31, డిసెంబర్ 2013, మంగళవారం

గుడి ఉన్న ఊళ్ళోనే మనుగడ

ప్రతిష్ఠ చేసిన ప్రదేశాల్లో జీవించే అర్హత ప్రతి మానవునికీ ఉంది.

ఆదియోగి శివుడు అగస్త్య మహామునిని దక్షిణ భారతావనికి పంపించారు.  దక్కను  పీఠభూమికి దక్షిణాన ప్రతి పల్లెనూ, జనావాసాన్నీ ఆ మహాముని ఏదో రకమైన ప్రతిష్ఠలతో పవిత్రం చేశారు.  తద్వారా ఆ ప్రాంతాల్లో ఆథ్యాత్మిక ప్రక్రియ ప్రారంభమై, కొనసాగేలా చూశారు. మానవుడు నివసించే ఏ ఒక్క జనావాసాన్నీ కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఇలా చేయడానికి ఆయనకు 4,౦౦౦ సంవత్సరాల కాలం పట్టిందని చెబుతారు.  అయితే అది నాలుగు వేల ఏళ్ళా, నాలుగు వందల ఏళ్ళా, అంత కాకుంటే పోనీ 140 ఏళ్ళా అనేది మనకు తెలియదు.  కానీ, ఆయన చేసిన ఈ బృహత్తర కార్యక్రమం, అందుకోసం ఆయన చేసిన సుదీర్ఘ యాత్ర గమనిస్తే, ఆయన అసాధారణ రీతిలో ఎంతో దీర్ఘకాలం సాధన చేశారన్నది అర్థమవుతుంది.

ప్రతిష్ఠ చేయడమనేది ఓ సజీవ ప్రక్రియ.  మట్టిని ఆహారంగా మార్చామనుకోండి, దాన్ని వ్యవసాయం అంటున్నాం. అదే ఆహారాన్ని మాంసంగా, ఎముకలుగా మార్చేదాన్ని జీర్ణ క్రియగా, మళ్ళీ ఈ మాంస శరీరాన్ని మట్టిగా మార్చడాన్ని దహనం లేదా ఖననం అంటున్నాం.  ఇక్కడ పేర్కొన్న ఈ మాంసాన్ని లేదా ఓ రాయిని, ఇవీ అవీ కాకుంటే ఏ ఖాళీ ప్రదేశాన్నయినా దివ్య భూమికగా మార్చగలిగితే, ఆ ప్రక్రియే ప్రతిష్ఠ.  ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఒకే శక్తి రూపాలనీ, ఒకే శక్తి కోట్లాది రూపాల్లో, అనేక విధాలుగా వక్తమవుతోందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతోంది కదా.  విషయం అదే అయినప్పుడు, దివ్యత్వమని, రాయి అని, మగాడు లేదా ఆడది అని, రాక్షసుడని మనం అంటున్నవన్నీ వివిధ రూపాల్లో గోచరిస్తున్న, పనిచేస్తున్న ఒకే శక్తి మాత్రమె.  ఉదాహరణకు విద్యుత్తు ఒకటే.  కాని అదే దీపంగా వెలుగుతుంది, ధ్వనిగా వినవస్తుంది.  సాంకేతికతను బట్టి విద్యుత్తూ వివిధ రకాలుగా వ్యక్తమవుతుంది.  అలాగే ఈ ప్రతిష్ఠ కూడా ఒక సామ్కేతికతే.  అవసరమైన సాంకేతికత అందుబాటులో ఉంటే, మన చుట్టు ఉన్న ఈ సామాన్యమైన సాధారణమైన ప్రదేశాలను దివ్యంగా మార్చగలుగుతాం.  దారి పక్కనున్న ఓ చిన్న రాయిని తీసుకుని దాన్ని ఓ దేవుడిగానో, దేవత గానో మార్చేయ గలుగుతాం.  అదే ప్రతిష్ఠ అనే అద్భుతం.

మన సంస్కృతిలో ఈ అఖండ విజ్ఞానాన్ని శాశ్వతంగా నిలిచిపోయేలా చేయడం జరిగింది.  మన సంస్కృతిలో ఈ విజ్ఞానాన్ని పరమోత్క్రుష్టమైనదిగా నిర్ధారించారు.  మన సంస్కృతిలో మనమేమి తింటున్నాం, మనమెలా ఉన్నాం, మనమెంత కాలం బతుకుతాం అనేవి అంత ముఖ్యమైనవి కాదు.  మన జీవితంలో ఏదో ఓ తరుణంలో సృష్టిమూలాలను అన్వేషించాలనే వాంఛ ప్రతివారికీ తప్పకుండా వచ్చి తీరుతుంది.  దీన్ని అందుకోవాలనే తపన పడే ప్రతి మానవునకూ ఈ అవకాశం అందివచ్చే విధంగా చేయక పొతే, అతనికి యదార్థమైన సంక్షేమాన్ని అందించడంలో సమాజం విఫలమైనట్లే.

మానవాళి అభ్యున్నతికి అవసరమైన ఈ సంక్షేమ దృష్టి తోనే ప్రతివీధిలో కనీసం ముడేసి దేవాలయాలు ఉండడాన్ని ఈ సంస్కృతిలో భాగం చేశారు.  ఎందుకంటే, పవిత్రమైన వాతావరణం లేని ప్రదేశం, కొన్ని అడుగులైనా సరే, ఉండరాదన్న విజ్ఞతతో  చేసిన గొప్ప ఏర్పాటు ఇది.  ఇదేదో ఓ గుడికి పోటీగా మరో గుడి నిర్మించాలనుకోవడం కానే కాదు.  ఎవరూ కూడా ప్రతిష్ఠ కాని ప్రదేశంలో ఒక్క అడుగు కూడా వేయరాడనే సదుద్దేశంతో చేసినది.  ఎవరు కూడా ప్రతిష్ఠ కాని వాతావరణంలో జీవితం దుర్భరం చేసుకోరాదన్న విశేష ఆదరణ బుద్ధితో చేసిన మహాత్కార్యమిది.  అందుకే ముందుగా గుడిని నిర్మించి ఆ తరువాతే దానిచుట్టూ నివాసాలు నిర్మిస్తూ వచ్చారు.

దక్షిణాది యావత్తూ, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం యావత్తూ ఇదే తీరున నిర్మితమైంది. తమిళ నాడు లోని చెప్పుకోదగిన ప్రతి పట్టణంలో ఓ బృహత్ దేవాలయం తప్పనిసరిగా ఉంటుంది.  దాని చుట్టూనే పట్టణం.  ఎందుకంటే మనమేలాంటి ఇంటిలో ఉంటున్నాం అన్నది ముఖ్యం కాదు.  ఆ ఇల్లు పదివేల చదరపు అడుగుల్లో నిర్మిమ్చినదా, లేక వెయ్యి చదరపు అడుగుల్లో కట్టినాడా అనేది అంతకన్నా ముఖ్యం కాదు.  దానివల్ల చివరకు మన జీవితంలో తేడా ఏదీ ఉండదు.  కానీ, ప్రతిష్ఠ చేసిన వాతావరణంలో నివాసం వల్ల మన జీవితం ఎంతో ప్రభావితం అవుతుంది.  ఎంతో తేడా కనిపిస్తుంది.  ఈ విజ్ఞానంతోనే, ఈ అనుభవసారంతోనే, వారు మానవ ఆవాసాలను ఈ విధంగా నిర్మించారు.  ఊళ్ళో 25 గడపలు ఉన్నాయంటే, కచ్చితంగా ఓ దేవాలయం ఉండి తీరాలి.  మనం ఆ గుడికి వెళ్ళినా, వెళ్లక పోయినా, మనం అక్కడ ప్రార్థించినా, ప్రార్థించక పోయినా, మనకు ఏదైనా మంత్రం తెలిసినా, తెలియకున్నా పరవాలేదు.  అసలది సమస్యే కాదు.  జీవితంలో ప్రతి క్షణం మనం ప్రతిష్టించిన వాతావరణంలోనే ఉండాలి.  అదే దీని పరమార్థం. 
[kbn sharma]

2 కామెంట్‌లు:

cvraju చెప్పారు...

మీ ఆలోచన తో ఏకిభవిస్తున్నాము.

cvraju చెప్పారు...

మీ ఆలోచన తో ఏకిభవిస్తున్నాము.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి