృత్యై నమః అంటారు లక్ష్మీ అష్టోత్తరంలో ! కనుక ఇక్కడ ప్రతివిషయాన్ని శ్రీ అమ్మవారు తన ప్రేమామృతంతో రంగరించి సృష్టించి ఉన్నారు. ఒక వడ్లగింజని తీసుకొని పరిశీలించండి. ఆ గింజలు తన మానవ బిడ్డలకి చేఱాలనే ఆ తల్లి తపన మీకర్థమవుతుంది. ఎంత పకడ్బందీగా ఆవిడ ఒక్కొక్క గింజని ప్యాకేజి చేసిపెట్టిందో చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. భగవంతుడు/ భగవతి తన మీద కుఱిపిస్తున్న ఈ వాత్సల్యానికి ప్రతిగా మనిషి ఏం చేస్తున్నాడు ? అవే ఆహార పదార్థాల్ని కల్తీ చేసి తోటి మానవులకి సరఫరా చేస్తున్నాడు. ఒకవేళ భగవంతుడు/ భగవతి ప్రత్యక్షమై " ఏరా ! నేను నీకు పరిశుద్ధమైన ప్రేమతో అందించిన ఆహారాన్ని అదే విధమైన ప్రేమతో నీ తోటి మానవులకి అందించాల్సిన అవసరం లేదా ? లేదని నువ్వంటే నీలాగే నేను కూడా నీకు కలుషితాహారాన్నే ప్రసాదిస్తే నీ గతేమవుతుందో ఆలోచించావా ?" అనడిగితే వీడి సమాధానమేంటి ?

మన పూర్వీకులు మనకొదిలిపోయిన పరిశుద్ధమైన నీటిని, గాలినీ, పరిసరాల్నీ మనం అలాగే ఉంచుతున్నామా ? వారు మనకి వాటిని ఎలా అందించారో అలాగే మనమూ భావితరాలకి అందిస్తే అదే నిజంగా దేవ, పితృఋణాల్ని తీర్చడం అవ్వదా ?

5, నవంబర్ 2009, గురువారం

ఒకటో తరగతి నుంచి ఇంగ్లీషంట ! సిగ్గులేకపోతే సరి

ఒకజాతి ఆత్మగౌరవానికి ఆయువు పట్టు దాని భాష . తమ భాషను తామే ధ్వంశం చేసుకుంటున్నమన్న సృహలోలేని కుహనమేధావి వర్గ వాదనలకు నిరసనగాతెలుగు బిడ్డల ఆవేదనలివి

కచ్చితంగా మతులు పోయాయి అందఱికీనూ.

ఈనాడులో ప్రచురించిన ఈ వార్త చదవండి: http://www.eenadu.net/story.asp?qry1=6&reccount=38 ఇదే వార్తని జతచేసిన కవిలెలోనైనా చదవవచ్చు.

--------------------------------------------------------------------------------------

అభిప్రాయం ౧
---------

పిల్లలకు చదువు ఎలా చెప్పాలనేది నిపుణులకు తెలిసినట్టుగా మనకు తెలవదు. అలాంటి దాని సంగతి తేల్చడం కోసం పిల్లల తలిదండ్రుల వద్ద అభిప్రాయాలు తీసుకుంటారంట ! ఆ తల్లిదండ్రులెవరూ..? తమ పిల్లలు ఏ సిలబస్సులో చదూతున్నారో తెలీనివాళ్ళు!

మాన్యుఫాక్చరింగ్ ది కన్సెంట్ అని పుస్తకమేదో ఉన్నట్టుంది కదా.. అందులో ఇలాంటి వాటిని గురించి బహుశా చోమ్‌స్కీ చెప్పి ఉంటాడేమో! చెప్పాడో లేదో గానీ, మన ప్రభుత్వం మాత్రం ఇలాంటివాటిల్లో నైపుణ్యం సాధించింది.సెజ్‌ల పట్ల ప్రజాభిప్రాయం తీసుకునే పద్ధతులు చూసాం. ఇలాంటి వాటిల్లో అభిప్రాయాలు తయారుచేసే పద్ధతి ఇలాగన్నమాట. అయిలయ్య లాంటివాళ్ళు ఈ అభిప్రాయాల తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తూంటారు. (అయిలయ్య ఇంకోమాటన్నాడు.. గిరిజన పిల్లలకు తెలుగు కంటే ఇంగ్లీషే బాగా వస్తున్నదంట. వాళ్ళు తెలుగులో తప్పుతున్నారంట, ఇంగ్లీషులో ప్యాసవుతున్నారంట. గిరిజనులకు తెలుగు పరాయి భాషే. వాళ్ళ మాతృభాషలో చెబితే సంతోషంగా బడికి వెళ్ళి చదూకుంటున్నారంట. "నేను చిన్నప్పటి నుంచీ తెలుగులో చదూకున్నాను, కానీ ఇప్పుడు ఇంగ్లీషులో రాసినంత బాగా తెలుగులో రాయలేను" అనీ అన్నాడు")

పంతుళ్ళు, అధికారులు - ఇంగ్లీషులో చదువు చెప్పడం కోసం సీబీయెస్యీ మొదలెట్టారండి. పంతుళ్ళకు, అధికారులకు అది కొరుకుడుబడలేదు, తిరిగి రాష్ట్ర సిలబస్సుకు రావాలని అడుగుతున్నారు. అంచేత ఇంగ్లీషు మీడియమ్ అయినా పర్లేదని అనుకుంటున్నట్టున్నారు. ఎవడి బాధలు వాడివి.

ఇలాంటి అభిప్రాయాల సేకరణలో భాషానిపుణులను, తెలుగు సంఘాలను కూడా లెక్కలోకి తీసుకోవాలని మనం గోలెట్టాలి.
------------------------------------------------------------------------------------
అభిప్రాయం ౨
.......................

గత సంవత్సరం వీళ్ళు బలవంతంగా ఇంగ్లీషు మీడియమ్ లో కుక్కిన పిల్లల్లో సగం మంది "మాకోద్దీ ఇంగ్లీషు మీడియమ్ బాబో" అని ఈ సంవత్సరం నుంచి మళ్ళీ తెలుగుమీడియమ్ లోనే పోయి కూర్చుంటున్నారు. అది చూశైనా ఇంకా ఈ తల్లిదండ్రులకీ, ఈ అధికారులకీ, ఈ పంతుళ్ళకీ బుద్ధి రాకపోవడం విచారకరం. "అయినా సరే ఇంగ్లీషే కావా"లని చెప్పిన పంతుళ్ళ సంఖ్య అత్యల్పం. కానీ ఈనాడు వాళ్ళ అభిప్రాయాల్నే ఉద్ద్యోతిస్తున్నది చూడండి. లోపం ఎక్కడుందంటే మనవాళ్ళు భాషని సమాజంతో సంబంధం లేని ఒక ఐకాంతిక స్వమూర్తి (stand-alone entity) గా చూడ్డం దగ్గఱ. నేర్పితే వచ్చేస్తుందనుకుంటున్నారు. చుట్టూ ఉన్న సమాజంతో సంబంధం లేని భాషని కృత్రిమంగా అభివృద్ధి చెయ్యగలమనుకోవడం మూఢవిశ్వాసమని తెలుసుకోలేకపోతున్నారు. ఇంతమందికి ఇంగ్లీషు నేర్పాక ఆ తరువాత వాళ్ళేం చెయ్యాలో, వాళ్ళచేత ఏం చేయించాలో ఐడియా లేనివాళ్ళంతా ఇంగ్లీషు మీడియమ్ ని సమర్థిస్తున్నారు.

ముందు మన తెలుగువాళ్ళలో భాష గుఱించిన ఈ విధమైన దురభిప్రాయాల్ని పోగొట్టడానికి తెలుగభిమానులైన మేధావులంతా తలో వ్యాసమూ రాసి ఒక పుస్తకంగా విడుదల చెయ్యాలని నాకనిపిస్తుంది. ఆలోచన బావుందని మీరంటే ఈరోజే కార్యరంగంలోకి దిగుదాం. నావంతుగా నేను కొన్ని వ్యాసాలు రాయడానికి సిద్ధం. ముందు దీన్ని పి.డి.ఎఫ్. పుస్తకంగా అంతర్జాలంలో విడుదల చేసి తరువాత ప్రజాస్పందనని బట్టి ముద్రించి అమ్ముదాం.
-----------------------------------------------------------------------------------
అభిప్రాయం ౩

అయిలయ్య చెప్పినమాటలు నేను సరిగ్గా రాయలేదు. తిరగ రాస్తున్నాను:

(అయిలయ్య ఇంకోమాటన్నాడు.. గిరిజన పిల్లలకు తెలుగు కంటే ఇంగ్లీషే బాగా వస్తున్నదంట. వాళ్ళు తెలుగులో తప్పుతున్నారంట, ఇంగ్లీషులో ప్యాసవుతున్నారంట. ఇంకా ఇలా అన్నాడు: "నేను చిన్నప్పటి నుంచీ తెలుగులో చదూకున్నాను, కానీ ఇప్పుడు ఇంగ్లీషులో రాసినంత బాగా తెలుగులో రాయలేను" )
------------------------------------------------------------------------------------
అభిప్రాయం ౪

ఇంతకీ ఎవరండీ ఈ అయిలయ్య? నాకు అర్థం కాలేదు.

* * *

తప్పదు. "అసలు భాష అన్నది పుట్టిందే మన అభిప్రాయాలూ ఆలోచనలూ వేఱేవారికి చేఱవెయ్యడం కోసం, కాబట్టి తెలుగు భాష ఉంటే ఎంత లేకపోతే ఎంత?" వంటి దరిద్రపుగొట్టు ప్రశ్నలకు కూడా సమాధానాలు ఉండాలండీ ఆ వ్యాసాలలో.

----------------------------------------------------------------------------------
అభిప్రాయం ౫
రాష్ట్ర జనాభాలో పూర్తిగా మూడు శాతం కూడా లేని నాన్-తెలుగు గిరిజనుల పేరు చెప్పి తెలుగుని తొక్కేయ్యాలని చూడ్డం, ఉర్దూ ముస్లిముల పేరు చెప్పి తొక్కెయ్యాలని చూడ్డం, లేకపోతే రాష్ట్ర సరిహద్దుల్లో నివసించే తమిళ, కన్నడ, మరాఠీ, ఒరియా గట్రా మైనారిటీ సమూహాల్ని చూపించి తొక్కేయాలని చూడ్డం, భాగ్యనగరానికి అప్పుడప్పుడు వచ్చి వెళుతూండే ఉత్తర భారతీయుల్ని చూపించి "అదిగో వాళ్ళొద్దంటున్నా"రని చెప్పి తొక్కెయ్యాలని చూడ్డం - ఈ కుట్రలన్నీ మనకిదివఱకే తెలుసు. ఈ వాదాలు చేసేవాళ్ళంతా రాష్ట్రంలో 92 శాతం మంది ఉన్న మెజారిటీ తెలుగువాళ్ళ భాషాహక్కుల గుఱించి మౌనం వహిస్తారు. వాటిని చాలా కన్వీనియంట్ గా మర్చిపోతారు. మనల్ని కూడా మర్చిపొమ్మంటారు.
---------------------------------------------------------------------------------
అభిప్రాయం ౬

ఇలా తెలుగు అక్కఱలేదు అనుకునేవాళ్లని అందఱినీ, ఏదో సినీమాలో చూపించినట్టుగా, గోనెసంచీలలో కట్టిపారేసి అప్రాచ్యదేశాలకి పార్శిల్ చేశేయాలండీ. అప్పుడు కానీ కుదరదు వీళ్ల తిక్క.
------------------------------------------------------------------------------------అభిప్రాయం ౮

హ్హ హ్హ హ్హ ఇంగ్లీషులో చదివితే ప్యాసవుతున్నారా? ఇంగ్లీషులో వాళ్ళు ఎంతమటుకు రాస్తారో, వాళ్ళ పరీక్ష పేపర్లు దిద్దే టీచర్లను అడగమని చెప్పండి.

పదవతరగతి వరకు తెలుగుమీడియంలో చదివి, ఇంటరులో ఇంగ్లీషు మీడియం చేరగానే, మనవాళ్ళకు 900 పైగా మార్కులు వస్తున్నాయంటే కారణం అది ఆంగ్ల గొప్పతనం కాదు. పరీక్ష పేపర్లు దిద్దేవాడి మహత్మ్యం. ఒక్కసారి పరీక్ష పేపర్లు దిద్దేవాడు, జవాబు పత్రంలో ఏం రాశాడో చూసి పేపరు దిద్దితే, మన రాష్ట్రంలో ఒక్కడు కూడా ఇంగ్లీషు మీడియం తీసుకోడు ఇంటరులో.

జవాబు పత్రంలో సగానికి పైగా కహానీలే ఉంటాయి. లేదా పరీక్ష పేపరునే అటు తిప్పి ఇటు తిప్పి రాస్తారు. అదే తెలుగు మీడియం వానికి ఆ అవకాశం ఉండదు.

పేపర్లు దిద్దేవాడికి మాత్రం డబ్బులు కావాలి అంతే. ఎన్ని ఎక్కువ పేపర్లు దిద్దితే అన్ని ఎక్కువ డబ్బులు.

----------------------------------------------------------------------
అభిప్రాయం ౯

"భాష ఉంటే ఎంత ? పోతే ఎంత ?" అని అడిగితే నేను కూడా "మిగతావి ఉంటే ఉంటే ఎంత పోతే ఎంత ?" అని అడుగుతాను. సమాధానం చెప్పమనండి. ఏం ? అడక్కూడదా ?

మానవహక్కులు ఉంటే ఎంత ? పోతే ఎంత ?
ఇండియా ఉంటే ఏంటి ? పోతే ఏంటి ?
స్త్రీల హక్కులు ఉంటే ఎంత పోతే ఎంత ?
ఎస్సీలు ఎస్టీలూ ఉంటే ఎంత ? పోతే ఎంత ?
దేశాలు ఉంటే ఎవడిక్కావాలి ? లేకపోతే ఎవడిక్కావాలి ?
ప్రజాస్వామ్యం ఉంటే ఎవడిక్కావాలి ? లేకపోతే ఎవడిక్కావాలి ?
నేరాలు పెరిగితే ఏంటి ? పెరక్కపోతే ఏంటీ ?

భాష కేవలం పరస్పర వ్యక్తీకరణకే అయితే మఱి ఇంగ్లీషు కాకుండా ఏ భాషయినా పనికొస్తుందిగా ? బళ్ళలో ఇంగ్లీషే ఎందుకట ? తెలుగు ఎందుకు ఉండకూడదట ?

సరే, భాష పరస్పర వ్యక్తీకరణకే. బావుంది. మఱి ఆకలి కూడా ఏ పదార్థంతో నయినా తీర్చుకోవచ్చు కదా ? ఏది పడితే అది ఎందుకు తినడంలేదట జనం ? కామం భార్యతోనే ఎందుకు తీర్చుకోవాలి ? తల్లితో ఎందుకు తీర్చుకోకూడదు ? ఆఫ్టరాల్ ఈ తల్లి భార్య అనేవి కేవలం భాషే తప్ప కామానికి అవేమీ తెలియవుగా ?

ఇదొక పిచ్చివాగుడు. ఇది reasoning కాదు. Anti-reason. దాన్నొక reasoning లా చేసి చూపించడానికి ఆంగ్లభాషాభిమానులు కిందామీదా పడ్దం చూస్తూంటే నవ్వొస్తోంది. ఇలా మాట్లాడేవాళ్ళంతా నిజానికి తెలుగు భాషాభిమానులు వేస్తున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక ఓడిపోయామని అనిపించుకోవడం ఇష్టం లేక, ఇలా మూలచ్చేద వాదానికి దిగుతారు. మూలచ్ఛేదవాదమంటే అసలు చర్చిస్తున్న విషయానికే విలువ తీసేయాలని అసలది చర్చనీయాంశమే కాదనీ నిరూపించడానికి పూనుకోవడం. ఇదొక రకం అవతలివాడి నోరు మూసే వ్యూహం. కొట్టి, చంపి ప్రతివాదుల్ని ఖతమ్ చెయ్యాలని చూడ్డం కంటే భిన్నం కాదు.

-------------------------------------------------------------------------------
అభిప్రాయం ౧౦

అణచివేతక్కూడా ఒక హద్దుంది. ఇక్కడ ఈ రాష్టంలో తెలుగుని పనిగట్టుకొని అణచివేస్తున్న విధానం అలాంటి అన్ని హద్దుల్నీ అధిగమిచింది. సరిగ్గా ఇలాంటి క్రూరమైన అణచివేతల్లోంచి పుడతారు భావి నియంతలూ, కర్కోటకులూ ! ఎక్కడ ఇలా అణచివేత పెచ్చుమీఱుతుందో అక్కడ తప్పకుండా ఒక నిరంకుశుడు ఆవిర్భవిస్తాడు. వాడు దయాదాక్షిణ్య రహితుడై ఉంటాడు. ఈ రోజు తెలుగుని అణచివేస్తున్నామని ముఱిసిపోవడం కాదు. ఈ రాష్ట్రంలో భవిష్యత్ సంవత్సరాల్లో భాషోన్మాదులైన నాయకులు అధికారాన్ని చేపట్టితే ఏం జఱుగుతుందో అది ఎవఱికి వారు ఊహించుకోవచ్చు. అప్పుడు ఇంగ్లీషు ఎదుర్కునే అణచివేత తెలుక్కి పదిరెట్లుగా ఉండొచ్చు. బహుశా ఆ దెబ్బకి ఇంగ్లీషు ఈ గడ్డమీదినుంచి శాశ్వతంగా అదృశ్యమైపోవచ్చు.

----------------------------------------------------------------------------------
అభిప్రాయం ౧౨

ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు పుట్టడానికి కారణం ప్రస్తుతపుటుద్యోగాలకి తెలుగుతోకంటే అప్రాచ్యభాషలతో ఉన్న అవసరం సామీప్యం ఎక్కువ అవ్వడం వలన అని నాకు గట్టిగా అనిపిస్తుందండీ.
ఆంధ్రభాషోన్మాది ఏలే రోజు నిజంగా రావలసిన పరిస్థితి వచ్చేలాగే ఉంది, చూడబోతే.
-----------------------------------------------------------------------
అభిప్రాయం ౧౩

మనకి ఎక్కడ గుచ్చుకుంటోందో సరిగ్గా గ్రహించారు. కానీ ఎందుకలా గుచ్చుకుంటోందని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సి ఉంది. ఇతర దేశాల భాషలకి అడక్కుండానే రక్షణ లభించడానికీ, మన భాషకి నోరు తెఱిచి అడిగినా రక్షణ కఱువవ్వడానికీ మధ్య ఎక్కడ వ్యత్యాసం ఉందనేది ఆలోచించాలి. నా పరిశీలనలో--

౧. మన తెలుగు ఏ దేశానికీ గుర్తింపు పొందిన ఏకైక జాతీయభాష (recognized official language) కాకపోవడం ఒక పెద్ద కారణం. నిజానికి ఇదే అసలుకారణం కూడాను. ఇది ఒకానొక దేశంలో ఒక మూలన ఆంధ్రప్రదేశ్ అనే ఒక subordinate province యొక్క భాషగానే ఉండడం. ( ఈ province ఎంత పెద్దదనేది అనవసరం. ఆధికారికంగా ఇదొక province. అంతే!) నేపాలీ, బర్మీసు, సింహళీ, థాయ్ లాంటివి తెలుగు కంటె అన్నివిధాలా చిన్నాచితక భాషలయినప్పటికీ అవి తమ తమ దేశాల యొక్క జాతీయభాషలూ, అధికారభాషలు కూడా ! అవి ఆయా ప్రభుత్వాల చేత రాజ్యాంగబద్ధంగా రక్షితమైన భాషలు(languages protected by the national constitution) అందుచేత తెలుగు ఎదుర్కుంటున్న ఘోరమైన మనుగడ సమస్యని అవి ఎదుర్కోవడంలేదు. ఆ సంగతి కప్పిపుచ్చి ఈ రాష్టంలోని మేధావులు తెలుగు ఇలా నశించిపోవడం ఒక సహజమైన చారిత్రిక పరిణామం లాగాను, అది నశించకపోతే మన ఆధునీకరణకి అర్థం లేనట్లూ మాట్లాడ్డం నేర్చుకున్నారు.

౨.ఇతరదేశాల్లోని ఉద్యోగాలు ఆయా దేశాలవారికే పరిమితం. కానీ భారతీయ రాష్ట్రాలలోని ఉద్యోగాలు ఆయా రాష్టాలవారికి పరిమితం కాదు. అలా పరిమితం చేసుంటే, మన భాషలు హాయిగా బతకగలిగి ఉండేవి. కానీ అలా చెయ్యకపోవడాన ఈ రాష్ట్రంవారు పోయి ఆ రాష్టంవారి ఉద్యోగాల్ని హరించి వాటిల్లో తాము తిష్ఠ వేస్తారు. తత్ఫలితంగా వారూ ఇక్కడికొచ్చి మన పట్ల అదే చేస్తారు. ఇలా మనుషులు తమకి సంబంధం లేనిచోట్లకి వెళ్ళి వాళ్ళ ఆర్థిక అవకాశాల్ని దోచాలంటే అందుకు సహకరించే భాష ఒకటి కావాలి. అదే ఇంగ్లీషు. ఇది పరస్పర దోపిడీ వల్ల జఱుగుతున్నదని గ్రహించకుండా "ఇంగ్లీషు లేకపోతే రాష్ట్రం బయట ఉద్యోగాలు ఎలా సంపాదిస్తాం ?" అి అమాయకంగా ప్రశ్నిస్తారు. మనమూ అదే అనుకుంటాం. "బయటివాళ్ళని రానివ్వకపోతే, వాళ్లు మనల్ని రానివ్వరు కదా !" అని ! వాస్తవంలో మనమూ వాళ్లు చేసేది, పరస్పర భాషాహక్కుల్ని హరించేసుకోవడం. అందఱమూ కలిసి ఇంగ్లీషుని సింహాసనమెక్కించడం.

ఏ రాష్ట్రంవారు ఆ రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకునేట్లయితే, వారి ఉద్యోగావకాశాల్ని బయటివాళ్ళొచ్చి హరించకపోతే అప్పుడు ఇంగ్లీషు మీడియంతో అవసరమేముంది ? అప్పుడు ఇంజనీరింగు, మెడిసిన్ కూడా మనం తెలుగులోనే చదువుకుంటాం. ఉన్న ఉద్యోగావకాశాలతోనే తృప్తిపడతాం. తృప్తిపడనివాడు ప్రైవేట్ గా కోచింగ్ తీసుకొని ఇంగ్లీషు నేర్చుకొని బయటికి పోతాడు. కానీ బహుకొద్దిమందే ఉన్న అలాంటివాళ్ళకోసం ఈ ప్రభుత్వం అందఱి నెత్తినా బలవంతంగా ఇంగ్లీషుని - అదీ పాలుతాగే పసివయసు నుంచి రుద్దాలనుకోవడం, ఇక్కడ ఏ కొత్త ఉద్యోగావకాశాలూ కల్పించకుండా తన బాధ్యతని గాలికొదిలేసి అందఱినీ పొట్టపట్టుకొని బయటికి పొమ్మనడం, అందుకోసం ఇంగ్లీషు నేర్చుకోండని బలవంతం చెయ్యడం, సరే, అలాగని బయటికి పోతేనేమో అక్కడివాళ్లు "మా దేశానికి/ రాష్ట్రానికి ఎందుకొచ్చారు ?": అంటూ మన అంతు చూడ్డానికి ప్రయత్నించడం - ఏమిటిదంతా ? దీకికి అంతు ఎక్కడ ? ఎప్పుడు ?

౩. ఇప్పటి ఇంగ్లీషు వ్యామోహానికి అసలు కారణం - రాష్ట్రం యొక్క వాస్తవిక ప్రొఫెషనల్ అవసరాలతోను, అసలు ఉన్న ఇంజనీరింగ్ ఉద్యోగఖాళీల యొక్క మొత్తం సంఖ్యతోను నిమిత్తం లేకుండా ప్రతిభాప్రమాణాలతో సంబంధం లేకుండా కట్నార్థులకోసం, వలసదారుల కోసం ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్ కళాశాలలు తెఱిచేసి సీట్ల సంఖ్య పెంచేయడం. దానివల్లా ఆ కోర్స్ చదివినవాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు లేక విదేశాల కెగబడ్డం. ఆ విదేశాలకోసం ఇంగ్లీషు. ఇదీ వరస. అసలు ఇంజనీరింగ్ లో ప్రవేశమే కష్టం చేసెయ్యాలి. సగం ఇంజనీరింగ్ కాలేజిలు మూసెయ్యాలి. సీట్లు తగ్గించాలి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులోని వార్షిక పరీక్షల్ని కూడా కష్టం చేసెయ్యాలి. సబ్జెక్టులూ, సిలబస్సు, కోర్స్ కాలావధి (సంవత్సరాలు) పెంచాలి. అదే సమయంలో పక్క రాష్ట్రాల్లోను, ఇతరదేశాల్లోను చదివిన ప్రొఫెషనల్ కోర్సుల్ని డీరికగ్నయిజ్ చెయ్యాలి. అప్పుడు వలసపోయి ఇంగ్లీష్ మీడియమ్ లో ఇంజనీరింగ్ చదివి ఇక్కడకొచ్చి షాన్లు కొట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడ ఫీజు కట్టి చదువుకున్నవాళ్ళ కోసమే. అలా ఎవడు పడితే వాడల్లా ఇంజనీరు కాజాలని విధంగా వ్యవస్థని బిగించాలి. ఆ తరువాత ఇంజనీరింగ్ ని తెలుగుమీడియమ్ లోకి మార్చినా అందులో చదువుకున్న ప్రతివాడికీ ఉద్యోగం చూపించడం సులభమవుతుంది కనుక అలా దాన్ని. మార్చెయ్యడం కూడా సులభమవుతుంది. ఎవరూ అభ్యంతరపెట్టరు. మెడిసిన్ కైనా ఇదే మంత్రం. అదే సమయంలో బీయెస్సీవాళ్ళ ఉద్యోగావకాశాల్ని బాగా హెచ్చించి జనం ఊరికే ఇంజనీరింగ్ అని ఎగబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిరకాల ఉద్యోగాల్ని కేవలం బీయెస్సీలకి ప్రత్యేకిస్తూ జీవో జారీచెయ్యాలి.
--------------------------------------------------------------------------------
అభిప్రాయం ౧౪

తెలుగే కాక చాలా భారతీయభాషలు (మన రాజ్యాంగంలో మనం గుర్తించి, మన మారకంపై ముద్రించుకుంటున్న భాషలు) కూడా వేఱే జాతీయభాషలు కానివి ఉన్నాయి కదండీ! వాటి పరిస్థితి కూడా ఇంతేనా? అసలు నా అనుమానం, హిందీ కూడా తెలుగులాగానే తత్సదృశమైన ఇబ్బందులని ఎదుర్కుంటోందని! తెలుగైతే కాస్త ఎక్కువ ఇబ్బంది పడుతోంది, ఆ ఇబ్బంది మనకి ప్రత్యక్షంగా తెలుస్తోంది కూడాను.

ఆహా! ఏ ముహూర్తంలో ప్రవేశించిందో కానీ ఈ అప్రాచ్యభాషావ్యామోహం, చాలామంది బుఱ్ఱలని ఇంకా దొలిచేస్తూనే ఉంది కదండీ!

పూర్వకాలంలో కూడా ఒక రాజ్యాన్నించి మఱొక రాజ్యానికి వెళ్లి ఉద్యోగాలు చేసినవారు ఉండే ఉంటారు. అప్పుడు అందఱికీ మాధ్యమంగా సంస్కృతమో ప్రాకృతమో నడిచేదనుకుంటాను. లేదా ప్రాంతీయభాష నేర్చేవారనుకుంటాను. కానీ ఇప్పుడు ఆ ఆ భాషలని పూర్తిగా వదలివేసి, ఇలా మన దేశంలో పుట్టని మఱొక భాషలోకి మారిపోయామంటే కారణం వేఱే రాజ్యాలలో ఉద్యోగాలు వెతుక్కోవడం అనడం కంటే, వేఱే రాజ్యాలలో ఉద్యోగాలు సైతం అలాంటి భాషతో ముడిపెట్టబడడం అనడం సబబేమోనండీ. నిజంగా మనం పరస్పర భాషాహక్కులని నశింపజేసేసుకున్నాం, ...కుంటున్నాం కూడాను.

ఒక రకంగా చూస్తే, వేఱే ప్రాంతానికి చెందిన మఱొక భారతీయ భాషతో సంపర్కం వలన కొన్ని క్రొత్త ప్రయోగాలూ క్రొత్త పదాలూ ఒక భాషలోకి చేరిన దృష్టాంతాలు లేకపోలేదు. మఱీ పోయి పోయి ఆంగ్లంతో కలవడం కంటే, సంస్కృతి పరంగా దగ్గఱ పోలికలున్న రెండు ప్రాంతాల భాషల కలయిక ఆహ్వానించదగ్గదే కదా. పైగా ఆ రెండు భాషలూ పోలికలు ఉన్నవే ఐతే, ఇక ఆ భాషలు భలే సంపన్నమౌతాయి కూడాను.

అసలు ఇంగ్లీషు ఎప్పుడు ఈ మధ్యలో దూరిందీ అంటే... అది అందఱికీ తెలిసిన చిదంబర రహస్యమే. కానీ ఇప్పటికీ మనం ఎందుకు దానినుండి బయటపడలేకపోతున్నామూ అన్నదే ప్రశ్న!

సాక్షి వ్యాసాలలో మొదటి సంపుటంలోనే మొదటి పది వ్యాసాలలో వస్తుందనుకుంటాను ఈ ప్రాంతీయభాషల గుఱించి జంఘాలశాస్త్రి పడే ఆవేదన. నాకు అదే గుర్తుకు వస్తోందండీ ఇప్పుడూ.

అసలు మనం మన దేశానికే బోలెడన్ని అవసరాలు ఉన్నాయనీ, మన దేశంలోనే కావలసినంతమంది వినియోగదారులూ ఉన్నారనీ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడు ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఈ ఎగబడడం తగ్గుతుంది, ప్రాంతీయభాషల అభివృద్ధికి ఆటంకమూ ఉండదు.

శ్రేష్ఠులైన మన భారతీయ శ్రేష్ఠివర్గానికి చేయూత నిద్దాం ! విదేశీ వ్యాపార కుట్రల్ని ఛేదిద్దాం !

హిందూసమాజం అంటే వెంటనే ప్రతిఒక్కరికీ గుర్తొచ్చేది అందులోని కులవ్యవస్థ. అది ఏర్పడేందుకు గల కారణాలు, తర్వాత కాలక్రమంలో వ్యవస్థను స్థిరీకరింపచేసి సమాజంలో బాధ్యతలను పంచుకోవటంలో దానిపాత్ర. అలానే కలిప్రభావంతో ఇప్పుడు ఎదుర్కుంటున్న అపనిందలు హిందూధర్మం పట్ల నమ్మకం ఉన్నవారికి, తటస్థులకు అలానే కలి‌అంశలకు సైతం తెలుసు.(కాకపోతే వాళ్లు తెలిసినా అడ్డంగా వాదించుకుని మురిసిపోతారు అంతే.)

ఈ వ్యవస్థలో మనకు ముందుగా గుర్తొచ్చేది బ్రాహ్మణులు- వీరికి సమాజంలో పెద్దన్న పాత్ర. గౌరవ మర్యాదలతో పాటు విపత్కాలంలో సమాజానికి దిశానిర్దేశం చెయ్యాల్సిన బాధ్యత అప్పగించారు. పురాణాల్లోని కథల్లోనే కాదు చరిత్రలోనూ, ఇటీవలి స్వాతంత్ర్యసంగ్రామంలోనూ ఇంకా అనేక సందర్భాల్లో తమ బాధ్యతలను ప్రశంసనీయంగా నిర్వర్తించారు. అయితే ప్రస్తుతం? కనీసం సంధ్యావందనంచేసే అలవాటున్నవారెందరు ? మన హిందూ దేవుళ్లపై చెణుకులూ, చెమక్కులు అవాకులూ, చెవాకులు విసరడం మొదలెట్టింది కొద్దిమంది అల్పవిశ్వాసులైన బ్రాహ్మణ మేధావులే. ఆ తర్వాతే బయటివారికి హిందూధర్మంపై వేలెత్తే ధైర్యం వచ్చింది.

తరువాత క్షత్రియులు- గోబ్రాహ్మణ రక్షణ, థర్మాన్ని నాలుగుపాదాలా నిలపడం, దేవతలకు తనరాజ్యంలోని ప్రజలకు మద్య వారథి. యవనులు తదితర ముష్కర మూకలవల్ల ముందునష్టపోయింది వీళ్లే. అంతర్గత కలహాలు, వెన్నుపోట్లతో మ్మొదలైన వీరి పతనం హిందూజాతికి ఎనలేని నష్టం కలుగజేసింది. తమకోసం ముందుండి పోరాడే నాయకుడు అంగార్థబలాలు కోల్పోయి అచేతనంగా పడి ఉంటే మూగగా రోదిస్తోంది హిందూత్వం.

ఇక శూద్రుల విషయానికి వస్తే వీరికి దైవభక్తి మెండు. కానీ ధర్మసిధ్థాంతాలలోని సూక్ష్మాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నవారు అతికొద్దిమంది. అలాగే హిందూత్వంపై జరుగుతున్న వ్యూహాత్మక దాడిని అర్థంచేసుకునేంతగా వారికి పరిజ్ఞానం లేదు. ఊరిలో ఉన్న పురోహితుడు లేదా వ్యక్తిగతంగా గురి ఏర్పడిన ఎవరో ఒక పెద్దమనిషి చెప్పిన మాటను విని అనుసరించటం ఒక్కటే వీరికి తెలిసింది. వీరి ఆర్థిక, సామాజిక స్థితిగతులు సమాజంలో సైద్ధాంతిక ప్రమేయాన్ని అడ్డుకున్నాయి.

మిగిలినది వైశ్యులు. హిందూ ఆచారాలపై విశ్వాసాలు లేనివారిని మీరే కులంలోనైనా చూడొచ్చు గానీ వీరిలో చాలా అరుదు. (బహుశా ఉండకపోవచ్చు) గ్రామంలో గానీ పట్టణాల్లో గానీ వీరి ప్రమేయంలేకుండా ఉత్సవాలు (వినాయకచవితి, రామనవమి వంటివి) జరుగడం అరుదు.. దాదాపూ అన్ని హైందవ సంస్థలకూ ఆర్థికసహాయం చేయడంలో వీరే ఎక్కువ. వీరిచే నడిపే వాసవి అన్నదాన సత్రాలు దాదాపూ ఒక మోస్తరు పట్టణాలు ప్రతిచోటా ఉంటాయి. కళ్యాణ మండపాలు ఈరోజుల్లో వ్యాపారం అయిపోయాయి. కానీ అది ఒక సమాజసేవగా భావించబడిన రోజుల్లో ముప్పాతికభాగం నిర్మించినది వాళ్లే. వాటిలో కొన్ని వ్యాపారదృక్పదంతో నిర్వహిస్తున్నా ఇప్పటికీ ఎన్నో ఆర్యవైశ్య కళ్యాణ మండపాలు లాభాపేక్షలేకుండా నడుస్తున్నాయి. ఏదైనా గుడికెళ్ళి దాన్ని కట్టినప్పుడు సాయంచేసిన దాతలపేర్లు చూడండి. వైశ్యుల పేరు కనపడని గుడి ఉండదు.

ఇన్ని చేస్తున్నా వైశ్యుడెప్పుడూ పదిమందిలో సిద్ధాంతాలపై రాద్ధాంతంచేయడు. తాను చేయదల్చుకున్న సహాయాన్ని గుట్టుచప్పుడుకాకుండా చేస్తారు. అలా గుప్తదానాలు ఇచ్చిన శెట్టిగార్లు ఎందరో ఉన్నారు. విశ్వహిందూపరిషత్ వంటి హైందవ సంస్థలకి, ఇస్కాన్ వంటి ధార్మిక సంస్థలకి, కంచిమఠాల వంటి వాటికి ఆర్థిక సహాయాన్ని అందించేవారు వారిలో మెండు.

అంతెందుకు, ఇటీవలి సంఘటన- దేవాదాయ ధర్మాదాయ శాఖ పాల్పడుతున్న అధర్మాలు అందరికీ తెలిసినవే. ఒక మాజీ ప్రభుత్వాధినేత చేసిన దారుణాలకు అందరూ కలవరపడుతూండగా వైశ్యులు గుట్టుచప్పుడు కాకుండా తమ ధర్మం తాము చేశారు. వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థానాలకు, అనుబంధ అన్నదాన సంఘాలకు మరియు కళ్యాణమండపాలకు స్వయంప్రతిపత్తి విషయమై ఒక జీఓ కొన్నినెలల కిందట విడుదలైంది. ఇప్పుడు ఉన్నరాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వాధినేతగా ఉంటూ హిందూ అనుకూల కార్యక్రమాలు చెయ్యడం ఎంత కష్టమో మనకి తెలియందికాదు. పైన 'ఆ యమ్మ' ఎన్ని ఆంక్షలు పెడుతున్నా కంచిపీఠానికి వైద్యకళాశాల కేటాయించడం ఎంతకష్టమైన పని. ఆయన ఎప్పుడూ ఉపన్యాసాలు ఇవ్వలేదు. పూర్తిస్థాయి హిందూవ్యతిరేక కార్యక్రమాలకు ఒక బృహత్‌ప్రణాళిక రచించి దాన్ని తు.చ. తప్పక అమలు పరుస్తున్న పార్టీలో ఉంటూ ఇలాంటి పని చెయ్యడం పదవికేకాదు ప్రాణాలకు కూడా ప్రమాదం.

అలాంటి శ్రేష్టులపై ఇప్పుడు వ్యూహాత్మకదాడికి పథకం తయారయ్యింది.

ఇన్ని శతాబ్దాలుగా భరతఖండపు వర్తక వాణిజ్యాలకు ప్రతినిథులుగా ఉంటున్న వీరిని దెబ్బతీయడం ద్వారా హిందూసమాజపు వెన్నెముకను విరగ్గొట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యి దశాబ్దం అయ్యింది.ఈస్ట్ ఇండియా కంపెనీకంటే కూడా దుర్మార్గపు పోకడలు మొదలయ్యాయి. అందులో అతి ముఖ్యమైనది వారి రిటైల్ వ్యాపారం. ప్రభుత్వం సంస్కరణలు మొదలుపెట్టినప్పుడు ఈ రంగాన్ని మినహాయించింది. ఇది మన స్వావలంబనకు అత్యంత ప్రధానం.

ఇక్కడ ఇతరులను ప్రవేశపెట్టేందుకు వాళ్లు చెబుతున్న కుంటిసాకులు అన్నీ తాత్కాలిక ప్రయోజనాలే. నాణ్యత, పన్నుకట్టడం, సులభతర వాణిజ్యం, అంతర్జాతీయ పోటీలో నిలబడడం ఇలాంటివి. కొన్నేళ్ల తర్వాత ఆ కంపెనీలు ఇదే స్థాయి నాణ్యతను కొనసాగిస్తాయి అన్న నమ్మకముందా? వాళ్లు కొనసాగిస్తాం అన్నా మన నాయకులు ఒప్పుకుంటారా? ఇక్కడివాళ్లకి చేసేందుకు పనిలేకుండా చేసి ఆ వచ్చే పన్నుతో ఎవరిని ఉధ్ధరిద్దాం అని? అంతర్జాతీయ పోటీ ఉండాల్సిన రంగమా కిరాణా కొట్లు ?

కాబట్టి హిందూసోదరులారా ! మన వైశ్యసోదరులకు నైతికమద్దతునివ్వండి. వారితో సంబందాలు పెంచుకోండి. వారితో వ్యక్తిగతంగా కొంతకాలం మసలండి. వారిలోని నీతినియమాలు మీకే తెలుస్తాయి. మిగతా వర్గాలతో పోలిస్తే దురలవాట్లు వీరిలో చాలాతక్కువ. ఆర్థిక లావాదేవీల్లో సైతం మీరు నిబద్దతను పాటించినంతకాలం వారు కోపించరు. వారిచే నడుపబడుతున్న అంగళ్లలోనే లావాదేవీలు జరిపేందుకు ప్రయత్నించండి. మీకు ఇప్పుడు వారిలో కొన్ని అల్పదోషాలు కనిపిస్తుండవచ్చు. కానీ ప్రపంచంలో వ్యాపారాలు చేసే ఏ వర్గంతో పోల్చి చూసినా వీళ్లు ఎన్నోరెట్లు నయం. చేతిలో డబ్బును పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి వారు ఎంత అభద్రతాభావాన్ని పొందుతుంటారో షేర్లలో పెట్టే ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అలాంటిది, వాళ్లు జీవితాంతం అదే ఒత్తిడిలో ఉంటారు.

4, నవంబర్ 2009, బుధవారం

పోయింది అదుపు, వచ్చింది కడుపు - పాశ్చాత్యమా ! నీకు జోహార్లు !!

బళ్ళలో లైంగికవిద్య, బయట టీవీలూ, సినిమాలూ, ఇంటర్నెట్టు, బాయ్ ఫ్రెండ్లూ, చేతినిండా డబ్బు, విడాకుల పుణ్యమా అని తండ్రి అదుపాజ్ఞలంటే ఏంటో తెలియని బాల్యం, గాలిలో వైరస్సుల మాదిరి అలవోకగా తేలుతూ ముక్కుపుటాలకి తాకే స్వేచ్ఛాసమానత్వ సిద్ధాంతాలు, పిల్లల్ని అదుపులో పెట్టడం చేతకాని సింగిల్ తల్లులూ, పిల్లల్ని ఏమీ అనకూడదంటూ ప్రభుత్వం చేసిన చట్టాలు - వెఱసి అందఱికీ ఉచితంగా కడుపులు. ఇదీ ఈనాటి అమెరికా సాంఘికస్వరూపం. ఈ క్రింది దృశ్యకాన్ని (video) కనులారా తిలకించి తరించండి.

http://cbs2chicago.com/video/?id=63710@wbbm.dayport.com


ఇది ఇంతటితో ఆగిపోతే బావుణ్ణు. కానీ అనుకున్నామని జఱగవు అన్నీ, అనుకోలేదని అగవు కొన్ని. ఇలా కౌమారప్రాయంలో తల్లులైనవారు ఆ తరువాత ఆ పుట్టిన పిల్లల్ని ఎవరికో దత్తత ఇచ్చేస్తారు. అటుపిమ్మట వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక పునస్సమావేశం (Re-union) అంటూ అసలు తల్లిదండ్రుల్ని చూస్తారు. వాటిల్లో అన్నీ సక్రమంగా జఱగవు. కనడమే తప్ప పెంచకపోవడం తప్ప వాళ్ళకీ ఆ ఎదిగిన పిల్లల మధ్య కొన్నిసార్లు సహజమైన parent-child సంబంధం బదులు ప్రేయసీప్రియుల సంబంధం అభివృద్ధి చెందుతున్న దృష్టాంతాలు కోకొల్లలు. ఆ నిస్సిగ్గు ముచ్చటల్ని మీరు కూడా సిగ్గుపడకుండా ఈ క్రింది సైటులో తిలకించుడీ.


http://geneticsexualattraction.com/


ఇది కేవలం ఒక సహాయక సైటు (support site) మాత్రమే. అయితే అసలా "సహాయం" ఎందుకు అవసరమైందో, దానికి ఏ సాంఘిక పరిస్థితులు కారణమో, ఏ నడమంత్రపు సిద్ధాంతాలకి వాళ్ళు బలయ్యారో కూడా ఆలోచించాల్సి ఉంది.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి