12, ఫిబ్రవరి 2012, ఆదివారం

ఈ జనాభా లెక్కల్ని ఎంతవఱకూ నమ్మొచ్చు ?

http://www.indiaonlinepages.com/population/hindu-population-in-india.... 


ఎందుకడుగుతున్నానంటే - చాలామంది దళితులూ, గిరిజనులూ క్రైస్తవమతంలోకి  మారినా కూడా కేవలం రిజర్వేషను కోసం హిందువులుగా జనాభా లెక్కల్లో నమోదయ్యారు. అందుచేత హిందువులుగా ప్రొజెక్టు చేయబడుతున్నవాళ్ళంతా వాస్తవంగా హిందువులు కారు. ఉదాహరణకి - ఆంధ్రప్రదేశ్ లో 90 శాతం కంటే ఎక్కువమంది దళితులు క్రైస్తవంలోకి వెళ్ళి చాలా సంవత్సరాలవుతున్నది. దళితుల సంఖ్య మొత్తం జనాభాలో 15 శాతం. అంటే ఏ.పి.లో ఉన్న 8 కోట్ల 46 లక్షల జనాభాలో కోటీ 27 లక్షలమంది దళితులు. కనుక వీళ్ళల్లో ఇప్పటికీ హిందువులుగానే మిగిలిపోయిన జనం అంతా కలిపి పదమూడు - పదిహేను లక్షలకి మించరు. 

ఇహపోతే రాష్ట్రజనాభాలో 8 - 9 శాతం ఉన్న గిరిజనులలో ఎంతమంది కిరస్తానం పుచ్చుకున్నారో, ఎంతమంది హిందువులుగా ఉన్నారో అస్సలు అంతు చిక్కట్లేదు. ఇహపోతే ముస్లిములు. తమ సంఖ్య రాష్ట్ర జనాభాలో సుమారు 9 శాతం అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీన్ని తనిఖీ (verify) చేయడానికి పనికొచ్చే విశ్వసనీయ ఆకరం (reliable source) ఏంటో, ఎక్కడుందో నాకు తెలీదు. ఈ క్రింది లంకె చూడండి : 


ఇలా ఓ పక్క  క్రైస్తవులేమో 15 శాతం (అన్నికులాలవాళ్ళనీ కలుపుకుని), మఱో పక్క ముస్లిములేమో (కనీసం) 9 శాతం ఉన్నారనుకుంటే ఇహ హిందువుల Brute majority ఎక్కడుంది ఈ రాష్ట్రంలో ? కాబట్టి ఇప్పుడు మనం వాస్తవంగా 70 - 75 శాతం మధ్య మాత్రమే ఉన్నట్లు నాకు అనుమానం కలుగుతోంది. మనం గనక భవిష్యత్తులో 60 శాతానికి లోపల పడిపోయామా, ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.

ఈ సందర్భంగా గత శతాబ్దాల్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, కాశ్మీర్, బాంగ్లాదేశ్ లలో ఏం జఱిగిందో గుర్తు తెచ్చుకోవడం అవసరం. అక్కడ హిందువుల జనాభా పడిపోయాక వాళ్ళ మీద భౌతికదాడులూ, రక్తపాతాలూ, Ghettoisations, దోపిళ్లూ, అత్యాచారాలూ, అన్ని రంగాల్లోనూ దుర్విచక్షణ, apartheid మొదలయ్యాయి. వారి సాంస్కృతిక చిహ్నాలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. ఆ బాధలు పడలేక వాళ్ళల్లో చాలామంది మతం మారారు. (అవతలివాళ్ళకి కావాల్సిందీ అదే). ఇంకొంతమంది తమ మాతృభూమి నుంచి తామే "బతుకు జీవుడా" అని పారిపోయారు.

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి